<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-13455637</id><updated>2011-11-22T08:51:54.620-08:00</updated><title type='text'>telugu stories, gathered</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>21</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194456240495259</id><published>2005-07-21T04:15:00.000-07:00</published><updated>2005-07-21T04:16:02.423-07:00</updated><title type='text'>నిజమే కానీ ప్రభూ....</title><content type='html'>హాస్యం కథ&lt;br /&gt;నిజమే కానీ ప్రభూ....&lt;br /&gt;- ములగాడ సురేష్‌కుమార్‌&lt;br /&gt;&lt;br /&gt;'మంచిప్పల సూరయ్యా', 'మంచిప్పల సూరయ్యా', 'మంచిప్పల&lt;br /&gt;సూరయ్యా'&lt;br /&gt;దేవలోకంలో దేవుని కోర్టు హాలు ముందున్న ద్వారపాలకుడు కమ్‌ కోర్టు బంట్రోతు కంఠం మూడుకి ఆరుసార్లు మారుమోగింది.&lt;br /&gt;'వచ్చె వచ్చె'&lt;br /&gt;'ఇక్కడే ఉండి పలకవేమయ్యా'&lt;br /&gt;'మూడు మార్లు పిలవడం రివాజు కదా. అయినా రెక్కలు విరిచి పట్టుకున్న ఈ రాక్షసభటులు వదిలితే కదా. మంచీ మర్యాదా లేదు'&lt;br /&gt;'ఒకటికి వంద మాట్లాడుతున్నావు. ఏమా తలబిరుసుతనం?'&lt;br /&gt;'ఎవరయ్యా ఎక్కువ మాట్లాడుతున్నది? ఒకటి సరిపోతే ఒకటే మాట్లాడతాను. వంద అవసరమైన చోట వంద మాట్లాడతాను. హలో, యిలా చూడు, సూరయ్యని తక్కువ అంచనా వేయొద్దు'&lt;br /&gt;'అటులనా? నీ సంగతి ఇప్పుడే తేల్చెదము'&lt;br /&gt;'ఏంటి తేల్చేది. ముందు నన్ను యిక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి'&lt;br /&gt;&lt;br /&gt;'నిశ్శబ్దము నిశ్శబ్దము' హాలు ముందు వైపు నుంచి ఎవరో భటుడు హెచ్చరిక చేశాడు.&lt;br /&gt;'ఎవరూ మాటలాడరాదు. స్వామివారు వేంచేయుచున్నారు'&lt;br /&gt;పరివారమంతా లేచి నిలబడ్డారు.&lt;br /&gt;హాలంతా ఒక్కసారిగా అద్భుతమైన వెలుగు పరుచుకుంది. దేదీప్యమానంగా వెలిగిపోతూ దేవుడు హాలులో ప్రవేశించి ఉన్నతాసనం పైకి చేరుకున్నాడు.&lt;br /&gt;ఆయన కూర్చున్న తర్వాత మిగిలినవారు కూర్చున్నారు. దేవుడు సైగ చేయగా అంతసేపూ వాదిస్తున్న చిత్రగుప్తుడు గబగబా ముందుకు నడిచి దేవుడి పక్కగా నిలబడ్డాడు.&lt;br /&gt;'ఈనాడు ఎందరు?'&lt;br /&gt;'ఒక్కరే ప్రభూ'&lt;br /&gt;'ఒక్కరేనా?'&lt;br /&gt;'అవును ప్రభూ'&lt;br /&gt;'ఆరంభింపుము'&lt;br /&gt;పెద్ద శబ్దంతో భేరీ మోగింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది.&lt;br /&gt;'పాపిని ప్రవేశపెట్టుము'&lt;br /&gt;అప్పటివరకు ఒక పక్కగా రెక్కలు విరిచి పట్టుకున్న నన్ను సభా మధ్యానికి ఈడ్చుకుపోయారు.&lt;br /&gt;పక్కగా నిలుచున్నంత సేపు కొద్దిగా బాగానే ఉందిగాని ఇలా మధ్యకు తీసుకొచ్చి ప్రదర్శనగా నిలబెడితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పైగా ఇప్పుడు చిత్రగుప్తుడు పాపీ అని సంబోధిస్తున్నాడు.&lt;br /&gt;ఇక్కడున్న వాళ్లందరూ పాపులు కారా?&lt;br /&gt;దేవుడి సంగతి ఏమోగాని మిగిలిన వారి జాతకాలన్నీ మహాత్ముడు ఎన్టీఆర్‌ ఏదో సినిమాలో గడగడా చెప్పి అందర్నీ గడగడలాడించెయ్యలేదూ? అప్పుడే మర్చిపోయారా? చప్పున గుర్తు రావడం లేదుగాని లేకపోతే ఆ డైలాగులు మళ్లీ చెప్పి ఉందును కదా?&lt;br /&gt;'ఏమిటి ఈతని నేరములు'&lt;br /&gt;'మాట యిచ్చి తప్పడం స్వామి'&lt;br /&gt;'ఇచ్చిన మాట తప్పుటయా?' అదేమంత తప్పు కాదన్నట్టుగా స్వామి స్వరం ధ్వనించింది.&lt;br /&gt;'అవును ప్రభూ. ఇప్పటికి వందసార్లు అలా మాట యిచ్చి, ఒట్లు వేసి మరీ తప్పాడు ప్రభూ. అదీ మరెవరికో కాదు'&lt;br /&gt;'ఎవరికి?'&lt;br /&gt;'తమకే ప్రభూ. మీకు ప్రమాణం చేసి ఇచ్చిన మాటను తప్పాడు ప్రభూ'&lt;br /&gt;'అదేమిటో వివరంగా చెప్పు'&lt;br /&gt;'చిత్తం ప్రభూ! క్రీ.శ. 1930లో భూలోకంలోని దక్షిణ భారతదేశంలో, ఆంధ్రావని గుండెచప్పుడు, అదే హార్టుబీటైన హైదరాబాదులో'..&lt;br /&gt;'చిత్రగుప్తా'&lt;br /&gt;'అయ్యా'&lt;br /&gt;'అంతొద్దు'&lt;br /&gt;'పాయింటుకి వస్తున్నాను ప్రభూ. ఈ పాపి తనకి ఇరవై ఏళ్ల వయసప్పుడు అనగా 1950లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతూ తమకు తొలి ప్రమాణం చేశాడు ప్రభూ'&lt;br /&gt;'ఏమని?'&lt;br /&gt;'ఉద్యోగం వస్తే నడిచి తిరుమల వచ్చి తలనీలాలతో పాటు నిలువు దోపిడీ ఇస్తానని'&lt;br /&gt;'ఇచ్చాడా'&lt;br /&gt;'లేదు ప్రభూ'&lt;br /&gt;- ఈ చిత్రగుప్తుడు టూమచ్‌గా ఉన్నాడే. ఎప్పుడో యాభై ఏళ్ల కిందటి మాట ఇప్పుడు తవ్వి తీసి చెప్పాలా? ఉద్యోగం వచ్చిన వెంటనే వెళ్లడానికి డబ్బులుండొద్దూ? నెల జీతం రాగానే వెళ్దామనుకున్నాను. నిలువు దోపిడీకి ఉత్త చేతులతో వెళ్లలేం కదా. ఆ తరువాత కొత్త ఉద్యోగం సెలవు యివ్వం అని అంటే వెళ్లలేదు.&lt;br /&gt;'తరువాత?'&lt;br /&gt;'ఈ పాపికి పెళ్లి కుదిరింది ప్రభూ. కొత్త భార్యను తీసుకొని కొండకొస్తానని రెండవసారి మొక్కినాడు ప్రభూ'&lt;br /&gt;'అప్పుడూ రాలేదా'&lt;br /&gt;'లేదు ప్రభూ'&lt;br /&gt;- ఇదిగో చిత్రగుప్తా. జరిగింది జరిగినట్టు చెప్పవేం? హనీమూన్‌ అదీ ఏం వద్దు కొండమొక్కు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది, అక్కడికే టిక్కట్లిప్పించండి అని చెప్పనే చెప్పాడు మామకి. ఇదిగో అదిగో అన్నాడు. ఈలోగా వాళ్లమ్మగారు, ముసలామె బాల్చీ తన్నేసింది. ప్రోగ్రాం కేన్సిల్‌. అది చెప్పవేం?&lt;br /&gt;'మొదటి కాన్పులో కొడుకు పుడితే తప్పక వస్తానని, ముచ్చటగా మూడవసారి మొక్కాడు ప్రభూ'&lt;br /&gt;- అలా అన్యాయంగా మాట్లాడకు చిత్రగుప్తా. పుట్టగానే తీసుకెళ్లకపోయినా పుట్టు వెంట్రుకలు తీయించడానికి వాళ్ల తాతగారు తిరుపతి మొక్కు ఉందంటే వెళ్లి వచ్చాం కదా. అది చాలదా?&lt;br /&gt;'అలా మొదలైన మొక్కుల పర్వం కొడుక్కి ఫలానా స్కూల్లో సీటు వస్తే అది చేస్తానని, ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తే యిది చేస్తానని, ఇల్లు కడితే ఒకసారి, భార్యకు జబ్బు చేసినప్పుడు మరోసారి, బండి మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నప్పుడు యింకోసారి, సొంతంగా వ్యాపారం ప్రారంభించినప్పుడు, కొడుకుని అమెరికా పంపించినప్పుడు...'&lt;br /&gt;ఊపిరి తీసుకోవడానికి ఆగాడు చిత్రగుప్తుడు.&lt;br /&gt;- ఓరి వీడి అసాధ్యం కూల. ఎంత పక్కాగా లెక్క రాసుకుంటున్నాడు ఈ ముసలి చిత్రగుప్తుడు. ఇంత డేటా ఇంత పర్‌ఫెక్టుగా మెయింటెయిన్‌ చేస్తున్నాడంటే వీడి కంప్యూటర్లో చాలా మంచి సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్టుంది. వెళ్లేప్పుడు అడిగి మరీ తీసుకెళ్లాలి. పెద్దాడు దాన్ని బాగా డెవలప్‌ చేసి తను డెవలప్‌ అయిపోతాడు.&lt;br /&gt;'కూతురిని పెళ్లివారు చూడ్డానికి వచ్చినప్పుడు, ఆమెకి ఆ సంబంధం కుదిరినప్పుడు, చిన్నకొడుకు పెళ్లాం ఆస్తి పంపకంపై గొడవ పెట్టినప్పుడు'&lt;br /&gt;వింటున్న దేవుడు అప్రయత్నంగా ఆవ&lt;br /&gt;లించాడు.&lt;br /&gt;'అలా ఇప్పటికి వంద మొక్కులు మొక్కి, ఏ ఒక్కటీ నెరవేర్చలేదు ప్రభూ' దేవుడి అనాసక్త అవస్థ చూసి ముగించేశాడు చిత్రగుప్తుడు.&lt;br /&gt;'అంతేనా చిత్రగుప్తా' దేవుడి గొంతులో ఓస్‌ ఇంతేనా అన్నట్లనిపించి కేసు కొట్టేస్తాడేమోనని ఆనందం కలిగింది.&lt;br /&gt;'తమకే కాక ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, తనతో లావాదేవీలు నిర్వహించిన ప్రతిఒక్కరితోనూ ఎన్నో సందర్భాలలో అది చేస్తానని ఇది చేస్తానని వాగ్దానం చేసి మాట తప్పినట్టుగా నా దగ్గర రుజువులు ఉన్నాయి ప్రభూ'&lt;br /&gt;- ఈ చిత్రగుప్తుడు శిక్ష పడేదాకా వదిలేట్టు లేడు. ఇతణ్ణి ముందే మేనేజ్‌ చేసుకోవలసింది.&lt;br /&gt;'సరి సరి. ఇతగాడు శిక్షార్హుడే అని మేము విశ్వసించుచున్నాము. ఇతనికి తగిన శిక్ష ఏమీ?'&lt;br /&gt;'సలసల కాగుతున్న పామోలిన్‌ ఆయిల్‌లో ముంచి, మండుతున్న బొగ్గుల కుంపటిలో కాల్చి, సెయిల్‌ మేకులతో గుచ్చి, కుప్పం ఏనుగులతో తొక్కించి'..&lt;br /&gt;'ప్రభూ' చిత్రగుప్తుడి లిస్ట్‌ పూర్తికాకముందే ఎలాగోలా గొంతు పెకలించుకుని అరిచాను.&lt;br /&gt;'ఏమి?'&lt;br /&gt;దేవుడు నావైపు చూడగానే నన్ను మాట్లాడనివ్వమని కళ్లతోనే వేడుకున్నాను.&lt;br /&gt;'పలుకుము'&lt;br /&gt;'ధర్మఫ్రభువులు. శిక్ష కరారు చేసే ముందు అవతలివారికి కూడా వారి వాదన వినిపించేందుకు అవకాశం యివ్వరా?'&lt;br /&gt;'అవతలివారా, వారెవరు?'&lt;br /&gt;'నేనే ప్రభూ'&lt;br /&gt;'యివ్వను. నేరగానికి అవకాశం యివ్వడం అసంభవం. ప్రతి నేరగాడూ తను చేసే ప్రతి నేరానికీ తగిన కారణాలు ఉన్నాయనే అంటాడు. కారణాలు చెప్పుకుంటూ లోపాలను ఉపయోగించుకుంటూ నీతీ నిజాయితీ నిబద్ధతలకు మేలిముసుగులు కప్పుతూ భూలోకంలోలా ఇక్కడ మనగలగడం కుదరదు. మనుషులలో మానవీయతను నింపి, కట్టుబాట్లకు నిబద్ధులను చేసి, సామాజిక క్రమశిక్షణకు లోబడే విధంగా సత్సంప్రదాయపు జీవితం గడిపేలా చూడటం మా విధి. గాడి తప్పిన వాణ్ణి గాడ్‌ ఎలా క్షమిస్తాడురా మూర్ఖా? గాంధీని చంపిన గాడ్సే కూడా తను చేసిన ఘాతుకానికి పుంఖానుపుంఖాలుగా కారణాలు ఉన్నాయన్నాడు మీ భారతావనిలోనే ఒకనాడు. మేమది మర్చిపోలేదు'&lt;br /&gt;'దేవా, మీరసలు దేవుడేనా? ఇక్కడున్న వారంతా దేవతలేనా?'&lt;br /&gt;'స్వామీ. మీ స్పీచ్‌కి వీడికి మతి భ్రమించింది. తమ ఐడెంటిటీనే ప్రశ్నిస్తున్నాడు' చిత్రగుప్తుడు హోమగుండంలో నెయ్యి పోశాడు.&lt;br /&gt;'ఏమా పిచ్చి ప్రేలాపన' దేవుని కంఠం గర్జిం చింది.&lt;br /&gt;'మన్నించండి మహాప్రభూ. ఏదో తొందరలో అనేశాను. దేవ దేవ ధవళాచల మందిర, గంగాధరా హర నమో నమో'&lt;br /&gt;'పాటొద్దు. పాయింటుకు రా' దేవుడి స్వరంలో తీవ్రత తగ్గింది.&lt;br /&gt;'భగవాన్‌, రక్షకుడా, కరుణామయా'&lt;br /&gt;'ఏమిటీ సినిమా టైటిల్సు. విషయం చెప్పవయ్యా'&lt;br /&gt;'దేవా. కొండకు రాలేదని, గుండు చేయించలేదని, నిలువు దోపిడీలు యివ్వలేదని ఇంకా మొక్కులు తీర్చలేదని దేవుళ్లే లెక్కలు రాసి శిక్షలు వేస్తే ఇంక దేవుళ్లని దేవుళ్లనడం ఎందుకు స్వామీ. మేమిది ఇస్తే మీరది ఇస్తారని మీరు బోర్డు పెట్టి లోకాలను పాలిస్తున్నట్టు మేము నమ్మవచ్చు కదా. అప్పోసప్పో చేసేసి నీ మొక్కు తీర్చేస్తే మనిషి కోరుకున్నవన్నీ జరిగిపోవాలి కదా. మేము మొక్కులు చెల్లించలేదని మీరంటున్నారే మరి మీరు తీర్చని మొక్కుల సంగతి ఏమిటి? ఎన్ని మొక్కులు మొక్కినా ఒక్కటీ తీరలేదు అనే వాళ్ల పరిస్థితి ఏమిటి? అది మీ నేరం కాదా?'&lt;br /&gt;'ప్రభువులతో ఏమిటీ లా పాయింట్లు? మొక్కు లు మొక్కుటయే మీ వంతు. వాటిని నెరవేర్చుటయా లేకుంటే రిజెక్ట్‌ చేయుటయా అనేది ప్రభువుల వంతు. మొక్కు నెరవేరినా లేకపోయినా మీరు మొక్కు తీర్చాల్సిందే. మాట ముఖ్యం. ఫర్‌ ఎగ్జాంపుల్‌....'&lt;br /&gt;'చిత్రగుప్తా. ఆపుము. ఇతను వ్యాపారి. ఇతనికి అర్థమయ్యే ఎకానమీ భాషలోనే చెప్తాను. సూరయ్యా. విను. డబ్బు, మనిషి, వ్యవస్థా.. వీటి నడుమ సంబంధం తెలుసుకో. మనిషి తనకు కావలసిన సౌకర్యాలను కల్పించడం కోసం వ్యవస్థను తయారు చేశాడు. వ్యవస్థ నడవడానికి డబ్బు కావాలి. డబ్బు మనిషి సంపాదించాలి. అందుకోసం పని చేయాలి. పని వ్యవస్థ కల్పించాలి. ఇదొక చక్రవ్యూహం. ఈ వ్యూహంలో మనిషి ఒక్కడికే బుర్ర ఉంది. ఆలోచించి ఆచరించే సమర్థత ఉంది. అతడు తన ధర్మం విస్మరించాడా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. వ్యవస్థ ముక్కలైందా? డబ్బు గల్లంతవుతుంది. అందువల్ల మనిషికి క్రమశిక్షణ ముఖ్యం. దానిని పెంపొందించేదే దైవచింతన. దైవత్వం అంటే కర్తవ్య పాలన. మనిషి ఈ కర్తవ్య పాలనను మాట తప్పకుండా క్రమశిక్షణతో చెయ్యడమే మనిషి, డబ్బు, వ్యవస్థ పని చేయడానికి మూలకారణం. దేవుడు ఇదంతా గమనిస్తుంటాడు. మనిషి ఈ నియంత్రణలో ఉండేలా చేస్తాడు. అలాగే మొక్కుల రూపంలో మీరు యిచ్చింది మళ్లీ మీకే ఇస్తూ సర్క్యులేషన్‌ చేస్తుంటాడు.'&lt;br /&gt;'మహాప్రభో.. ఇక ఆపండి. అజ్ఞానం అంధకారంలా కమ్ముకొచ్చి నా కర్తవ్యాన్ని అలక్ష్యం చేశాను. ఒక్క ఛాన్సు యివ్వండి. భూలోకానికి వెళ్లి నా వాగ్దానాలు, యిచ్చిన మాటలు, చేసిన మొక్కులు తీర్చుకొని వస్తాను.'&lt;br /&gt;'వద్దు ప్రభూ వద్దు. ఇలాగే కొందరిని గతంలో మీరు మన్నించి ఒక్క ఛాన్సు యిచ్చి భూలోకానికి పంపారు. వాళ్లంతా రాజకీయ నాయకులై మిమ్మల్ని, ప్రజల్ని నిలువునా ముంచారు. మళ్లీ అటువంటి నిర్ణయం తీసుకోకండి స్వామీ' చిత్రగుప్తుడు వాదిం చాడు.&lt;br /&gt;దేవుడు ఒకసారి చుట్టూ పరికించి చూశాడు.&lt;br /&gt;'తర్జనభర్జనలతో శిరోభారం కలిగినది. శిక్ష కరారు చేయ ఏకాగ్రత కుదురుట లేదు. అట్లని క్షమించి విడిచిపెట్టుట న్యాయసమ్మతంగా తోచుట లేదు. కనుక కేసును తిరిగి జాగ్రత్తగా ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించుచున్నాను'&lt;br /&gt;దేవుడు లేచి వెళ్లిపోయాడు.&lt;br /&gt;వెలుగూ ఆయనతో పాటే వెళ్లిపోయింది.&lt;br /&gt;'అంటే వెళ్లిపోవచ్చా?'అడిగాను.&lt;br /&gt;'మళ్లీ పిలుస్తారులే' అన్నాడు చిత్రగుప్తుడు.&lt;br /&gt;ఆనందంతో ఎగిరి గంతేసి ఒక్కసారిగా కిందకు దూకాను.&lt;br /&gt;***&lt;br /&gt;వెనక్కి వచ్చిన నాకు యిల్లంతా ఏదో తేడాగా బోసిపోయినట్టుగా అనిపించింది. లోపలికి చూశాను.&lt;br /&gt;హాల్లో నా ఫోటో. ఫోటో ముందు దీపం.&lt;br /&gt;'నిద్రలోనే పోయాడు నా బిడ్డ.. రోజూ పొద్దున్నే లేచి అందర్నీ లేపేవాడు. ఇవ్వాళ ఎవరు లేపినా లేవలేదు. చిన్నాడు డాక్టరు కదా, వెంటనే పిలిపిస్తే వచ్చి చూశాడు, అప్పటికే నాడి కొట్టుకోవడం ఆగిపోయిం దట' ఏడుస్తూ ముక్కు చీదడానికి ఆపింది తల్లి.&lt;br /&gt;'అందరూ ఏటి ఒడ్డుకు వెళ్లారమ్మా. పెద్దాడికి ఫోన్‌ చేస్తే పదోనాటికి వస్తానన్నాడు. కూతురూ అల్లుడూ చిన్నరోజుకి వస్తామన్నారు. దూరాభారం కదా, ఇంకా ఉంచడమెందుకులే అని అన్నీ చిన్నాడి చేతనే కానిచ్చేశాము. అలా కూర్చోండి. అయ్యో నా బిడ్డా'... మళ్లీ శోకాలు మొదలెట్టింది.&lt;br /&gt;చిత్రగుప్తుడి తెలివి అర్థమైంది.&lt;br /&gt;సోల్‌ ఉంది, బాడీ లేదు.&lt;br /&gt;ఇది కండిషనల్‌ బెయిల్‌. మళ్లీ వెంటనే వెళ్లిపోక తప్పదు.&lt;br /&gt;చేసిన తప్పులు సవరించుకుని, యిచ్చిన మాటలు నెరవేర్చుకోవడానికి నాకు యింకో ఛాన్స్‌ లేదు. యివ్వలేదు.&lt;br /&gt;హతోస్మి.&lt;br /&gt;బయట ఎవడో పాట వేశాడు.&lt;br /&gt;'మానవా ఏమున్నది ఈ దేహం, ఇది రక్తమాంసముల అస్థిపంజరం దీనిపై ఎందుకురా వ్యామోహం'&lt;br /&gt;దండ వేసున్న ఫోటో వైపే చూస్తూ ఉండిపోయాను ఆత్మరూపంలో ఆత్మపరిశీలన చేసుకుంటూ.&lt;br /&gt;నాస్తిక భర్త&lt;br /&gt;జె.యు.బి.వి.ప్రసాద్‌&lt;br /&gt;&lt;br /&gt;అత్తా, కోడళ్ల నోముల ప్రహసనం మోహన్‌కి బాగా తెలుసు. ఏవో వాళ్ల నమ్మకాలు వాళ్లవి అని వదిలేశాడే గానీ, ఆ పూజలూ గట్రా నచ్చేవి కావు. ఆ నోముల వల్ల మోహన్‌కి వచ్చిన కొత్త కష్టం ఒకటుంది.&lt;br /&gt;&lt;br /&gt;'మా ఆయన నాస్తికుడు తెలుసా? దేవుడి మీద నమ్మకం లేదాయనకు' అతిశయంగా నవ్వుతూ అంది సునంద తన స్నేహితురాలు లక్ష్మితో.&lt;br /&gt;'అవునా?' అంది లక్ష్మి ఓరకంట మోహన్‌ వైపు చూస్తూ, కొంచెం నొసలు చిట్లిస్తూ.&lt;br /&gt;ఏమనాలో తెలియక భావరహితంగా చూశాడు మోహన్‌. నాస్తికత్వం కూడా ఒక క్వాలిఫికేషన్‌ లాంటిదని అతనికి తెలియదు. సునందకూ, మోహన్‌కూ పెళ్లయి నెల రోజులయింది. విజయవాడలో చుట్టాలింట్లో పెళ్లి ఉందని హైదరాబాద్‌ నుంచి రైల్లో వెళుతున్నారు. లక్ష్మి సెండాఫ్‌ ఇవ్వడానికి స్టేషన్‌కి వచ్చింది.&lt;br /&gt;ఇంతలో గార్డ్‌ విజిల్‌ వూదడమూ, రైలు కదలడమూ జరిగాయి.&lt;br /&gt;జీవిత భాగస్వామిని వెతుక్కోవడం చేతగాక, ఆ విషయం మోహన్‌ తల్లిదండ్రులకే వదిలేశాడు. 'నా కాబోయే భార్య నాలాగే నాస్తికురాలయి ఉండాలి' అని ఒకే ఒక షరతు పెట్టాడు, తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నప్పుడు.&lt;br /&gt;ఊహ తెలిసినప్పటి నుంచీ, పద్దెనిమిదేళ్ల వరకూ మంచి భక్తుడిగానే పెరిగాడు. ఆ తరవాత పుస్తకాలు చదవడం నేర్చుకుని, అరకొర నాస్తికుడిగా తయారయ్యాడు. నాస్తికత్వం పూర్తిగా అర్థం గాకపోయినా, దేవుడి మీద నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకున్నాడు ముందుగా.&lt;br /&gt;'సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలెవరూ నీలా నాస్తికుల్లా ఉండరు. పిచ్చి పుస్తకాలు చదివి నువ్విలా పాడయిపోయావు. ఇలాంటి వెర్రి, మొర్రి షరతులు పెడితే నీకు పిల్లనెవరూ ఇవ్వరు, తెలుసా!' అంటూ తల్లి భయపెట్టింది.&lt;br /&gt;దానికి వంత పాడారు అక్కా బావలు.&lt;br /&gt;పెళ్లి కాకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమోనన్న భయంతోనూ, దేవుడిని నమ్మే ఆడపిల్లలు కూడా మంచితనంతో ఉంటారనే నమ్మకంతోనూ తన షరతుని వదులుకున్నాడు చివరికి.&lt;br /&gt;పెళ్లి చూపుల్లో తను సునందతో ఒంటరిగా మాట్లాడాలంటే, పెద్ద వాళ్లు కాస్త ఏకాంతం కల్పించారు.&lt;br /&gt;'నాకు దేవుడి మీద నమ్మకం లేదండీ! నేను నాస్తికుడిని. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీకీ విషయం ముందే తెలియాలని చెప్తున్నాను' అన్నాడు మోహన్‌.&lt;br /&gt;అతని నిజాయితీకి సునంద ముచ్చటపడిపోయింది.&lt;br /&gt;'మీ ఫ్రాంక్‌నెస్‌ నాకు చాలా నచ్చింది. ఇంతమంది మనుషులు దేవుడున్నాడని నమ్ముతున్నారు కాబట్టి దేవుడున్నాడనే నా విశ్వాసం. మీరు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు!' నవ్వుతూ చెప్పింది.&lt;br /&gt;అంతే! ఆ నాస్తికుడికీ, ఆ ఆస్తికురాలికీ పెళ్లయిపోయింది. సాంప్రదాయబద్ధంగా కాకుండా, సింపుల్‌గా రిజిస్టర్‌ మేరేజీ చేసుకోవాలన్నది మోహన్‌ కోరిక. దానికి ఇరువైపుల వారే కాకుండా, సునంద కూడా ఒప్పుకోలేదు. పట్టుచీరలు కట్టుకుని, నగలు పెట్టుకోవాలన్నది ఆ అమ్మాయి సరదా.&lt;br /&gt;గత్యంతరం లేక అందరిష్ట ప్రకారం శాస్త్రోక్తంగా సునంద మెళ్లో తాళి కట్టాడు.&lt;br /&gt;'ఎప్పుడూ ఈ మంగళసూత్రం మెళ్లోనే వేసుకుంటావా, లేక అప్పుడప్పుడూ తీసేస్తావా?' కుతూహలంగా అడిగాడు పెళ్లయిన మర్నాడు.&lt;br /&gt;'అమ్మో, ఇంకా నయం. నేను బతికున్నంత కాలమూ ఈ మంగళ సూత్రం నా మెళ్లోనే ఉంటుంది' అంది భక్తిగా మంగళసూత్రాన్ని కళ్లకద్దుకుంటూ.&lt;br /&gt;అలా అని చెప్పి 'పతివ్రత'లా మోహన్‌ని నెత్తి మీద పెట్టుకున్నదీ లేదు. కాస్త ఎక్కువ, తక్కువలొస్తే చాలు ఉతికేసేది మాటల్తో మోహన్‌ని.&lt;br /&gt;'ఆ మెళ్లో మంగళసూత్రం మీదున్న భక్తి, అది కట్టిన నా మీద లేకుండా పోయింద'ని వాపోయాడు మోహన్‌.&lt;br /&gt;చుట్టాలింట్లో పెళ్లయ్యాక అడిగింది సునంద.&lt;br /&gt;'ఏమండీ! సాయంకాలం నన్ను కనకదుర్గ గుడికి తీసుకెళ్లండీ!'&lt;br /&gt;గతుక్కుమన్నాడు మోహన్‌.&lt;br /&gt;నాకు దైవ నమ్మకాలు లేవని నీకు తెలుసు కదా. నన్ను గుడికి రమ్మంటావేమిటీ?&lt;br /&gt;'ఒకసారి గుడికి వస్తే ఆస్తికుడిగా మారిపోతారని మీకేమన్నా భయమా? మనూళ్లో అయితే అడిగే దాన్ని కాదు కదా! కొత్త ఊరు కాబట్టి మీ మీద ఆధారపడుతున్నాను. ఒక్కసారి నాతో గుడికి వస్తే మీకేమీ వ్రత భంగం కలగదులెండి!' కొంచెం బతిమాలుతున్నట్లుగా అంది.&lt;br /&gt;సునంద లాజిక్‌కి జవాబేం చెప్పాలో తెలియలేదు మోహన్‌కి. అయిష్టంగానే బయలుదేరాడు గుడికి. మోహన్‌కి ఇంకో కోరిక ఉండేది, పెళ్లికి ముందర. అందువల్ల పెళ్లి చూపుల్లో సునందని, 'ఏమండీ, మీరు పెళ్లయ్యాక కూడా నన్ను 'ఏమండీ' అనే పిలుస్తారా, లేక పేరు పెట్టి పిలుస్తారా?' ఆశగా అడిగాడు.పేరు పెట్టి పిలిపించుకోవాలని మోహన్‌కి తపన.&lt;br /&gt;ఓ వెర్రి వెధవని చూసినట్లు చూసింది సునంద.&lt;br /&gt;జనరల్‌గా అంతే కదండీ! మా అక్కలంతా వాళ్ల భర్తలని 'ఏమండీ' అనే పిలుస్తారు. మా అమ్మా అంతే! జనరల్‌గా నేనూ అంతే.&lt;br /&gt;ఉసూరుమనిపించింది మోహన్‌కి. ఆ కోర్కెకి కూడా నీళ్లొదిలేసుకున్నాడు. కానీ పెళ్లయ్యాక, ఒంటరిగా ఉన్నప్పుడు 'నువ్వు' అనీ, ఎవరైనా ఉన్నప్పుడు 'ఏమండీ' అని సంబోధించేది సునంద మోహన్ని. అది నచ్చక, 'ఆ రెండు పిలుపుల్లో ఏదో ఒకటి సెటిల్‌ చేసుకో! ఇలా రెండు రకాలుగా పిలవడం నాకు నచ్చదు' అని చెప్పాడు.&lt;br /&gt;'ఏంటీ? నలుగురిలో 'నువ్వు' అని పిలవడమా? మీ అమ్మగారు చంపెయ్యరూ నన్ను?' అంటూ నెపాన్ని అత్తగారి మీదకి నెట్టేసి 'ఏమండీ' అనే పిలుపుతో సెటిల్‌ అయిపోయింది సునంద. దానికే అలవాటు పడిపోయాడు మోహన్‌ కూడా.&lt;br /&gt;గుళ్లో సునంద పక్కనే నించున్నాడు చుట్టూ చూస్తూ.&lt;br /&gt;కాస్త దణ్ణం పెట్టుకోండి అని గొణుగుతూ మోచేత్తో పొడిచింది సునంద.&lt;br /&gt;దణ్ణం పెట్టుకోకుండా, సీరియస్‌గా చూసి, గుడి బయటకి వచ్చేశాడు. రుసరుసలాడుతూ వెనకే వచ్చింది సునంద. ఏదో అనబోయి సీరియస్‌గా ఉన్న భర్త మొహం చూసి, కాస్త జంకి ఊరుకుంది.&lt;br /&gt;మర్నాడు ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ వచ్చేశారు. రోజులు మామూలుగానే ఎగుడు, దిగుడు దారిలో పోతున్నాయి. ఆ రోజు మోహన్‌ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, ముందు గదిలో సునందా, అతని తల్లీ విచారంగా కూర్చుని కనిపించారు. ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని భయపడ్డాడు.&lt;br /&gt;ఏవయిందీ? ఎందుకు మీరిద్దరూ దిగులుగా కూర్చున్నారూ? బెతుగ్గానే అడిగాడు మోహన్‌.&lt;br /&gt;ఇప్పుడో సమస్య వచ్చిందండీ, విచారంగా అంది సునంద.&lt;br /&gt;ఏమిటా సస్పెన్సూ, అసలు విషయం చెప్పండి... విసుక్కున్నాడు.&lt;br /&gt;అది కాదురా! ఇది శ్రావణ మాసం. మీ పెళ్లయ్యాక వచ్చిన మొట్టమొదటి శ్రావణ మాసం. సునంద నోములు నోస్తోందని నీకు తెలుసు కదా... అని చెప్పి కాస్త ఆగింది తల్లి.&lt;br /&gt;అత్తా, కోడళ్ల నోముల ప్రహసనం మోహన్‌కి బాగా తెలుసు. ఏవో వాళ్ల నమ్మకాలు వాళ్లవి అని వదిలేశాడే గానీ, ఆ పూజలూ గట్రా నచ్చేవి కావు. ఆ నోముల వల్ల మోహన్‌కి వచ్చిన కొత్త కష్టం ఒకటుంది.&lt;br /&gt;మొదటి నోము నోచుకున్నపుడు అమ్మవారి పూజ అవగానే, మోహన్‌ చేతిలో అక్షింతలు పెట్టి, అతను తెల్లబోయ చూస్తుండగా, వంగి అతని పాదాలకు దణ్ణం పెట్టబోయింది సునంద.&lt;br /&gt;పాము తగలబోతున్నట్లుగా ఒక్క గంతు వెనక్కేశాడు మోహన్‌.&lt;br /&gt;'ఇదేమిటీ, ఇదేమిటీ? ఇలాంటివి నాకిష్టం లేదు' అన్నాడు గబ గబా.&lt;br /&gt;'నోము నోచాక, భర్త కాళ్లకి దణ్ణం పెట్టకపోతే అరిష్టం. అత్తయ్యగారూ చూడండీ, మీ అబ్బాయి దణ్ణం పెట్టనివ్వడం లేదు నన్ను...' అంటూ కంప్లయింటు చేసింది.&lt;br /&gt;తల్లి వచ్చి మోహన్‌ని గట్టిగా పట్టుకోవడం, సునంద వెంటనే మోహన్‌ కాళ్లకి దణ్ణం పెట్టేయడం, మోహన్‌ బిత్తరపోయి చూస్తూ ఉండటం జరిగిపోయాయి.&lt;br /&gt;అక్షింతలు వెయ్యలేదండీ, గొణిగింది సునంద.&lt;br /&gt;ఫర్వాలేదులే, దణ్ణం పెట్టావుగా! వీడొక మొండి వెధవ అంటూ అత్తగారు లోపలికి వెళ్లిపోయింది.&lt;br /&gt;తర్వాత వారం, సునంద పూజలో ఉండగానే మోహన్‌ ఇంట్లోంచి పారిపోయాడు, మళ్లీ ఎక్కడ సునంద చేత దణ్ణం పెట్టించుకోవాల్సి వస్తుందోనని.&lt;br /&gt;సాయంత్రం ఇంటికొచ్చేసరికి గుమ్మంలోనే కన్నీళ్లతో ఎదురయ్యింది సునంద.&lt;br /&gt;నీకంత బుద్ధి లేదేమిట్రా? భర్తకి దణ్ణం పెడితే గానీ నోము అయినట్లు కాదని అమ్మాయి కిందటి వారమే చెప్పింది కదరా! పొద్దున్నించీ ఏమీ తినకుండా, నీ కోసం చూస్తూ కూర్చుంది. నీకు దణ్ణం పెట్టి, నోము పూర్తయితేనే ఎంగిలి పడుతుంది. నీకంత మంకు పట్టుదల ఎందుకూ?... చీవాట్లేసింది తల్లి.&lt;br /&gt;అవాక్కయిపోయిన మోహన్‌ కాళ్లకి చప్పున దణ్ణం పెట్టేసి వంటిం ట్లోకి వెళ్లిపోయింది సునంద. అప్పటినుంచీ గొడవ చెయ్యకుండా, లొంగి దణ్ణాలు పెట్టించుకుంటూ వచ్చాడు మోహన్‌.&lt;br /&gt;ఇప్పుడు మీ నోములకేం కష్టం వచ్చింది? కాస్త కినుకగానే అడిగాడు.&lt;br /&gt;అతని కినుకని పట్టించుకోలేదు అత్తా, కోడళ్లిద్దరూ.&lt;br /&gt;'అది కాదండీ. అత్తయ్యగారికి అర్జెంటుగా వూరు వెళ్లే సందర్భం వచ్చింది. నోము రోజు సాయంకాలంగానీ తిరిగి రాలేరు. అసలే ఇది ఆఖరి వారం, చాలా ముఖ్యం కూడా! నా చేత నోము ఎవరు నోయిస్తారూ? అదీ అసలు సమస్య' చాలా దిగులుగా చెప్పింది సునంద.&lt;br /&gt;'నీ అంతట నువ్వు నోము నోచుకోలేవా?' అడిగాడు. మోహన్‌కి అప్పటికే నోము మీద సహనం ఏర్పడిపోయింది.&lt;br /&gt;'ఒక్క మనిషీ అంత పని ఎలా చేసుకుని పూజ చేసుకోగలదురా పొద్దున్నే? కాస్త మనిషి తోడు వుండొద్దూ?' అంది తల్లి కోడలికి సపోర్టుగా.&lt;br /&gt;అర్థం కానట్టు చూశాడు మోహన్‌.&lt;br /&gt;'మీరు కొంచెం సాయం చేస్తే, ఈ వారం గట్టెక్కించేస్తానండీ' బతిమాలుతూ అంది సునంద.&lt;br /&gt;తెల్లబోయాడు మోహన్‌.&lt;br /&gt;'నేనేం చెయ్యగలనూ?' ఆశ్చర్యంగా అడిగాడు.&lt;br /&gt;'ఆ రోజు పొద్దున్నే లేచి, స్నానం చేసి, కొంచెం అమ్మవారికి వంట చేసి పెట్టాలి. ఆ లోపల నేను అమ్మవారిని తయారు చేసి, పూజ చేస్తాను. ఈ ఒక్కసారికీ సాయం చెయ్యండీ. ఇంకెప్పుడూ అడగనుగా మిమ్మల్ని' ఎంతో ప్రాధేయపడుతూ అంది సునంద.&lt;br /&gt;తల్లి కూడా జాలిగా చూసింది కొడుకు వేపు. అంతే. మోహన్‌ మనసు ద్రవించిపోయింది.&lt;br /&gt;నోము రోజు పొద్దున్నే నాలుగ్గంటలకి అలారం మోతతో లేచాడు. కళ్లు మండుతూండగానే స్నానం గట్రా కానిచ్చాడు. సునంద కూడా లేచి వంటగదిలోకి వచ్చి, పూజా మందిరం దగ్గర కూర్చుంది. మందిరాన్ని, దేవుడి పటాలను, విగ్రహా లనూ శుభ్రం చెయ్యడం, పూజ సామాగ్రి సమకూర్చడం మొదలుపెట్టింది.&lt;br /&gt;'సతీవ్రతుడి'లాగా మోహన్‌ మామిడికాయ పప్పూ, వంకాయ కూరా, దోసకాయ పచ్చడీ, పులుసూ, అన్నం వండాడు. పులిహోర చేశాడు. పూర్ణం బూరెలూ, గారెలూ వండాడు. రుబ్బడాల్లోనూ, కూరలు తరగడంలోనూ, గిన్నెలు తొలవడం లోనూ సాయం చేసింది సునంద. మొత్తానికి వంట పూర్తయ్యేసరికి ఒళ్లు హూనం అయిపోయింది మోహన్‌కి. అప్పటికి పూజ మొదలుపెట్టింది సునంద.&lt;br /&gt;మామూలు తెలుగయితే వచ్చు గాని సంస్క­ృత పదాలు నోరు తిరగడం లేదు సునందకి. పూజ మంత్రాలన్నీ సంస్క­ృతంలో వున్నవాయే! అన్ని రోజులూ అత్తగారు చిన్నప్పటి నించీ వున్న అభ్యాసంతో చదివిపెట్టేది. ఇప్పుడు తనే కూడబలుక్కుంటూ చదివితే ఆ సంస్క­ృత పదాలు తనకే కర్ణకఠోరంగా వినిపిం చాయి. చదవడం ఆపి మోహన్‌ వేపు బాధగా చూసిం ది. మోహన్‌కి విషయం అర్థం అయింది. కాలేజీలో అతడు సంస్క­ృతం నేర్చుకుని ఉన్నాడు. అప్పటికే ఆ అక్షర దోషాలు వినలేక అవస్థపడుతున్నాడు.&lt;br /&gt;ఇంకోసారి అడిగించుకోకుండా మంత్రాలన్నీ చదివి పూజ జరిపించాడు సునంద చేత. పూజ పూర్తి చేసి అమ్మవారికి మహా నైవేద్యం ఘనంగా పెట్టి సంతృప్తి చెందింది సునంద.&lt;br /&gt;సాయంత్రానికి వచ్చిన తల్లి కొడుకుని బాగా మెచ్చుకుంది. సునంద కూడా బోలెడంత కృతజ్ఞత చూపింది. ఓ రెండ్రోజులు మోహన్‌ని రాజకుమారుడిలాగా చూసుకుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని కాస్త సంతృప్తి పడ్డాడు మోహన్‌ కూడా.&lt;br /&gt;ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, ముందు గదిలో సునంద తన స్నేహితురాలు లక్ష్మితో మాట్లాడుతూ కనబడింది. లక్ష్మి వేపు పలకరింపుగా చూసి లోపల గదిలోకి వెళ్లాడు మోహన్‌. అక్కడకి వీళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మోహన్‌ వినాలని సునంద కొంచెం గొంతు పెద్దది చేసింది కూడా.&lt;br /&gt;'నువ్వెన్నైనా చెప్పు లక్ష్మీ. ఈ నాస్తికులు మంచివాళ్లు. వాళ్లు మనల్ని మారమనరు. వాళ్లే మారతారు. మనకి అనుగుణంగా మారి, అన్నిట్లోనూ తోడుగా వుంటారు. మనమేం మారక్కలేదు. ఏ సాయమూ చేయని ఆస్తిక మొగుడి కన్నా అన్ని సాయాలూ చేసే నాస్తిక మొగుడే బెటర్‌' అంది సునంద.&lt;br /&gt;ఆ మాటలు మోహన్‌కి ఆనందం కలిగిస్తాయని సునంద విశ్వాసం. అయితే అవే మాటలు మోహన్‌ని ఆలోచనల్లో పడేశాయి.&lt;br /&gt;అలా స్నేహితురాలితో అనడంలో సునందకి వేరే ఉద్దేశం కూడా ఉంది. పెళ్లయినప్పటి నించీ భర్త తననెక్కడ మారమంటాడోనని సునం దకి గుబులుగానే ఉంది. ఈ విధంగా మాట్లాడితే తనకా యిబ్బంది ఉండదని ఒక ఆశ.&lt;br /&gt;పెళ్లయిన మొదట్లో సునందని కొంచెం మార్చడానికి ప్రయత్నించాడు మోహన్‌. కొన్ని వ్యాసాలున్న పుస్తకాలిచ్చాడు చదవమని. కథల పుస్తకాలు, ముఖ్యంగా చెడ్డ మొగుళ్లు మంచి భార్యలని కష్టపెట్టే కథలున్న పుస్తకాలు చదివేది ఇష్టంగానే. అవి చదివేటప్పుడూ, చదివిన తరువాతా ఆ చెడ్డ మొగుళ్లని తిట్టి పోసేది బహిరంగంగా. ఆ తిట్లు ఆ పుస్తకాల్లోని పాత్రలకో, లేక జాగ్రత్తగా వుండమని ఇండైరెక్టుగా తనకో అర్థం అయ్యేది కాదు మోహన్‌కి. వారపత్రికల్లో సినిమా కబుర్లూ, కథలూ చదివేదిగానీ వ్యాసాలు చదివేది కాదు.&lt;br /&gt;ఒకరోజు సాయంకాలం ఏదో పార్కుకి వెళ్లారు ఇద్దరూ. నెమ్మదిగా నాస్తిక ప్రస్తావన తీసుకువచ్చాడు మోహన్‌. పాత పాఠమే మళ్లీ ఒప్పచెప్పింది సునంద.&lt;br /&gt;'ప్రపంచంలో ఎంతోమంది దేవుడున్నాడంటూ నమ్ముతున్నారు కదా. ఉండకుండా ఎందుకుంటాడు దేవుడు?' ప్రశ్నించింది సునంద.&lt;br /&gt;'ప్రపంచంలో ఎంతోమంది భూమి గుండ్రంగా లేదని నమ్మేవారు మొదట్లో. ఏ విషయంలోనన్నా నిజం ఆ విషయం మీద ఆధారపడి వుంటుందిగానీ ఎంతమంది నమ్ముతున్నారని కాదుగదా' తర్కం చెప్పాడు మోహన్‌.&lt;br /&gt;ఆ తర్కం అర్థమే కాలేదు సునందకు.&lt;br /&gt;'మీరెన్ని చెప్పండి. నేను దేవుడిని నమ్మే తీరుతాను. మీరు నా నమ్మకాన్ని మార్చలేరు' అంది సునంద స్పష్టంగా.&lt;br /&gt;ఏమీ మాట్లాడలేదు మోహన్‌. ఆ అమ్మాయిని 'మారూ మారూ' అని అనడానికి తనకేం హక్కు ఉందీ అని తర్కించుకున్నాడు. ఏ వ్యక్తయినా విజ్ఞానం సంపాదించుకుని దానితో మారాలే గానీ ఇంకో వ్యక్తి ప్రోద్బలంతో కాదు కదా.&lt;br /&gt;స్నేహితురాలు లక్ష్మి వెళ్లిపోగానే లోపల గదిలోకి వచ్చింది సునంద.&lt;br /&gt;'మీరు స్నానం చేసి వస్తారా, నేను అన్నాలు పెట్టేస్తానూ?' అడిగింది.&lt;br /&gt;'అలాగే కానీ, నీకో విషయం చెప్పాలి' మెల్లిగా అన్నాడు మోహన్‌.&lt;br /&gt;ఏమిటన్నట్టు చూసింది సునంద.&lt;br /&gt;'రేపు టౌన్‌హాల్లో రామాయణ విషవృక్షం మీద మీటింగు ఉంది. ఆ పుస్తకం రాసిన రచయిత్రితో ముఖాముఖీ కూడా ఉంది ఆ సభలో. వెళదామనుకుంటున్నాను' చెప్పాడు.&lt;br /&gt;గతుక్కుమంది సునంద.&lt;br /&gt;'వెళదామనుకుంటున్నానంటే మీరొక్కరేనా, నేను కూడా రావాలా?'&lt;br /&gt;'నేను వెళ్లడం ఖాయం. నువ్వు కూడా రాకూడదూ, బాగుంటుందీ? ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కూడా' ఆశగా అడిగాడు.&lt;br /&gt;'ఇంకా నయం. దేవుడి మీద యింత నమ్మకాన్ని పెట్టుకున్న నేను విషవృక్షం మీటింగుకి రావడం ఏమిటీ? నా కళ్లు పోవూ? అసలు మీరు కూడా వెళ్లడం ఎందుకూ? ఏవో ఆ పుస్తకాలు యింట్లో చదువుతూనే వున్నారుగా' గట్టిగా అడిగింది.&lt;br /&gt;'అదేమిటీ, అలాగంటావూ? నాకు నమ్మకం లేకపోయినా నీ కోసం నేనెన్నిసార్లు దైవ కార్యాల్లో తలదూర్చలేదూ? నమ్మకం లేకపోయినా నువ్వూ నా కోసం రావొచ్చు కదా.'&lt;br /&gt;'అదీ యిదీ ఒకటెలా అవుతుందీ? నమ్మకం లేకుండా చేసినా, అవి దైవ కార్యాలవడం చేత మీకు పుణ్యమే వస్తుంది. నమ్మకం పెట్టుకుని, నేను ఈ నాస్తిక సభలకి వస్తే నాకు పాపం వస్తుంది. అదీ తేడా.'&lt;br /&gt;'ఈ పాపం, పుణ్యం నిర్వచనాలు నీకు గానీ నాకు కావు గదా. కాబట్టి నువ్వు అనుకున్నట్టు నేననుకోనుగదా.'&lt;br /&gt;'మీరెలా అనుకున్నా సరే, ఈ నాస్తిక సభలకి రావడం నా వల్ల కాదు బాబూ. అంతగా కావలిస్తే, మీరొక్కరూ వెళ్లి రండి' స్థిరంగా చెప్పింది.&lt;br /&gt;'నేను ఎలాగూ వెళ్లి తీరతాను. దాన్ని ఎవరూ ఆపలేరు. నా సమస్య అది కానే కాదు. ఇంతకాలం ఇన్ని విషయాల్లో నా నమ్మకాలకు విరుద్ధంగా నీ కోసం, కేవలం నీ కోసం లొంగాను. నువ్వు నా కోసం ఒక్కసారి ఎందుకు లొంగలేవూ అని.'&lt;br /&gt;'ఈ లొంగడాలవీ మీ నాస్తికులకే వచ్చు. మా ఆస్తికులకి రావు బాబూ. మీరు 'ఫరవాలేదులే' అనో, మరోలాగో, మా కోసం అనో, మరో దాని కోసం అనో లొంగుతూ ఉంటారు. నమ్మకం లేకుండా ఎవరికోసమో గుడికి వెళ్లే నాస్తికులని చూడగలరు గానీ, గుడిని తగలబెట్టాలనే నాస్తిక సభలకి వెళ్లే ఆస్తికులని మీరెరుగుదురా? ఆ మనుషులతో సంబంధాలన్నా తెంపుకుంటాం గానీ అటువంటి సభలకి పోము బాబూ.'&lt;br /&gt;ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది మోహన్‌కి.&lt;br /&gt;'తెలివితక్కువగా అయినా చాలా కరెక్టుగా చెప్పావు. ఈ విధంగా మనుషుల కోసం లొంగడం అనే విషయం నాస్తికులే చేస్తున్నారు. ఆస్తికులు మాత్రం లొంగరు. లోపం నాస్తికుల్లోనే ఉంది. మా భావాల మీద మాకే గట్టి పట్టుదల లేదు. మా జ్ఞానంలో ఎక్కడో లోపం ఉంది. ఈ లోపాల్ని మేం సవరించుకోవడం లేదు గాబట్టి, మేం అంటే ఏ మాత్రమూ గౌరవం లేకుండా పోతోంది మీకు. నిజమే ముందరగా మారవలసింది మేమే.'&lt;br /&gt;ఆ రోజు నుంచీ సునంద ప్రసాదం పెట్టినా తీసుకోవడం మానేశాడు. తన జ్ఞానాన్ని నాస్తికత్వానికే పరిమితం చెయ్యకుండా ఆస్తికత్వానికి గల మూలకారణల గురించి కూడా తెలుసుకోవడం మొదలెట్టాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194456240495259?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194456240495259/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194456240495259' title='5 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194456240495259'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194456240495259'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194456240495259.html' title='నిజమే కానీ ప్రభూ....'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>5</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194418973828076</id><published>2005-07-21T04:09:00.000-07:00</published><updated>2005-07-21T04:09:49.746-07:00</updated><title type='text'>యజమాని</title><content type='html'>From July 2005 Vipula &lt;br /&gt;    &lt;br /&gt;యజమాని&lt;br /&gt;సి.ఆర్‌.దాస్‌&lt;br /&gt;ఇండో ఆంగ్లికన్‌ కధ&lt;br /&gt;రామారావు ఒక ఇరుకు సందులోని మామిడిచెట్టు కింద కూర్చుని సైకిళ్లు రిపేరు చేస్తూ ఉంటాడు. ఒక పక్క చెక్కలతో చేసిన చిన్న గది ఉంది. ఆ గల్లీలో దొంగతనాలు, మోసాలు చేసి బతుకు వెళ్లదీస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. కొద్దిమంది మంచి ప్రవర్తన గలవారు మాత్రం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;రామారావుకు సైకిళ్లు బాగుచెయ్యడంలో చెయ్యితిరిగిన పనివానిగా పేరుంది. అతను దారిద్య్రపు తిరగలిలో పడి నలుగుతున్నాడు. వున్న దరిద్రంతోపాటు తాగుడు అలవాటు అయింది. రిపేర్ల వల్ల వచ్చిన కాసిని డబ్బులూ తాగుడుకు ఖర్చుచేస్తాడు. అతని భార్య లక్ష్మి, కూతురు భవానీ కొన్ని ఇళ్లలో పనిపాటలు చేసుకుంటూ, ఆ ఇళ్లవారు మిగిలిపోగా ఇచ్చిన ఆహారాన్ని తింటున్నారు. వచ్చే కొద్దిపాటి జీతంతో వారు జీవితాలు వెళ్లమార్చడం కష్టంగా ఉంది. ఒక్కొక్కసారి ఆ తల్లీ కూతుళ్ళు తాము అటువంటి బతుకు బతికే బదులు చావడమే మేలని అనుకునేవారు.&lt;br /&gt;&lt;br /&gt;ఒకవైపు ఆర్థిక బాధ కృంగదీస్తూ ఉండగా, మరొకవైపు భవానీ పెళ్లి గురించిన బాధ లక్ష్మిని వేధిస్తోంది. తాను, భవానీ పనులు చేస్తున్న ఇళ్లల్లోని పురుషుల బారిన పడకుండా వెయ్యికళ్లతో ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తోంది. గతంలో అటువంటి దుర్ఘటనలు ఆమె ఎన్నో ఎదుర్కొంది.&lt;br /&gt;&lt;br /&gt;లక్ష్మి పెద్దకూతురు ఒక పోలీసు ఆఫీసరు కొడుకు రేప్‌ చెయ్యడంవలన ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు ఆఫీసర్‌ డబ్బు, పలుకుబడివలన అతని కొడుకుపై లక్ష్మి ఏ చర్యా తీసుకోలేకపోయింది. ఆనాటి నుంచీ భవానీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తోంది పురుషుల పట్ల బహు జాగ్రత్తగా ఉండమని తెలివితక్కువ తనంతో పురుషుల వలలో పడితే, అక్కకు పట్టిన గతే తనకు కూడా పడుతుందని మృదువుగా కొన్నిసార్లు, కరి౮నంగా కొన్నిసార్లు చెప్పింది. అక్కవలే తాను అజాగ్రత్తగా ఉండననీ, తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటానని భవానీ తల్లికి చెప్పింది.&lt;br /&gt;&lt;br /&gt;కలెక్టర్‌ ఆఫీసులో రఫుపండా హెడ్‌క్లర్క్‌. బక్కపలచగా, నెరసిన తలతో ఉంటాడు. జిత్తులమారి నక్కవంటి వాడు. భార్య బాగా ముసలిదైంది. కొడుకులు ప్రభుత్వోద్యోగంలో మంచి స్థితిలో ఉండి, భార్యలతో వేరే ఉంటున్నారు. ఆ దంపతుల విషయంలో శ్రద్ధ తీసుకొంటూ భవానీ రఫుపండా ఇంట్లో పనిచేస్తోంది. పండా భార్య పరమ గయ్యాళిది. అయితే పండా మాత్రం నిదానస్తుడు. ముసలితనం వచ్చినా అతని బుద్ధులు పెడదోవన పడుతూనే ఉన్నాయి. తరచుగా డబ్బు ఇస్తూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. అమాయకత్వంతో ఆమె డబ్బు తీసుకొనేది.&lt;br /&gt;&lt;br /&gt;కొద్దిరోజుల్లోనే పండా దుర్భద్ధి భవానీ గ్రహించి, అతణ్ని కరి౮నంగా మందలించింది. అతని ప్రవర్తన గురించి, అతని భార్యకు చెప్తానని హెచ్చరించింది. అది విని పండా గజగజా వణికిపోయాడు. తనను క్షమించమని భవానీని కోరాడు. ఈ విషయం భార్యకు తెలిస్తే, ఆమె తన నిక చీల్చి చండాడుతుందని భయపడిపోయాడు. అయినా భవానీని వదల కూడదనీ, తన స్వార్థానికి మరొక విధంగా ఉపయోగించుకోవాలని భావించాడు. అతను ఆఫీసులో విపరీతంగా లంచాలు తీసుకొని బాగా గడించాడు! అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆఫీసులో అతని ఆటలు సాగడం లేదు. ఆ జిల్లాకు కొత్త కలెక్టర్‌ వచ్చాడు.&lt;br /&gt;&lt;br /&gt;అతను అమిత నిజాయితీపరుడు. లంచాలు ఇవ్వడాన్నీ, తీసుకోవాడాన్నీ సహించడు. అతణ్ని చూసి కటక్‌లోని అవినీతిపరులంతా భయపడుతున్నారు!&lt;br /&gt;&lt;br /&gt;తన పబ్బంగడుపుకొనడంకోసం, కుతంత్రాలు పన్నడంలో ఆరితేరిన పండా ఒక పధకం పన్నాడు. ఆపధకాన్ని కలక్టర్‌పై ప్రయోగించడానికి ఓ రూపకల్పన చేశాడు. కొత్త కలక్టర్‌ అయిన తపన్‌సింగ్‌ ఎంత నీతిపరుడైనా, ఓ అందాల మగువ వలన తన నీతిని కోల్పోయి భ్రష్టుడుకాకపోడు! ఎంతమంది ప్రముఖులు పదవుల్లో వున్నవారు స్త్రీల వలలో చిక్కి పతనం కాలేదు! తన పధకానికి ఇక తిరుగులేదని రఫుపండా గ్రహించాడు. తన పాచికపారి, గుప్పిట్లో కలక్టరు చిక్కితే, అటుపై తనపంట పండినట్లే! కంట్రాక్టర్లవద్ద, ఇతర వ్యాపారుస్తుల నుంచి దండిగా వెనకటివలే లంచాలు గుంజుకోవచ్చు. కలక్టర్‌ యువకుడు, అందగాడు. పెద్దపదవిలోవున్నవాడు అవ్వడంవలన, కుర్రదైన భవానీ అతని కోరిక తీర్చితీరుతుంది. ఆమె అందానికి కలక్టర్‌ పడిపోకమానడు. ఆ బుద్ధి లేనిది తనకోరిక తీర్చిందే కాదు! ఈ విధంగా పండా ఆలోచనలు సాగాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఆ రోజు మిట్టమధ్యహ్నం మండే ఎండలో ఓడొక్కు సైకిల్‌పై ముసలి పండా లక్ష్మి ఇంటికి వెళ్లాడు.&lt;br /&gt;&lt;br /&gt;''లక్ష్మి! నిద్రపోతున్నావా? తలుపుతెరువు. నీకోసం ఒక మంచి వార్త తెచ్చాను.'' అన్నాడు బిగ్గరగా.&lt;br /&gt;&lt;br /&gt;వెంటనే లక్ష్మి తలుపుతెరిచింది. గొప్పవాడైన రఫుపండా తనగుమ్మం ముందు నిలబడి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపడింది. ఇంకా తేరుకోకముందే, పండా చొరవగా ఇంట్లోకి వెళ్లి ఓచిన్న ఎత్తుపీటమీద కూర్చున్నాడు. అతని ఎదురుగా వేసివున్న చాపపై లక్ష్మి కూర్చుంది. పక్కన భవానీ ఉంది. లక్ష్మి వంక చూస్తూ పండా చెప్పసాగాడు.&lt;br /&gt;&lt;br /&gt;''చూడు లక్ష్మి! కొత్తగా వచ్చిన కలక్టర్‌ యువకుడు, అందరినీ అర్ధం చేసుకుని, వారికి కావలసిన మేలుచేస్తూ ఉంటాడు. పేదలపట్ల జాలీ, దయ, ఆయనలో గొప్ప విశేషాలు, అతని ఆర్డరు లేకుండా జిల్లాలో ఎవ్వరూ ఏపనీ చెయ్యడానికి వీల్లేదు''&lt;br /&gt;&lt;br /&gt;అది విని లక్ష్మి లోపల బాధకు, ఆందోళనకు గురి అయింది. పెద్ద ఆఫీసర్లందరూ మోసగాళ్లు, దగాకోర్లు అనే అభిప్రాయం అమెది. '' పండాబాబు! మీరెందుకని కలక్టర్ను అదేపనిగా పొగుడుతున్నారు? నాకు తెలిసిన ఆఫీసరు ఒకడు ఉన్నాడు. అతను ప్యూన్ల్‌ను తరుచుగా కొట్టేవాడు. ఈ పెద్ద ఆఫీసర్లందరూ దుర్మార్గులు. వాళ్ల గురించి నాకు చెప్పకండి. మాబోటి పేదవాళ్లకు అంతులేని అపకారం చేసేదివాళ్లే!'' అంది ఆవేశంతో.&lt;br /&gt;&lt;br /&gt;''అలా అనకు! మన కొత్త కలక్టర్‌ అటువంటివాడు ఎంతమాత్రం కాదు. నా సర్వీస్‌ మొత్తం మీద అటువంటివాణ్ని నేనెప్పుడూ చూళ్లేదు!''&lt;br /&gt;&lt;br /&gt;అతనివంక సూటిగా చూస్తూ, ''ఇంతకీ మీరు చెప్పేది ఏమిటి?''&lt;br /&gt;&lt;br /&gt;నేను నీకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. నీ శ్రేయోభిలాషిని. నీకు మేలే చేస్తానుగానీ, కీడు అనేది చెయ్యనుగదా! ఈ వయస్సులో మనకు డబ్బు అవసరం ఎంతైనా ఉంటుంది. క్రమేపీ నాలో పని చేసే శక్తి సన్నగిల్లుతుంది. ఈ స్థితిలో నువ్వోక మంచి నిర్ణయం తప్పక తీసుకోవాలి సుమా!'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;లక్ష్మిలో ఓపిక సన్నగిల్లింది ''పండాగారు! మీరు చెప్పదలుచుకొన్నదేదో సృష్టంగా చెప్పండి. మీరు ఇక్కడకు ఏపని మీద వచ్చారు?'' అంది విసుగ్గా&lt;br /&gt;&lt;br /&gt;నీ కష్టాలు నుంచి నిన్ను బయటపడవెయ్యడానికి నేనిలావచ్చాను. కలక్టరు గారికి బంగళాలో పని చెయడానికి ఒక పనిమనిషి కావాలి. బాగావంటలు చెయ్యడంకూడా తెలిసి ఉండాలి. ఈ విషయంలో మీ భవానీకి మించిన అమ్మాయి వేరెవ్వరూలేరు. కలక్టరు ఆమెకు మంచి జీతం ఇస్తాడు. మీ అమ్మాయిని రేపు నాతో పంపించు. కలక్టరుకు పరిచయం చేస్తాను'' అన్నాడు. లక్ష్మి ఏమీమాట్లాడలేదు.&lt;br /&gt;&lt;br /&gt;''లక్ష్మి! నీ కష్టాలు, అవసరాలు ఇకతీరిపోయినట్లే! అదృష్టం నీముందు నిలిచింది. మంచి నిర్ణయం తీసుకో. ఈ అవకాశాన్ని వదులుకోకు!''&lt;br /&gt;&lt;br /&gt;గాయపడిన సింహంలా గర్జించింది లక్ష్మి&lt;br /&gt;&lt;br /&gt;''నాకు కష్టాలు తొలగి సుఖాలు రావాలని నేను కోరుకోవడం లేదు. పదవిలో వున్న ఓ దుర్మార్గునికి నా కూతురును బలి ఇవ్వమంటావా?'' అంది కళ్లల్లో నిప్పులు చెరుగుతూ.&lt;br /&gt;&lt;br /&gt;ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వీ విధంగా మాట్లాడతావని నేను అనుకోలేదు. ఒక్క దేవుడు మాత్రమే నాలో ఉన్న మంచి భావాన్ని అర్థం చేసుకోగలడు! నీ కూతురు విషయంలో అన్ని జాగ్రత్తలూ నేను తీసుకుంటాను. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టు. నా మాట నమ్ము'' అన్నాడు పండా.&lt;br /&gt;&lt;br /&gt;లక్ష్మి ఆలోచనలో పడింది. చివరికి పండా ఆమెను ఒప్పించగలిగాడు. అయితే లక్ష్మి అతనికి ఓ షరతు పెట్టింది.&lt;br /&gt;&lt;br /&gt;''మా భవానీ అయిదారు రోజులు బంగళాలో పనిచేస్తుంది. అప్పుడు కలెక్టర్‌ మంచివాడేనని ఆమెకు నమ్మకం కలిగితేనే అటుమీదట పనికి వెళ్తుంది''&lt;br /&gt;&lt;br /&gt;ఆ మర్నాడు ఉదయం పండా, భవానీని వెంటతీసుకొని కలెక్టరు బంగళాకు వెళ్లాడు. కలెక్టర్‌ వద్దకు ఆమెను తీసుకువెళ్లినప్పుడు ఆయన ముందు వినమ్రంగా ఎలా ప్రవర్తించవలసిందీ పండా ఆమెకు బోధపరిచాడు. అది విని భవానీ భయపడిపోయింది. తాను మొదటిసారిగా ఓ కలెక్టర్‌ ముందుకు వెళ్లబోతోంది. తనవొంటి మీదున్న పాతవి, మాసినట్లుగా కనిపిస్తున్న దుస్తులు చూసి కలెక్టరుగారు చిరాకు పడతారు అనుకుంది భవానీ.&lt;br /&gt;&lt;br /&gt;రఫు పండా కూడా లోలోపల ఆందోళన చెందుతున్నాడు. భవానీ విషయాన్ని కలెక్టరుకు ఎలా చెప్పాలి? కలెక్టర్‌ తపన్‌సింగ్‌ తనకొక పనిమనిషి కావాలని పండాకు ఎప్పుడూ చెప్పలేదు. ఆఫీసులో సిబ్బంది ద్వారా అతను, కలెక్టర్‌కు ఒక పనిమనిషి అవసరం ఉన్నదని మాత్రమే విన్నాడు. భవానీని బంగళాముందు కూర్చోపెట్టి పండా లోనికి వెళ్ళాడు. తన గదిలో ఏదో రాసుకొంటున్న కలెక్టర్‌ తలెత్తి పండాను చూసి,&lt;br /&gt;&lt;br /&gt;''ఏమిటి ప్రాబ్లమ్‌. ఏదో కంగారు పడుతున్నట్లు ఉన్నావ్‌?'' అన్నాడు. కాస్సేపు మౌనంగా ఉండి పండా ఏదో ఆలోచించాడు. వెంటనే కొన్ని ఆఫీసు వ్యవహారాలు కలెక్టర్‌తో మాట్లాడాడు.&lt;br /&gt;&lt;br /&gt;కొంత నిశ్శబ్దం తర్వాత కలెక్టర్‌ ప్రశాంతంగా ఉండడం పండా గమనించి తన మనసులోని మాటలు చెప్పడానికి అదే సమయమని గ్రహించి,&lt;br /&gt;&lt;br /&gt;''సార్‌! మీరు వంట మనిషికోసం చూస్తున్నారని విన్నాను. అందుకు నేనొక మనిషిని చూశాను!&lt;br /&gt;&lt;br /&gt;''అతని వయస్సు ఎంత ఉంటుంది?'' తపన్‌సింగ్‌ ప్రశ్నించాడు.&lt;br /&gt;&lt;br /&gt;''మగవాడు కాదుసార్‌! చక్కటి వంటలు చేసే ఒక ఆడపిల్లను చూశాను. వంటతోపాటు ఇంటిపనులు కూడా చక్కగా చక్కపెడుతుంది. ఆమె, ఆమె తల్లి మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు''&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌సింగ్‌ సంతోషంతో పకపకా నవ్వాడు. ''ధాంక్స్‌! నా అవసరం విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకొన్నందుకు''&lt;br /&gt;&lt;br /&gt;''సార్‌! ఆ అమ్మాయి బంగళాముందు ఉంది. తమ పర్మిషన్‌ అయితే తీసుకు వస్తాను'' విన్నవించాడు పండా. కలెక్టర్‌ ఆమోదపూర్వకంగా తలవూపాడు. మెరుపువేగంతో గదిలోనుంచి బయటకు వెళ్లాడు. భవానీ కలెక్టర్‌ గదిలోకి వెళ్లే సరికి, భయంతో సన్నటి వణుకు ఆమెలో ప్రారంభమైంది. తనను తాను సంబాళించుకొని ఆయనకు వినయంగా నమస్కరించింది.&lt;br /&gt;&lt;br /&gt;''నీ పేరేమిటి?'' ఆమెను అడిగాడు తపన్‌సింగ్‌&lt;br /&gt;&lt;br /&gt;''భవానీ''&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వు చేపలు కూర, మాంసం కూర బాగా వండగలవా?''&lt;br /&gt;&lt;br /&gt;''బాగా వండుతాను సార్‌''&lt;br /&gt;&lt;br /&gt;''ఏమేమి వంటలు వండుతావో చెప్పు''&lt;br /&gt;&lt;br /&gt;తాను వండగలిగిన వంటకాలు అన్నిటినీ భవానీ చెప్పింది.&lt;br /&gt;&lt;br /&gt;''నీకు ఎంత జీతం కావాలి?''&lt;br /&gt;&lt;br /&gt;ఆమె మౌనంగా ఉంది. వెంటనే పండా కలగజేసుకొని&lt;br /&gt;&lt;br /&gt;''సార్‌! రెండు వందల రూపాయలు ఇస్తే చాలు!'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌సింగ్‌ చిరుకోపంతో పండా వంక చూశాడు.&lt;br /&gt;&lt;br /&gt;''నేను నీకు నెలకు అయిదు వందల రూపాయలిస్తాను. చెప్పాడు కలెక్టర్‌&lt;br /&gt;&lt;br /&gt;అది విని పండా కళ్లు పెద్దవిగా అయి బయటకు వచ్చేసేంత పనైంది!&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌సింగ్‌, భవానీని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆమె కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నాడు. అన్నిటికీ ఆమె చక్కటి సమాధానాలు చెప్పింది. అప్పటికి ఆమెలో ధైర్యం ఏర్పడింది. తొట్రుపాటు లేకుండా సమాధానాలు చెప్పింది. మధ్య మధ్య చిరునవ్వులు నవ్వడానికి కూడా ధైర్యం వచ్చింది ఆమెకు.&lt;br /&gt;&lt;br /&gt;పండా నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. తపన్‌సింగ్‌లో కనిపిస్తున్న ఉత్సాహం పండాకు ఆనందం కలిగించింది. తన పాచిక పారినట్లేనని అతగాడు మురిసిపోయాడు. భవానీ వలన తాను కలెక్టర్‌ మెప్పు పొందినట్లే! ఇటుపై కలెక్టర్‌ తనపై చూపే అభిమానం వలన పార్టీల వద్ద బాగా లంచాలు గుంజవచ్చు! పండా ఆలోచనలు ఇలా సాగుతుండగా కలెక్టర్‌ తన జేబులోనుంచి పర్సు తీసి కొన్ని నోట్లు భవానీకి ఇచ్చాడు.&lt;br /&gt;&lt;br /&gt;''వీటితో మంచి డ్రస్సులు కొనుక్కో. ఇక మీదట నువ్వు శుభ్రంగా వుండడం నేర్చుకో! రేపటి నుంచి పనిలో ప్రవేశించు'' చెప్పాడు తపన్‌సింగ్‌.&lt;br /&gt;&lt;br /&gt;భవాని ఇంటికి వెళ్లి జరిగిన సంగతులన్నీ తల్లికి చెప్పింది. ఆ మరుసటి రోజునుంచీ భవానీ కలెక్టర్‌ బంగళాకు వెళ్లి వంటపనులు, ఇంటి పనులు చెయ్యసాగింది. రోజులు గడిచేకొద్దీ ఆమె తన పనిపాటలతో కలెక్టర్‌ మెప్పు పొందసాగింది. కలెక్టర్‌ బంగళాలో పనులుచేసే బాబుల్‌కు భవానీ రాకతో చాలా వరకు పనులు చేసే శ్రమ తప్పిపోయింది. అతను మెట్రిక్యులేషన్‌ పాసయ్యాడు. ఏపనీ చెయ్యడం అతనికి ఇష్టం ఉండదు. వొళ్లు వంచకుండా తేలికైన పనులు చేస్తూ కాలక్షేపం చెయ్యాలని చూస్తాడు. అతగాడు చేసే వంటలన్నీ పరమ ఘోరంగా ఉంటాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఒకరోజున కలెక్టర్‌, బాబుల్‌కు చెప్పాడు భవానీ ఖాళీగా ఉండే సమయంలో ఆమెకు ఒరియా భాష ఎలా చదవాలో, రాయాలో నేర్పమని, బాబుల్‌కు చాలా ఆనందం కలిగింది. ఇందువల్ల తాను ఆమెను తనివి తీరా చూస్తూ కూర్చోవచ్చు. ఆమెకు పాఠాలు చెప్తూ ఆమెను స్వాధీనం చేసుకొనే పధకాల కోసం అన్వేషించసాగాడు.&lt;br /&gt;&lt;br /&gt;భవానీ నిజాయితీ, పనితనం తపన్‌సింగ్‌కు పూర్తిగా తృప్తి కలిగించాయి. ఆయన భవానీ నెల జీతాన్ని 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాడు. అందువలన భవానీ తల్లి ఆర్థిక బాధలు తగ్గాయి. అయితే ఆమెలో ఆందోళన మాత్రం ఎక్కువైంది. తరచుగా భవానీని దూషించసాగింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఛండాలురాలా! నీవలన ఏదో రోజు నేను ఛస్తాను. నీకు కడుపు అవుతుంది. నలుగుర్లో తలెత్తుకోలేక నేను చావనే ఛస్తాను''&lt;br /&gt;&lt;br /&gt;తాను జాగ్రత్తగానే వున్నాననీ, ఈ విషయంలో భయపడనవసరం లేదనీ, తల్లికి పరిపరి విధాల చెప్పేది భవాని. ఆమెకు కలుగుతున్న అసౌకర్యం అంతా బాబుల్‌ వల్లనే. అతనితో వేగడం ఎలాగో ఆమెకు బోధపడడం లేదు. అతను రెండుసార్లు ఆమెను బలాత్కరించడానికి చూశాడు. ఒకసారి&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వు చాలా అందంగా ఉంటావు భవానీ!'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;అది విని ఆమె మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు సాయంత్రం వర్షం కురుస్తూ ఉండగా బాబుల్‌, భవానీకి పాఠం చెప్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు. కొద్దిసేపు ఆమె మొహం వంకే తేరిపార చూస్తూ కూర్చున్నాడు. తన వేలినుంచి ఉంగరం తీసి,&lt;br /&gt;&lt;br /&gt;''ఈ ఉంగరాన్ని భవానీ తీసుకుని ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకోవాలని నేను కోరుకొంటున్నాను'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఎందుకు?'' అన్నది భవాని&lt;br /&gt;&lt;br /&gt;''నేను నిన్ను పెళ్లాడుదామనుకొంటున్నా. కొద్దిరోజుల్లో నువ్వు నా భార్యవు కావాలి!'' చెప్పాడు బాబుల్‌.&lt;br /&gt;&lt;br /&gt;అదే సమయంలో కలెక్టర్‌ ఆ గదిలోకి వెళ్లాడు.&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వు చెప్పింది విన్నాను... మీ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతూ ఉందని నేను గ్రహించాను భవానీని ఈ నెలలో పెళ్లి చేసుకుంటావా?'' తపన్‌సింగ్‌ అడిగాడు బాబుల్‌ను.&lt;br /&gt;&lt;br /&gt;బాబుల్‌ మొహం మాడిపోయింది. భయంతో వణకసాగాడు. అది చూసి కలెక్టర్‌కు ఆశ్చర్యం వేసింది. వెంటనే భవానీని ఆ గదిలో నుంచి వెళ్లమని చెప్పాడు తపన్‌సింగ్‌.&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వామెను పెళ్లాడుతావా? లేదా?'' ఆయన బాబుల్‌ను అడిగాడు. ఇదే ప్రశ్నను మూడుసార్లు అడిగాడు. చివరికి బాబుల్‌ తలెత్తి నెమ్మదిగా గొణిగాడు&lt;br /&gt;&lt;br /&gt;''క్షమించండి సార్‌! నేను భవానీని పెళ్లాడలేను. నా తండ్రి ఒక స్కూలు టీచరు. మాది గౌరవనీయమైన కుటుంబం. నేనొక పనిమనిషిని పెళ్లాడ్డానికి ఆయన ఎంతమాత్రం ఒప్పుకోడు. తమరే చెప్పండి నేను పనిమనిషిని ఎలా పెళ్లాడనూ?''&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌సింగ్‌ కోపాన్ని ఆపుకోలేకపోయాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఈ విషయంలో నీ తండ్రి అంగీకారం అనవసరం''&lt;br /&gt;&lt;br /&gt;''అయ్యా! తండ్రి మాట కాదని, దైవంపట్ల ఎలా తప్పుగా ప్రవర్తించగలను?'' అన్నాడు బాబుల్‌.&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వు వెంటనే బంగళాలోని నీ సామాన్లు తీసుకొని వెళ్లిపో!'' ఆగ్రహంతో బిగ్గరగా కేకలు వేశాడు కలెక్టర్‌&lt;br /&gt;&lt;br /&gt;ఆ మర్నాడు టీ తాగే సమయంలో తపన్‌సింగ్‌ భవానీతో అన్నాడు. ''నువ్వు పరమ తెలివి తక్కువదానివి. ఆ బాబుల్‌ నిన్ను మోసం చేద్దామనుకున్నాడు. నువ్వు అతన్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటే, నేను అతణ్ని నిన్ను పెళ్లాడేలా ఒప్పిస్తాను. దాపరికం లేకుండా నాకు చెప్పు. నువ్వు అతణ్ని ప్రేమిస్తున్నావా?''&lt;br /&gt;&lt;br /&gt;వెంటనే భవానీ ''లేదు. అతనంటే నాకు పరమ అసహ్యం!'' అని చెప్పింది.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌సింగ్‌ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. అక్కడ తపన్‌ అన్న ఒక డాక్టర్‌. తండ్రి ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. అతని ఇద్దరు చెల్లెళ్లు అమెరికాలో ఉంటున్నారు. తమ భర్తలు ఉద్యోగరీత్యా. తపన్‌సింగ్‌ వివాహాన్ని వాయిదా వేస్తున్నందుకు అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూనే ఉన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌ తండ్రి కటక్‌ వెళ్లాడు తపన్‌ అన్న ఒక లేడీ డాక్టర్‌ సంబంధం అతనికోసం చూశాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఈ విషయం కొడుక్కు చెప్పడానికి తండ్రి వచ్చాడు. తపన్‌ తల్లి ఆ లేడీ డాక్టర్‌ను తన కోడలుగా చేసుకోవాలని తహతహలాడుతోంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ సాయంత్రం టీ చేసే సమయంలో తండ్రీ, కొడుకుల సంభాషణ భవానీ వింది. తండ్రి ఇచ్చిన ఫొటో చూసి తపన్‌ హేళనగా నవ్వాడు. అందుకు పెద్దాయన తీవ్రంగా బాధపడ్డాడు. ఆ మర్నాడు ఉదయం తపన్‌సింగ్‌ కలకత్తా వెళ్లాడు. నాల్గురోజుల క్యాంపు. తాను తిరిగి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచిద్దామని తండ్రికి మాట ఇచ్చాడు తపన్‌.&lt;br /&gt;&lt;br /&gt;ఆందోళన చెందుతున్న ఆయనకు ఒక ఆలోచన తోచింది. తన కొడుకుకు స్త్రీలెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? తెలుసుకోవాలనే కుతూహలంతో భవానీ నుంచి కొంత విషయాన్ని ఆయన సేకరించగలిగాడు.&lt;br /&gt;&lt;br /&gt;''బాబుగారూ! మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గారు తరచు బంగళాకు వచ్చి అయ్యగారితో మాట్లాడుతూ ఉంటారు. ఆమె అందమైంది. ఒంటరిది. ఆమె అంటే బాబుగారికి కూడా ఇష్టమే అని నేను అనుకొంటున్నాను. ఆయన, ఆమెను పెళ్ళాడ్డానికి ఒక కారణం అడ్డు వస్తోంది. ఆమె ఒక ముస్లిం యువతి'' అని చెప్పింది.&lt;br /&gt;&lt;br /&gt;క్యాంపు నుంచి తపన్‌సింగ్‌ రాగానే ''నా పేరును, కుటుంబ ప్రతిష్టను నువ్వు మంట కలపనున్నావా? ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకుని!'' ఆగ్రహంతో అడిగాడు తండ్రి.&lt;br /&gt;&lt;br /&gt;''ఏ ముస్లిమ్‌ యువతి?''&lt;br /&gt;&lt;br /&gt;''ఇంకెవరు? ఆ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌!'' ముసలాయన మండిపడుతూ అన్నాడు&lt;br /&gt;&lt;br /&gt;''ఈ అయిడియా మీకు ఎవరిచ్చారు?''&lt;br /&gt;&lt;br /&gt;''భవానీ నాకు అన్ని విషయాలు చెప్పింది. నువ్వు ఆ ముస్లిమ్‌ యువతిని ప్రేమిస్తున్నావ్‌. పెళ్లాడాలని అనుకొంటున్నావ్‌'' అన్నాడు ముసలాయన కోపంగా.&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌కు త్రీవమైన ఆగ్రహం కలిగింది. మొహం ఎర్రగా కందిపోయింది. ''బుద్ధిలేని పనిమనిషి! నా క్యారెక్టర్‌ మీద బురద చల్లడానికి చూస్తోంది. నేనామెను చంపేస్తాను. నేనంటే ఏమనుకుంటోంది? భవానీని కరి౮నంగా శిక్షిస్తాను. ఇక నుంచి పనిచెయ్యడానికి రావద్దని చెప్తాను'' అన్నాడు&lt;br /&gt;&lt;br /&gt;కొడుకు కోపాన్ని చూసి పెద్దాయనకు ఆశ్చర్యం వేసింది. ''బాబూ! తొందరపడకు. భవానీ చాలా మంచి అమ్మాయి. చదువు లేకపోయినా, ప్రవర్తన చక్కగా ఉంటుంది. పాపం ఆమెను శిక్షించకు. చాలా అమాయకురాలు. నీకు ఆడస్నేహితులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని నేనే ఆమెను అడిగాను అంతే!'' అన్నాడు పెద్దాయన కొడుక్కు సంజాయిషీ ఇస్తూ&lt;br /&gt;&lt;br /&gt;కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత ముసలాయన&lt;br /&gt;&lt;br /&gt;''భవానీ మంచి పనిమనిషి. ఇదివరకు బంగళా అంతా చెత్తా చెదారంతో నిండి అపరిశుభ్రంగా ఉండేది. ప్రస్తుతం భవానీ దీన్నంతా శుభ్రం చేసి అద్దంలా తీర్చిదిద్దింది! నేను భవానీని ఢిల్లీ తీసుకు వెళ్దామనుకొంటున్నాను. మీ అమ్మ భవానీని ఎంతో ఇష్టపడుతుంది. ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటుంది'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఆమెను అంతగా మీరు పొగడుతున్నారు గదా? అలాంటప్పుడు ఆమెను మీ కోడలుగా ఎందుకు అంగీకరించకూడదు? నేనామెను పెళ్లాడాలని అనుకొంటున్నాను!'' అన్నాడు తపన్‌సింగ్‌.&lt;br /&gt;&lt;br /&gt;వెంటనే తండ్రి తీవ్రమైన కోపంతో బిగ్గరగా అన్నాడు ''అలాగా! భవానీ ఎంతో ధైర్యంగా ఈ ప్లాన్‌ వేసింది అన్నమాట! ఆమె నీ నెత్తిన ఎక్కి కూర్చుంది. ఇది పరమ ఛండాలంగా ఉంది. ఇక మీదట ఇక్కడకు రావద్దని ఆమెకు చెప్తాను. ఆమెకు చదువు సంధ్యలు లేవు. చాలా హీనస్థితిలో వున్న కుటుంబం. నువ్వామెను పెళ్లాడకూడదు. డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌ ఓ పనిమనిషిని పెళ్లాడ్డమా? అసంభవం తపన్‌. నీ ప్రతిష్ట అంతా కుప్పకూలిపోతుంది. ఈ విషయం విన్నదంటే మీ అమ్మ చచ్చిపోతుంది!''&lt;br /&gt;&lt;br /&gt;తపన్‌ ఆగ్రహోదగ్రుడయ్యాడు. తీవ్రస్థాయిలో తండ్రిని ఎదుర్కొన్నాడు. ''మీరెప్పుడూ గర్వంగా చెప్తూ ఉంటారుగదా? మీరు గాంధేయవాది అని! మీరు జీవితంలో ఇంతవరకూ మహాత్ముడు చేసిన కార్యాల్లో ఒక్కటైనా చేశారా? మనదేశంలో గాంధీ గారి అనుచరులం అని చెప్పుకొనే అనేక మంది నకిలీ అనుచరులున్నారు. వారిలో మీరొకరు. ఒక హిందూ, ముస్లిమ్‌ల మధ్య తేడా చూడ్డానికి మీకు లజ్జ వెయ్యడం లేదు? ఒక పనిమనిషి అని భవానీని మీరు అసహ్యించుకోవడానికి మీకు సిగ్గు వెయ్యడం లేదు? ఆమె పేదదనీ, చదువు లేనిదనీ ఈసడించుకోవడానికి మీ మనసెలా ఒప్పింది? గంగాజలంలా భవానీ హృదయం అతి పవిత్రమైంది. స్వచ్చమైన ప్రేమకు అమాయకత్వానికి ఆమె శిఖరాగ్రం వంటిది! నేనామెను పెళ్లాడతాను. ఆమెను విద్యావంతురాలిని చేసిన పిమ్మట, ఈ సంఘం యొక్క తీరు తెన్నులు గురించి చెప్తాను'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;అది విని ముసలాయన గర్వం అణగారిపోయింది. ఆయన మానసికంగా ఎంతో గాయపడ్డాడు. తీవ్రమైన అవమానానికి గురయ్యాడు. రెండు గ్లాసుల చల్లటి నీళ్లు తాగి, నుదురుకు పట్టిన చెమట తుడుచుకున్నాడు. తపన్‌సింగ్‌ కోపంగా ఆ గదిలోంచి వెళ్లాడు. పెద్దాయన సోఫాలో కూర్చుని ఆలోచనల్లోకి కూరుకుపోయాడు. బాపూజీ ప్రవచనాలు, ఆయన మహోన్నతమైన ఘనత, మానవత్వం గురించి ముసలాయన స్ఫురణకు తెచ్చుకోసాగాడు. హఠాత్తుగా ఆయన ఆలోచనలు భగ్నమయ్యాయి&lt;br /&gt;&lt;br /&gt;''బాబు గారూ!'' అని భవానీ పిలవడంతో. తృళ్లిపడి చూశాడు. పొగలు కక్కుతున్న టీ గ్లాసుతో భవానీ కనిపించింది.&lt;br /&gt;&lt;br /&gt;''భవానీ! నీ టీ ఏది?''&lt;br /&gt;&lt;br /&gt;ఆ ప్రశ్న ఆమెకు వింతగా అనిపించింది. తొట్రుపాటుతో,&lt;br /&gt;&lt;br /&gt;''అయ్యా, నేను టీ తాగను'' అంది&lt;br /&gt;&lt;br /&gt;''ఇప్పుడు నువ్వు కూడా టీ తాగవలసిందే!'' ఆజ్ఞాపించాడు. ఆమె గాబరా పడింది.&lt;br /&gt;&lt;br /&gt;''బాబు గారూ! మీకోసం ఒక్కటే చేశాను''&lt;br /&gt;&lt;br /&gt;''ఇంకో గ్లాసు పట్రా''&lt;br /&gt;&lt;br /&gt;వెంటనే భవానీ మరొక గ్లాసు తెచ్చింది. అతనా గ్లాసు తీసుకొని తన గ్లాసులోని సగం టీని దాంట్లో పోసి ఆమెకు ఇచ్చాడు. వాళ్లిద్దరూ మౌనంగా టీలు తాగారు. హఠాత్తుగా భవానీ చూసింది ఆయన పెద్దకళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతూ ఉండడం. ఈయన ఎందుకో బాధపడుతున్నాడు. కొడుకు ఏ విషయంలో అయినా మందలించాడేమో? ఆ బాధకు కారణం ఏమిటో ఆయన్నే అడిగి తెలుసుకోవాలని అనిపించినా, మౌనంగా ఉండిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;హఠాత్తుగా ముసలాయన కన్నీటిని ఆపుకోలేక బావురుమన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''మా తపన్‌ నిజంగా ఓ మహాత్మాగాంధీ! భవానీ, నీకు భర్తగా ఓ దేవుని వంటి వాడు లభించాడు! నీ బాబు గారు నిన్ను పెళ్లాడతారు!'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;తాను విన్న మాటలు నమ్మలేనట్లుగా అతని వంక చూసింది భవాని.&lt;br /&gt;&lt;br /&gt;''ఇది నిజం. నన్ను నమ్ము. ఇకమీదట మీ తల్లిదండ్రులకు ఏ ఇబ్బందీ కలక్కుండా, మేము సహాయం చేస్తూ ఉంటాం సరేనా!'' చెప్పాడు పెద్దాయన.&lt;br /&gt;&lt;br /&gt;భవానీ ఇంటికి వెళ్లింది. ఏమీ జరగనట్లు మామూలుగా ప్రవర్తించింది. తల్లికీ, తండ్రికీ ఏ విషయం చెప్పలేదు.&lt;br /&gt;&lt;br /&gt;కొద్దిరోజులు తర్వాత తపన్‌సింగ్‌, భవానీని వివాహం చేసుకొన్నాడు. అతని నిజాయితీ, అవినీతి పరుల పట్ల తీవ్రంగా వ్యవహరించే తీరు, రఫుపండాకు ఇతర లంచగొండి ఉద్యోగులకు తీవ్రమైన అసౌకర్యం కలిగించింది. లంచాలు ముట్టడం గగనమైంది. చివరికి వారంతా కలసి, అవినీతి పరులైన రాజకీయ నాయకుల సహకారంతో, తపన్‌సింగ్‌ను కటక్‌ నుంచి మరో జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు.&lt;br /&gt;&lt;br /&gt;అక్కడ తపన్‌సింగ్‌, భవానీలు కలసి కొత్తజీవితం ప్రారంభించారు!&lt;br /&gt;అనువాదం: కొడిమెల శ్రీరామమూర్తి&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194418973828076?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194418973828076/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194418973828076' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194418973828076'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194418973828076'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194418973828076.html' title='యజమాని'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194413878068693</id><published>2005-07-21T04:08:00.000-07:00</published><updated>2005-07-21T04:08:58.783-07:00</updated><title type='text'>నాన్నకో కధ</title><content type='html'>From July Vipula &lt;br /&gt;    &lt;br /&gt;నాన్నకో కధ&lt;br /&gt;గ్రేస్‌పాలీ&lt;br /&gt;నాన్నకు ఎనభైయ్యారేళ్ళు. మంచం పట్టాడు. ఏపని చెయ్యాలన్నా శరీరం సహకరించటం లేదు. తల దిమ్మెక్కినట్టుగా వుంటున్నదట. లేచి తిరగటం వీలుపడదు. ఈ అనారోగ్యానికి కారణం కేవలం వృద్ధాప్యమే కాదనీ, పొటాషియం లోపం కూడాననీ నాకు తెలుసు. దిళ్ల మీద ఒత్తిగిలి పడుకుని నాకు సలహాలిస్తుంటాడు.&lt;br /&gt;&lt;br /&gt;''మరొక్క కధ రాయవా! నువ్విదివరకు రాసినట్లాంటి కధలు. మపాసా, చెహోవ్‌లు రాసినట్లాంటివి. మనంరోజూ చూసే మనుషుల గురించి. వాళ్ల జీవితాల్లో జరిగే సామాన్య సంఘటనల గురించి.''&lt;br /&gt;&lt;br /&gt;''ఓయస్‌ రాస్తాను. దానికేం భాగ్యం.'' అన్నాను నాన్న తృప్తి కోసం. కాని నేను అలాంటి కధలు యింతవరకు రాస్తేగద! ''అనగనగా ఒక ఊళ్లో ఒకావిడ వుండేది......'' అంటూ ప్రారంభించి, ఒక ప్లాట్‌ తయారుచేసి కధ రాయాలనే వున్నది. కాని... స్త్రీని ప్లాట్‌ అనబడే విధిలీలకు వదిలెయ్యటం ఎంత దుర్మార్గం! పాత్రలు మాత్రం మనుషులు కారా. వాళ్ల జీవితాలు గాలిలో దీపాలా?&lt;br /&gt;&lt;br /&gt;మాయింటి కెదురుగా ఓ దంపతులుంటారు. రెండేళ్లుగా వాళ్లు గురించి రాయాలనుకుంటున్నాను. ప్రారంభించి,&lt;br /&gt;&lt;br /&gt;''నాన్నా, యిలారాస్తే బావుంటుందా చూడు'' అంటూ చదివాను, '' న్యూయార్క్‌లోని ఒక చిన్న అపార్టుమెంటులో ఒకావిడుంటోంది. ఆవిడకో కొడుకు. పదిహేనేళ్లు నిండకుండానే ఆ కుర్రాడు మాదకద్రవ్యాల కలవాటుపడ్డాడు. (ఆ బస్తీలో చాలా మంది పిల్లలకా అలవాటుంది) కొడుకును దూరం చేసుకోవడం యిష్టం లేని తల్లి తనూ మాదకద్రవ్యాలు తీసుకోవటం ప్రారంభించింది. ఈ తరం పిల్లలంతా యిలాగేవున్నప్పుడేంచేస్తాం అంటూ సరిపెట్టుకుంది. కొన్నాళ్ల తరువాత, అనేక కారణాలవల్ల, కొడుకు ఆ అలవాటుమాని, నగరం విడిచి వెళ్లిపోయాడు. తల్లికి తనమీద తనకు అసహ్యం వేసింది. నిరాశానిస్ప్రహలు తప్ప మరేం మిగిలాయావిడకు. ఆమె గురించిన కధయిది.....''&lt;br /&gt;&lt;br /&gt;''చూశావా నాన్నా, ఏ నగిషీలు పెట్టకుండా సింపుల్‌గా రాశాను.''&lt;br /&gt;&lt;br /&gt;నేను చెప్పింది నీకర్ధం కాలేదు. ఇంకా రాయాల్సింది చాలావుంది. తుర్జెనీవ్‌ యిలాగే రాస్తాడు? చెహోవ్‌ అయితే అసలు యిలా ప్రారంభించడు. రష్యన్‌ శీతకాలాల గురించి విన్నావుగా సరళంగా కధ చెప్పటం ఆ చలివల్ల నేర్చుకుంటారేమో. శరీరాల్లేని, ఆత్మల్లేని మనుషులుంటారాకధల్లో! వాళ్లెవరు....?&lt;br /&gt;&lt;br /&gt;''ఇంకేం రాయాలినాన్నా! చెప్పకుండా వదిలేసిందేమిటి''&lt;br /&gt;&lt;br /&gt;''ఆ స్త్రీ ఎలా వుంటుందో చెప్పనేలేదు...''&lt;br /&gt;&lt;br /&gt;''ఆవిడా, యస్‌, అందంగావుంటుంది...''&lt;br /&gt;&lt;br /&gt;''జుత్తు ఎలావుంటుంది!''&lt;br /&gt;&lt;br /&gt;''నల్లటి జుత్తు. పొడవాటి జడ. చిన్నపిల్లలేసుకున్నట్టుగా''.&lt;br /&gt;&lt;br /&gt;''ఆమె తల్లిదండ్రులు? వాళ్ల కుటుంబ నేపధ్యం? ఆమెనలా తయారుచేసిన పరిస్ధితులు... అవన్నీ రాస్తే బావుంటుంది తెలుసా.''&lt;br /&gt;&lt;br /&gt;''వాళ్లు మరోవూరి నుండి వచ్చి యిక్కడ సెటిలయ్యారు. ఏదో పని చేసుకుని బతికేవాళ్లు. బహుశా భర్త ఆమెకు విడాకులిచ్చివుంటాడు. చాలా?''&lt;br /&gt;&lt;br /&gt;''నామాటలన్నీ నీకు జోకులాగా వినిపిస్తున్నాయా ఏమిటి? ఆ కుర్రాడు తండ్రి గురించి ఒక్క మాటకూడా చెప్పలేదేం? అతడెవరు? ఏంచేస్తాడు? కుర్రాడు పెళ్లికి ముందర పుట్టాడా! తరువాత పుట్టాడా!''&lt;br /&gt;&lt;br /&gt;''సరే. వాడు పుట్టేనాటికి తల్లిదండ్రులింకా పెళ్లి చేసుకోలేదు.''&lt;br /&gt;&lt;br /&gt;''నీ కధలన్నీ అంతే. నీదృష్టిలో ఆడా, మగా పెళ్లిళ్లు చేసుకోరాఏమిటి?! పెళ్లికి ముందే సంసారం, పిల్లలు....''&lt;br /&gt;&lt;br /&gt;''వాస్తవానికి అలాజరగదులే. కాని నాకధల్లో మాత్రం సాధారణంగా పెళ్లిళ్లు జరగవు... ''&lt;br /&gt;&lt;br /&gt;''ఏమిటా పెడసరి జవాబు.. ''&lt;br /&gt;&lt;br /&gt;''ఇదొక చిన్న కధ మాత్రమే నాన్నా. ఒక అందమైన, తెలివైన స్త్రీ, గుండెనిండా ఆశల్ని, కలల్ని మూటగట్టుకుని న్యూయార్క్‌ మహానగరానికి వచ్చింది. కొడుకును పెంచటానికి నానా కష్టాలు పడింది. ఆమెకు పెళ్త్లెందా లేదా అన్నది యిక్కడ అప్రస్తుతం కాదా?''&lt;br /&gt;&lt;br /&gt;''ఎంత మాత్రం కాదు. అది చాలా ముఖ్యమైన అంశం''&lt;br /&gt;&lt;br /&gt;''ఓకే ఓకే.''&lt;br /&gt;&lt;br /&gt;''ఓకేగీకే కాదు జాగ్రత్తగా విను. ఆమె అందంగావుంటే వుండవచ్చుగాని తెలివైంది మాత్రం కాదు''&lt;br /&gt;&lt;br /&gt;''నిజమే. కాని కధలో వచ్చిన చిక్కేఅది. పాత్రలగురించి గొప్పగా రాస్తాం. కాని వాళ్లు చాలాసాధారణ వ్యక్తులాగే బతుకుతారు. మూర్ఖుడిలా కనిపించే మరోవ్యక్తి కూడా వాళ్లను మోసం చెయ్యగలడు. ఇలాంటి కధలకు ముగింపు వెదకటం కష్టం.''&lt;br /&gt;&lt;br /&gt;''అయితే ఏంచేద్దామనుకుంటున్నావు?'' నాన్న కొన్నాళ్లు డాక్టరుగా పనిచేశాడు. కొన్నాళ్లు ఆర్టిస్టుగా బతికాడు. శిల్పం, శైలి, కధనం, పరిశీలన అంటే యిష్టంయింకా.&lt;br /&gt;&lt;br /&gt;''కొన్నాళ్లీ కధను పక్కన పెడదాం. ఈలోగా నీకూ ఆ జగమెండి హీరోకూ మధ్య సమోధ్య కుదరనీ.''&lt;br /&gt;&lt;br /&gt;''నాన్సెన్స్‌. కధ మళ్లీ రాయి. నాకూ ఈ సాయంత్రం వేరే పనేంలేదు. కమాన్‌, స్టార్ట్‌.''&lt;br /&gt;&lt;br /&gt;''ఓకే. కాని ఇది అయిదు నిమిషాల్లో తేలే విషయం కాదు.'' అంటూమళ్లీ ప్రారంభించాను.&lt;br /&gt;&lt;br /&gt;''పక్కింటావిడ అందమైన మనిషి. కొడుకంటే ఆమెకు ప్రాణం. కడుపులో పడినప్పటినుండి, నెత్తుటి గుడ్డగావున్నప్పుడు, పొత్తిళ్లనుంచి ఎదిగి తన చేతుల్లో యిమిడిపోయినప్పుడు, వాణ్ణి గుండెల మీద వేసుకొని పడుకున్న ఆక్షణాలు తన కళ్ల నిండా వాడే.. మీసాలన్నా రాలేదుగాని కుర్రాడప్పుడే మాదకద్రవ్యాల అడిక్టుగా మారాడు. మరీ అంత సీరియస్‌ కేసేమీకాదు. ఆశ వదులుకోవలసిన అవసరంలేదు! తను చదువుకొంటున్న హైస్కూలు పత్రికలో వ్యాసాలు రాసేవాడు. వాడి ప్రతిభకు ఆపత్రిక సరిపోలేదు. స్వయంగా ఒక మాగజైను తనే ప్రారంభించాడు.&lt;br /&gt;&lt;br /&gt;మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళందరూ గిల్టీగా ఫీలవుతారు. (అమెరికాలో కాన్సర్‌తో బాధపడుతున్న వాళ్లతో పదింట తొమ్మిది మందికి ఈ గిల్టీ మనస్తత్వమే ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారించారు.) కాని చిన్నచిన్న వ్యసనాలను ఆనందించటంవల్లనే మనిషి ఆనందంగా బతుకుతాడని తల్లి నమ్మకం. అందువల్ల ఆమె కూడా అడిక్టుగా మారింది.&lt;br /&gt;&lt;br /&gt;మేధావి అడిక్టులందరికీ ఆమె యిల్లుకేంద్రమైంది. వచ్చినవాళ్లందరూ కోలరిడ్జులమనో (19721834;ఇంగ్లీషు కవి. నల్లమందు ప్రియుడు) టిమొదీలీరీ (జననం: 1920; హార్వర్డులో సైకాలజీ ఫ్రొఫెసర్‌. ఎల్‌.ఎస్‌.డి. వల్ల లాభాలున్నాయని ప్రచారం చేసినవాడు)లమనో అనుకునేవాళ్లు. స్వయంగా మత్తులో వున్నప్పటికి, తల్లితో సహజంగా వుండే సేవాభావం ఆమెను వీడలేదు. మంచి మంచి భోజనపదార్ధాలు, విటమిన్‌ మాత్రలు, ఆరెంజి జూస్‌ అందరికీ అందుబాటులో వుంచేది. తరాల అంతరాన్ని చెరిపేసి తనూ పడుచు పిల్లలలో ఒకటైపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;ఒకనాడు (మైకెలేంజిలో) ఆంటోనిమోనీ (ప్రముఖ యిటాలియన్‌ చలనచిత్ర కళాఖండాల సృష్టికర్త) సినిమా చూస్తున్నప్పుడు ఓ పిల్ల వాణ్ణి మోచేత్తో డొక్కలో పొడిచింది. పరిస్ధితి అర్ధం చేసుకొని, తల్లి, కొడుకుని మందలించి, యింటికి తీసుకెళ్లింది.&lt;br /&gt;&lt;br /&gt;కొడుకు అభిప్రాయాలే తన అభిప్రాయాలు. వాడి ఆశయాలే తన ఆశయాలు. అనూహ్యమైన పద్ధతుల్లో తల్లి ప్రేమఫలించింది. కుర్రాడికి ఆరోగ్యం మీద శ్రద్ధకలిగింది. నరాలు వశం తప్పుతున్నాయని గ్రహించ గలిగాడు.&lt;br /&gt;&lt;br /&gt;నిరాకారమైన ఆత్మ ఆనందించినంత మాత్రన సరిపోదు.&lt;br /&gt;&lt;br /&gt;శరీర కూడా ధృఢంగావుండాలి.&lt;br /&gt;&lt;br /&gt;ఆరోగ్యవర్ధక ఆహారం తీసుకున్నాడు. ఆపిల్స్‌, రకరకాల మొలకధాన్యాలు, జీడిపప్పు, బాదం, సోయాబీన్స్‌. ఇదికూడా ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ప్రకటించాడు.&lt;br /&gt;&lt;br /&gt;''అమ్మా, మరి నువ్వెప్పుడు మారతావు'' అంటూ అమాయకంగా అడిగాడు.&lt;br /&gt;&lt;br /&gt;కుర్రాడు త్వరలోనే కోలుకున్నాడు. మెహంలో కళ వచ్చింది. కండపట్టాడు.&lt;br /&gt;&lt;br /&gt;కొడుకు సాంగత్యం లేని తల్లి ఏకాకిగానే కొకెయిన్‌ యింజక్షన్లు తీసుకుంది.&lt;br /&gt;&lt;br /&gt;కుర్రాడు, వాడిగర్ల్‌ఫ్రెండూ మరోచోట కొత్త జీవితం ప్రారంభించటానికి వెళ్లిపోయారు. మాదక ద్రవ్యాలకు బానిసఅయిన తల్లిని చూస్తే అసహ్యం. 'ఈ అలవాటు మానకపోతే నీ మొహం చూడం' అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఏకాంతంలో, ఫ్లాట్‌నిండా విస్తరించిన శూన్యంలో కొడుకు రాసిన వ్యాసాలు చదివి విలపించింది తల్లి. కుర్రాడిలో ఎంతనిజాయితీ వుంది! మేం అప్పుడప్పుడు ఆమెను ఓదార్చటానికి వెళ్లేవాళ్లం. పడుచుపిల్లలుఎవరైనా అడక్టులున్నారని వింటేచాలు ఆమెకు కన్నీరాగదు. ''నా చిన్నినాన్నా ఈ అలవాటు మానరా'' అని గుండెపగిలేలా రోదిస్తుంది.&lt;br /&gt;&lt;br /&gt;కళ్లు మూసుకుని వింటున్న నాన్న ''కధలో అంత హాస్యం, వ్యంగ్యంఎందుకే? మరోవిషయం, కాలయాపన చెయ్యికుండా సింపుల్‌గా కధ చెప్పలేవా? ఇక చివరి విషయం ''అంటూ కాస్త వివరంగా,'' అంటే యిక ఒంటరి జీవితమే ఆమెకు మిగిలిందా? ఆమె జబ్బు మనిషే అని నువ్వు చెప్పదలచుకున్నావు''అంటూ వ్యాఖ్యానించాడు.&lt;br /&gt;&lt;br /&gt;''అవును''&lt;br /&gt;&lt;br /&gt;''పాపం, ఎంత అర్థంలేని పనిచేసింది. మూర్ఖురాలు. మూర్ఖులమధ్య గడిపితే మరేమవుతుంది? మొత్తం మీద కధ ముగించావు. అవునా?''&lt;br /&gt;&lt;br /&gt;ఆర్గ్యూ చెయ్యిటం యిష్టంలేక,&lt;br /&gt;&lt;br /&gt;''లేదునాన్నా. ఆమెకింకా నలభైకూడా నిండలేదు. ఇంకా ఎంతో జీవితం మిగిలివుంది. ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలదు. దురలవాట్లు మాని ఘనకార్యలు చేసినవాళ్లెందరులేరు! ఈ అనుభవం, యూనివర్సిటీలో బీయేలు,ఎమ్యేలు చేసిందానికన్నా ఎక్కువ పనికొస్తుంది.''&lt;br /&gt;&lt;br /&gt;''కాని రచయిత్రిగా నువ్వెదుర్కొంటున్న సమస్యే అది. ట్రాజెడీ కధలు రాయిటంలో వున్న మజా మనుషులు మారతారని రాయిటంలో లేదు. ఎంతగొప్ప ట్రాజెడీ అయితే అంత పాఠకరంజకంగా వుంటుంది. పరాజితులను గురించి చదవటం పాఠకుల కెంతయిష్టమో!''&lt;br /&gt;&lt;br /&gt;''ఆమె మారే అవకాశముందని చెప్పానుగా నాన్న.''&lt;br /&gt;&lt;br /&gt;''కధల్లోనూ, జీవితంలోనూ బలహీనతలను అధిగమించి, పరిస్థితులను మార్చగలగిన మనుషులు కావాలి'' అన్నాడు నాన్న.&lt;br /&gt;&lt;br /&gt;ఆయన మాటకు ఎదురు చెప్పకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాని కధ పట్ల నా బాధ్యతను విస్మరించలేను. ఆమె నాకు పరిచయస్థురాలే. అయినా ఆమె నేను సృష్టించిన పాత్ర. ఆమెను చూస్తే బాధగావుంది. బోసిపోయిన ఆ యింట్లో రోదిస్తున్న ఆ మనిషిని అలా వదిలెయ్యటం నాకిష్టంలేదు.&lt;br /&gt;&lt;br /&gt;అందువలన&lt;br /&gt;&lt;br /&gt;''ఆమె వ్యసనాన్ని అధిగామించింది. కొడుకు తిరిగి రాలేదుఅది వేరేవిషయం. ప్రస్తుతం ఆమె మాదకద్రవ్యరోగుల చికిత్సాకేంద్రాంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. పేషెంట్ల సమస్యల్ని అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగింది తనే.''&lt;br /&gt;&lt;br /&gt;''నీ లాంటి వాళ్లు మరో యిద్దరుంటే ఎంతబాగుండునో''అంటాడు డాక్టరు.&lt;br /&gt;&lt;br /&gt;''డాక్టరు అలానిజంగా అన్నాడా? నువ్వు జోక్‌ చేస్తున్నావా?'' అన్నాడు నాన్న.&lt;br /&gt;&lt;br /&gt;''అలా జరిగే అవకాశముంది నాన్నా. లోకంలో చాలా చిత్రాలు జరుగుతున్నాయి, చూడటం లేదూ.''&lt;br /&gt;&lt;br /&gt;''లేదు పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె అలవాటు మానుకునే అవకాశంలేదు.''&lt;br /&gt;&lt;br /&gt;''ఇప్పుడామెకు మంచి వుద్యోగం వచ్చింది. గతాన్ని మరచిపోగలిగిన శక్తి ఆమెకుంది.''&lt;br /&gt;&lt;br /&gt;''ఎన్నాళ్లులే. ఒకసారి అలవాటు పడితే మానటం ఎవరితరం. జీవితవాస్తవాల్ని ఎప్పుడర్థం చేసుకుంటావో.'' అంటూ ఆక్సిజన్‌ ట్యూబులు ముక్కుపుటాల్లో అమర్చుకుని, నైట్రోగ్లిసెరిన్‌ బిళ్లలు రెండువేసుకుని కళ్లు మూసుకున్నాడు నాన్న.&lt;br /&gt;అనువాదం: సందీప్‌&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194413878068693?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194413878068693/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194413878068693' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194413878068693'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194413878068693'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194413878068693.html' title='నాన్నకో కధ'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194405464842194</id><published>2005-07-21T04:06:00.000-07:00</published><updated>2005-07-21T04:07:34.666-07:00</updated><title type='text'>దట్సాల్‌ ! యువరానర్‌</title><content type='html'>From July Vipula &lt;br /&gt;దట్సాల్‌ ! యువరానర్‌&lt;br /&gt;ఆర్‌.కె.కటారి&lt;br /&gt;తెలుగు కధ&lt;br /&gt;సాయం సంధ్యా సమయం. అప్పటివరకు ఆ ప్రాంతంపై ఆధిపత్యం నెరపుతున్న ఎండ తీక్షణతను తరిమికొట్టి చల్లగాలులు గ్రామీణులను సేదదీరుస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఆ సమయంలో... గృహ విజ్ఞాన శాస్త్ర డిగ్రీ చదువుతున్న విద్యార్థినులను గృహవిజ్ఞాన శాస్త్ర కళాశాల విద్యార్థినుల గ్రామీణ శిక్షణానుభవ కార్యక్రమంకి తీసుకువస్తున్నట్టుగా తెలియజేసే తెలుగులో రాసిన బేనర్‌ కట్టబడిన బస్సు ఊరి పొలిమేరలో ప్రవేశించి ఊరికి ఎడంగా వున్న చెరువు పక్క నుంచి ఊరిలోకి వెళ్ళిపోయింది. అలా చెరువు పక్కగా బస్సు పోతున్నప్పుడు ఆ చెరువు పరిసరాల అందాలు ఆవైపు సీట్లలో కూర్చున్న విద్యార్థినుల దృష్టిని ఆకర్షించాయి.&lt;br /&gt;&lt;br /&gt;అది మంచినీళ్ళ చెరువు. అందులో నీటిని ఇతర పనులకు, అవసరాలకు వాడనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న నిస్వార్థపరులైన మునుపటి ఆ గ్రామపంచాయతీ పెద్దలు అభినందనీయులు! చెరువు చుట్టూ ఎత్త్తెన కట్ట, కట్టమీద చెరువు చుట్టూ కొబ్బరిచెట్లు, చెరువుకి కాపలా దారుడు కూడా వున్నాడు. రాత్రిపూట సరిసరాలు కనిపించటానికి, చెరువుకి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి విద్యుద్దీపాలు ఏర్పాటుచేశారు. చెరువు పక్కనే పడమర వైపు ఊళ్ళోకి వెళ్ళేబాట. తూర్పువైపు మాగాణి పొలాలు.&lt;br /&gt;&lt;br /&gt;పడమర వైపు కట్టమీద వున్న విశాలమైన మర్రిచెట్టు. చెట్టు మాను చుట్టూ మనుషులు కూర్చోడానికి సిమెంటుతో కట్టబడిన రచ్చపట్టు. చెట్టుకావల రాతి మండపం.&lt;br /&gt;&lt;br /&gt;ఉదయ, సాయం సంధ్యల్లో బిందెలతో ఆడవాళ్ళు, కావిళ్ళతో మగవాళ్ళు చెరువులో మంచినీళ్ళు తీసుకెళుతుంటారు. రోజూ సాయంకాలం... తీరికగా వున్న గ్రామస్థులు చెరువు గట్టుమీదనో, మర్రిచెట్టు రచ్చపట్టు మీదనో కూర్చుని చల్లగాలిని అనుభవించటానికి వస్తారు.&lt;br /&gt;&lt;br /&gt;చెరువు దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా ఒక వయోవృద్ధుడు మాత్రం ఎప్పుడూ ఆ ప్రదేశంలో వుంటాడు. అతను కొంతకాలంగా ఆ రాతి మండపాన్ని తన నివాస స్థలంగా వాడుకుంటున్నాడు. అతను కాషాయాంబరధారి వయసు చేతనో, సుదీర్ఘ జీవితానుభవాల చేతనో... భుజాల వరకు పెరిగిన తలవెంట్రుకలు, పొడవాటి గడ్డంతో కలిసిపోయిన గుబురు మీసాలు పూర్తిగా తెల్లబడిపోయి, అతని రూపం... భారత జాతీయ పతాకంలో కాషాయధవళ వర్ణాలు మనుష్యరూపం దాల్చినట్టుగా అతని ఎడల చూపరులకు గౌరవ ప్రపత్తులు ఏర్పడతాయి! అతని ముఖంలో ఉట్టిపడే వర్చస్సు వల్ల చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది! ఈ కారణాలవల్ల, ఉదాత్త ప్రవర్తనవల్ల, అతను అక్కడికి వచ్చిన కొత్తల్లో అక్కడ వుండటానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు!&lt;br /&gt;&lt;br /&gt;ఆ వృద్ధుడు రోజూ సాయంసంధ్యలో మర్రిచెట్టు కింద కూర్చుని, తంబురా మీటుతూ రకరకాల తత్వాలు పాడుకుంటాడు. వాటిలో ఎన్నో జీవిత సత్యాలు, వేదాంతం ఇమిడి వుంటాయి. అప్పుడు వీస్తుండే చల్లగాలి తరంగాలు అతని గానాన్ని గ్రామంలోకి ప్రసారం చేస్తాయి. వాటిపట్ల ఆకర్షితులైన వాళ్ళు వచ్చి అతని ఎదురుగా కూర్చొని విని ఆనందించటం అలవాటుగా మారిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;భిక్షాటన చేయటం, తత్వాలు పాడుకోవటం, ఇతర సమయాల్లో ఆధ్యాత్మిక గ్రంధాలు చదువుకోవటం అతని దినచర్య. ఏ కోర్కెలూ లేవు, ఎవరికీ ఎటువంటి ప్రవచనాలు చెప్పడు. అతనొక అంతర్ముఖుడు! భగవంతుని పిలుపు కోసం నిరీక్షిస్తున్నానని చెప్పుకుంటాడు.&lt;br /&gt;&lt;br /&gt;ఒక రోజు... ఒక స్త్రీ, జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా వున్న అయిదారేళ్ళ బాలుణ్ణి భుజాన వేసుకొని వచ్చి వృద్ధుడి పాదాల చెంత పడుకోబెట్టి, తన బిడ్డకి వచ్చిన జ్వరం తగ్గిపోయేలా దీవించమని ప్రాధేయపడింది. ఇలా జరగటం ఇదే ప్రధమం!&lt;br /&gt;&lt;br /&gt;తనూ వాళ్ళలాగే సామాన్యమైన మనిషినని, జీవితంలో చివరి దశ ప్రశాంతంగా గడపటానికి ఇక్కడికి వచ్చి వుంటున్నానని, తనలో ఎలాంటి దివ్యశక్తులు లేవని, ఆ బిడ్డ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, వెంటనే ఊళ్ళో వున్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్ళి డాక్టరు గారికి చూపించమని ఎంత నచ్చజెప్పినా ఆవిడ వినలేదు!&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీ! తమరు మహానుభావులు. మీ లాంటోళ్ళలో మహత్యం వుంటది. నాకా నమ్మకముంది! నాబిడ్డకి జొరం తగ్గిపోయేటట్టుగా దీవించండి సామీ!'' అని పట్టుబట్టింది.&lt;br /&gt;&lt;br /&gt;''అమ్మా. నన్ను స్వామి అనికూడా అనవద్దు! నా మాట నమ్ము. నువ్వనుకుంటున్నట్టుగా నాలో ఏమహత్యం లేదు! ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్ళు... నా మాట విను తల్లీ!'' అని ప్రాధేయపూర్వకంగా చెప్పాడు.&lt;br /&gt;&lt;br /&gt;అయినా ఆమె వినలేదు. ప్రాధేయపడుతూనే వుంది... గత్యంతరం లేక కళ్ళుమూసుకొని ఆ బిడ్డకు స్వస్థత చేకూర్చమని మనసారా భగవంతుణ్ణి ప్రార్థించి, ఆమె తృప్తికోసం బిడ్డ శరీరమంతా నిమిరి ఇక తీసుకెళ్ళమని చెప్పాడు. ఆమె సంతోషంగా బిడ్డని భుజం మీద పడుకోబెట్టుకొని ''దండంసామీ!'' అని చెప్పి వెళ్ళిపోతూంటే, ఆస్పత్రికి కూడా, తప్పక తీసుకెళ్ళమని గుర్తుచేశాడు.&lt;br /&gt;&lt;br /&gt;వారం రోజుల తర్వాత మధ్యాహ్న సమయంలో వృద్ధుడు భిక్షాటనకు బయలుదేరబోతూ వుండగా, ఆమె తన పిల్లవాడిని నడిపించుకుంటూ మరో స్త్రీతో పాటు ఆయన దగ్గరకు వచ్చింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఏమ్మా? బాబుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టుందిగా! అంటే నా మాట ప్రకారం ఆస్పత్రికి తీసుకెళ్ళి మందులిప్పించావన్నమాట! మంచిపని చేశావమ్మా'' అని మెచ్చుకోలుగా అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''లేదు సామీ! తఁవరు దీవించారుగా. అందుకని నేనేడకీ తీసుకెళ్ళలా. మీ దీవెన తోనే జొరం తగ్గిపోయింది!'' అని చెప్పిందావిడ.&lt;br /&gt;&lt;br /&gt;ఆమె మూఢభక్తికి ఆయనలో కించిత్‌ కోపం, అసహనం కలిగాయి! కాని, తాను అరిషడ్వర్గాలకు అతీతుడుగా వుండటానికి సాధన చేస్తున్నవాడు! ఈ మాత్రానికే తనకి కోపం రావచ్చునా? అని వగపుతో తనని తాను నిగ్రహించుకొని సాత్వికంగా చెప్పాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఈ రోజుల్లో కూడా ఇంత గుడ్డినమ్మకాలు వుండకూడదమ్మా! వేల సంవత్సరాల క్రితం మహర్షులు, మహాయోగులు అడవులలో, హిమాలయ పర్వత ప్రాంతాలలో కరి౮నమైన తపస్సు చేసేవారు! అలాంటి మహాపురుషులకు దివ్యశక్తులు వాటంతటఅవే సిద్ధించేవి! ఈ రోజుల్లో అంటే అంత కరి౮నమైన తపస్సు చేసే బుుషులు ఎవరున్నారమ్మా! ఒకవేళ ఎక్కడైనా వుంటే అలాంటి వారికి దివ్యశక్తులు వుంటే వుండవచ్చు! కాని కాషాయ బట్టలు వేసుకున్న వారంతా స్వాములూ కాదు, బాబాలూ కాదు! అదేదో మామూలు జ్వరం అయివుంటుంది. మీరేవో కషాయాలూ అవీ యిస్తుంటారుగా! అందువల్ల తగ్గిపోయి వుంటుంది గాని నా మహత్యంవల్ల కాదు! ఒకవేళ అదే గనుక ఏదైనా విషజ్వరం అయుండి, మీరు నా మీద నమ్మకంతో ఆస్పత్రికి తీసుకెళ్ళకుండా వుండివుంటే, ఏదైనా జరగరానిది జరిగివుంటే అప్పుడు బిడ్డ కోసం అల్లాడేదెవరు?... వైద్య సదుపాయాలు బాగా పెంచి, ఊరూరా ప్రభుత్వంవారు, ఆస్పత్రులు వైద్యసౌకర్యంలు ఏర్పరుస్తూ వుంటే మీరు ఆ సౌకర్యాలు ఉపయోగించుకోకపోతే ఎలా? అంతేకాదు మీకు ఆ దోషముందని, ఈ దోషముందని వాటికి శాంతి చేయించాలని చెప్పి డబ్బు గుంజే దొంగస్వాములు వైద్యం తెలియకపోయినా తెలిసినట్టు నమ్మించి 'ఏదో ఒకటి చేసి ప్రాణాలకు ముప్పుతెచ్చే దొంగ డాక్టర్ల దగ్గరకి కూడా మీరెప్పుడూ వెళ్ళకండి! ఏ జబ్బు వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళండి. అక్కడ కూడా డబ్బులివ్వందే పనులు జరగకపోతే వాళ్ళ పైఅధికారులకి ఫిర్యాదు చెయ్యండి! అంతేకాని... గుడ్డి నమ్మకాలతో, చెప్పుడు మాటలతో పిల్లల ప్రాణాలకే కాదు పెద్దల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చుకోకండి!... మళ్ళీమళ్ళీ చెబుతున్నాను దీవెనల కోసమంటూ ఇంకెప్పుడూ నా దగ్గరికి రాకండి. ఇకవెళ్ళండి'' అని హితబోధ చేయక తప్పలేదు.&lt;br /&gt;&lt;br /&gt;ఆమె ఏమీ మాట్లాడకుండా, వృద్ధుడు ఎంత వారిస్తున్నా వినకుండా, పిల్లవాడిచేత ఆయన పాదాలకి మొక్కించి, తనూ మొక్కి, తనవెంట వచ్చిన స్త్రీచేత కూడా మొక్కించి... ఒక పరిశుభ్రమైన అరటి ఆకులో పొట్లం కట్టి తెచ్చిన పొంగలి అన్నం ఆయన చేతుల్లో పెట్టి, మళ్ళీ నమస్కారంచేసి వెంట వచ్చినావిడతో వెళ్ళిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతనిలో అంతర్మధనం మొదలైంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ స్త్రీకి హితబోధ చేశాడేగాని దానివల్ల అతనికి హితం చేకూరలేదు.&lt;br /&gt;&lt;br /&gt;తమలో మహత్యం వున్న మహానుభావులెవరూ తమ గురించి గొప్పలు చెప్పుకోరని, ఆ వృద్ధునిలో ఏదో మహత్తు వుందని ఆ గ్రామంలో ప్రచారమైపోయింది! తరచుగా ఎవరో ఒకరు ఒంట్లో బాగోలేని పిల్లలనో, పెద్దలనో ఆయన దీవెనల కోసం తీసుకురాసాగారు.&lt;br /&gt;&lt;br /&gt;వచ్చినవాళ్ళతో విసుగుచెందకుండా శాంతస్వభావంతో 'నేను ఎంత చెప్పినా మీరు నమ్మటంలేదు. మిమ్మల్నెందుకు నిరాశపర్చాలి! మీ తృప్తి కోసం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి దీవిస్తాను. అయితే మీరు మాత్రం నా దీవెనలందుకున్నాం గదా అని అంతటితో వూరుకోకుండా ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళండి! ఏ విధంగానైనా వ్యాధి తగ్గటం కదా మీకు కావలసింది!' అని చెప్పి, వచ్చిన వారిని కాదనకుండా దీవించి పంపుతూనే వున్నాడు. వ్యాధి తగ్గినవాళ్ళు ఫలమో, పదార్థమో సమర్పించుకొని దండం పెట్టి వెళుతున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఈ పరిణామం స్వామిగా వ్యవహరింపబడే ఆయన్ని ఒక పరీక్షకి గురిచేసింది.&lt;br /&gt;&lt;br /&gt;బాబాలను ఆసరా చేసుకొని, వాళ్ళని దైవస్వరూపులుగా చిత్రించి ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకుంటూ, ఆ బాబాలు కాలం చేశాక వారిని ఆశ్రమంలోనే సమాధి చేసి దానిపై గుడి కట్టించి, దానికి ధర్మకర్తలై, ఆలయ ఆదాయాలను దోచుకుతింటున్న దొంగ భక్తులకు కూడా ఈ దేశంలో కొరత లేదు కదా!&lt;br /&gt;&lt;br /&gt;స్వామి వారి విషయంలోను అదే ప్రయత్నం జరిగింది.&lt;br /&gt;&lt;br /&gt;ఒక రోజు రాత్రి ఆ గ్రామ సర్పంచ్‌, ఆయన అనుచర వర్గం స్వామి వారి దగ్గరికి వచ్చారు.&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీ! తమరు సాక్షాత్తూ షిర్డీ సాయిబాబా అంశలాగున్నారు?'' అంటూ సంభాషణ పొగడ్తతోనే ప్రారంభమైంది!&lt;br /&gt;&lt;br /&gt;''మహాపరాధం! నేను సామాన్య మానవుణ్ణి! దైవాంశ సంభూతులతో పోల్చకండి'' అని వినయంగా విన్నవించుకున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీ. మేము లేనివేవీ కల్పించి చెప్పటం లేదే! తమరి జీవిత విధానం సాయిబాబాను పోలి వుండలేదా? బిక్షతో ఆకలి తీర్చుకుంటున్నారు. యోగముద్రలో కూర్చొని ధ్యానం చేసుకుంటారు. మీరు పాడే తత్వాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నారు. మీ ఆకారాన్నిబట్టి అపర బ్రహ్మేంద్రస్వామిలా కూడా వున్నారు!''&lt;br /&gt;&lt;br /&gt;''దయచేసి మీరు ఏ పనిమీద వచ్చారో సెలవీయండి''&lt;br /&gt;&lt;br /&gt;''మీరింకా ముసలి వారైపోతే బిక్ష కోసం ఇంటింటికీ తిరగ్గలరా అప్పుడేమిటి మీ పరిస్థితి? ఎవరో ఒకరు ఇక్కడికి అన్నం తెచ్చిపెట్టాలి. ఎవరు తెచ్చిపెడ్తారు? మా వూరి ప్రజలకు ఇంత మేలు చేస్తున్న మాకు మాకు తోచిన సహాయం మేం చేయొద్దా? మా ఉద్దేశమేమిటంటే... ఒక్క మా పొట్టకి కావలసిన పట్టెడు మెతుకుల కోసం, ఎండనక వాననక మీరు ఇంటింటికీ తిరగక్కర లేకుండా, పూట పూట ఇక్కడికే తమకు టిఫిను, భోజనం తెచ్చిపెట్టే ఏర్పాటు చేయాలి! వేడికీ, చలికీ తట్టుకుంటూ ఇటువంటి రాతిమండపంలో మిమ్మల్ని ఇంకా పడుకోనివ్వటం మాకు అపచారం! అందుకని మేము ఆలోచించిందేమంటే... ఈ పక్కనే అన్ని సౌకర్యాలతో మీ కోసం ఒక కాటేజ్‌ కట్టిస్తాం. మీరెక్కడికీ వెళ్లనక్కర లేకుండా, ఎప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకొని వుండి మీకన్నీ సమకూర్చిపెట్టటానికి ఒక సేవకుణ్ణి నియమిస్తాం. మీ బెడ్‌రూం ఎ.సి. కూడా చేయిస్తాం! మా ఆలోచనని కాదనకుండా మీరు ఒప్పుకుంటే మా పనులు మొదలు పెట్టుకుంటాం. ఏమంటారు?'' అని అంగీకారం కోసం ఎదురు చూడసాగారు.&lt;br /&gt;&lt;br /&gt;స్వామివారు కొద్ది క్షణాలు కనులు మూసుకొని మౌనంగా ఉండి కళ్లు తెరిచి, మందహాసంతో ''అయితే నన్నొక దేవుణ్ణి చేసి నాలుగు గోడల మధ్య బంధిస్తారన్నమాట!'' అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;''అయ్యో! ఎంత మాట! వయసు మీరుతున్న మీరు సుఖంగా వుండాలని, మీ ధ్యానానికి ఎటువంటి అంతరాయం కలగకుండా వుండాలని, మీరు మా ఊళ్లోనే వుండి మా మీద మీ చల్లని దీవెనలను కురిపిస్తూ వుండాలని మా తాపత్రయం!'' అని అన్నాడు సర్పంచ్‌.&lt;br /&gt;&lt;br /&gt;''మాటలెందుకుగాని, మీ ఆంతర్యం నాకు తెలుసు! జీవితానుభవంతోటి, లోకానుభవంతోటి నా తల ముగ్గుబుట్టలా తయారైంది. నేను అజ్ఞానాన్ని విడిచి ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్న వాణ్ణి! నన్నీ లౌకిక లంపటంలోకి లాగకండి మీకు పుణ్యముంటుంది! నాకు అంతగా నడవలేని స్థితే దాపురిస్తే, ఎవరో ఒక మహా తల్లి నా మీద దయతలచి అంత ముద్ద పెట్టకపోతుందా! పెట్టకపోయినా ఫర్వాలేదు. భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూస్తున్న వాణ్ణి! ఇక నేను దేని గురించి భయపడాలి బాధపడాలి?''&lt;br /&gt;&lt;br /&gt;పెద్దలందరికీ కోపాలొచ్చేశాయి.&lt;br /&gt;&lt;br /&gt;''మీ మంచి కోరి మేమేదో మీకు మేలు చేయాలనుకుంటే, ఊరి పెద్దలమైన మా మాటే కాదంటారా? మమ్మల్ని అనుమానించి అవమానిస్తారా?... సరే, అయితే!&lt;br /&gt;&lt;br /&gt;ఒకవేళ తమరికి ఏ రోగమో, ధూమో తగిలి ఈ గట్టుమీదనే గుటుక్కుమన్నారనుకో! అసలే ఇది మంచినీళ్ళ చెరువు! మీ శవం నుంచి ఏ విషక్రిములో చెరువునీళ్ళలో కలిస్తే అప్పుడు మా గ్రామస్థుల గతేం కాను? అంతేకాదు. గ్రామ పంచాయతీ స్థలం పన్ను కట్టకుండా వాడుకోవడానికి వీల్లేదు. వెంటనే ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోండి!'' అని ఆదేశాలిచ్చారు సర్పంచ్‌ గారు.&lt;br /&gt;&lt;br /&gt;''పన్ను గట్టటానికి ఆయన దగ్గరేముంది బూడిద! అదైనా వుండానికి ఆయన సాధువు కూడా కాదే!'' అన్నారెవరో వ్యంగ్యంగా&lt;br /&gt;&lt;br /&gt;''చూశారా! కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీరు నన్ను భూషించటం, దూషించటం మీరు నా దగ్గరికి భక్తితో వచ్చారో, యుక్తితో వచ్చారో తెలియజేస్తాయి. ఈ భూమి అంతా దేవుడి నివాసమే అయినప్పుడు ఈ భక్తుడికి ఆయన పాదాల చెంత ఇంత చోటే దొరకదా!... అలాగే. మీ ఆదేశం ప్రకారం ఈ చోటు ఖాళీచేసి వెళ్తాను. కాని ఇంత రాత్రిపూట వెళ్ళలేను కదా. రేపు పొద్దుటే వెళ్ళిపోతాను. అంతవరకు గడువివ్వండి'' అని అడిగాడు.&lt;br /&gt;&lt;br /&gt;''సరే'' అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు గ్రామ పెద్దలు.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;తెల్లారింది.&lt;br /&gt;&lt;br /&gt;తెల్లవారక ముందే ఈ వార్త ఊరంతా పొంగమంచులా వ్యాపించింది. మొదట చెవి కొరికినవాడు చెరువు కాపలాదారుడు చెంచయ్య!&lt;br /&gt;&lt;br /&gt;సూర్యోదయ వేళ స్వామివారు కాషాయ గుడ్డ సంచులు భుజానికి తగిలించుకొని, చేత తంబురా పట్టుకొని, మండపం నుండి బయటికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి ఒక స్త్రీ జన సమూహం చేరింది.&lt;br /&gt;&lt;br /&gt;స్వామివారు వాళ్ళ ముఖాల్లోకి తేరిపార జూశారు. వాళ్లలో చాలామంది తమ దీవెనల కోసం వచ్చినవాళ్ళే. వాళ్ల ముఖాల్లో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ సమూహంలోంచి మంగమ్మ ముందుకొచ్చింది. ఆమె ఎవరో కాదు స్వామివారి దగ్గరికి మొట్టమొదటిసారి, మూసిన కన్ను తెరవకుండా వున్న కుమారుణ్ణి దీవించమని తీసుకొచ్చినావిడ! ఆమెతో ప్రారంభమైన కధకి ముగింపే ఇప్పుడు స్వామి వారు ఈ ఊరు విడిచి వెళ్లవలసిరావటం!&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీ! ఎక్కడికెళ్తున్నారు?'' అని అడిగింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఊరు విడిచి వెళ్ళిపోతున్నానమ్మా! రాత్రి గ్రామ సర్పంచ్‌గారు చెప్పారు పన్ను కట్టకుండా గ్రామ పంచాయతీ స్థలం వాడుకోకూడదట. అందుకని ఈ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయమన్నారు. వారి ఆదేశం ప్రకారం వెళ్ళిపోతున్నాను''&lt;br /&gt;&lt;br /&gt;''అతనెవడు స్వామీ మిమ్మల్ని ఎల్లిపొమ్మని సెప్పటానికి? పంచాయతీ స్థలం ఆయన సొంతమా? మేమంతా ఎన్నుకుంటేనే ఆయన సర్పంచ్‌ అయ్యింది. ఆయన, ఆయన ముఠావోళ్ళు ఎన్నెన్ని పంచాయతీ స్థలాలు వాడుకుంటున్నారో మాకు తెలవదా? మీరేమన్నా ఆయన స్థలంలో వుంటున్నారా, పొలంలో వుంటున్నారా! ఊరందరికీ సెందిన సెరువు గట్టు మీద వుంటన్నారు. ఆ మాత్రానికే పన్ను గట్టాలా? ఆ మాట కొస్తే వాళ్ళు వాడుకుంటున్న స్థలాలన్నిటికీ పన్ను గడతన్నారా? సర్పంచికొకరూలు సాములోరికొకరూలా?'' అని తన వెంట వచ్చిన వాళ్లనుద్దేశించి అడిగింది.&lt;br /&gt;&lt;br /&gt;''సెప్పండే! ఊరి పొలిమేరల్లో ఎలిసి గేమ పెజల్ని కాపాడే పోచయ్య పోలేరమ్మల్లాగ.. ఈ సామి గూడ ఊరి బయట వుంటా, మనల్ని దీవిస్తా జబ్బుల్ని తగ్గిస్తా కాపాడుతుండాడే! అట్టాంటి సామిని మనకి తెలవకుండా ఊరిడిసి ఎల్లటానికి రూల్లేదని తెగేసి సెబుదాం!! ఏమంటారే?''&lt;br /&gt;&lt;br /&gt;''అంతే! అంతే! ఇప్పుడే ఎల్లి నిలదీద్దాం పదండి!'' అన్నారు ముక్తకంఠంతో.&lt;br /&gt;&lt;br /&gt;అంతా వెళ్ళబోతుంటే ''అమ్మా! నీ పేరేమిటో?'' అని అడిగారావిడని.&lt;br /&gt;&lt;br /&gt;''మంగమ్మ సామీ'' అని చెప్పింది.&lt;br /&gt;&lt;br /&gt;''చూడు మంగమ్మా! నా గురించి సర్పంచ్‌గారితో గొడవెందుకు? అది ఊళ్లో వేరే కలతలకి దారితీస్తుంది. నేనెలాగూ దేశ సంచారినే! కాకుంటే ఇక్కడేదో నాకు బాగుండి ఎక్కువ కాలం వున్నాను. కొంతకాలం తర్వాతైనా వెళ్లవలసినవాడినే కదా! అందుకని మీరు సర్పంచ్‌గారి దగ్గరికి వెళ్ళకండమ్మా! నా దారిన నన్ను వెళ్ళనివ్వండి!'' అని మృదువుగా కోరారు.&lt;br /&gt;&lt;br /&gt;''ఏంది సామీ! మీరు ఇక్కడే వుంటా, ఎప్పుడన్నా ఏ తీర్థయాత్రకో ఎల్లొస్తావుంటే అదొక దారి గాని, దొంగమాటలు సెప్పి మిమ్మల్ని ఎల్లగొట్టుటమేంది? అంతా వాళ్ళిస్టమేనా? మాకు సంబంధం లేదా? ఆళ్ల గూడుపుటాని మాకు తెలిసిందిలే సామీ! మీకు ఆశ్రమం ఏదో కట్టించాలని సెప్పి ఊళ్ల మీద పడి డబ్బులు దండుకొని, అందులో బొక్కినంత బొక్కి ఆనక మిమ్మల్నడ్డం పెట్టుకొని వాళ్ళ బొక్కసాలు నింపుకోవాలని ఆళ్ల ప్లాను! తమ రొప్పుకోకపోయేటప్పటికి ఆళ్ల అసలు రంగు బయటపడింది. ఆ మాత్రం తెలవని ఎర్రోళ్ళం కాదులే! మేము ఆడ జలమ ఎత్తి గాజులు తొడుక్కుంటున్నాం గాని, మేం తలుసుకుంటే మొగోళ్ళక్కూడా గాజులు తొడిగిస్తాం. ఆఁ... సామీ! మీరు మాత్రం మేం సర్పంచి కాడికి ఎల్లొచ్చేదాకా ఇక్కడ్నించి కదలొద్దు. ఎల్లారంటే నా మీద ఒట్టే! అటో యిటో తేల్చుకొని వస్తాం!... పదండే'' అంటూ ఆ సమూహాన్ని వెంటేసుకుని వెళ్లింది.&lt;br /&gt;&lt;br /&gt;''నాది ఆధ్యాత్మిక మార్గమే అయినా, లౌకికపరంగా ఆలోచిస్తే, ఈ రోజుల్లో స్త్రీలలో ఈ చైతన్యదీప్తి కాలానుగుణ్యమే!'' అనుకున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;మంగమ్మ ఒట్టుకి కట్టుబడి అలాగే దాదాపు గంటసేపు కూర్చుండిపోయారు మండపంలో.&lt;br /&gt;&lt;br /&gt;చెరువు కాపలాదారుడు చెంచయ్య ''స్వామివారికి జై! స్వామివారికి జై!'' అని జేజేలు కొట్టుకుంటూ సంతోషంతో చెంగుచెంగున ఎగురుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చాడు.&lt;br /&gt;&lt;br /&gt;అతన్ని అభినయాన్ని చూసి నవ్వుతూ ''ఏమిటయ్యా. ఎందుకంత సంతోషపడిపోతున్నావ్‌?'' అని ప్రశ్నించారు.&lt;br /&gt;&lt;br /&gt;''జయం మనదే స్వామి, జయం మనదే! బిడ్డకి జబ్బు చేసి ఆరోజున మీ దగ్గరికి దీనురాలు లాగ వచ్చిందిగాని, మంగమ్మంటే మాటలా! మంగమ్మంటే ఈ ఊరంతటికీ హడల్‌! 'మరి మొగుడేమీ అనడా' అని అనుకుంటారేమో. అసలామెకి సపోర్టు వాడే!! 'తప్పేం చేస్తోందిరా దాన్నడ్డుకోటానికి!' అంటాడు. ఆమె ఒక విషయం పట్టించుకుందంటే ఇక అది మంగమ్మ శపధమే! నేను గూడ ఆళ్లతో గాకుండా చాటుమాటుగా వెళ్లి అక్కడ జరిగిందంతా ఇన్నా. మీ దగ్గిర అన్నట్టే అన్నీ అడిగేసింది. సర్పంచిక ఏమీ పాలుపోక కోపంతో 'ఆముసలోడికి ఏ కలరా లాంటి రోగమో వచ్చి ఆ చెరువుగట్టు మీదనే చచ్చాడంటే, ఆ విషక్రిములు చెరువు నీళ్లలో చేరి అవి తాగి చచ్చేది మీరే!' అని అదొక వంక బెట్టుకొని దబాయించాడు. మంగమ్మ ఆయన్ని ఎట్టా వాయించిందో తెలుసా! ఎప్పుడూ దేవుణ్నే తలుసుకుంటాడు. అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఆయనకి దేనిమీద కోరిక లేదు. అట్టాంటి సాములకి 'ఏరోగాలు రావు. ఆ మాయ రోగలేవో లోకుల సొమ్ముతినే మీలాంటోళ్లకే వస్తయ్యి! అంతగా ఆ సాములోరి కేదైనా జబ్బుసేస్తే మా ఇళ్లల్లో పెట్టుకొని సేవ చేసుకుంటాం! ఆసామి పోయ్యేదాకా ఈడే వుండాలనుకుంటే ఉంటాడు. మళ్లీ ఆయన జోలికి ఎల్లారంటే మీకు మర్యాద దక్కదుఆఁ!' అని వార్నింగ్‌ ఇచ్చింది అని మహదానందంగా చెప్పాడు చెంచయ్య.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే 'గృహ విజ్ఞాన శాస్త్ర కళాశాల' విద్యార్థినులను తీసుకొని వచ్చిన బస్సు ఊరిలోకి వెళ్లి సర్పంచ్‌గారి ఇంటి ముందు ఆగింది.&lt;br /&gt;&lt;br /&gt;అందులో నుంచి మేడమ్స్‌ దిగి సర్పంచ్‌ గారిని కలిసి, 'రావే'కి విద్యార్థినులను తీసుకొని వచ్చా'మని, వాళ్లని వారికి కేటాయించిన ఇళ్లల్లో వదిలివెళ్తామని, ఊరి పెద్దలంతా విద్యార్థినుల బాగోగులు చూస్తూ ఉండమని విన్నవించుకొని, మరల బస్సులోకి వచ్చి కూర్చొని జాగ్రత్తగా మెలగమని, కాలేజికి చెడ్డపేరు తెచ్చే పనులేవీ చేయవద్దని విద్యార్థినులను హెచ్చరించి, వాళ్లని వాళ్లకి కేటాయించిన ఇళ్లల్లో అప్పజెప్పి బస్సులో తిరిగి వెళ్లిపోయారు.&lt;br /&gt;&lt;br /&gt;విద్యార్థినులు తమ నిధులు సక్రమంగా, సజావుగా నిర్వహించుకుంటూ ఆయా కుటుంబాలలోని ఆడవాళ్ల అభిమానం సంపాదించుకున్నారు. దానికి ఈ అమ్మాయిలను వాళ్ల ఇళ్ల అడపడుచులుగానే చూసుకుంటున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;రోజులు గడుస్తున్నాయి...&lt;br /&gt;&lt;br /&gt;ఇన్నాళ్లూ తమకి అప్పగించిన విధుల నిర్వహణలోని కొత్తదనం వల్ల, గ్రామప్రజలతో జాగ్రత్తగా మసలుకోమని మేడమ్స్‌ హెచ్చరించి వెళ్లినందువల్ల, మరో ధ్యాసలేకుండా విధులలోనే లీనమయ్యారు. ఇప్పుడు ఊళ్లో వాళ్లందరికీ తామెవరో, ఎందు కోసం వచ్చారో బాగా తెలిసిపోయింది. అందరూ తమని మన్ననతో చూస్తున్నారు. తాము ఊళ్లో ఎక్కడికి వెళ్లాలన్నా భయపడాల్సిన పనిలేదు.&lt;br /&gt;&lt;br /&gt;మధ్యాహ్నానికల్లా తమ విధులు అయిపోతాయి. భోంచేసి, రికార్డు వర్కుపూర్తి చేసుకొని కొంతసేపు విశ్రమిస్తారు. ఇక సాయంత్రాలలో ఇళ్లవద్ద ఉండిపోవలసిందే! విధులు మొదలైనవన్నీ బాగా అలవాటైపోయాక సాయంసమయాల్లో ఊరికే ఇళ్ల వద్ద కాలం గడపటం అమ్మాయిలకి చికాకు కలిగించటం మొదలుపెట్టింది. కొంతసేపు ఉల్లాసంగా కాలక్షేపం చేయటానికి ఆ పల్లెటూళ్లో సినిమా హాలైనా లేదు. గ్రామం గనుక దాని చుట్టూ కనుచూపుమేర పొలాలు. కనీసం వాటివైపు వాహ్యాళికైనా వెళ్లిరాకుండా ఇళ్లకే పరిమితం కావటం బాగనిపించలేదు.&lt;br /&gt;&lt;br /&gt;ఒక సాయంత్రం యాదృచ్చికంగా శర్వాణికి ఆఊరి చివర్న వున్న చెరువు విషయం గుర్తుకొచ్చింది. వాళ్లు ఆ గ్రామంలో ప్రవేశించే రోజూ ఆచెరువు, దాని పరిసరాల అందాలు చూసిన వాళ్లలో శర్వాణీ కూడా ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;మర్నాటి సాయంత్రం శర్వాణి తన స్నేహితురాళ్లతో బయలుదేరింది. చెరువుకట్ట ఎక్కి పరిసరాలు చూశారు. చెరువుకట్ట మీద చుట్టూ కొబ్బరి చెట్లు, పెద్దమర్రిచెట్టు ఒకవైపు, దానికి దగ్గరగా మండపం, చెరువు ఆవల అలలు అలలుగా ఊగుతున్న వరిపైరు... ఆ ప్రదేశమంతా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, నయానానందకరంగా ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ దృశ్యాలు అందరూ తన్మయులై చూస్తూ ఉండగా ఎవరో తత్వం పాడటం వినిపించింది. అప్పటివరకు తమ ధ్యాసనంతా నయానాల్లోనే కేంద్రీకరించినందువల్ల కర్ణాలు మూసుకుపోయినట్టయింది. కాస్త దృష్టి మరలగానే ఆగానం వాళ్ల చెవులకి సోకింది. శర్వాణికైతే తత్వం వినగానే ప్రాణం లేచి వచ్చింది.&lt;br /&gt;&lt;br /&gt;పాడేది ఎవరా అని చుట్లూ చూసింది. ఎవరూ కనిపించలేదు. కారణం చాలా వెడల్పయిన ఆ మర్రిచెట్టు మానుకి, అవతలివైపున స్వామివారు కూర్చొని ఉండటమే. గానం వినిపిస్తున్న సామీప్యం, దిశ గమనించి శర్వాణి మర్రిచెట్టు ఆవలివైపుకి వెళ్లి చూసింది. వెనకాలే అమ్మాయిలంతా వెళ్లారు. కొత్తవాళ్లని చూడగానే స్వామివారు పాడటం ఆపేశారు.&lt;br /&gt;&lt;br /&gt;''ఎందుకమ్మలూ అలా బిత్తరపోయి చూస్తున్నారు? నేనేమీ బుుషినీ, మునినీ కాదులే! నాకు అంతరాయం కలిగించారని శపించనులే! నేనూ మీలాంటి మామూలు మనిషినే. భయపడకుండా కూర్చోండి.&lt;br /&gt;&lt;br /&gt;''మీలో ఇద్దరు ముగ్గురు ఊళ్ళో కనిపించారుగాని మీరెవరో తెలియక వూరుకున్నాను. మీ గురించి చెబుతారా?''&lt;br /&gt;&lt;br /&gt;''చెబుతానుగాని, మొదట మిమ్మల్ని ఏమని పిలవాలో సెలవివ్వండి'' కాస్త వెనుకాడుతూనే శర్వాణి అడిగింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఎంత వద్దని చెప్పినా వినకుండా ఊళ్ళోవాళ్ళు 'స్వామీ' అని సంభోదిస్తున్నారు. మీరు నాకు మనమరాళ్ళతో సమానం! 'తాతయ్య' అని పిలవండి. చాలు!'' అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;''ఉఁహూఁ! మిమ్మల్ని మామూలు తాతయ్యగా పిలవటం ఇష్టంలేదు. మేముకూడా 'స్వామిజీ' అని పిలుస్తాం. సరేనా?''&lt;br /&gt;&lt;br /&gt;''మీ ఇష్టం!''&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీజీ. మేము చదివే కోర్సుకి సంబంధించిన అన్ని ఇంగ్లీషు పదాలకి సరైన తెలుగు పదాలు చెప్పలేం. మీరు ఇంగ్లీషు అర్థమౌతుందా?''&lt;br /&gt;&lt;br /&gt;''బాగా''&lt;br /&gt;&lt;br /&gt;''ఆఁ!''&lt;br /&gt;&lt;br /&gt;''ఎందుకమ్మా అంతాశ్చర్యం? వేషభాషలకి సంబంధం లేదు... ఇక మీ వివరాలు చెప్పండి.''&lt;br /&gt;&lt;br /&gt;''మేము హోంసైన్స్‌ డిగ్రీ చదువుతున్నాం. మూడవ సంవత్సరం ఒక సెమిస్టర్‌లో మాకు 'రావే' అనే కార్యక్రమం వుంటుంది. అంటే 'రూరల్‌ హోంసైన్స్‌ వర్క్‌ ఎక్స్పీరియన్‌ ప్రోగ్రాం' అని దాన్ని ఏదైనా ఒక గ్రామంలో జరపాలి. అన్ని ఏర్పాట్లూ మా మేడమ్స్‌ ముందుగా చేసి మమ్మల్ని తీసుకొచ్చి దిగవిడిచి వెళ్తారు. మమ్మల్ని కొన్ని బ్యాచ్‌లుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్‌ని ఒక ఇంట్లో వుంచుతారు. మా భోజనం మేమే తయారు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం పూర్తయ్యే వరకు ఈ గ్రామంలోనే వుంటాం.&lt;br /&gt;&lt;br /&gt;మా కోర్సులో 'ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌', 'చైల్డ్‌ డెవలప్‌మెంట్‌', 'ఫేమిలీ సోర్స్‌ మేనేజ్‌మెంట్‌', 'టెక్స్‌టైల్స్‌' మొదలైన సబ్జెక్ట్స్‌ వుంటాయి. వాటిని ఎలా అమలు చేస్తాం అనే వివరాలు చెప్పటం మీకు విసుగు కలిగించటమే అవుతుంది... ఇవీ క్లుప్తంగా మా గురించిన వివరాలు.&lt;br /&gt;&lt;br /&gt;మేము సాయంత్రం పూట ఖాళీగానే వుంటాం! ఇన్నాళ్ళూ వర్క్‌మైండెడ్‌గా వుండటం వల్ల మరో ఆలోచన వుండేది కాదు. ఇప్పుడిప్పుడే సాయంకాలం ఈవెనింగ్‌ వాక్‌లా వెళ్ళకపోవటం బాగోలేదనిపించి, ఈ రోజుకి బయటపడ్డాం'' అంది శర్వాణి.&lt;br /&gt;&lt;br /&gt;''మంచిది అమ్మలూ, మీరు రోజూ ఇక్కడికి వచ్చి కొంతసేపుండి పరిశుభ్రమైన గాలి పీల్చుకోవటం ఆరోగ్యానికి, మానసికోల్లాసానికి మంచిది. మీకు తెలియదని చెప్పటంలేదు. ఈవేళలో మీకు వేరే పనేమీ వుండదంటున్నారు గనుక రోజూ వచ్చి వెళ్తూ వుండండి'' అని సలహాయిచ్చారు.&lt;br /&gt;&lt;br /&gt;''తప్పక వస్తాం స్వామిజీ. కాని, మీ గురించి కూడా మాకు చెప్పాలి. ఇంగ్లీసు బాగా వచ్చన్నారు. మరిలా తత్వాలు పాడుకుంటూ ఒంటరిగా ఎందుకుంటున్నారు? మీ నివాసమెక్కడ? లేక మీరు సన్యసించారా?''&lt;br /&gt;&lt;br /&gt;''నేను సన్యాసినికానమ్మా, సన్యసించటమంటే కామ్యకర్మములను విడిచి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితమంతా భగవంతుని ధ్యానంలో గడపటం! మొదట నేను సంసారినే! భార్యా బిడ్డలందర్ని కోల్పోయి ఒంటరినై, జీవిత చరమాంకాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపాలని ఇలా సన్యాసిలాగే జీవితం గడుపుతున్నాను. నాది మధుకర వృత్తి'' అని వాళ్ళ ముఖాలలోకి చూసి అర్థం కాలేదని గ్రహించి ''అంటేభిక్షాటన'' అని వివరించారు.&lt;br /&gt;&lt;br /&gt;అమ్మాయిల ముఖాలలో ఆశ్చర్యంతోపాటు బాధకూడ చోటు చేసుకుంది!&lt;br /&gt;&lt;br /&gt;''స్వామిజీ, భార్యబిడ్డలు లేకపోవచ్చుగాక మీ ఆధ్యాత్మిక చింతన మీ ఇంట్లోనే చేసుకోవచ్చుగా?''&lt;br /&gt;&lt;br /&gt;''నాకు ఇల్లు లేదమ్మా''&lt;br /&gt;&lt;br /&gt;''మరిప్పుడెక్కడుంటున్నారు?''&lt;br /&gt;&lt;br /&gt;''ఇక్కడే అదిగో ఆ మండపమే నా నివాసం''&lt;br /&gt;&lt;br /&gt;''మరి వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో ఇంత ఓపెన్‌ప్లేస్‌లో ఎలా వుండగలరు?'' శర్వాణి ప్రశ్నలో ఆందోళన ధ్వనించింది.&lt;br /&gt;&lt;br /&gt;''ప్రతి ఊళ్ళో ఒక దేవాలయం వుంటుంది కదమ్మా! అటువంటి కాలాల్లో, ఈ ఊళ్ళో వున్న పెద్ద రామాలయమే నాకు శ్రీరామరక్ష!'' నిశ్చింతగా చెప్పారు స్వామీజీ.&lt;br /&gt;&lt;br /&gt;ముఖంలో దుఃఖఛాయలు తారాడుతుండగా శర్వాణి అడిగింది.&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీజీ! మీరు భార్యా బిడ్డల్ని కోల్పోయిన ఒంటరి వారన్నారు. ఇల్లు లేదన్నారు. ఇదంతా ఎలా జరిగిందో... అభ్యంతరం లేకపోతే మీ కుటుంబ గాధ చెప్పగలరా?''&lt;br /&gt;&lt;br /&gt;''ఇప్పుడు కాదమ్మా! మరోరోజు చెబుతాను''&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;ఆ తర్వాత వాళ్ళ మేడమ్స్‌ వచ్చినందువల్ల రెండురోజులు స్వామీజీ దగ్గరికి వెళ్ళలేక పోయారు. మూడవరోజు స్వామివారి కధ వినటానికి మొదటిరోజు కన్నా ఉత్సాహంగా బయలుదేరారు.&lt;br /&gt;&lt;br /&gt;వారిని కూర్చోమని చెప్పి, స్వామీజీ మొదలుపెట్టారు.&lt;br /&gt;&lt;br /&gt;''మేము ఐశ్వర్యవంతులమే. నేను కాలేజి లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యాను. నా భార్య అనుకూలవతి, ఆస్తికురాలు. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, భగవద్గీత పారాయణం చేస్తూ వుండేది. నేను ఆస్తికుడనీ కాను నాస్తికుడనీ కాను. కాని, నా భార్య భగవద్గీత పారాయణం చేస్తూ వుంటే కొన్ని అంశాలు నాచెవిని పడుతూండేవి. ఆ విధంగా పరోక్షంగా నాకు భగవద్గీతతో పరిచయం ఏర్పడింది.&lt;br /&gt;&lt;br /&gt;మాకు ఆలస్యంగా పిల్లలు పుట్టటం వల్ల నేను రిటైరయ్యే నాటికి మా ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు పెళ్ళీడుకొచ్చారు. కొడుకు ఇంజనీరయ్యాడు. వేరే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది. అమ్మాయి యం.ఎ., పి.హెచ్‌.డి. చేసి నాలాగే లెక్చరరై నేను రిటైరైన కాలేజిలోనే చేరింది. అదే కాలేజిలో మరో లెక్చరర్‌తో సంబంధం కుదిచి పెళ్ళి చేశాం. అప్పటి వరకు మా కుటుంబం అనే నిఘంటువులో 'కష్టం', 'దుఃఖం' అనే పదాలకు తావేలేదు. ఆ తర్వాతే ఆ రెండూ మా కుటుంబంలో చాపకింద నీరులా ప్రవేశించాయి.&lt;br /&gt;&lt;br /&gt;మొదట నా కూతురి బతుకులో విధి వికట్టాహాసం చేసింది!&lt;br /&gt;&lt;br /&gt;మా కూతురు గర్భవతై మమ్మల్నందర్నీ ఆనందడోలికల్లో ఓలలాడించింది. మనవడో, మనవరాలో పుట్టి మాకు మంచి కాలక్షేపం అవుతుందని నేను, నా భార్య ఊహలోకాల్లో విహరించాము. కాని, మా ఊహలు గాలిమేడలే అయ్యాయి!&lt;br /&gt;&lt;br /&gt;నెలలు నిండకముందే ఒకరోజు కడుపులో భరించరాని నొప్పి, రక్తస్రావం. మేము భయపడి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. డాక్టర్‌ పరీక్ష చేసి, లోపల బిడ్డ చనిపోయిందని, ఆలస్యం అవటం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా వుందని చెప్పి వెంటనే ఆపరేషన్‌ ధియేటర్‌లోకి తీసుకెళ్ళారు. మా అల్లుడు చేత ఏదో స్టేట్‌మెంట్‌ మీద సంతకం పెట్టించుకున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;లోపలికి తీసుకెళ్లి పరీక్షలు చేసి కాస్సేపటికి 'సారీ! మా దగ్గరికి తీసుకొచ్చేసరికి కండిషన్‌ సీరియస్‌గా వుంది. ప్రొఫ్యూస్‌ బ్లీడింగ్‌ కంట్రోల్‌ కానందువల్ల పెద్ద ప్రాణాన్ని కాపాడలేకపోయాము!' అని చెప్పి డాక్టర్‌ వెళ్ళిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;మా అందరి గుండెల్లో పిడుగులు పడ్డాయి! ఆ మాట వినగానే నా భార్య బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలి స్పృహ తప్పిపడిపోయింది! ముందు ఆమెని రక్షించటం మా తక్షణ కర్తవ్యమైంది. హాస్పిటల్లో చేర్పించాం.&lt;br /&gt;&lt;br /&gt;నా కూతురు చనిపోయిన పరిస్థితుల్లో అంత్యక్రియలు ఆలస్యం చేయకూడదని, పైగా నా భార్యకి ఈలోగా స్పృహ కోల్పోయి కోమాలోకి పోయే ప్రమాదం లేకపోలేదని, అందుచేత అంత్యక్రియలు వెంటనే జరిపించటం మంచిదని డాక్టర్లు సలహాయిచ్చారు. వాళ్ళ సలహా ప్రకారం అందుబాటులో వున్న బంధుజనానికి కబురంపి, ఆచార వ్యవహారాల జోలికి పోకుండా శవాన్ని హాస్పిటల్‌ నుంచే తీసుకెళ్ళి అంత్యక్రియలు జరిపాం.&lt;br /&gt;&lt;br /&gt;మర్నాడు నా భార్య స్పృహలో కొచ్చింది. కూతురి అంత్యక్రియలు జరిగిపోయిన సంగతి తెలుసుకొని నానా గొడవ చేయటం మొదలుపెట్టింది. మేమెంత నచ్చచెపుతున్నా వూరుకోవటం లేదు. చివరికి డాక్టర్‌ వచ్చి 'నువ్వున్న అనారోగ్య పరిస్థితిలో కూతురి శవాన్ని చూస్తే, ఆమెకి తోడుగా నువ్వూ శవమై వుండేదానివి! కామ్‌గా పడుకో' అని కరి౮నంగా కసిరేసరికి వూరుకుంది!&lt;br /&gt;&lt;br /&gt;ఆ మర్నాడే కార్తీకపౌర్ణమి ఇన్నాళ్ళూ దుఃఖంలో మునిగి ఏ విషయంలోను ఆసక్తి లేకుండా గడుపుతున్న నా భార్యకు ఆ విషయం ఎవరు చెప్పారో, ఆమె మనసు కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఇల్లు కడగటం, గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టటం, పూజా మందిరం కూడా శుభ్రం చేసేసరికి, సాయంత్రమైంది. శివపార్యతుల పటం, ఇతర దేవుళ్ళ పటాలు ముందేసుకొని కూర్చొని గుడ్డతో తుడుస్తూ నన్ను పిలిచి.. రేపు ధరలు మండిపోతాయి. పైగా నేను వేకువజామునే గుడికి వెళ్ళాలి కదా, ఈ పూటే వెళ్ళి తీసుకురండి అని పూలు, పళ్లు, ఇతర వస్తువుల జాబితా చెప్పింది. నేను సంచి తీసుకొని బజారుకి వెళ్ళాను. వచ్చేసరికి అంతా అయిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;కూతురు జ్ఞాపకం వచ్చి ఆ పటాన్ని కూడ శుభ్రం చేద్దామనుకొని, స్టూలు వేసుకొని దానిమీద ఎక్కి పటాన్ని చేతుల్లోకి తీసుకొని వుంటుంది. తుడుస్తున్నప్పుడు కూతురి మృతి సందర్భం గుర్తుకు వచ్చి దుఃఖంతో పరధ్యానంగా కదిలి పాదం స్టూలు అంచున వేయగా అది ఒరిగిపోయి దాంతోపాటు వెల్లికిల పడిపోయి వుంటుంది. దెబ్బ ఆయువు పట్టున తగిలి వెంటనే ప్రాణం పోయింది. చూడ్డానికి వచ్చిన వాళ్ళు 'ఇదేం ఖర్మ! కూతురు చనిపోయి నాలుగు నెలలైనా కాలేదు ఇంతలోనే తల్లి కూడా పోవటమేమిటి! ఈ ఇంటికేదో శనిపట్టుకుంది!' అని బాధపడ్డారు.&lt;br /&gt;&lt;br /&gt;తెల్లవారి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు నేను నా కుమారుడు సూర్య పక్కనే వుండి ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకున్నాను. పెద్ద కర్మ రోజు వరకు, రోజులో ఎక్కువ భాగం నిద్రపోయేవాడు. మిగతా సమయాల్లో ముభావంగా వుండేవాడు. ఎలాగో పెద్దకర్మ కూడా ప్రశాంతంగానే గడిచిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;మరో వారంరోజులు గడిచాక 'ఇక నేనిక్కడ వుండలేను. డ్యూటీకి వెళ్తా'నన్నాడు. ఒక్కడినే పంపటం ఇష్టం లేకపోయినా, ఒక విధంగా అదీ మంచిదేనని, పనిలోపడి కొంతవరకైనా అమ్మ విషయం మర్చిపోతాడని ఒప్పుకున్నాను.&lt;br /&gt;&lt;br /&gt;క్షేమంగా చేరానని ఫోన్‌ చేశాడు.&lt;br /&gt;&lt;br /&gt;వాడు ఫోన్‌ చేసిన నాలుగు రోజులకే మళ్ళీ ఫోన్‌ వచ్చింది. మా వాడి నుంచి కాదు. వాడి సహోద్యోగి నుంచి ''మీ అబ్బాయికి యాక్సిడెంట్‌ జరిగింది. హాస్పిటల్‌లో చేర్పించాం. వెంటనే రండి'' అని చెప్పి హాస్పిటల్‌ పేరు, ఎక్కడున్నదీ కూడా చెప్పాడు.&lt;br /&gt;&lt;br /&gt;నాకు ముచ్చెమటలు పోశాయి. నవనాడులు కుంగిపోయాయి.&lt;br /&gt;&lt;br /&gt;ప్రయాణానికీ అతడే ఏర్పాట్లు చేశాడు. వెంటనే బయలుదేరాం. హాస్పిటల్లో సూర్య స్పృహలేని స్థితిలో వున్నాడు. చాలా సేపటికి సూర్య చిన్నగా మూలగటం వినిపించింది.&lt;br /&gt;&lt;br /&gt;ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూంటే, నా చెవి సూర్యనోటికి దగ్గరగా వుంచాను. మాటలు సరిగా వినపడనంత బలహీనంగా వున్నాయి. జాగ్రత్తగా విన్నాను.&lt;br /&gt;&lt;br /&gt;'నాన్నా! నేను స్కూటర్‌ మీద ఆఫీసుకి పోతుంటే దగ్గర నుంచి 'సూర్యా' అని అమ్మపిలిచినట్టు అనిపించి అప్రయత్నంగా స్కూటర్‌కి సడెన్‌బ్రేక్‌ పడింది. నా వెనకాలే వస్తున్న సిటీబస్‌ నన్ను గుద్దేసింది. అంతే! తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడే కళ్ళు తెరిచి మిమ్మల్నే చూస్తున్నాను!' అని చెప్పగానే నా పక్కనే వున్న వాళ్ళ బావని కూడా చూపిస్తే చూశాడు. ''నా చివరి గడియల్లో మీరు నా దగ్గరున్నారు. నాకదే తృప్తి! అమ్మ లేకుండా నేను బ్రతకలేను!'' అని వెర్రిచూపులు చూస్తూ 'అదిగో! అమ్మ పిలుస్తోంది. వెళ్తాను. వస్తున్నానమ్మా!'' అంటూనే కళ్ళు తేలేశాడు.&lt;br /&gt;&lt;br /&gt;నాతో ఆ రెండు మాటలు చెప్పటానికే వాడి బొందిలో ప్రాణముందన్నమాట!&lt;br /&gt;&lt;br /&gt;మర్నాడు మధ్యాహ్నానికి పోస్ట్‌మార్టం జరిపిన సూర్య శవాన్ని మాకప్పగించారు. ఆ శవాన్ని అంత దూరం సొంత వూరికి తీసుకెళ్ళటం మంచిదికాదని, అప్పటికి, 'డికంపోజ్‌' అవుతుందని, అక్కడే అంత్యక్రియలు జరపటం మంచిదని సూర్య సహోద్యోగులు సలహా యిచ్చారు. అలాగే చేశాం.&lt;br /&gt;&lt;br /&gt;పుట్టుట ఎక్కడో! గిట్టుట ఎక్కడో! అంతా విధి ఆడించే నాటకం!&lt;br /&gt;&lt;br /&gt;నేను ఒక్క సూర్య శవానికే కాదు అదే క్షణంలో నా లౌకిక బంధాలన్నిటికి తలకొరివి పెట్టాను!&lt;br /&gt;&lt;br /&gt;నాలో వైరాగ్యం మొలకెత్తింది. ముందుగా నా భార్య నిత్యం నిష్ఠతో పరి౮ంచే భగవద్గీత క్షుణ్ణంగా చదివాను. ఆధ్యాత్మిక గురువులైన మహాత్ముల ప్రవచనాలు, జీవిత చరిత్రల గ్రంధాలు కూడా కొని చదివాను. భగవద్గీతలో చెప్పిన 'ఆత్మజ్ఞానమునందు మనసు లగ్నము చేయుట, మోక్షప్రాప్తియందు దృష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును' అనే గీతా వాక్యం నాకు మార్గదర్శకమైంది!&lt;br /&gt;&lt;br /&gt;తర్వాత పుణ్యక్షేత్రాలన్ని సందర్శించాను. కాని, గీతాసారానువర్తన ప్రవర్తన పూర్తిగా ఏ పుణ్యక్షేత్రంలోను చూడలేకపోయాను. ఆధ్యాత్మికత కూడా వ్యాపారమైంది. యోగులనబడే వారిలో రోగులను బుుషులనబడే వారిలో కాపురుషులను చూశాను. 'అన్ని ధర్మముల కంటే స్వధర్మమే శ్రేష్ఠము'' అని గీతాకారుడు చెప్పినట్టుగా నేను స్వధర్మాన్నే పాటించాలని నిశ్చయించుకున్నాను. అన్ని అనర్థాలకు మూలకారణం 'నేను, నాది' అనే భావనే అని గ్రహించాను!&lt;br /&gt;&lt;br /&gt;నాకంటూ ఏమీ లేకుండా చేసుకోవాలనుకున్నాను. నేనేం చేయదలుచుకున్నది నా అభిప్రాయాలను నా అల్లుడితో చెప్పాను. ''తమ అభీష్టం ప్రకారం చేయండి!'' అన్నాడు అల్లుడు.&lt;br /&gt;&lt;br /&gt;అంతే! నా ఆస్తినంతా అనాధ శిశు శరణాలయానికి దానంగా రాసియిచ్చాను.&lt;br /&gt;&lt;br /&gt;పగటిపూట అయితే నన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవటాలు, ప్రశ్నలడగటాల సంకటస్థితిని తప్పించుకోవటానికి ఒకరోజు రాత్రి పొద్దుపోయాక ఇంటినుంచి బయటపడ్డాను. మా అల్లుడొక్కడే మా ఇంటి ముందు నిలబడి చేయూపుతూ వీడ్కోలు చెప్పాడు.&lt;br /&gt;&lt;br /&gt;సన్యాసి అయినా, బైరాగి అయినా బతకాలిగా! మన సంస్కృతిలో జీవితమంతా అధ్యాత్మిక చింతనలోనే గడిపేవారు మధుకర వృత్తిని చేపట్టటం సంప్రదాయమే ఆదరణీయమే! అందుకే నేనూ ఆ వృత్తిని చేపట్టి దేశాటన మొదలు పెట్టాను. పల్లెలు పట్నాలు తిరిగాను. ఈ ఊళ్ళో ఈ చెరువు పరిసరాలు ఊళ్ళో పెద్ద రామాలయం నా మనుగడకి నచ్చి కొంతకాలంగా ఇక్కడే స్థిరంగా వుంటున్నాను! ఇదీ నాకధ!'' అని ముగించారు.&lt;br /&gt;&lt;br /&gt;అమ్మాయి లెవరూ మాట్లడలేదు. అందరూ దుఃఖసాగరంలో మునిగి అప్పుడే తేలుతున్నారు! కొందరు మధ్యలో ఏడ్చినట్టుగా, కనీసం తుడుచుకోవటం మరిచిపోయినట్టుగా వాళ్ళ బుగ్గలపై ఎండిన కన్నీటి చారికలు కనిపించాయి. స్వామిజీ మనసు చివుక్కుమంది!&lt;br /&gt;&lt;br /&gt;'నాదొక సలహా! మీ చదువులన్నీ పూర్తయాక అందరూ భగవద్గీత కొని నిత్యం చదవండి? రాగద్వేషాలకి, దుఃఖ వ్యామోహాలకి లోనుగాకుండా స్థిరచిత్తంతో ప్రశాంతమైన జీవితం గడపగలుగుతారు.! పాటిస్తారు కదూ?''&lt;br /&gt;&lt;br /&gt;''తప్పకుండా స్వామీజీ!.. ఇక మేం వెళ్లొస్తాం''.&lt;br /&gt;&lt;br /&gt;''మంచిది తల్లీ!'' అని స్వామీజీ వాళ్ళని కొంతదూరం సాగనంపివచ్చారు.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణికి స్నేహితురాళ్ళు తోడొచ్చినా రాకపోయినా, వీలైనప్పుడల్లా స్వామీజీ దగ్గరికెళ్ళి తత్వాలు విని రావటం అలవాటైంది.&lt;br /&gt;&lt;br /&gt;అయితే... ఆ ఊళ్ళో కొద్ది రోజుల క్రితమే రెండు కళ్ళు శర్వాణిని మొదటిసారిగాచూసి ఆశ్చర్యంతో వెడల్పై తర్వాత ఆలోచనతో ముకుళించుకు పోయాయి. ప్రతిరోజు ఆకళ్ళు ఆమె కదలికల్ని గమనిస్తున్న విషయం ఏ రెండో జత కళ్ళకీ తెలియదు!&lt;br /&gt;&lt;br /&gt;ఒక రోజు వేర్వేరు కారణాలతో శర్వాణి స్నేహితురాళ్ళెవరూ రాకపోయినా ఒక్కర్తే స్వామిజీ దగ్గరికి బయలుదేరింది. ఆరెండు కళ్ళూ చాటుగా వెంబడించాయి.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి చెరువు దగ్గరికి వెళ్ళేసరికి స్వామీజీ చెరువు కాపలాదారుడు లేరు, చల్లగాలి కోసం వచ్చే మనషులూ ఎవరూలేరు! తనవెంట స్నేహితురాళ్ళెవరూ రాకపోవటం, ఇక్కడా నిర్మానుష్యంగా వుండటం నమ్మలేనంత వింతగా అనిపించింది శర్వాణికి! తన అనుభవంలో ఇది మొదటిసారి కావచ్చుగాని, ప్రకృతిలో ఇలాంటి సందర్భాలు ఎక్కువసార్లే సంభవిస్తుంటాయి!&lt;br /&gt;&lt;br /&gt;'పోనీలే, చల్లగాలికి కొంతసేపు కూర్చుంటాను. ఈలోగా స్వామీజీ వస్తేసరి, లేకపోతే వెళ్ళిపోతాను' అనుకొని శర్వాణి మర్రిచెట్టు అరుగు మీద కూర్చుంది.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి ఒంటరిగా వున్నా, అది ఎత్తుగావున్న బహిరంగ ప్రదేశం అయినందువల్ల, ఆ రెండు కళ్ళూ ఆమెను సమీపించటానికి సాహసించలేకపోయాయి.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి చాలాసేపు చూసినా స్వామీజీ రాలేదు. ఎక్కడో పొలాలలో అక్కడక్కడ రైతుల సంచారం వుందిగాని చెరువు వైపు ఎవరూ రావటంలేదు. సూర్యాస్తమయమై చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరింది.&lt;br /&gt;&lt;br /&gt;దారిలో చెరువుకి దగ్గరగా బాటపక్కన పొదల మాదిరిగా పెరిగిన చెట్లదాపుకి వచ్చేసరికి వెనకగా ఎవడోవచ్చి ఒకచేత్తో శర్వాణి నోరు గట్టిగా మూసి, మరో చెయ్యి నడుంచుట్టూ వేసి పైకెత్తి బలవంతంగా చెట్ల చాటుకీ తీసుకెళ్ళాడు. శర్వాణి బలమంతా ఉపయోగించి పెనుగులాడి వాడి పట్టునుంచి విడిపించుకొని 'ఎవడా!' అని వాడి ముఖంలోకి చూసి 'నువ్వా' అని నివ్వెరపోయింది!&lt;br /&gt;&lt;br /&gt;''అవును నేనే! మిస్టర్‌ చంద్రజయచంద్రని!'' అన్నాడతను వీరత్వం ప్రదర్శిస్తున్నట్లుగా&lt;br /&gt;&lt;br /&gt;జయచంద్ర అగ్రికల్చర్‌ కాలేజి విద్యార్థి. హోంసైన్స్‌ కళాశాల విడిగా వున్నప్పటికి, కొన్ని సబ్జెక్ట్స్‌లో క్లాసులకి మాత్రం ఆ విద్యార్థినులు అగ్రికల్చరల్‌ కాలేజీకి రావాలి.. వాళ్ళకి విడిగా హాస్టల్‌ లేక అగ్రికల్చరల్‌ కాలేజి హాస్టల్లోనే వుండేవారుకూడా.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి ఆ సంవత్సరమే హోంసైన్స్‌ కళాశాలలో చేరింది.&lt;br /&gt;&lt;br /&gt;జయచంద్ర అందగాడు, డబ్బున్నవాడు, కొసమెరుపుగా పొగరుబోతు కూడా.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి సౌందర్యవతి తన సీనియర్లలోకూడా తనని మించిన అందగత్తెలు లేనందువల్ల 'కాలేజీ బ్యూటీ'గా పేరుబడింది. జయచంద్ర కన్ను శర్వాణి మీద పడింది. హాస్టల్లో వున్నప్పుడు చాలాసార్లు శర్వాణితో మాట్లాడాలని ప్రయత్నించాడు గాని శర్వాణి ఎప్పుడూ స్నేహితురాళ్ళతో వుండటంతో వీలుపడలేదు. ఒకసారి ఒంటరిగా హాస్టల్‌కి వెళ్ళటం చూసి వెంబడించి పలకరింపులేం లేకుండా డైరెక్టుగా, పొగరుగా ''హాయ్‌! ఐలవ్‌యూ!'' అన్నాడు. ''ఐ హేట్‌యు!'' అని కోపంతో జవాబిచ్చి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది!&lt;br /&gt;&lt;br /&gt;జయచంద్రకి ఘోరవమానమైంది! తలకోట్టేసినట్టయింది! ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని సమయం కోసం చూస్తుండగా... ఆపైన రెండు నెలలకే, హోంసైన్స్‌ కళాశాల ఆవరణలోనే నిర్మిస్తున్న వాళ్ళ హాస్టలు పూర్తయి, ఆ విద్యార్ధినులందర్ని అక్కడికి తరలించారు.&lt;br /&gt;&lt;br /&gt;జయచంద్ర ప్రతీకారం తీర్చుకోటానికి అదొక పెద్ద ఆటంకమైంది!&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి మూడో సంవత్సరంలోకి రాగానే జయచంద్రకి డిగ్రీపూర్తయి అగ్రికల్చర్‌ కాలేజి వదిలివెళ్ళాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఇన్నాళ్ళూ కాపేసి ఇక్కడ దాకా వచ్చావన్నమాట!'' అంది ముఖం అసహ్యంగా పెట్టుకొని. అతను నవ్వి ''నేను రావడమేమిటి. నువ్వే నా దగ్గరకొచ్చావ్‌! ఇది మా ఊరు'' అన్నాడు. అది అతని ఊరన్నా శర్వాణి జంకలేదు. ''మీ ఊరైతే?'' అనిప్రశ్నించించి.&lt;br /&gt;&lt;br /&gt;''అప్పుడు ఐ హేట్‌యు'' అని నన్ను షేమ్‌ చేశావు. ఇప్పుడు నిన్నుషేమ్‌ చేద్దామని వచ్చాను!'' అన్నాడు కసిగా.&lt;br /&gt;&lt;br /&gt;''ఐ హేట్‌ యు'' అని అనడమే షేమ్‌ చేయటమైతే నువ్వూ నన్ను అను. మాటకిమాట, నీ కోపం తీరిపోతాయి!''&lt;br /&gt;&lt;br /&gt;''అతి తెలివి ప్రదర్శించకు. నేను నిన్ను షేమ్‌ చేయబోతోంది మాటలతో కాదు చేతలతో!''&lt;br /&gt;&lt;br /&gt;''ఏంచేస్తావేం?''&lt;br /&gt;&lt;br /&gt;''నిన్ననుభవిస్తాను!''&lt;br /&gt;&lt;br /&gt;''నోర్ముయ్‌! నేను గనుక సర్పంచ్‌తో చెప్పానంటే, నువ్వనుభవించేది నన్నుకాదుశిక్షని!'' ధీమాగా హెచ్చరించింది.&lt;br /&gt;&lt;br /&gt;గేలిగా నవ్వాడతను.&lt;br /&gt;&lt;br /&gt;''ఎందుకా వికారపునవ్వు?''&lt;br /&gt;&lt;br /&gt;''నీ అజ్ఞానానికి, నేను ఆయన పుత్రరత్నాన్నే!''&lt;br /&gt;&lt;br /&gt;''అయితే ఇప్పుడేవెళ్ళి ఊరంతా టాంటాం చేస్తాను!''&lt;br /&gt;&lt;br /&gt;''ఏమని! నేను చెడిపోయానహో అనా?''&lt;br /&gt;&lt;br /&gt;''ఏం కూశావురా!'' అని అతని చెంప పగలగొట్టి పారిపోవడానికి ప్రయత్నించింది. అతను రోషంతో రెచ్చిపోయిమళ్ళీ గట్టిగా వాటేసి పట్టుకున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''రక్షించండి! రక్షించండి!'' అని శర్వాణి పెద్దగా అరవసాగింది.&lt;br /&gt;&lt;br /&gt;అతడు క్షణం ఆలోచించాడు. ''ఇది అసలే పల్లెటూరు. కేకలు విని ఏ ఒక్కరు వచ్చి చూసిన అంతా రసాభాస అవుతుంది''. అనుకొని శర్వాణి నోరు గట్టిగా మూసి ప్లేటు ఫిరాయించాడు.&lt;br /&gt;&lt;br /&gt;''శర్వాణీ. ప్లీజ్‌! ఒక్కసారి మాత్రమే. తర్వాత నీ జీలికి వస్తే ఒట్టే! ఇక్కడ ఎవరూ లేరు. ఎవరికీ తెలియదు! ప్లీజ్‌! ప్లీజ్‌!''.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి మళ్ళీ తన శక్తినంతా ఉపయోగించి పట్టువిడిపించుకొని ''చీ౫! సిగ్గులేదురా? ఇదే కోర్కె నీ చెల్లినో, అక్కనో ఎవడైనాకోరితే నువ్వు సహిస్తావా?''రోషమొచ్చి ''ఏయ్‌! ఆపు నీపాతచింతకాయ పచ్చడి డైలాగు!''అన్నాడు అసహనంగా.&lt;br /&gt;&lt;br /&gt;''పాతచింతకాయపచ్చడి ఎంతశ్రేష్ఠమో, ఈ డైలాగ్‌ కూడ అంత ఎవర్‌గ్రీన్‌! దమ్ముంటే నా ప్రశ్నకు జవాబు చెప్పు!'' అంది ఛాలేంజ్‌ చేస్తున్నట్టుగా.&lt;br /&gt;&lt;br /&gt;''అసలు నీతో మాటలు పెట్టుకోవటమే నేను చేసినతప్పు! ఇక ఆలస్యంచేయను!''&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి ''రక్షించండి! రక్షించండి!'' అని అరుస్తుంటే గట్టిగా నోరు నొక్కిపట్టాడు.&lt;br /&gt;&lt;br /&gt;శర్వాణి ప్రతిఘటిస్తూనే శక్తిమేరకు మూలగసాగింది.&lt;br /&gt;&lt;br /&gt;స్వామిజీ ఊర్లోంచి నస్తూ ఎవరో ఆడపిల్ల మూలుగులా వినిపించి పొదవెనక్కి వెళ్ళి చూశారు. కిందపడి వున్నయువతి శీలం చెడిపోకముందే తను అడ్డుకోవాలి!కలబడి లాగేద్దామా అంటే అతనా దృఢంగా వున్నయువకుడు, పైగా కామాంధుడైవున్నాడు. అతన్ని ఆపగలిగే శక్తితనకిలేదు. క్షణం ఆలస్యం కాకుండా ఆమెరక్షించ బడాలి! ఎలా?ఎలా?&lt;br /&gt;&lt;br /&gt;కొన్ని సమయాల్లో ఆపదల్లోనే మనస్సు చురుగ్గా పని చేస్తుంది. స్వామీజీకి మెరుపులా తంబురాని చివర పట్టుకొని దాని బుర్రతో బలంగా అతని తలమీద కొట్టాడు. అనుకున్నట్టుగానే అతను బాధతో ''అమ్మా!'' అంటూ రెండు చేతులతో తలపట్టుకొని పక్కకి ఒరిగిపోయాడు!వెంటనే స్వామిజీ అమ్మాయి చేతులందిస్తే పట్టుకొని పైకి లేపాడు, తేరిపార జూస్తే శర్వాణి!&lt;br /&gt;&lt;br /&gt;''అమ్మా! నువ్వా! నీకా ఈ అన్యాయం జరగబోయింది''.&lt;br /&gt;&lt;br /&gt;''స్వామిజీ! నా పాలిటి దైవమై నన్ను కాపాడారు!'' అంటూ కడుపులో దాగివున్న అవమానం, బాధల వల్ల భోరున ఏడ్చేసింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా! లేకుంటే సమయానికి నన్నే యిక్కడికి పంపటమేమిటి? ఊరుకోతల్లీ, ఊరుకో!'' అని శర్వాణిని సముదాయిస్తూ ఆ యువకుణ్ణి చూశారు. పక్కకి పడి నప్పటినుంచి అతనిలో చలనంలేదు. అనుమానం వచ్చి నాడి పట్టి చూశారు. ముక్కు దగ్గర వేలుంచి చూశారు. సందేహం లేదు. అతను చనిపోయాడు!&lt;br /&gt;&lt;br /&gt;తననుకున్నది ఒకటి జరిగింది వేరొకటి! ఆ భగవంతుడు నా చేత ఒకరి శీలం రక్షింపజేశాడు మరొకరిని హత్య చేయించాడు. అంతా దేవుని లీల!&lt;br /&gt;&lt;br /&gt;''అతను చనిపోయాడమ్మా!'' స్వామిజీ శర్వాణికి నిర్వికారంగా చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;భయాందోళనలతో బిగుసుకుపోతూ ''ఇప్పుడెలా స్వామీజీ'' అని అడిగింది.&lt;br /&gt;&lt;br /&gt;'నీకేం భయంలేదు. నేనున్నాను. నాతో రా!'' అని తిన్నగా పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళారు.&lt;br /&gt;&lt;br /&gt;లోపలికి పోగానే ''నేనొక హత్య చేశాను! నన్ను మీ కస్టడీలోకి తీసుకోండి'' అని ఉపోద్ఘాతం లేకుండా చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;ఆ మాటలు విని ఉరుములు లేకుండా పిడుగు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డారు పోలీసులు! వారికీ స్వామీజీ అంటే గౌరవ ప్రపత్తులున్నాయి. చీమకి కూడా అపకారం తలపెట్టరని తెలుసు!&lt;br /&gt;&lt;br /&gt;''తమరు హత్య చేయటమేమటి స్వామీ! మమ్మల్ని నమ్మమంటారా?'' నమ్మకం కుదరకనే అడిగారు.&lt;br /&gt;&lt;br /&gt;''దయచేసి నన్ను కూర్చోటానికి అనుమతిస్తారా?'' స్వామీజీ అడిగారు.&lt;br /&gt;&lt;br /&gt;''సారీ స్వామీ! నమ్మరాని వార్త విన్న షాక్‌లో మర్యాదలు కూడా మర్చిపోయాం. మీరు కూర్చోటానికి మా అనుమతి కావాలా! దయచేసి ఈ కుర్చీలో కూర్చోండి స్వామీ!'' అని కుర్చీలు వేశారు.&lt;br /&gt;&lt;br /&gt;స్వామీజీ కూర్చుని శర్వాణిని కూడ పక్క కుర్చీలో కూర్చోమన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;''స్వామీ తమరేమైనా తీసుకుంటారా?'' భక్తితోనే అడిగారు.&lt;br /&gt;&lt;br /&gt;''మంచి నీళ్ళిప్పించండి, చాలు''&lt;br /&gt;&lt;br /&gt;వాళ్ళు శ్రద్ధగా ఇద్దరికీ మంచినీళ్ళు తెచ్చియిచ్చారు&lt;br /&gt;&lt;br /&gt;స్వామీజీ మంచినీళ్ళు తాగి... సంఘటన జరిగిన చోట తాను ఏం చూసిందీ, ఏం చేసిందీ పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ అమ్మాయే బాధితురాలు దయచేసి ఈ అమ్మాయిని ఇంటికి పంపండి. అవసరమైనప్పుడు పిలిపించవచ్చు. నన్ను కస్టడీలోకి తీసుకోండి'' అని చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;వారి మాట మీద గౌరవంచేత శర్వాణిని ఇంటికి పంపారు పోలీసులు.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;పోలీసులు పద్ధతి ప్రకారం కేసు నడిపి స్వామీజీని నేరస్థుడిగా కోర్టులో ప్రవేశపెట్టడం, బోనులో ఎక్కించటం, ప్రమాణం చేయించటం యధాక్రమంగా జరిగిపోయాయి.&lt;br /&gt;&lt;br /&gt;''మీరు జయచంద్ర అనే యువకుడిని హత్యచేసినట్టుగా అభియోగం మోపబడింది! నిజమేనా?'' జడ్జిగారు ప్రశ్నించారు.&lt;br /&gt;&lt;br /&gt;''మీ ప్రశ్నకు సమాధానం 'అవునులేదు' అని ఒక్క మాటలో కాకుండా కొన్ని విషయాలు చెప్పటానికి నన్ను అనుమతిస్తారా'' అని అడిగారు స్వామీజీ.&lt;br /&gt;&lt;br /&gt;''చెప్పండి'' అన్నారు జడ్జిగారు.&lt;br /&gt;&lt;br /&gt;''నాచేత 'అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను' అని ఒక పుస్తకం మీద చేయి పెట్టించి ప్రమాణం చేయించారు. అది ఏం పుస్తకమో నాకు తెలియదు. బహుశా భగవద్గీత' అయుంటుందని అనుకుంటాను. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఏం ఉపదేశించాడో తమకు తెలిసే వుంటుంది. ఫలితాన్ని తనకి వదిలేసి 'కర్మ'ని చేయమన్నారు. ఇంకా 'చంపేది నేనే. నీవు నిమిత్తమాత్రుడవు' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;ఇదంతా నేనే నేరం చేయలేదనో, శిక్షనుంచి తప్పించుకుందామనో చెప్పటం లేదు. జరిగిన సంఘటనలో అక్కడే ప్రేక్షకుడిగా వున్న నా కర్తవ్య మేమిటి? నేను చేయవలసిన 'కర్మ' ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా కూడా ఉద్బోధించారు! 'సమస్త కర్మలు నాకర్పించి నన్ను శరణు వేడితే సమస్త పాపాలనుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తా... నీవు విచారించకు అని నేను ఏ 'కర్మ' చేస్తే ఒక యువతి శీలం కాపాడబడుతుందో ఆ 'కర్మ'నే చేశాను! ఫలితంతో నాకు సంబంధం లేదు! మీరు విధించబోయే శిక్షతో కూడా నాకు సంబంధం లేదు. ఒక యువతి శీలం కాపాడటంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. 'నే చేసిన 'కర్మ'ను ఆ శ్రీకృష్ణ పరమాత్మకే అర్పించి ఆయన శరణు వేడుతున్నాను! దట్సాల్‌, యువర్‌ ఆనర్‌!'' అని ముగించారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194405464842194?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194405464842194/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194405464842194' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194405464842194'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194405464842194'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194405464842194.html' title='దట్సాల్‌ ! యువరానర్‌'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194392501352629</id><published>2005-07-21T04:04:00.000-07:00</published><updated>2005-07-21T04:05:25.016-07:00</updated><title type='text'>అమ్మాయికి గొడుగు</title><content type='html'>From July Vipula &lt;br /&gt;అమ్మాయికి గొడుగు&lt;br /&gt;ఎలాంగబమ్‌ దీన మణిసింగ్‌&lt;br /&gt;మణిపురి కధ&lt;br /&gt;అయ్యో! పారిపోతున్నాడు... పట్టుకోండి... పట్టుకోండి... దొంగ... దొంగ... అయ్యో! కాస్త పట్టుకోండయ్యా! దొంగ... దొంగ పారిపోతున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;బజార్లోని జనమంతా అతడ్ని తరుముకొస్తున్నారు. మధ్యాహ్నం దాటింది. అరగంట క్రితం వరకు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఫాయిరెన్‌'' (మణిపురి క్యాలండర్‌ లోని పదకొండవ నెల) మాసంలో కురిసే వర్షాన్ని తలపిస్తోంది. ఈ రోజు కురిసే వర్షం. బురద ఎక్కడ అంటుకుంటుందోనని జనాలు చాలా జాగ్రత్తగా అటు, ఇటు చూసుకుంటూ పరిగెత్తుతున్నారు. ఆ బురదలో పరిగెట్టటం కష్టంగా ఉన్నా అతగాడు వాళ్లకి అందకూడదనే దృఢ నిశ్చయంతో శరవేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే జన సందోహంతో నిండిపోయిన ఆ బజార్లో ఎవరికీ చిక్కకుండా పరిగెట్టాలంటే అతడికి కష్టంగానే ఉంది మరి. ఇంతా కష్ట పడ్డాక ఏం జరిగింది... పాపం సాలెగూటిలో చిక్కుకున్న ఈగలాగా జనాలకి చిక్కిపోయాడు.&lt;br /&gt;&lt;br /&gt;అతగాడిని చూసిన ఎవరైనా అతను నగరానికి మొదటిసారి వచ్చాడని, పచ్చి పల్లెటూరి బైతని ఇట్టే చెప్పేస్తారు.&lt;br /&gt;&lt;br /&gt;అందరూ అనుకున్నట్టుగానే అతను ఓ పల్లెటూరి రైతే. వచ్చిన పని త్వరగా ముగించుకొని గ్రామానికి వెళ్ళి పోవాలనీ అనుకున్నాడు. కాలం కలిసిరాక యిదిగో... ఇలా ఈ జనాలకే చిక్కిపోయాడు. పట్టణానికి వచ్చి మూడు రోజులైనా, ఉండటానికి గూడు కానీ, తినటానికి తిండి కానీ లేక తెగ అవస్థ పడ్డాడు. అన్నం తిని మూడు రోజులు కావస్తోంది. ఆ రోజు బజార్లోకి వచ్చే ముందు యేదో కాస్త ఎంగిలి పడ్డానని అనిపించుకున్నాడు. పొలంలో కాయ కష్టం చేసుకుని ముతక బియ్యంతో వండిన అన్నంలో మిరపకాయ నంజుకుని తిని, పంచ భక్ష్య పరమాన్నం తిన్నంత ఆనందపడిపోయే అమాయకుడు అతను.&lt;br /&gt;&lt;br /&gt;తినటానికి కడుపు నిండా తిండి దొరక్క పోయినా, కాయ కష్టం చేసుకుంటూ పోవటం తప్పించి మరొక ఆలోచన లేని, తెలియని బండోడు. బాధని, దుఃఖాన్ని సైతం గుర్తించక పోవటం అతని ప్రత్యేకత అనుకోవాలా, లేక అమాయకత్వం అనుకోవాలా!!! ఓ రెండున్నర ఎకరాల భూమిని కామందు దగ్గర కూలీకి తీసుకొని ఒంటరిగానే కష్టపడే కష్టజీవి అతగాడు. అద్దెకు తెచ్చుకున్న ఎడ్లని క్షణమైనా కూర్చోనివ్వకుండా పొలాన్ని దున్నిస్తాడు. మళ్లీ మళ్ళీ ఎడ్లని అద్దెకి తెచ్చుకుని డబ్బు ఇచ్చే స్తోమత అతగాడి దగ్గరెక్కడుంది? ఒకవేళ తన పని అయిపోతే అడిగినా అడక్కపోయినా పక్క వాళ్ల పొలం కూడా దున్ని పెట్టే యితగాడిని ఏమనాలండీ!! ఇంతా కష్టపడి యింటికొస్తే, వంట కాలేదని తెలిసిందా... అంతే... పార పట్టుకుని తన చిన్న తోటలోని మొక్కలకు బళ్లు కట్టి నీళ్లు పెట్టటంలో నిమగ్నమై పోతాడు. తిండి మీదకన్నా అతగాడికి పనిమీద ధ్యాసెక్కువని అర్థమవుతోంది కదూ!!! ఇంత కష్టపడ్డా కూడ అతగాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడా! అంటే... అది ఆ భగవంతుడికే తెలియాలి. కాయ కష్టం చేసుకోవటం తప్పిస్తే, చక్కగా నలుగురితో కలిసి తిరగాలని. వాళ్ళతో మాట్లాడాలని గానీ బహుశా అతను ఎన్నడూ అనుకోలేదనుకుందాం. ఒకవేళ ప్రయత్నం చేసినా అది అంతగా రాణించదని అతగాడి భయం. పోయిన 'పోయినూ' (మణిపురి క్యాలెండర్‌ లోని 7వ మాసం) మాసంలో పంట కాస్తా చేజారిపోయింది. కామందు అగ్గిమీద గుగ్గిలమవుతూ ''ఏంటిరాయిది? ఇలాగయితే నేను బతికినట్టే'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఏం చేయను బాబాయ్‌! నేపడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తూనే వున్నావుకదా ఇంతకన్న నన్నేం చేయమంటావు?''&lt;br /&gt;&lt;br /&gt;''కిందిటిసారి యిదే పాట పాడావ్‌. నీతో కానప్పుడు నన్నెందుకురా ముంచుతావు. ఇప్పుడే కాదు నువ్వెప్పటికీ నా చేతిలో నాలుగు గింజలు కూడా రాల్చలేవు. నేను ఈ పొలం మీదేకదా ఆధారపడింది. 15 వేలు ఖర్చుపెడితే ఏ మిగిలింది. డబ్బు ఖర్చుపేట్టేది వెనకది, ముందు వేసుకుతినటానిటికా గాడిద కొడకా...&lt;br /&gt;&lt;br /&gt;''లేదు, నన్ను నమ్ము బాబాయ్‌! వచ్చే ఏడాది ఈ లోటుని తప్పక తీరుస్తాను''&lt;br /&gt;&lt;br /&gt;ఈ ఏడాది ఏం తిని బతకమంటావురా? గాలి భోజనం చేయమంటావా! నాకు పిల్లాజెల్లావున్నారు. వాళ్ళ కడుపులెలా నింపమంటావు? ఏదైనా అన్నానంటే చాలు, పెద్ద పెద్ద దణ్ణాలు పెడుతూ నా కాళ్ళమీద పడియేడుస్తావు. చచ్చే చావొచ్చిందిరా నాకు. ఈ మోటరు నీళ్ళతో నడుస్తుందనుకొంటున్నావా! ప్రతి సంవత్సరం ఏదో వంకతో ధాన్యం తగ్గిస్తూనే వస్తున్నావు. నీతో కాదుకానీ మరెక్కడైనా చూసుకో''.&lt;br /&gt;&lt;br /&gt;మరెక్కడైన పని దొరకడం అంటే మాటలా! బతిమిలాడటం, కాళ్ళావేళ్ళాపడటం యివేమీ చేతగాని పరమశుంఠ మనవాడు. రెండుమూడు సంవత్సరాల లోటు ఒక్క ఏడాదితో తీరుస్తానని గట్టిగా చెప్పటం అయితే చెప్తున్నాడు. ఇతగాడిని ఆ భగవంతుడే రక్షించాలి.&lt;br /&gt;&lt;br /&gt;తాగుడు అలవాటులేదు. అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టడం, శరీర శ్రమకు వెనకాడడం యివేమీ చాతకావు. ఎత్తలేని బరువుని ఎత్తటం మూలానే ఈ రోజు ఇంత అనర్ధం జరిగింది. అన్నీ బాగావున్నరోజులో 15 కి బదులు 10 బస్తాలు సేద్యం చేసేవాడు. కానీ ఈ రోజు కలిసిరాక యిన్ని తిప్పలు పడాల్సి వస్తోంది. ఏడాది, ఏడాదిన్నర వ్యత్యాసంలో ఒకరి తరువాత ఒకరు పిల్లలు పుట్టుకు రావటంతో చూస్తుండగానే సంతానం ఎనిమిది మందైకుర్చున్నారు. అందులోను ఆరుగురు ఆడపిల్లలు, యిద్దరు మగపిల్లలు. వీళ్ళందరితో పాటు అస్తమానం ముక్కుతు, మూలుగుతూవుండే యిద్దరు ముసలివాళ్ళు. వైద్యుడి అవసరం లేకుండా పూటకూడా గడవదు.&lt;br /&gt;&lt;br /&gt;కేవలం తిండి వరకే అయితే ఫరవాలేదు. బడికూడా యింటికీ దగ్గర్లోనే ఏడ్చింది. ఇక పిల్లల్ని బడికి పంపక తప్పదుగా! చదువు, తిండి రెండు ఒకేసారి కావాలంటే కష్టమే మరి వసంతంలో శ్రీపంచమి ఎందుకొస్తుంది? 'లమదా' (మణిపురి కాలెండర్‌లో చివరి నెల) మాసం గుట్టుచప్పుడు కాకుండా ఎందుకెళ్లిపోదో? వర్షం తన హద్దులో వుండకుండా కట్టలు తెంచుకుని ఎందుకు కురుస్తోందో? అదీ నగరంలోనో, గ్రామంలోని పోలాల్లోనో కాకుండా మాలతిపైనే ఎందుకు కురుస్తోంది? ఇవన్నీ అతగాడి బుర్రని తోలిచేసే ప్రశ్నలు.&lt;br /&gt;&lt;br /&gt;మాలతి అతని పెద్దకూతురు. పక్క గ్రామంలోని స్కూల్లో చదువుకుంటోంది. తనకంటూ ఓ చిన్న గొడుగు కొనుక్కొవాలని ఎప్పటినుంచో ఆశ పడుతోంది. ఈ విషయమై తండ్రిదగ్గర చాలాసార్లు గొడవ పడింది కూడా. ఇదివరకటి లాగా యిప్పుడు స్నేహితురాలి గొడుగులో స్కూలుకెళ్లిరావటమో లేకపోతే వర్షం తగ్గేవరకు ఆగి వెళ్ళటమో చేయటంలేదు. వర్షం మరీ ఎక్కువగా పడుతుంటే స్కూలు మానేయటమో లేక తడుచుకుంటూ పోవటమో చేస్తోంది. తన స్నేహితురాళ్ళంతా చక్కగా గొడుగులో వెళుతుంటే ఆ పసి హృదయం పాపం బాధగా మూలిగేది. గొడవ చేస్తే గొడుగు వస్తుందన్న విషయం ఆ పసి మనసుకి తెలియక పోలేదు. నిజం చెప్పాలంటే అవసరమైనప్పుడు అలగడం, ఏడవడం, కోపగించుకోవడం సహజమే కదా! కోప తాపాలు మనిషి నైజంలో ఒక భాగమే అలాగే వాటిని ఉపయోగించుకునే హక్కు ప్రతి వారికీ ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;తండ్రి తన బిడ్డ కోరికని గుర్తించలేక పోతున్నాడనుకుంటే అది మీ అవివేకమే అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలపు మేఘాలు చూడగానే అతనిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కానీ తిండి గురించి పట్టించుకునే అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి గొడుగు విషయం పక్కకి పెట్టాల్సి వస్తోంది అతగాడికి.&lt;br /&gt;&lt;br /&gt;దేవుడి దయవల్ల ఈసారి అన్నీ కలిసొచ్చాయి. బహుశా ఆమె కోరిక తీరే రోజు దగ్గరకొచ్చిందేమో!!! మాలతి తన పాత పుస్తకాలని అమ్మేసి కొంత సొమ్ము కూడబెట్టింది. దానికి తోడు పోయినసారి వర్షంలో బాగా తడిసి, ముద్దయి ఒణికి పోతూ, నీళ్ళు కారుకుంటూ వచ్చిన కూతుర్ని చూసి గొడుగు కొనాలనే నిశ్చయించుకొన్నాడు. అంతే కాదు అప్పు చేసైనా సరే గొడుగు కొనటానికి వెళ్లాలని తీర్మానించుకొన్నాడు. తన నిర్ణయాన్ని కూతురికీ చెప్పాడు. మాలతి ఆనందానికి హద్దులు లేకపోయాయి. కూని రాగాలు తీస్తూ పడుకోవటానికి వెళ్లిపోయింది. తెల్లారే లేచి స్నానం చేసి సంతోషంగా బస్సెక్కాడు.&lt;br /&gt;&lt;br /&gt;''దీని ఖరీదెంత?''&lt;br /&gt;&lt;br /&gt;''బాబయ్యా! 20 రూ.లు''&lt;br /&gt;&lt;br /&gt;''అమ్మో! 20 రూపాయలా!!!''&lt;br /&gt;&lt;br /&gt;''దీని బట్ట చూడండి ఎంత అందంగా ఉందో! పైగా గాజుతో చేసిన దీని పిడి చూస్తే దీని ఖరీదు తెలియటం లేదూ!&lt;br /&gt;&lt;br /&gt;అతగాడు మారు మాట్లాడకుండా బయటికొచ్చేశాడు. పక్క కొట్లోకి వెళ్ళే ముందు ఓ సారి రొంటిన దాచుకున్న డబ్బును తడిమి చూసుకున్నాడు. డబ్బు మూట చేతికి బరువుగా తగలడంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;చుట్టు పక్కల దుకాణాలలో సైతం గొడుగు ఖరీదు 25 రూ్హ్హ అనటంతో అతగాడికేం చేయాలో తోచలేదు. ఎలాగో అలా ధైర్యం కూడగట్టుకుని చివరికి మూలగా ఉన్న ఓ దుకాణంలోకి దూరి గొడుగు ఖరీదు అడిగాడు. ''25 రూపాయలు'' అని అనేలోగానే అతని మాటలకు అడ్డం పడుతూ ''కాస్త తక్కువ ధరలో చూపించవయ్యా'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''తక్కువ ధరా! ఎంతలో చూపించమంటావు... 20 రూ... 15 రూ... అంటూ కొన్ని గొడుగులు చూపిస్తూ ''ఇందులో యేది కావాలో యేరుకో... అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఇంతకన్నా తక్కువ... ధరలో లేవా?''&lt;br /&gt;&lt;br /&gt;''లేవు''&lt;br /&gt;&lt;br /&gt;''నీ దగ్గర కాకపోతే కనీసం చుట్టు పక్కల యెక్కడా తక్కువ ధరలో గొడుగు దొరకదా? అన్నాడు నిరుత్సాహంగా.&lt;br /&gt;&lt;br /&gt;''దొరుకుతాయేమో ప్రయత్నించు''&lt;br /&gt;&lt;br /&gt;అతని మాటల మీద విశ్వాసంతో పాపం అతనెంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. గొడుగులతో నిండిన దుకాణాలన్నీ దాదాపు అయిపోయాయి. ఆఖరికి ఓ మూలగా ఉన్న దుకాణంలో కొద్దిగా పాడైనా కాస్త నదరుగా ఉన్న గొడుగు అతని కంట పడింది. గొడుగు పిడి గాజుదై ఉండటమే కాకుండా లోపల విచ్చుకొన్న పువ్వు డిజైను ఉంది. లోపల దారాలు చెమ్కీతో చేసినవై ఉండటం మూలాన చక్కగా మెరుస్తూన్నాయి. పైగా ఖరీదు 8 రూ. 50 పైసలే! అతగాడి ఆనందానికి హద్దులు లేకపోయాయి.&lt;br /&gt;&lt;br /&gt;అంత రద్దీలో దోవ చేసుకొంటూ పోతున్నప్పుడు కూడా గొడుగు చేతిలో ఉంది. కొత్త గొడుగు ఎక్కడ మాసిపోతుందోనని కాగితంలో చుట్టి పట్టుకున్నాడు. అతనికి ఒక్క సారిగా కూతురి ముఖం కనిపించింది. పిచ్చి తల్లి... ఎన్ని రోజులుగా ఎదురు చూస్తోందో దీని కోసం'' అనుకుంటూ వడి వడిగా బస్‌స్టాండ్‌ వేపుగా నడిచాడు. నడుస్తున్నంతసేపు సంతోషంతో వెలిగిపోయే కూతురి ముఖమే కనిపిస్తోంది అతగాడికి. రెండు మూడు రోజులదాకా చెప్పిన పనల్లా చేస్తుంది. తల్లిని నిర్లక్ష్యం చేయదు. నేను వెళ్లేసరికి గుమ్మంలోనే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబోలు...&lt;br /&gt;&lt;br /&gt;హఠాత్తుగా ఆలోచనల లోంచి బయటికొచ్చిన అతనికి గొడుగు కనిపించలేదు. అతనికి ఒక్కసారిగా కళ్ళు చీకట్లో కమ్మినట్టయ్యాయి. ''అయ్యో! నా గొడుగు! నా గొడుగు! అమ్మో!... మీరుగాని నా గొడుగుని చూశారా?''&lt;br /&gt;&lt;br /&gt;''లేదు నాయనా! శనగలు కొంటూ నువ్వు రుమాల్లోంచి డబ్బులు తీయటం మాత్రమే చూశాను''.&lt;br /&gt;&lt;br /&gt;''అవును... డబ్బు తీసిన మాట వాస్తవమే కానీ... గొడుగు యిదిగో... యిక్కడే... ఈ పక్కకే పెట్టాను... కొత్తది... చిన్నది...''&lt;br /&gt;&lt;br /&gt;''నాకేం తెలియదు''.&lt;br /&gt;&lt;br /&gt;కర్మగాలీ యెవరైనా ఎత్తుకుపోయారా! ఓరి భగవంతుడా... ఏం చేయాలి?''&lt;br /&gt;&lt;br /&gt;గొడుగు పోయిందని అతగాడికి అర్థం అయిపోయింది. ఎవరినడగాలో, ఏం చేయాలో తోచటం లేదు. బాధతో పెదవులు కొరుక్కున్నాడు చేసేది లేక బస్టాండ్‌ వదిలేసి బజారు వేపుగా కదిలాడు.&lt;br /&gt;* * *&lt;br /&gt;''నీ పేరేమిటి?''&lt;br /&gt;&lt;br /&gt;''నిజంగా నేనే తీశాను''.&lt;br /&gt;&lt;br /&gt;''నీ పేరేవిటిరా? దొంగ వెధవా... గట్టిగా దవడ పగిలేలా కొట్టాడు. జవాబు చెప్పేలోగా ప్రశ్నల పరంపరలో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఆ పోలీసు. ప్రతి ప్రశ్నకి ముందు వెనక లారీ౮ దెబ్బలతో ఒళ్లు హూనం అయిపోతోంది. దెబ్బలకి కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి. భరించలేక అతను మోకాళ్ల మీద కూర్చున్నాడు. జేబులో చిరిగిన కాగితంలోంచి శనగ్గింజలు చుట్టు పక్కల దొర్లాయి.&lt;br /&gt;&lt;br /&gt;''ఇవి ఎవరి దగ్గర కొట్తేశావురా దొంగ...'' అంటూ ఠపేల్‌ మని ఎడమ కాలి మోకాలి చిప్ప మీద లారీ౮ దెబ్బ బలంగా పడింది. దెబ్బలు నొప్పికి నడుమ అంతరాత్మలోంచి ఓ నవ్వు బయటికెగసింది. కళ్లల్లోంచి కారుతున్న నీళ్లని చేతులతో తుడుచుకుంటూ&lt;br /&gt;&lt;br /&gt;''నన్ను... నన్ను... తోమాల్‌ అంటారు'' అంటూ జవాబిచ్చాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఎక్కడుంటావు?''&lt;br /&gt;&lt;br /&gt;... గ్రామంలో...&lt;br /&gt;అనువాదం: డా్హ్హ ఆర్‌. రాజి&lt;br /&gt;&lt;br /&gt;                          Vipula Home   |   Eenadu Home  | eMail This Article&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194392501352629?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194392501352629/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194392501352629' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194392501352629'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194392501352629'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194392501352629.html' title='అమ్మాయికి గొడుగు'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194386410811992</id><published>2005-07-21T04:03:00.000-07:00</published><updated>2005-07-21T04:04:24.113-07:00</updated><title type='text'>మృగతృష్ణ</title><content type='html'>From July Vipula &lt;br /&gt;    &lt;br /&gt;మృగతృష్ణ&lt;br /&gt;దేవవ్రతన్‌&lt;br /&gt;తమిళకధ&lt;br /&gt;''ప్లస్‌ టూ'' పరీక్షలు పూర్తియైున రోజు సాయంత్రం ముత్తు తన స్కూలు హెడ్‌మాస్టర్‌ అనంతకృష్ణన్‌ గారిని కలవడానికి వారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. ఆరు పదులు దగ్గర పడిన వయసు. ఈ కాలపు హంగులేవీ ఆయనలో అగుపించలేదు. పంచ, కండువా, నుదుట విభూతి అంతే! అతి సాధారణమైన వేషధారణ. ఆయన కన్నులలో ఏదో మెరుపు!&lt;br /&gt;&lt;br /&gt;గేటు తెరుచుకుని లోపల అడుగుపెట్టిన ముత్తు ''నమస్కారం సార్‌!'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;తలెత్తి చూచిన అనంతకృష్ణన్‌గారి ముఖం వికసించింది.&lt;br /&gt;&lt;br /&gt;''రాముత్తు...! లోపలకురా...!'' అని ఆప్యాయంగా పిలిచారు.&lt;br /&gt;&lt;br /&gt;హెడ్‌మాస్టర్‌ గారి ఇల్లు వారిలాగానే మరీ ఆధునాతనంగా కాక, మరీ పాతబడినదిగా కాక మధ్యతరహాగా ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;''ముత్తూ! పరీక్షలు ఎలా రాశావు...? నీకు తృప్తిగా ఉందా...?'' అని అడిగారు అనంతకృష్ణన్‌&lt;br /&gt;&lt;br /&gt;''అవును సార్‌...! బాగా రాశాను. అంతా మీ ఆశీర్వాదమే సార్‌...!''&lt;br /&gt;&lt;br /&gt;వరండాలోని కుర్చీలో ముత్తును కూర్చోమని చెప్పి తానూ ఎదురుగా కూర్చున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;''నీ వల్ల ఒకనాడు మన స్కూలుకే పేరు ప్రతిష్ఠలు రాబోతాయి...'' అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ముత్తు చిరునవ్వు నవ్వుతూ... ''నాకా అదృష్టం ఉందో లేదో తెలియదు సార్‌...! కాని అలా జరిగితే అందుకు కారకులు మాత్రం మీరే సార్‌...!''&lt;br /&gt;&lt;br /&gt;పదిహేడేళ్ల ముత్త్తు వయసుకు తగినట్టుగా ఎదిగాడు. దట్టమైన క్రాపు, నూనూగు మీసాలు, చామనఛాయ, అయినా ముఖంలో కళ ఉట్టి పడుతోంది.&lt;br /&gt;&lt;br /&gt;''సరే... ఇకపైన ఏం చదవాలని అనుకుంటున్నావూ...? నీకు వచ్చే మార్కులకు ఇంజినీరింగ్‌లోనో, మెడిసిన్‌లోనో సీటు దొరకడం ఖాయం...''&lt;br /&gt;&lt;br /&gt;ముత్తు ఏదో ఆలోచిస్తూ వారివైపే చూడసాగాడు.&lt;br /&gt;&lt;br /&gt;''నాన్నగారికి మునుపటిలా పొలంలో పని చేయడానికి చేతకావటం లేదు సార్‌...! అదే నాకు చింతగా ఉంది...'' ముత్తు కంఠంలో బాధ ధ్వనించింది.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;అనంతకృష్ణన్‌ 'పూంకుళం'లోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి చాలాకాలం గడిచిపోయింది. తంజావూరు జిల్లాలో పూంకుళంలో పుట్టి, అక్కడే చదివి మొదట అధ్యాపకునిగా ఆ పిమ్మట హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. తన యిన్నేళ్ల అనుభవంలో ఎంతోమంది విద్యార్థులను చూశారు.&lt;br /&gt;&lt;br /&gt;తన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం దేశంలోను, విదేశాలలోను, పెద్దపెద్ద పదువులలో ఉన్నారు. బడిలో చదివే రోజులలో అంతగా బుద్ధిమంతులు కాని వారు సహితం పట్టణాలకు వెళ్లి తెలివితేటలతో బాగా డబ్బు సంపాదించిన వారి వైనం కూడా చూసారు.&lt;br /&gt;&lt;br /&gt;కాని ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు ఆయన మనస్సును అమితంగా బాధిస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;'పూంకుళం' కావేరి డెల్టాలో బాగా సాగుబడి అయ్యే గ్రామం. ఈ మధ్య అక్కడ చాలామంది భూమిగల వారు తమ పిల్లలను ఆడామగా అనే తేడా లేకుండా పైచదువులకని పట్టణం పంపేసి, తమ పొలాలను సైతం అమ్మేసి, తాము కూడా అక్కడకు వెళ్లి స్థిరపడటం అనంతకృష్ణన్‌ మనసును బాగా కలిచివేసింది. కరువు కాలంలో సొంత పిల్లలను అమ్ముకున్నట్లు, భూములను అమ్మటం, వాటిని కొన్నవారు కూడా మెల్లమెల్లగా సాగుబడి చేయటం తగ్గించి ''రియల్‌ ఎస్టేట్‌'' పేరుతో వాటిని అమ్మి డబ్బు గడించటం ఆయన్ని ఎక్కువ బాధించింది.&lt;br /&gt;&lt;br /&gt;గత సంవత్సరం కూడా వారి స్కూల్లో అతి తక్కువ మార్కులతో పాసైన 'అరసు' అనే విద్యార్థి కొత్తగా ప్రారంభించబడిన ''ఇంజనీరింగ్‌'' కాలేజిలో ''పేమెంట్‌ సీటు'' కోసం పొలం అమ్మి లక్ష రూపాయలిచ్చి చేరాడు. ఆ అబ్బాయి తండ్రితో మాట్లాడినప్పుడు అనంతకృష్ణన్‌ ఆవిషయమై ప్రస్తావించారు.&lt;br /&gt;&lt;br /&gt;''ఎందుకయ్యా! బాగా పండే నీ పొలాన్ని అమ్మి మీ అబ్బాయిని ఇంజినీరింగ్‌ చదవడానికి పంపుతున్నావూ...? నీ వ్యవసాయాన్నే అతనూ చేయవచ్చుకదా...?'' అని మాటవరసకన్నారు. అది విన్న 'అరసు' తండ్రి ఆయనపై విరుచుకుపడ్డాడు&lt;br /&gt;&lt;br /&gt;''ఏం...? అయ్యవారూ...? ఇలా మాట్లాడుతున్నారు...? చదువుకోక నేను పాడైపోయాను. మా అబ్బాయికి కూడా అదే గతి పట్టాలా...? మీ పిల్లలే పెద్దపెద్ద చదువులు చదవాలా...? మేమంతా చదువుకోకూడదా... లేక చదవలేమా...? మీకైతే పిల్లాజల్లా లేరు. ఇప్పుడు ఎంతమంది కంప్యూటర్‌ చదువులు చదివి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసా? మీ బుద్ధులు మారవు. మీరొక్కరే పైకి రావాలి. ఇతర జాతులవారు అభివృద్ధిలోకి రాకూడదనే మీ కోరిక... అంతేగా...'' ఆవేశంతో అరవసాగాడు.&lt;br /&gt;&lt;br /&gt;అనంతకృష్ణన్‌ తన తప్పిదాన్ని గ్రహించి మౌనంగా వెనక్కి మళ్ళారు. అమాయకుడైన ఆ రైతుతో ''చాలామంది ఇంజినీర్లు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని కంప్యూటర్లు మూలపడిపోతున్నాయని'' చెప్పినా అతనికి అర్థంకాదు.&lt;br /&gt;&lt;br /&gt;కాని ముత్తు తండ్రి ఆశపడటంలో న్యాయముంది. ముత్తు చాలా బుద్ధిమంతుడు. తెలివైనవాడు. మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థి. అతను ఇంజినీరింగ్‌ కోర్సులో చేరటం ఏమంత కష్టమైన పనికాదు. కాని అతన్ని చదివించడానికి అతని తండ్రి ఆర్థికస్థోమత సరిపోతుందా అన్నదే సందేహం. వాళ్ళకు ఒక యిల్లు, కొద్దిపాటి పొలమూ వున్నాయి. ముత్తుకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కకు పెళ్ళై అత్తవారింట్లో కుంభకోణంలో ఉంటోంది. ముత్తు తమ్ముడు ఆరోక్లాసో, ఏడోక్లాసో చదువుతున్నాడు. ముత్తులా తెలివైన వాడు కాడు. ముత్తు బాగా చదివి కుటుంబాన్ని పోషించాలి.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;చైత్రమాసపు ఎండలు మండిపోతున్నాయి. ఆ మరుసటి రోజూ ప్లస్‌ టూ పరీక్షా ఫలితాలు వెలువడనున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఆ రాత్రి అనంతకృష్ణన్‌ అటు నిద్రరాక యిటు మేలుకోలేక ఏదో స్వప్నావస్థలో ఉన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;యింటి ఫోను మోగింది. ఫోను అందుకున్న ఆయన భార్య ''ఫోను మీకే''... అని రిసీవర్‌ అందించింది. అనంతకృష్ణన్‌&lt;br /&gt;&lt;br /&gt;''అవును... నేను పూంకుళం హైస్కూలు హెడ్‌మార్టర్‌నే మాట్లాడుతున్నాను'' అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఒక్క నిమిషం తరువాత ఆయన ముఖం సంతోషంతో వికసించింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఓహో... అలాగా...! ఎంతటి శుభవార్త! నిజంగానా... అవును చాలా బుద్ధిమంతుడు... తప్పకుండా రండి...'' అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఫోను కిందపెట్టి ''అంబుజం! ముత్తు ప్లస్‌ టూ పరీక్షలో మొత్తం తమిళనాడులోనే మొదటి ర్యాంకు సంపాదించాడట... ఎంతటి సంతోషకరమైన వార్త...! ఇప్పుడే వెళ్ళి అతనికి తెలియజేయాలి... రేపు పత్రికల వాళ్ళు అతన్ని చూడడానికి వస్తారట... మన ఊరికి ఎంతటి గౌరవం దక్కింది...!'' అనియింకా ఏదోదో మాట్లాడుతూ షర్టు తొడుక్కొని వడివడిగా ముత్తు యింటివైపు అడుగులు వేశారు.&lt;br /&gt;&lt;br /&gt;ఎదురుగా పదడుగుల దూరంలో సైకిల్‌పై వారియింటి వైపే వస్తున్న ముత్తు వారిని చూచి వెంటనే సైకిల్‌ దిగాడు.&lt;br /&gt;&lt;br /&gt;''అరే... నీకు నూరేళ్ళాయుష్షు... నిన్ను చూడడానికే బయలుదేరాను. నీవు తమిళనాడు అంతటిలో మొదటి ర్యాంకులో పాసైయ్యావు ముత్తు...!'' అంటూ అతన్ని వాటేసుకున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;''సార్‌...! నేను మీతో ఆరోజు చెప్పిన విషయమై మాట్లాడాలని మీ యింటికే వస్తున్నాను. రండిసార్‌...! మా యింటికివెళ్దాం...'' అని సైకిల్‌ తోసుకుంటూ వారివెంట నడవసాగాడు ముత్తు''.&lt;br /&gt;&lt;br /&gt;మరుసటి రోజు అన్ని వార్తాపత్రికలలోను, టీవీలోను ముత్తు ఫొటో, అతని ఇంటర్వ్యూ ప్రత్యేకంగా చోటుచేసుకుని అందరిని ఆకర్షించింది.&lt;br /&gt;&lt;br /&gt;''రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్‌ సాధించిన విద్యార్థి వ్యవసాయం చేసుకుంటూ తన గ్రామమందే ఉండదలచాడు. ఇంజినీరింగ్‌ గాని డాక్టరుకు గాని చదివే కోరిక లేదు'' అని పెద్దపెద్ద అక్షరాలతో వార్త వెలువడింది. ముత్తు ఇంటర్వ్యూలో చక్కగా స్పష్టంగా&lt;br /&gt;&lt;br /&gt;''మొదటి ర్యాంక్‌ వచ్చిన వాళ్ళందరూ 'ఇంజినీరింగ్‌; మెడిసన్‌ చదువులే చదవాలా...? నాకు ఆ కోరిక లేదు. ఈ పూంకుళం గ్రామంలోను, యింకా యితర అనేక గ్రామాల నుండి యువకులు, గుంపులు గుంపులుగా ఇంజినీరింగ్‌ అనే మాయా మరీచికాన్ని వెంటాడుతున్నారు. నేను నా కుటుంబానికి సొంతమైన పొలాన్ని, ఇంటిని, ఈ మనుషులను వదలి ఆ మాయవేటలో పడదలచుకోలేదు. నేను తంజావూరు కాలేజీలో లెక్కల్లో పట్టాపుచ్చుకుని ఈ పూంకుళం బడిలోనే ఉపాధ్యాయునిగా పనిచేయాలని ఆశ పడుతున్నాను. నా గ్రామం, నా భూమి ఇవే నాకు ముఖ్యం. బుద్ధిమంతులైన యువకులందరూ గ్రామాలను వదలి, ఈ దేశాన్ని వదలివెళ్తూ ఉంటే ప్రకృతి సహజమైన ఈ గ్రామాలు ఎవరి కోసం...? అలా చదివేవాళ్లని చదవనీయండి. కానీ వెయ్యి మందిలో ఒక్కరైనా నాలాగా ఆలోచిస్తే తప్ప ఈ గ్రామాలు బాగుపడవు. వ్యవసాయం వృధాపోదు...'' అంటూ తన అభిప్రాయం చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;ముత్తు మాటలు ఎంతటి ప్రశంసలనందుకున్నాయో అంతటి విమర్శలకు గురిఅయ్యాయి.&lt;br /&gt;&lt;br /&gt;ముత్తు తండ్రి నల్లశివం అనంతకృష్ణన్‌తో ''ఏం సార్‌...! ఈ అబ్బాయి యిలా మాట్లాడాడు. ఇతను పెద్ద చదువులు చదివి నాలుగు రాళ్లు సంపాదిస్తే కదా మీకు గౌరవప్రదంగా ఉంటుంది...?'' అని ఎన్నోసార్లు తన ఆవేదనను వెలిబుచ్చారు.&lt;br /&gt;&lt;br /&gt;''ఎందుకు నాన్నా..! అలా అనుకుంటారు? నాలుగు డబ్బుల కంటే మన పొలం, మన మనుషుల బాంధవ్యం గొప్పవికావా..? అదీకాక మనసు తృప్తి అని ఒకటుంది కాదా? నేను హెడ్‌మాస్టర్‌ గారితో సంప్రదించి వారి అనుమతితోనే పత్రికల వారికి అలాచెప్పాను. భారతదేశపు ప్రాణం గ్రామాలలో ఉందన్నారు గాంధీజీ! కాని ఈ వేళ మనం ఆ ప్రాణాన్ని లక్ష్యపెట్తున్నామా...? ఇప్పుడు ఎంతమంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారో తెలుసా...? ఆ గుంపులో నేనూ ఒకడినై ఉండిపోవాలా...? ఇంజినీరింగ్‌ చదువులు, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు యివే చదువుకున్న బుద్ధిమంతుల భవిష్యత్తా...? రాజకీయాలు బురదవంటివని చదువుకున్న వారందరూ దానికి దూరంగా ఉండబట్టే నేడు రాజకీయంరంగం యింతటి దుస్థితికి లోనైంది. అదే విధంగా వ్యవసాయం, గ్రామంఇవన్నీ ఒద్దని చదువుకున్న యువకులందరూ అనుకోవడం మొదలు పెడితే ఈ గ్రామాలన్ని ఎవరి కోసం...? నాకు ఈ పూంకుళం గ్రామం, దాని మట్టి, వ్యవసాయం యివే ముఖ్యం. కంప్యూటర్‌, అధునాతన వసతులు రోజురోజుకు మార్పులు చెందుతుంటాయి. కాని ఆకలి, అన్నం యివి రెండూ మారవు. అన్నం వద్దని చెప్పగలమా? నా ఈ గ్రామం వ్యవపాయ రంగంలో ప్రధమ స్థానాన్ని పొందేందుకు నేను కృషి చేస్తాను. అదే నా ధ్యేయం. నా భవిష్యత్తు ఈ గ్రామంతోనే ముడిపడిఉంది...''&lt;br /&gt;&lt;br /&gt;అంతటి దృఢ సంకల్పంతో మాట్లాడుతున్న ఆ యువకుణ్ణి అనంతకృష్ణన్‌ ఆశ్చర్యంతో చూడసాగారు.&lt;br /&gt;&lt;br /&gt;తండ్రికి ''ప్రణవ'' మంత్రాన్ని ఉపదేశించిన సుబ్రహ్మణ్యస్వామిని గురించి చెప్తుంటారు. ఇంతటి సూక్ష్మ బుద్ధిని ఈ బాలునికి ప్రసాదించినది ఎవరు? ఆ భగవంతుడేగా...?&lt;br /&gt;&lt;br /&gt;''విచారించకు నల్లశివం...! మీ అబ్బాయి వల్ల ఇప్పుడు ఈ బడికి, ఈ ఊరికి పేరు ప్రతిష్టలు కలిగాయి. భవిష్యత్తులో ఈ గ్రామం, ఈ ప్రజలు ఇతని వల్ల గౌరవాన్వితులౌతారు. నాకా నమ్మకం ఉంది'' అన్నారు అనంతకృష్ణన్‌.&lt;br /&gt;&lt;br /&gt;చైత్రమాసపు వేడి తగ్గడానికా అన్నట్లు ఉరుములు మెరుపులతో హోరుగా వర్షం కురవటం మొదలైంది. ఈ మట్టి వాసన పూల సుగంధంలా నలుదిశలా వ్యాపించింది.&lt;br /&gt;&lt;br /&gt;''రండి నాన్నగారు...! ఇంటికి వెళ్దాం. నాకు ఈ మట్టి వాసనను ఆస్వాదిస్తూ వానలో తడుస్తూ నడవాలని ఉంది. వస్తాను సార్‌...!'' అని చెప్పి తండ్రి చేయి పట్టుకుని వర్షంలో తడుస్తూ ఇంటివైపు నడక సాగించాడు ముత్తు.&lt;br /&gt;అనువాదం: ఆర్‌.జయశ్రీ కాసీకర్‌&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194386410811992?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194386410811992/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194386410811992' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194386410811992'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194386410811992'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194386410811992.html' title='మృగతృష్ణ'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194381115526457</id><published>2005-07-21T04:02:00.000-07:00</published><updated>2005-07-21T04:03:31.170-07:00</updated><title type='text'>దేవిడీ దేవత</title><content type='html'>From July 2005 vipula &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;దేవిడీ దేవత&lt;br /&gt;ఐతా చంద్రయ్య&lt;br /&gt;తెలుగు కధ&lt;br /&gt;''బావలు సయ్యా... సై&lt;br /&gt;మరదలు సయ్యా... సై...''&lt;br /&gt;అర్ధరాత్రి కాబోతుంది. నగరం నడిబొడ్డున ఐదు నక్షత్రాల హోటల్‌ హెవెన్‌. హెవెన్‌ నట్టనడుమ... కస్టమర్ల మనోరంజనం కోసం కలగా పులగం కార్యక్రమాలు. ఆకర్షణ కోసం కోడెవయసులున్న దొరచూపుల కవ్వింపులు, దొంగాటకాలు. నాట్యమయూరిగా పరిచయమైన ఊర్వశి మెరుపు పెదాలు నేపధ్య గీతాన్ననుసరిస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;కాళ్లూ చేతులు గంతులేస్తున్నాయి. గుమ్ముగా కనబడాలనే రమ్ము బాబుల ఆరాటానికనుగుణంగా ఒంటిమీద గుడ్డలు నామమాత్రమైనాయి. పాట పారుతూనే ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;వారుణ వాహినిలో కొట్టుకొచ్చి వేదిక చుట్టూ మూగిన కస్టమర్ల ఆకలి చూపులు ఊర్వశి నడుముకున్న మూరెడు, ఛాతీని చుట్టుకున్న బారెడు గుడ్డల మీదున్నాయి. జోరుగా, హుషారుగా వినిపిస్తున్న నేపధ్య గీతాని కనుగుణంగా కష్టమర్ల కాళ్లూ, నడుములు కదుల్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;గుట్టుగా, అందరూ ఆశించినట్టుగా అటు ఫోకస్‌ లైటు ఆరిపోగానే ఇటు జీరో బల్బు వెలగడం ఒకేసారి జరిగాయి. జీరో వెలుతురు కిరణాలు హీరోయిన్‌ ఊర్వశి నాట్యాన్ననుసరిస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఊర్వశి కొత్త డాన్సర్‌. కొత్త డాన్సర్‌ ప్రోగ్రామంటే పాత కస్టమర్లు చేపలమడుగులో కొంగల్లా వాలిపోతారనేది హోటల్‌ యాజమాన్యానికి అనుభవైక వేద్యం.&lt;br /&gt;&lt;br /&gt;ఇంతదాకా వచ్చాక ఇంకా ఈ వయ్యారి ఒంటిమీదనే ఉంటే చీలిక పీలికలై పోతామనే భయంతో మూరెడు బారెడులు విడిపోబోతున్నాయి. నవనాగరికుల ఈలలు, వయసు మళ్లిన పురుష పుంగవుల కేరింతలు... మరో మొహంజదారో నాగరకత నాశ్రయించబోతున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఫోకస్‌ లైట్లు కళ్లు తెరిచేలోగా పోలీసు బృందం మెరుపుదాడి. అంతే... అసిస్టెంటు కమిషనరాఫ్‌ పోలీస్‌, నవయువకుడు నందగోపాల్‌ నేతృత్వంలో రైడింగ్‌. ఎక్కడి వారక్కడనే... గప్‌చుప్‌. చట్టాలను చుట్టజుట్టి చంకలో పెట్టుకునే వాళ్లందరికతడు సింహస్వప్నమని డిపార్ట్‌మెంటుకు తెలుసు. గుమ్మడికాయ ఎంత గట్టిదైనా కత్తిపీటకు లోకువే గదా! పోలీసాఫీసర్‌ సింహంలాంటి వాడైనా ముడుపుల మూటకి పట్టువిడుపులుంటాయనేది హోటల్‌ యాజమాన్యం గతానుభవం.&lt;br /&gt;&lt;br /&gt;రైడింగ్‌లో రెడ్‌హాండెడ్‌గా పట్టుబడిన పిట్టలన్నీ బెయిల్‌ రెక్కలు విప్పుకుని రాత్రికి రాత్రే ఎగిరిపోయినై. లాకప్‌ సెల్లో చివరకు మిగిలింది ఊర్వశి మాత్రమే.&lt;br /&gt;&lt;br /&gt;బిక్కుబిక్కుమంటూ ఓ మూలన ఒదిగి కూచుంది. వయసు పొంగుల హంగులే కాని శిల్పసౌందర్యం చెప్పుకోదగింది కాదు. ఆమె ఒంపు సొంపుల్ని ఒడుపుగా జుర్రుకోవాలనుకున్న పరువుగల పురుష ప్రముఖులకెవ్వరికీ ఆమె గుర్తుకు రాలేదు. హోటల్‌ యాజమాన్యం పోతేపోయిందిలే అనుకుంది... చేతులు దులుపుకుంది.&lt;br /&gt;&lt;br /&gt;పొద్దున్నే వాకింగ్‌ నుంచి తిరిగొస్తున్న ఎ.సి.పి. నందగోపాల్‌ స్టేషన్‌లో ప్రవేశించాడు. సెల్‌ ముందున్న లేడీ కానిస్టేబుల్‌ సెల్యూట్‌ చేసింది. మగ కానిస్టేబుల్‌ మందహాసం కుర్చీ చూపించింది. మరో కానిస్టేబుల్‌ చేతులు కట్టుకుని రామభక్త హన్మాన్‌లా ఎ.సి.పి. ముందు నుంచున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''ఆ ఊర్వశి గురించి ఎవరూ రాలేదా?'' కుర్చీలో కూచుంటూ అడిగాడు. చూపులు గోడకు వేళ్లాడుతున్న గాంధీ బొమ్మమీదున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;''లేద్సార్‌. ఆమెకెవ్వరూ లేరట''&lt;br /&gt;&lt;br /&gt;అదెలా! నాట్యమయూరికి నా అనేవారే లేరా! ఆశ్చర్యం.&lt;br /&gt;&lt;br /&gt;''ఆమెతో మాట్లాడాలి''&lt;br /&gt;&lt;br /&gt;''పిల్చుకురావాలా సార్‌?''&lt;br /&gt;&lt;br /&gt;''వద్దు. వెళ్లి చెప్పు. నేనే వస్తానటు''&lt;br /&gt;&lt;br /&gt;కానిస్టేబుల్‌ లారీ౮ లాకప్‌ చువ్వల్ని రీ౮విగా తడిమింది.. కటిక నేలమీద పడుకున్న ఊర్వశి గబుక్కున లేచి కూచుంది. రాత్రంతా నిద్రలేమి కళ్లల్లో మంటలు రేపుతోంది. పోలీసు వ్యాను ఎక్కే ముందు నడుముకు చుట్టుకున్న చీరకొంగును భుజాలమీదుగా కప్పుకుంది. కళ్ల్లు పైకెత్తి కానిస్టేబుల్‌ వైపు చూసింది.&lt;br /&gt;&lt;br /&gt;''మా ఎ.సి.పి.గారొచ్చిండ్రు. నీతో మాట్లాడ్తారట. ఆయన మంచోల్లకు మంచోడు. చెడ్డోళ్లకు చండశాసనుడు. నీ సంగతంతా సారుకు చెప్పుకో''&lt;br /&gt;&lt;br /&gt;లేచి నుంచుని చీర సర్దుకుంది ఊర్వశి. ముందుకొచ్చి తలవంచుకుంది. లోలోపల భయం, బెరుకు... అయోమయం.&lt;br /&gt;&lt;br /&gt;''మీదేవూరు? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?'' ముందుకొచ్చి అడిగాడు నందగోపాల్‌. ఆవిడనాపాదమస్తకం పరిశీలిస్తున్నాయతని చూపులు...&lt;br /&gt;&lt;br /&gt;మేకప్‌ మిలమిలలు మాసిపోయిన మొహం వాడిపోయిన గులాబి పూవులాగుంది. చామనఛాయ, బాబ్డ్‌ హెయిర్‌... జాకెట్‌లేదు. సన్నని చీరలోంచి మెరుపుల కట్‌ బ్రా కనబడ్తోంది.&lt;br /&gt;&lt;br /&gt;''మీకు దండం బెడ్తా సార్‌. నన్ను వదిలిపెట్టకండి సార్‌. తొందరగా జైలుకు పంపించండి సార్‌''. చేతులు జోడించింది.&lt;br /&gt;&lt;br /&gt;పట్టుబడ్డ వాళ్లంతా పలుకుబడి నుపయోగించో, డబ్బులు చల్లో, కాళ్లావేళ్లా పడో... లాకప్‌ నుంచి బయటపడుతూంటే... ఈవిడేమిటీ! ఇదో నాటకం కాదుగదా!&lt;br /&gt;&lt;br /&gt;''ముందు నేనడిగిందానికి జవాబివ్వాలి''.&lt;br /&gt;&lt;br /&gt;''సరే సార్‌!'' పైకెగిరిన బంతిలా తలపైకి లేపింది. రెండు కన్నీటి చుక్కలు గాల్లోకెగిరి సెల్‌ చువ్వల మీద వాలినై. గండుతుమ్మెదల్లాంటి కళ్లు మేఘావృతాకాశంలాగున్నాయి. కొనకొంగుతో కళ్లద్దుకొంది.&lt;br /&gt;&lt;br /&gt;''కరీంనగర్‌ జిల్లాలో మాదో ఊరు సార్‌. ఏపనీ చెయ్యకుండా తాగుడుకలవాటుపడ్డ మా నాన్న నేను చిన్నగున్నప్పుడే చచ్చిపోయిండు. అమ్మ బీడీలు చేస్తుండేది. నేను గూడా అటు బడికి పోతూ ఇటు అమ్మకు ఆకు కత్తిరిస్తూ, బీడీలు కట్టలు కడుతూ సాయపడేదాన్ని. టెన్త్‌ దాకా మా ఊర్లోనే చదివిన. యస్సస్సీలో ఫస్ట్‌క్లాసు వచ్చింది. మా అమ్మ సంతోషంతో పొంగిపోయింది. నేను డిగ్రీ చదివి ఏదన్నా మంచి ఉద్యోగం చెయ్యాలని కోరుకున్నది. మా ఊరి పురోహితుడి కొడుకు ప్రభాకరశర్మ సాయంతో జగిత్యాల బి.సి. హాస్టల్లో సీటు దొరికింది. గవర్నమెంటు జూనియర్‌ కాలేజిల ఇంటర్‌ చదువుతున్న.&lt;br /&gt;&lt;br /&gt;అప్పటివరకే ప్రభాకరశర్మ డిగ్రీ పూర్తిజేసి రాజకీయాలల్ల తిరుగుతున్నాడు. నాతోని మంచిగా మాట్లాడెటోడు. వారానికి రెండుసార్లు హాస్టల్‌కొచ్చి పలుకరించేవాడు.&lt;br /&gt;&lt;br /&gt;ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు రాయకముందే మా అమ్మకు తగని రోగమొచ్చి చచ్చిపోయింది. లోకమంతా చీకటికాకి లెక్క కనబడింది. నన్ను ఒంటరిదాన్ని చేసి అమ్మ హాయిగా వెళ్లిపోయిందని గోడుగోడుమని ఏడ్చిన. ప్రభాకరశర్మ అండగా నిల్చున్నడు. అమ్మ తరఫున బంధువులెవ్వరూ లేరు. అమోమయంల పడిపోయిన.&lt;br /&gt;&lt;br /&gt;''ఇప్పుడేం చెయ్యాలె? ఎట్ల బతకాలె?''నని ప్రభాకరశర్మ నడిగిన. అసలు కష్టమంటే ఏమిటో అప్పుడే అర్థమైంది.&lt;br /&gt;&lt;br /&gt;''నువు ధైర్యంగా ఉండు. నీకో ఉద్యోగం చూసిపెడ్తా''. అంటూనే అతని చెయ్యి నా వీపు నిమిరింది. నా ఒళ్లు రఝల్లుమంది. వింతచేష్టకు విస్తుబోయిన. అతని సాయం లేకపోతే నా బతుక్కోదారి దొరకదు. ఏమిచెయ్యాల్నో నిర్ణయించుకునే లోగా ఆ చెయ్యి నా భుజం దాకా వచ్చింది. రోషాన్నంతా దిగమింగి దూరంగా జరిగిన.&lt;br /&gt;&lt;br /&gt;''నాకుద్యోగమెట్లా దొరుకుద్ది? ఖర్చులగ్గూడా పైసల్లేవు''.&lt;br /&gt;&lt;br /&gt;''మీ అమ్మది బంగారు గొలుసుందిగదా. అది అమ్మేసి సిటీకి పోదాం. అక్కడ నీకుద్యోగమిప్పిస్తా. మహారాణిలెక్క బతకొచ్చు''.&lt;br /&gt;&lt;br /&gt;''అబ్బో! సిటీలనా?'' నా గుండె దడదడమంది'' సిటీని నేను చూల్లేదు. నాకు భయం. వణికిపోయిన''&lt;br /&gt;&lt;br /&gt;''భయం గియం ఏమీ వద్దు''. నా చెంప నిమురుతూ ''అన్నింటికీనేనున్నాగదా! సిటీల నీకన్నీ చూపిస్తా. అక్కడున్న నా ఫ్రెండ్స్‌తో చెప్తా. ఒక్క సంవత్సరంలోగా నువు సిటీ మనిషివైపోతవు. సిటీ గురించి చిత్రవిచిత్రంగా చెప్తవు'' అంటూ భుజాలందుకున్నాడు. మెల్లగా విడిపించుకుని దూరం జరిగిన. అతని మాటల్తోని ధైర్యమొచ్చింది.&lt;br /&gt;&lt;br /&gt;''మరిగిట్ల నా మీద చెయ్యేస్తే ఎట్లా?'' అని అడుగుతూంటే ఏదో సిగ్గు తొంగిచూసింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఆఁ! దాందేముంది ఊర్వశీ! చెయ్యేస్తే అరిగిపోతవా, కరిగిపోతవా? కావాలంటే నువు గూడా నామీద చెయ్యెయ్‌''. అని నవ్విండు.&lt;br /&gt;&lt;br /&gt;నా అనే వారెవ్వరూ లేని నాకాక్షణాన అతడో ఆపద్భాంధవుడిలా కన్పించిండు. చేతులెత్తి మొక్కాలన్పించింది. కళ్లల్ల వత్తులేసుకుని అమ్మ రాత్రింబగళ్లు బీడీలు చేసి నెలక్కొంత కూడబెట్టి చేయించుకున్న బంగారు గొలుసు అమ్మేసి అతని వెంట సిటీకొచ్చిన.&lt;br /&gt;&lt;br /&gt;సిటీకొచ్చేసరికి రాత్రయింది. ఆటోల అతని పక్కన కూచున్న. కొత్త లోకంలో కొస్తున్నట్టనిపించింది. ఏదో లాడ్జింగుల దిగినం. కడుపునిండా భోంచేసినం. అదే రాత్రి ఏవేవో మాయమాటలు చెప్పిండు. తన పక్కన పడుకొమ్మన్నడు. నీడలేని ఆడదాన్ని. అతన్నెదిరించి బయటికొస్తే ఎరగని గల్లీల మొరగని కుక్క లెక్కయిపోతది. నా బతుకు కుక్కలుచింపిన విస్తరైతది.&lt;br /&gt;&lt;br /&gt;''గిట్త్లెతే ఎట్లా? నీ పక్కల పడుకున్నంక నన్నెవరు పెండ్లిజేసుకుంటరు?''&lt;br /&gt;&lt;br /&gt;అప్పటికే వెన్నుపూసల సన్నని వణుకు ప్రారంభమైంది. ఆకలిపులి ముందు మేకపిల్లలాగైపోయిన.&lt;br /&gt;&lt;br /&gt;''పిచ్చిదానా!'' మేధావి లెక్కనవ్విండు. ''ఎవరో ఎందుకు? నేను చేసుకుంట. నేను బాగలేనా?'' కమ్మగా అడిగిండు. నాకంతకంటే మంచి మొగుడు దొరుకుతడా?&lt;br /&gt;&lt;br /&gt;''మరి... మీవోళ్లు ఒప్పుకుంటరా?'' మంచమ్మీద అతని పక్కన కూచుని అడిగిన.&lt;br /&gt;&lt;br /&gt;''మా వోళ్లను నేను ఒప్పిస్తా. నేనుగూడా ఇక్కడికే వచ్చి ఏదన్నా వ్యాపారం చేస్తా.'' నామీద చెయ్యేసి నవ్విండు. అతడే నా పాలిట దేవుడనుకుని లొంగిపోయిన. తెల్లారి నన్నా లాడ్జింగ్‌ రూములనే ఉంచి అతడెక్కడో తిరిగి సాయంత్రమొచ్చిండు. రాంగనే&lt;br /&gt;&lt;br /&gt;''నువ్వదృష్టవంతురాలివి ఊర్వశీ! నీకో మాంచి౫ ఉద్యోగం దొరకబోతుంది'' అన్నడు. ఇద్దరం కలిసి భోజనం చేసినం. ఉన్నంతలో బాగా తయారైన. అప్పుడే ఇంటర్వ్యూకెల్దామన్నడు.&lt;br /&gt;&lt;br /&gt;ఆటోల బయలుదేరి మూడంతస్తుల మేడ ముందు దిగినం. ఆ మేడపైన గదిలో ఓ నడివయసాయనను చూపించి&lt;br /&gt;&lt;br /&gt;''ఇతడే మీ కంపెనీ యజమాని. ఇతని దగ్గరే నీ ఉద్యోగం'' అని పరిచయం చేసిండు. లోలోపల సంతోషంగా ఉన్నా ఏదో అయోమయంగా ఉంది. ''నేనిప్పుడే వస్తా. మీరు మాట్లాడ్తుండండి'' అంటూ బయటికెళ్లిపోయిండు.&lt;br /&gt;&lt;br /&gt;అక్కడున్న పెద్దమనిషి పేరుగూడా నాకు తెల్వదు. కాని... నన్ను పేరుబెట్టి పిల్చిండు. నా ఊరూ, వివరాలు అన్నీ అడిగిండు. ఇంకేవేవో అడిగిండు. అన్నింటికి జవాబు చెప్పిన. గబుక్కున నా చెయ్యిబట్టి లాగిండు. అతని ఒడిల వాలిపోయిన. బలవంతంగా కౌగలించుకున్నాడు. కేక వెయ్యబోయిన నా నోరు మూసిండు.&lt;br /&gt;&lt;br /&gt;''నిన్ను పదివేల రూపాయలకు కొనుక్కున్న'' అనుకుంటూ నన్నాక్రమించుకున్నాడు. సింహం చేతిల చిట్టెలుకనైపోయిన.&lt;br /&gt;&lt;br /&gt;నన్నక్కడే ఉంచి బయటికెళ్లేప్పుడు గదికి తాళం వేసుకపోయేవాడు. నన్నాదుకునే వారెవ్వరూ లేరు. గదిల ఫోన్‌గూడా లేదు. ''నాకు కంపెనీలు లేవు. మీ ఊరి ప్రభాకరశర్మ బద్మాష్‌గాడు. కాని నేను నీకు ఉద్యోగమిప్పిస్తా''నని గూడా చెప్పిండు. వారం రోజులు ఏడ్చుకుంటూ గడిపిన. ఆ తర్వాత నాకా హోటల్ల ఉద్యోగమిప్పిస్తనని తీసుకపోయిండు. హోటల్‌ వాళ్ల దగ్గర ఎంత వసూలు చేసిండో ఏమోకాని నాకక్కడ రకరకాల డాన్సులు నేర్పించిండ్రు. అందరి ముందు డాన్స్‌లు చేయించిండ్రు. గట్లనే గడుస్తుంది. కాని... రాత్రికి... గిట్ల జరిగిపోయింది... ''వెక్కి వెక్కి ఏడుస్తోంది. గుండెలు ఎగిసిపడుతున్నై. ఏసీ.పీ. వైపు ఆశగా చూసింది.&lt;br /&gt;&lt;br /&gt;ఏ.సీ.పి. నందగోపాల్‌కంతా అర్థమైంది. వాలకం గంభీరమైంది. అంతరాళాల్లో సునామీ అలలు ఎగిసిపడినై.&lt;br /&gt;&lt;br /&gt;''ఈమె నీ రోజే కోర్టుకు తీసుకెళ్లండి'' కానిస్టేబుళ్లనాదేశించి హుందాగా వెళ్లిపోయాడు.&lt;br /&gt;* * *&lt;br /&gt;రంగులతోపాటు అన్ని హంగులు అమర్చుకున్న గవర్నమెంటాఫీసు... అసిస్టెంట్‌ కమీష్నరాఫ్‌ పోలీసాఫీసు. ఆఫీసులో యస్సైలు, సీఐలు... పిల్లుల బారినుండి తప్పుకుంటున్న ఎలుకల్లా... తిరుగుతున్నారు. ఎవరి పని గురించి వారు... ఎవరెవరితోనో సంప్రదిస్తున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. ఆర్డినరీ ఫైళ్లు అల్మెరాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. అర్జంట్‌ ఫైళ్ల పరుగులకు గుసగుసల బ్రేకులు పడిపోయినై. సంచలన వార్త... వినీ విననట్టు, విషయం తెలిసీ తెలియనట్టు, అందరి మొహాలు గాంభీర్యాన్ని పులుముకున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;పుట్టిన్నాటి పుర్రెగుణం మేనమామకు తెలుసన్నట్టు ఏ.సీ.పి గారి వ్యక్తిగత విషయాలన్నీ క్యాంప్‌ క్లర్కుకు ఖచ్చితంగా తెలుస్తాయని అందరికీ తెలుసు. ఏదో గుర్తుకొచ్చినట్టుఎర్ర టోపీ తీసి బుర్ర గోక్కుంటూ అన్నాడొక యస్సై&lt;br /&gt;&lt;br /&gt;''పాలిచ్చే ఆవును పక్కనుంచుకుని దున్నపోతులనడిగితే పాలిస్తాయా? క్యాంప్‌ క్లర్క్‌నే అడిగితే సరి''.&lt;br /&gt;&lt;br /&gt;సీనియరసిస్టెంట్‌ అమోదముద్ర పడింది.&lt;br /&gt;&lt;br /&gt;బూట్ల టకటకలు, గుసగుసలు, మిసమిసలన్నీ క్యాంపు క్లర్కు చుట్టూ మూగాయి.&lt;br /&gt;&lt;br /&gt;''ఇది నిజమేనా భాయ్‌?'' సీనియరసిస్టెంట్‌ ప్రసావన.&lt;br /&gt;&lt;br /&gt;తింటే గారెలె తినాలి, వింటే ఏ.సీ.పి నందగోపాల్‌ వృత్తాంతమే వినాలి, అదీ తన ద్వారానే వినాలన్నంత ఉత్సుకతను పొత్తికడుపులో ఒత్తిపెట్టుకున్న క్యాంపు క్లర్కులో ఉత్సాహం ఉరకలేసింది. అతని చేతులున్న యమర్జెంటు ఫైలు రెక్కలు తెగిన పక్షిలా టేబుల్‌ మీద వాలిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;నేను చెప్పదలచుకున్నదీ, వీళ్లు అడగదలుచుకున్నదీ ఒకటేనా కాదా?... అనుమానం గోకింది.&lt;br /&gt;&lt;br /&gt;''ఏదీ... ఏం సంగతీ?'' ఏ.సీ.పీలా ఫోజిచ్చి కుర్చీకి జేరగిలబడ్డాడు. ఆఫీసనే నైమిషారణ్యములో తానో సూత మహర్షిలా వాళ్లంతా శౌనకాది మునుల్లా... ఫీలింగ్‌.&lt;br /&gt;&lt;br /&gt;''అదే భాయ్‌. మన ఏ.సీ.పీగారు ఆ బజారు ఆడదాన్ని...'' కిసుక్కుమంటూ అడగబోయిన సీ.ఐ. గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్నట్త్టెంది.&lt;br /&gt;&lt;br /&gt;''బజారు ఆడదా? ఆమె ఎవరూ?''&lt;br /&gt;&lt;br /&gt;'వీడో నంగనాచి, తుంగబుర్ర' లోపల గొణుక్కున్నాడు సీ.ఐ. సీనియరసిస్టెంటు అడుగు ధైర్యంగా ముందుకు పడింది. తల ముందుకు వంగింది.&lt;br /&gt;&lt;br /&gt;''అదేనయ్యా బాబూ!'' ధైర్యాన్ని కూడగట్టుకోవడం కష్టమైంది. ''అదే... ఆ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో హాఫ్‌ నేకెడ్‌గా పట్టుబడిన డాన్సర్‌ ఊర్వశిని మన ఏ.సీ.పీ. గారీ రోజు రిజిస్టర్‌ మ్యారేజి చేసుకుంటున్నారటా!''&lt;br /&gt;&lt;br /&gt;''హమ్మయ్య, అదేనా!'' క్యాంపు క్లర్కు కావాలనే నిట్టూర్చాడు. ''నిజమే... ఆ రోజు కోర్టులో ఆవిడ తరఫున మన సారు వారే జరిమానా చెల్లించారు. ఆవిడకు హెచ్‌.ఐ.వీ. పరీక్షలు చేయించారు. ఊర్వశి అమ్మవారికే రోగమూ అంటలేదని తేలిందట. మన ఏ.సీ.పీ. సారు మాట మనిషి కాదు. చేతల మనీషి. అమ్మో, టైమైపోతుంది. ఓ గంటలో నేను రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఉండాలి. సాక్షి సంతకం చెయ్యాలి'' లేవబోయి కూచున్నాడు. ''అన్నట్టూ... మనకీరోజు స్వీటు పార్టీ లభించబోతుందండోయ్‌'' కుండబద్దలు కొట్టేసి కొమ్మ మీది కోతిపిల్లలా కుర్చీలోంచి ఎగిరి గంతేశాడు. ఎందుకైనా మంచిదని ఊపిరి పీల్చుకుంటూ అందరి వైపు దృష్టి సారించాడు. జూనియరసిస్టెంట్‌ మీద దృష్టి నిలబడింది.&lt;br /&gt;&lt;br /&gt;విషయాన్నంతా గ్రహించి వింతగా దిక్కులు చూస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌తో ''అంతా కలియుగ మాయ...'' అంటున్న జూనియరసిస్టెంట్‌ శాస్త్రికేదో గుర్తుకొచ్చి నాలిక్కరుచుకున్నాడు. మింగలేక కక్కలేక, వ్యాఖ్యానం చేసేందుకు మాటలు రాక యస్సైలు, సీఐలు మొహాలు చూసుకున్నారు. వాతావరణం గంభీరంగా మారింది. ఆఫీసు స్టాఫు తమ సీట్లనాక్రమించుకుంటున్నారు. అందరి వాలకాన్నోసారి అలవోకగా గమనించి తనలో తాను నవ్వుకుంటూ ''అన్నట్టూ రిజిస్టర్‌ మారేజికి మన డి.ఐ.జీ. గారు గూడా హాజరవుతున్నారు సుమా!'' మురిపాల మూట విప్పాడు క్యాంపు క్లర్కు.&lt;br /&gt;&lt;br /&gt;నేనేమీ ఎక్కువగా వాగలేదు గదా... తనను తాను నెమరేసుకుంటూ శాస్త్రి ఏదో ఫైలందుకున్నాడు.&lt;br /&gt;* * *&lt;br /&gt;''ఏయ్‌! విజయ పోరీ! చెడిపోయిన పోరికి వావి వరుసలేందే? మా నాయిన బతికుండంగ ఆయన పక్కల పన్నవు. ఇప్పుడీ దేవుడీకి నేనే దొరను. ఇప్పుడు నా పక్కల పడుకోవాలె. రా... రావే!'' లోకాన్ని చీకటి కాకులు అలుముకుంటున్న సందెవేళ దొరబాబు దారుణం.&lt;br /&gt;&lt;br /&gt;''ఓ ముండా! నీకు విజయ అని పేరెందుకు పెట్టిండ్రటా, లంజ అని పెడ్తే బాగుండేది'' మర్నాడు దొరబాబు పడుచు పెళ్లాం దొర్సాని పళ్లు కొరుకుడు.&lt;br /&gt;&lt;br /&gt;''మీ అమ్మ ఈ దేవుడీల దాసీగా ఉండేది. నీ తమ్ముణ్ని బాగా చదివిస్తున్నవు. వాణ్నో పెద్ద్దాఫీసర్‌ చేసి నువ్వో దొర్సానివైపోతవా ఏంది?'' దొరబాబు వ్యంగ్య వచనాలు, కుతకుతలు.&lt;br /&gt;&lt;br /&gt;''అరేయ్‌ గోపీ! నువు పట్నం హాస్టల్లుండి గవర్నమెంటు తిండి తింటున్నావు. పుణ్యానికొచ్చిన బట్టలు తొడుక్కుంటున్నవు... అంతా బాగానే ఉందిగానీ... సదివి సదివి నువ్వేమన్నా రాజకీయం దందా చేసేదుందా? మన పొలంల పంజేసుకోరా'' దొర్సాని ఉచిత సలహాలు, వేధింపులు.&lt;br /&gt;&lt;br /&gt;''పాపం, పోనీ దొర్సానీ! వీడు బాగా సదువుకుని ఎటు వోతడు? మన దేవుడీలనే ఉంటడు. మన ఆస్తిపాస్తుల లెక్కలు రాస్తడు. పట్నంలున్న మన మిల్లుల సంగతులు చూస్తడు. టాక్స్‌ల విషయాలు మాట్లాడ్తడు. గొర్రె బలిస్తే గొల్లోనికే నయమన్నట్టు వీడెంత సదివితే అంత మనకే లాభం గదా దొర్సానీ!''&lt;br /&gt;&lt;br /&gt;వయసులోని శక్తియుక్తులన్నీ దేవుడీకి దారబోసిన ముసలి గుమాస్తా నారాయణ సముదాయింపు.&lt;br /&gt;&lt;br /&gt;''ఒరేయ్‌ నందగోపాలా! ఖర్చుల విషయంల నువ్వేమీ వెనకా ముందాడకు. నేనున్నాను గదరా. నువు ఐ.పి.యస్‌.కు అప్పీయరవు'' ఆత్మీయ మిత్రుని అండదండలు.&lt;br /&gt;&lt;br /&gt;''తమ్మీ గోపాల్‌! నీకు మంచి నౌకరి దొరుకుద్దట గదరా! నాకు ఖుషీగా ఉంది గానీ, నువు మళ్లా ఈ దేవుడీలకు రావద్దురా''. దేవుడీలో దొర స్నేహితుల చేతుల్లో నలిగిన అక్క విజయ అంతిమ ఘడియల్లో ఆరాటం. ''నువు నాలాంటోళ్లకు సాయం చెయ్‌రా. కనీసం ఒక్క ఆడిదాన్నైనా ఆదుకోరా'' చేతిలో చెయ్యి వేయించుకుంది... గతం కళ్లముందు కదుల్తోంది. రిజిస్ట్రార్‌ ఆఫీసులో పని పూర్తయాక ఊర్వశితోపాటు టాక్సీలో ఇంటికొస్తున్న నందగోపాల్‌ ఎద తృప్తిగా మూల్గింది.&lt;br /&gt;&lt;br /&gt;కీచుమంటూ టాక్సీ ఇంటి ముందాగింది.&lt;br /&gt;&lt;br /&gt;నిజామా! ఇదంతా నిజమేనా? కలకాదుగదా! దేవుడా! ఇదంతా నిజమే కావాలి... అమరిన అదృష్టాన్ని అంచనా వేసుకుంటూ ఊగిసలాడుతున్న ఊర్వశి మనసు.&lt;br /&gt;&lt;br /&gt;''దిగు ఊర్వశీ! మనింటికొచ్చినం'' భుజం తట్టాడు నందగోపాల్‌. ఊర్వశి మనసు ఊగిసలాట మాయమైంది.&lt;br /&gt;&lt;br /&gt;రెండు నిండు జీవితాలను ముడేసిన దండలు మెడలో వెళ్లాడుతున్నాయి. నూతన వధూవరులు కుడికాలుతో గడప దాటి బంగళా లోపలికొచ్చారు. నందగోపాల్‌ వేలు పట్టుకుని అతని అడుగులో అడుగేసుకుంటూ నడుస్తుంది ఊర్వశి. నేరుగా పూజ గదిలోకి తీసుకెళ్లాడు.&lt;br /&gt;&lt;br /&gt;అతని మనసులాగే పూజ గది కూడా విశాలంగా ఉంది... అనుకుంది ఊర్వశి.&lt;br /&gt;&lt;br /&gt;దేవీ దేవతల విగ్రహాల మధ్య ఓ మహిళ ఫొటో. ఆ ఫొటోకు దండా వేసుంది. దండ తాజాగా ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;''ఊర్వశీ! ఈమె నా అక్క. పేరు విజయ. మేము తోడబుట్టాము కాని కూడి పెరగనివ్వని సమాజము మా అక్కను దాసీగా మార్చింది'' ఫొటోకు నమస్కరిస్తూ తన్మయంగా చెబుతున్నాడు నందగోపాల్‌. ''మా ఊరి దొరదేవుడీలో మా అక్క నలిగిపోయింది. తాను మండుటెండలో కష్టాలనుభవిస్తూ నన్ను నీడలా ఉంచి చదివించిన మా అక్కను మించిన దేవతలెవరూ నాకు లేరు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని ఆడించిన ఈ తల్లి ఆశయ సాధనలోనే నువు నా అర్ధాంగివైనావు''&lt;br /&gt;&lt;br /&gt;అవును... నిజంగా విజయ వదిన దేవతనే. ఊర్వశి మానస సరోవరములో మురిపాల రాయంచలు రెక్కలు విప్పుతున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఫొటో ముందు దీపం వెలిగించి నమస్కరించింది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194381115526457?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194381115526457/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194381115526457' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194381115526457'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194381115526457'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194381115526457.html' title='దేవిడీ దేవత'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194370002660680</id><published>2005-07-21T04:00:00.000-07:00</published><updated>2005-07-21T04:01:40.033-07:00</updated><title type='text'>అశ్వమేధం</title><content type='html'>From July 2005 Vipula &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;అశ్వమేధం&lt;br /&gt;జయంత్‌ కాయ్కిణి&lt;br /&gt;కన్నడ కధ&lt;br /&gt;ములంద్‌లోని లాల్‌బహద్దూర్‌ శాస్త్రి రోడ్డుపైనుంచి స్టేషన్‌వైపు నెమ్మదిగా దొర్లిన ఆ పెళ్లి ఊరేగింపు ప్రస్తుతం మెయిన్‌ రోడ్డులో కొనసాగుతోంది. అన్నిటికన్నా ముందు జరతారి జగద్గురువులా నడుస్తున్న బ్యాండుమేళం వారు, వారి వెనకాల నూనుగు మీసాల కుర్రకారు, వారి వెనకాల టి షర్ట్‌లో కడుపులను బిగించుకుని, అభిమానంతో బజారు నడుమ వారి భార్యలను పరికిస్తూ నడుస్తున్న నడివయసు మగవాళ్లు, తరువాత చిత్తుగా తాగి, చిందులేస్తున్న గులాలు రాసుకున్న చిత్రవిచిత్రమైన జనం. అన్నింటికన్నా వెనకాల వస్తున్న ఆడవాళ్ల గుంపు, వీటన్నిటి నడుమ కాస్త నశ్యపు రంగులోవున్న గుర్రంపైన కూర్చున్న పెళ్లికొడుకు. జరీ తలపాగా నుంచి వేలాడుతున్న మల్లెపూదండలు అతని మొహాన్ని కప్పేశాయి. తలపాగా పైనున్న ఈక ఒకటి కిందకు పడిపోతుందేమోననిపించేలా వుంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ ఊరేగింపులో ఎవరికీ పెళ్లికొడుకు దగడూ పరబ్‌ మొహం గుర్తుకు రావటంలేదు. గుర్రానికి కాస్త ముందు కుడివైపు నడుస్తున్నవాడే బాలచంద్ర పరబ్‌ పెళ్లికొడుకు అన్న. పెళ్లికి ఆకర్షణగా గుర్రపు ఊరేగింపును ఏర్పాటు చేసినవాడు. స్వతహాగా ఆడపెళ్లివారిని బలవంతం చేసి తనే గుర్రాన్ని వెదికి ఇంటినుంచి ఆడవాళ్ల పందిరిలో వేసిన మండపం వరకూ ఊరేగింపుకు సంబంధించిన బాధ్యతను చూస్తున్నవాడు. అందువల్లనే అప్పుడప్పుడు వీధిలోని జనాన్ని, గుర్రంపైనున్న తమ్ముడిని గమనిస్తూ నడుస్తున్నాడు. తమ జీవితంలో ప్రప్రధమంగా గుర్రపు ఊరేగింపు జరుగుతుంది తనవల్లనే అని అందరికీ చెప్పేలా వుంది అతడి చూపు.&lt;br /&gt;&lt;br /&gt;వీధిలో కొనసాగుతున్న ఊరేగింపు శివాజీ విగ్రహం సమీపాన చేరుకుంది. ఆ ఊరేగింపు శివాజీ విగ్రహాన్ని దాటి ముందుకు వెళ్లేలోపల అక్కడే పక్కనున్న గ్యారేజీలో ఓ మోటారుసైకిల్‌ ఒక్క కిక్కుకే హోర్రోమని అరవసాగింది. ఉన్నఫళంగా ఆకాశమే ఊడిపడేలా ఉన్న శబ్దానికి ఓ క్షణం వీధిమొత్తం గడగడలాడింది. ఊరేగింపు మధ్యభాగం నుంచి రెప్పపాటులో అశ్వం వరుడి సమేతంగా పరుగెత్తింది.&lt;br /&gt;&lt;br /&gt;ఓ క్షణం అశ్వం ముందు కాళ్లను పైకెత్తి సకలించడం, వరుడూ విచిత్రమైన గొంతుకతో కేకలువేసి ఆ వైపున పడాలో లేక ఈ వైపున పడాలో అన్న సందేహంలో పడిపోవడం... వెంటనే మెరుపులా గుర్రం పెళ్లికొడుకును మోసుకుని మాయమవడం ఇలా ఉత్కంఠభరితమైన క్షణాల తరువాత హాహాకారం మొదలైంది. ఊరేగింపులోని జనం కంటికి కనపడిన వీధుల్లోకి, సందుల్లోకి దూరారు. బాలచంద్రపరబ్‌ ఈ అఘాతం నుంచి తేరుకొని 'పెపెపె' అంటూ తటపటాయిస్తూ మొత్తం ఊరేగింపునుద్దేశించి ఏదో చెప్పి ఎడం వైపున కూరగాయల మార్కెట్‌లోకి దూసుకుపోయాడు. అక్కడ చేతిసంచి, చిల్లర కూరగాయల నడుమ జనం మునిగిపోయారు. గుర్రం అటు నుంచి వెళ్లివుండొచ్చన్న ధ్యాసే వాళ్లకు వున్నట్లనిపించదు. బాలచంద్రపరబ్‌ వెంటనే ఏదో జ్ఞప్తికొచ్చి వెనుదిరిగి పరుగున శివాజి విగ్రహం వద్దకు వచ్చి అక్కడే నిలుచున్న ఆడవాళ్లను, మిగిలిన బ్యాండ్‌ వాయించే వాళ్లను అక్కడే వుండవలసిందిగా చెప్పాడు. వీధి మధ్యనే నిల్చోవడం అసాధ్యం గనుక ఆడవాళ్లు పక్కకు జరిగారు. అయితే వాళ్లు పళ్ల దుకాణం చుట్టూ మూగడంతో దుకాణంవారు కేకలు వేస్తూ గదమాయించి వారిని తరిమివేశారు.&lt;br /&gt;&lt;br /&gt;ఈ సంఘటన జరిగిన వేళ ఆడవాళ్ల నడుమ హేహేహే అంటూ నవ్వింది బాలచంద్రపరబ్‌గారి భార్యే. తమ పెళ్లిలో తండ్రి ఊరేగింపుకు గుర్రం తేలేదన్న నిజాన్ని గుచ్చిగుచ్చి చెప్పడం కోసమే మొగుడు ఇలాంటి గుర్రపు ఊరేగింపులాంటి బృహత్‌ పధకాన్ని కసితో అమలు చేశాడని ఆమెకు తెలుసును. నవ్వి ఊరుకుంది.&lt;br /&gt;&lt;br /&gt;పరబ్‌ మాత్రం పూర్తిగా తికమక పడ్డాడు. ''దగడూ... దగడూ'' అంటూ కలవరిస్తూ కూరగాయల మార్కెట్‌ను వెదికి గోశాల రోడ్డుచేరి, గుర్రాన్ని ఎక్కడంటూ వెతికేది అన్న ఘోరమైన ప్రశ్న తన ఎదుట నిలవడంవల్ల చతికిలపడ్డాడు. ఒకవేళ గుర్రం దొరికినా దగడూ దాని పైన ఇంకా ఉండగలడా లేక దగడూని మాత్రమే వెదకాలా అన్న ప్రశ్నలు వేధించసాగాయి. ఇటు వేర్వేరు వీధుల్లో అన్వేషణకోసం దూసుకు వెళ్లిన వాలంటరీలు దగడూ పడిపోయుండొచ్చునేమోనని రోడ్డు ఇరువైపులా వెదికారు.&lt;br /&gt;&lt;br /&gt;గోశాల రోడ్డులో బడి ముగించుకుని వీధినపడ్డ పిల్లలను ఆపి ఈ దారిలో గుర్రం వెళ్లడాన్ని చూశారా అంటూ అడిగాడు. ఇంకాముందు బస్‌స్టాపులో వేచివున్న కొందరిని అడుగుతున్నప్పుడు పరబ్‌కు చాలా విసుగనిపించసాగింది. సరిగ్గా అప్పుడే గుర్రాన్ని తెచ్చిన రౌతు ఎక్కడున్నాడు అన్న ప్రశ్న ఎదురయ్యింది. కానీ వాడు సైతం గుర్రాన్ని వెదుకుతుండవచ్చునేమో! అందరికన్నా వానికే గుర్రాన్ని గురించి ఎక్కువ బాధ్యత వుండాలిగద! నేను మాత్రం ప్రస్తుతం నా తమ్ముడు దగడూనే వెదకాలి. అన్న కచ్చితమైన నిర్ణయానికి వచ్చి రిక్షా ఎక్కి వీధుల్లో, గల్లీల్లో తిరుగనారంభించాడు. ఇక్కడ ఆపు, అక్కడ ఆపు అని రిక్షాను నిలిపేవాడు. దూరంలోనున్న పెద్దపెద్ద గంపలుకూడా గుర్రంలా కనపడి, వీధి పక్కన ఎక్కడో దగడూని చూస్తున్నట్లుగా అనిపించి విసుగనిపించి రిక్షా ఆపాడు. ప్రస్తుతం అతడు ఉపనగరం నుంచి చాలా దూరంలో ఓ స్టేడియం వద్ద వున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;గుర్రాన్ని తెచ్చిన అబ్బాయి రాఘవ మాత్రం ఈ అలజడిలో ఎవరి కంటికి కనపడకుండా కనుమరుగయ్యాడు. గుర్రం సకిలించి మాయమైన వెంటనే వాడు పరుగెత్తుకొని స్టేషన్‌కు వచ్చి ట్రైన్‌ ఎక్కి వి.టి.కి బయలుదేరాడు. రాఘవ గుప్తంగా ప్రేమించిన, మనసులోనే ప్రణయాసక్తితో విలవిలలాడిన భానుమతి తండ్రిది ఆ గుర్రం. రాఘవ పనిచేస్తున్న రేషన్‌ దుకాణంలో ఎదుట వున్న ఇంట్లో ఆ పిల్ల కంటపడింది. ఆమె అందానికి దాసోహమన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;భానుమతి తండ్రి వ్యవహారమంతా గుర్రాలతోనే. చాలాకాలం క్రితం టాంగా వాలాగా వున్నాడట. ప్రస్తుతం నాలుగైదు టాంగాలను నడుపుతున్నాడు. సెలవు రోజుల్లో గుర్రాలను, టాంగాలను జుహూ సముద్ర తీరానికి పిల్లల షికార్లకు అద్దెకు పంపిస్తున్నాడు. ఒట్టి టాంగా, గుర్రపు లద్దీ, గుర్రపు తోక, మేత, ఉలవలు కొట్టులా వున్న ఆ ఇంట్లో హంసలా కనబడి నవ్వి మాయమయ్యే భానుమతి కంట్లో పడ్డాడు. తన కళ్లతోనే ఆటపట్టించసాగింది.&lt;br /&gt;&lt;br /&gt;ఓ రోజు ఏమయిందో మగధీరుడిలా నడుస్తూ భానుమతి తండ్రి ఎదుట నిలచి చేతులొడ్డి ప్రేమార్తిగా అభ్యర్థించాడు. ఆమె నాన్న ఈ అభ్యర్థనకు జవాబుగా ఫెటేల్‌ మంటూ చెంప వాయించాడు. అవమాన భారంతో అతనికి చచ్చినంత పనైంది. అయినా ప్రేమ విజయాల గురించి హిందీ సినిమాలవల్ల కలిగిన అచంచలమైన శ్రద్ధతో అంగట్లో పనిచేస్తూ ఆమె అందమైన భుజాలవైపు చూసే తన పనిని మాత్రం ఆపలేదు. క్రమేపి విచిత్రమైన పట్టుదలతో కూడిన కోపంతో ప్రేమదృక్కులను విసర సాగాడు. టాంగా వాలాతో దోస్తీ కట్టాడు.&lt;br /&gt;&lt;br /&gt;అంగడికి సరకుల కోసం వచ్చిన వారిలో ప్రాయపు పిల్లలుంటే ఆలస్యంగా సరకులు ఇస్తూ వారితో ఎకసక్కెమాడ్తూ భానుమతిని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. నటన కాస్త ముదరడంతో ఓ రోజు భానుమతి రాఘవవైపు చూడడం కూడా మానుకుంది. దీనివల్ల బాధతోనూ కోపంతోనూ దుకాణంలో కూర్చోక టాంగావాలాతో ఎదుటున్న టాంగా స్టాండులో కబుర్లు చెబుతూ కాలం వెళ్లబుచ్చసాగాడు. ఇలా పాడు కబుర్ల నడుమ బాలచంద్రపరబ్‌ పెళ్లి ఊరేగింపునకు గుర్రం కావాలని అడిగాడు. రాఘవకి విచిత్రమైన సాహసం పొంగుకొచ్చింది. ''ఎంతో మీకు తెలిసినంత అడ్వాన్స్‌ ఇవ్వండి. రేపు తెల్లవార జామునే గుర్రాన్ని తెస్తా. దానికి అలంకరించడం మాత్రం సాధ్యం కాకపోవచ్చును'' అని మాటిచ్చాడు.&lt;br /&gt;&lt;br /&gt;మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి భానుమతి తండ్రి గుర్రపు పాకలోని టాంగా గుర్రాన్ని విప్పి దాన్ని నడిపించుకుంటూ ములంద్‌లోని పరబ్‌ ఇంటి ఎదుట హాజరయ్యాడు. పరబ్‌ ఇరుగు పొరుగున్నవాళ్లు స్వయంగా గుర్రాన్ని సింగారించడానికొస్తే అది కోపంతో కస్సు బుస్సుమనడం చూసి వెనకంజవేశారు. చివరికి అలంకరించడం సాధ్యంకాక అలంకరించిన పెళ్లికొడుకునే ఓ స్టూలుపై నుంచి ఎక్కించారు. సినిమా పోస్టర్ల నుంచి సూటిగా ఎగిరి ఇంటి ముందుకొచ్చి నిలబడిన దానిలా వున్న గుర్రాన్ని చూసి భయపడిన దగడూపరబ్‌ తను పెళ్లికొడుకునన్న సంగతినే మరచి దిగులుపడ్డాడు. గుర్రం కాస్త తల విదిలించితే చాలు తన కధ ముగిసినట్లేననిపించింది. ఊరేగింపు ఆరంభం కావడంతోనే చెమటోడ్చిన దగడూ ఈ అన్నకు తమ్ముడిగా ఎందుకు పుట్టవలసి వచ్చిందోననిపించింది. బ్యాండు వాయించడంతో ఊరేగింపు మొదలవ్వగానే గుర్రం సన్నగా గంతులు వేయడంతో దగడూ పిర్రకు బలంగా దెబ్బ తగిలింది. నొప్పిని జీర్ణించుకోడానికి కొద్దిగా పిరుదును జరపడంతో మరోసారి అక్కడే దెబ్బ తగిలి నర జన్మం గురించే దగడూ పరితపించసాగాడు. వీటన్నింటినీ చూసీ చూడకుండా నిర్వికారంగా నడుస్తున్నాడు గుర్రంవాడు.&lt;br /&gt;&lt;br /&gt;సాధ్యమైనంత త్వరగా ఆ గుర్రం సామీప్యం నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనలో వాడున్నాడు. అయినా పెళ్ళి సంబరం కావడంవల్ల వయస్సుకు మించిన దుస్తులు తొడుక్కొని తరుచుగా అత్తరు పూయడానికొస్తున్న అందమైన ఆడ పిల్లలు వుండనే వుంటారు కదా. ఆ ఆకర్షణకు లోనైన గుర్రంవాడు ఇంకా ఊరేగింపుకు అతుక్కునే ఉన్నాడు. బాలచంద్ర పరబ్‌ అంటూ నడుస్తున్నప్పుడే గోల్డ్‌స్పాట్‌ తెప్పిచ్చి కొట్టిచ్చాడు. శివాజీ విగ్రహం వద్ద రాఘవ గోల్డ్‌స్పాట్‌ ముగుస్తుండడం, గుర్రం పలాయనం చెందడం ఒకేసారి జరిగిపోయింది. అటూ ఇటూ చూడకుండా స్టేషన్‌ వైపుకు పరుగుతీసి వి.టి.కి. వెళ్ళి సినిమా చూడాలని రైల్లో కూర్చున్నాడు. భానుమతి, ఆమె తండ్రి, వాళ్ళ వంశం అంతా పాడవ్వాలని శపించడం మాత్రం మరిచిపోలేదు.&lt;br /&gt;&lt;br /&gt;ఇటు కలబాలో ఎనిమిది గంటలకు లేచిన భానుమతి తండ్రి సమాచారం తెలిసిన వెంటనే కోపంతో రెచ్చిపోయి గంతులేశాడు. తన టాంగాలను, కలబా ఠాణా ఏరియానంతా గుర్రాన్ని గాలించడానికే తిరుగనిచ్చాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. గుర్రం గురించి వివరాలు చెబుతుండగా ఏ రంగో తెలియక గుర్రం రంగు అన్నాడు. భానుమతి స్నానానికి నిలిచింది. నీళ్ళు పోసుకుంటూ, ఒళ్ళు రుద్దుకుంటూ లల్లల్లా అని పాడింది. ఉదయం నుంచే ఏదో హుషారు మొదలైంది ఆమెకి.&lt;br /&gt;&lt;br /&gt;ఇటు క్రీడా మైదానం పక్కన ఎండలో నిత్రాణుడై నడుస్తున్న బాలచంద్రపరబ్‌ను ఎవరో&lt;br /&gt;&lt;br /&gt;''అరే, మీరిక్కడా ఈ రోజు మీ తమ్ముడి పెళ్ళి కదండీ...'' అని పలకరించారు.&lt;br /&gt;&lt;br /&gt;ఓ క్షణం వాడికి పెళ్ళి మండపం, ఊరు, తన ఇల్లు ఎంతో దూరం వున్నట్లనిపించింది. గుర్రం, దగడూ వుంటే ఈ పాటికి మూహుర్తం ముగిసుండేది. గుర్రం, దగడూ ఇప్పటికే మండపం చేరి, అందరూ తన నిరీక్షణలో వుండవచ్చునేమోనన్న కంగారు సైతం కలిగింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామా అంటే, మండపం లైసన్స్‌, మైకుల వాడకం, పోలీసుల హప్తా వగైరా వలలో పడడం తలచుకొని దిగులుపడ్డాడు. కాళ్లీడ్చుకుంటూ మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మండపం చేరుకున్నాడు. మండపంలో వేచి వేచి ఆడవాళ్లు కూర్చున్న చోటే కునుకు తీస్తున్నారు. బ్యాండు వాద్యం వారు, మైకు వాళ్ళు వంట గదిలోకి వెళ్ళి పళ్లికిలిస్తూ బయటకు వస్తున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;పరబ్‌ సుమారు మూడుగంటలకు లేచి నిలబడి మిగిలిన వాళ్ళనుద్దేశించి ''అంతా దైవేచ్చ, జరిగేదంతా జరిగి తీరుతుంది'' అని విందునారంభించడానికి ఆజ్ఞాపించాడు.&lt;br /&gt;&lt;br /&gt;ఆకలిగొన్న అందరికీ భోజనం బ్రహ్మాండంగా వుందనిపించింది. భోజనం నడుమ తొందరపరచడానికి గుర్రం రాకుండా వుంటే చాలనుకున్నారు కొందరు. పరబ్‌ మాత్రం భార్య బలవంతం చేయడంతో అన్యమనస్కుడిగా జిలేబీలు తిన్నాడు. పాటలు వాయించిన బ్యాండు వాళ్ళకు పూరా డబ్బులు చెల్లించవలసి వచ్చినప్పుడు పరబుడుకి గుండె గొంతులోకి దూసుకొచ్చినంత పనైంది. అయినా చుట్టూ జనం చూస్తున్నారో లేదో గమనించి మరీ నోటులు లెక్కించి ఇచ్చాడు. మైకువాళ్ళు 'సాయంత్రం వరకు వుండమంటారా' అని 'అడిగితే ''కావాలంటే వెళ్ళు'' అని దబాయించాడు. తరువాత తనూ కుర్చీలో కూర్చొని కునుకు తీశాడు.&lt;br /&gt;* * *&lt;br /&gt;శివాజీ విగ్రహం వద్ద గ్యారేజిలోని ఆ శబ్దం గుర్రం మీద ఎలాంటి ప్రభావం చూపింది? ఇంత క్రితం కొంతకాలం సర్కస్‌లో వున్న గుర్రం అది. తరువాత కొన్ని నెలలపాటు సినిమా షూటింగులో సైతం పాలుపంచుకొంది. గుర్రం జ్ఞాపకాలంటూ వేరే వుంటాయా? మోటార్‌ సైకిల్‌ శబ్దంలో సర్కస్‌లోని ఏ జ్ఞాపకాలు గుర్రాన్ని పరుగు తీసేలా చేశాయో ఎవరికి తెల్సును. ఆ క్షణాన గుర్రం వళ్ళంతా విదిలించుకొని, గెంతి, ముని కాళ్ళనెత్తి పరుగుతీసింది. తెల్లవారు జామునుంచి ఆరంభమైన రాద్ధాంతాలవల్ల గుర్రం విసుగెత్తిపోయింది. ఈ మోటారు సైకిల్‌ శబ్దంవల్ల రెచ్చిపోయి 'ధడక్‌, ధడక్‌' మంటూ ఎగురుతూ రాజాజీ కూరగాయల వీధిలో పడ్డ గుర్రం కొన్ని క్షణాల్లోనే వీధిని దాటి అడ్డం తిరిగి రఝువేర్‌ రోడ్డులో దూరి అటు నుంచి గోశాల రోడ్డుకు పరుగు తీసింది. దాని వీపుమీద బెండులా దగడూ గడగడలాడసాగాడు. గుర్రం మెడను కౌగిలించుకుని కళ్లు మూసుకున్నాడు. ఏమో ఏఅదృశ్యశక్తివల్లనో? గుర్రం గంతులకు భయపడకుండా అరే! తనింకా పడిపోలేదన్న ఆశ్చర్యాన్ని సైతం మరచిపోయి విచిత్రంగా గుర్రంలాగే సకిలించాడు.&lt;br /&gt;&lt;br /&gt;గోశాల రోడ్డులో బడిపిల్లలు 'హే...' అంటూ గుమిగూడి కేకలేశారు. అది కూడా అతన్ని విచలితం చేయలేకపోయింది. అతగాడు తలకు ధరించిన తలపాగా మాత్రం అక్కడ పడిపోయింది. కొందరు పిల్లలు దాన్ని పట్టుకొని కొన్ని నిమిషాలు పాటు గుర్రం వెనకాలే పరుగెత్తారు. ఆ రోడ్డులో అడ్డం తిరిగిన గుర్రం విశాలమైన క్రీడా మైదానం నడుమ, ఆవుల మధ్యన రెండు మూడు క్రికెట్‌ పిచ్చులపై నుంచి దూకి, చిన్న గోడను సైతం ఎగిరి పెట్రోల్‌ బంక్‌ పక్కన చిన్న సందులో దూరి ఆగ్రా రోడ్డును చేరుకుంది.&lt;br /&gt;&lt;br /&gt;పెళ్ళి తలపాగా పడిపోయిన దగడూను బస్సుల్లోంచి జనం చూడసాగారు. ప్రస్తుతం రహదారిలోని వాహనాల నడుమ గుర్రం గెంతసాగింది. మిల్లులోని తన ఉద్యోగం, అన్నగారి గూండాయిజం, ఎత్తు పళ్ల పెళ్ళికూతురు, తన పొడుగాటి దినచర్య అన్నింటినీ గుర్రం ఒకే ఒక్క గెంతులో తన్నేసినట్లనిపించి, భద్రంగా గుర్రం మెడను పెనవేసుకున్నాడు. ఓ క్షణం పాటు తనే శివాజీలా రాయఘడ కోటను ఎక్కుతున్నట్లుగా భ్రమ కలిగింది. గుర్రం వేగంగా రహదారి వెంబడి పరుగెత్తింది. ఆక్రాయ్‌ నాకను దాటి, సిగ్నల్స్‌ను లెక్కచేయక తనకు తెలిసిన గమ్యంవైపు కొనసాగుతోనే వుంది.&lt;br /&gt;&lt;br /&gt;ఇలా ఎంతో సమయం పరుగెత్తి రహదారిని విడిచిపెట్టి పరిచితమైన సందులలో అడుగులేస్తూ, ఉపనగరం ఒకదానిలో ప్రవేశించి ఎగశ్వాస విడుస్తూ చాలా ఇరుకైన సందులో దూరి ఓ ఇంటికి చెందిన పశువులపాకలా వున్న కొట్టంలో నిలిచింది. ఆ ఇంట్లోంచి పనిమనుషులొచ్చి నీరసంగా వేలాడుతున్న దగడూని దింపుకున్నారు. అతగాడు ధరించిన జలతారు దుస్తులను విప్పి గాలి విసిరి మంచంపై పడుకోబెట్టారు. కనుగుడ్లు తేలేసి అతడి కళ్ళెదుట చెంబులో మంచినీళ్ళు తెచ్చిన ఓ అమ్మాయి నిలిచింది. వాడు గటగటా నీళ్ళు తాగుతుండగా 'లల్లలా' అంటూ పాడుతూ మాయమైంది. మారుమాటలేకుండా రెండే నిమిషాల్లో భానుమతి తండ్రి గుర్రం పట్టుకొచ్చిన మహాధీరుడిలా భావించి వచ్చిన పెళ్ళికొడుకును అల్లుడిగా అంగీకరించాడు.&lt;br /&gt;* * *&lt;br /&gt;కొన్ని నెలల తర్వాత బాలచంద్రపరబ్‌ చెవుల్లో ఎవరో ఓ కబురును వినిపించారు. జుహూ సముద్ర తీరంలో అందమైన పెద్ద టాంగాలో పిల్లలను ఎక్కించుకొని దగడూ టాంగాను అద్దెకు నడుపుతున్నాడని. అదే రోజు సాయంత్రం భార్యాపిల్లలను వెంటబెట్టుకొని ట్రైను, రెండు బస్సులను మారి బాలచంద్రపరబ్‌ జుహూ చేరుకున్నాడు. అక్కడ బీచ్‌లో జనం ఓ ప్రవాహంలా వున్నారు. ఎన్నెన్నో టాంగా గుర్రాలు, ఒంటెలు, పిల్లలు, బెలూన్లు వీటన్నిటి నడుమ దగడూగాని, టాంగాగానీ కనబడలేదు. కాళ్ళు నొప్పిపెట్టేలా తిరిగాడు. సెనగ పప్పులు కట్టిన పొట్లం ఇచ్చి భార్యాపిల్లలను ఓ చోట కూర్చోబెట్టి తిరిగి తిరిగి నీరసించి చివరికి వాళ్ళ వద్దకు వచ్చి కూర్చున్నాడు. అతడి నిరాశ నిస్పృహలను అర్థం చేసుకున్న భార్య&lt;br /&gt;&lt;br /&gt;''కనబడలేదా వాడు? దొరికితే చివరి పక్షం ఆ రోజు మండపానికి, పెళ్ళి విందుకు మనం పెట్టిన ఖర్చయినా అడగేవాళ్లం'' అని నసిగింది.&lt;br /&gt;&lt;br /&gt;దానికి అతడు ఏడుపు గొంతుతో ''ఛ, తమ్ముడికి ఓ అన్నగా అంతైనా చేయకుండా వుంటే ఎలా?'' అని ఏమీ తోచక సముద్రం వైపు చూడసాగాడు.&lt;br /&gt;అనువాదం: డా్హ్హ వణేనూరు మల్లికార్జున&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194370002660680?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194370002660680/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194370002660680' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194370002660680'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194370002660680'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194370002660680.html' title='అశ్వమేధం'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194356689866328</id><published>2005-07-21T03:58:00.000-07:00</published><updated>2005-07-21T03:59:26.906-07:00</updated><title type='text'>ఎక్కడికి?</title><content type='html'>From July 2005 Vipula &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఎక్కడికి?&lt;br /&gt;గుల్జార్‌&lt;br /&gt;ఉర్దూ కధ&lt;br /&gt;అగ్గి ఆటవస్తువు కాదు. అది కరుస్తుంది. రక్కుతుంది. కండల్ని చీలుస్తుంది. అగ్గి ఒక పశువు. విచిత్రమేమంటే, అదే సమయంలో అదొక పక్షీ, పురుగూ కూడ. కందిరీగ వంటి పచ్చని చిన్న పురుగు అది కుట్టిన చోట పుండు పడుతుంది.&lt;br /&gt;&lt;br /&gt;పదిహేను లక్షల సంవత్సరాల క్రితం మనుషులు గుంపులుగా జీవించినప్పుడు క్రూరమృగాల నుండి తమను రక్షించుకోడానికి చెట్లెక్కి వాటి కొమ్మల మీద నిద్రపోయే వాళ్ళు. గుహలలో దాక్కొని కాలం గడిపేవారు. మనిషికి, పశురానికి పెద్ద తేడా వుండేది కాదు. మనిషి జంతువులను, జంతువు మనుషులనూ వేటాడేవి. బలవంతుడికే బతికే హక్కు. ఇది అడవి సూత్రం మనుష్యులు, పశువులు కూడ పెద్ద పెద్ద బలగాలుగా అడవిలో సంచరిస్తుండేవి.&lt;br /&gt;&lt;br /&gt;ఒక గుంపులో ఒక పిల్లవాడుండేవాడు. అతని ఆలోచనలిలాగుండేవి. రాత్రి ఎందుకేర్పడుతుంది? సూర్యుడెక్కడికెళ్తాడు? అతడి యిల్లు కొండకావల పక్క వుండి వుండొచ్చు. మరయితే మర్నాడుదయం ఎదురు దిశనుండి ఎలా కనిపిస్తాడు?&lt;br /&gt;&lt;br /&gt;ఆ పిల్లాడి పేరు హాబు. సూర్యుడు స్నానం కోసం సముద్రానికి వెళ్తాడని హాబు అనుకొనేవాడు. కాని ఏ మార్గం గుండా వెళ్తాడా అని అతని ఆలోచన. దిశమొలతో వెళ్ళాలి కనుక సూర్యుడు దొంగచాటుగా వెళ్తాడని హాబు నమ్మకం. ఆ సూర్యుని కధేమిటో తెలిసికొంటే తను తప్పక వెళ్లి సూర్యుణ్ణి కలుసుకుంటానని హాబు నమ్మకం. వెళ్ళేటప్పుడిక మృగచర్మాన్ని తీసుకెళ్ళేవాడు సూర్యుడు కప్పుకోడానికి.&lt;br /&gt;&lt;br /&gt;అతడలుపొచ్చేవరకు ఆలోచించేవాడు. వేలాది ప్రశ్నలు బుర్రలో తిరుగుతుండేది. అవన్నీ గుర్తుకూడ వుండేవి కావు. కొన్నిసార్లతడు ఆశ్చర్యపడేవాడు. బిడ్డలు ఆడవాళ్ళకే గాని, మగ వాళ్ళకెందుకు పుట్టరోనని. తనకొక బిడ్డ పుడితే ఎంత బాగుండును. తనకే ఎగరడం చేతనయినట్లయితే తను ఏ క్రూరమృగానికి భయపడడు కదా అని ఆలోచించేవాడు. ఏదయినా తనను తరుముకొని వస్తుంటే తనువెళ్ళి, కాకిలాగ ఏనుగు మీద వాల్తాడు. ఒకరోజు అతడు చెట్టెక్కి అక్కడినుండి ఎగరడానికి ప్రయత్నించాడు. కాని ధబ్బుమని కింద పడ్డాడు. పైగా అటువంటి పిచ్చిపని చేసినందుకు బభా తన్నాడు. అతని గాయాలు చూసి అందరూ నవ్వారు. వాడి తల్లికొక్కదానికే అతడి బాధ అర్థమయ్యింది. ఒకరాత్రి భోరుమని వర్షం పడింది. జంబి హాబూ నడిగాడు. 'అంత నీరెక్కడనుండి వస్తుందని?' ఠపీమని జవాబిచ్చాడు హాబు ''ఆకాశంలో ఒక దేవతల గుంపుంటుంది. వాళ్ళకి అవసరం లేని నీళ్లు పారబోస్తారని''.&lt;br /&gt;&lt;br /&gt;అంత తెలివయిన జవాబిచ్చినందుకు జంబి చకితుడైనాడు. ''హాబూ! నీవు కూడా, ఏదో ఒకనాడు బభా లాగ తండా నాయకుడివవుతావు. నీ పొట్టనిండా విజ్ఞానమే'' అన్నాడు మెచ్చుకోలుగా.&lt;br /&gt;&lt;br /&gt;హాబు చాలా తెలివయిన వాడనే విషయం చెప్పాలని వాడి ఉద్దేశం. ఆ రోజుల్లో మేధాశక్తి పొట్టలోనే వుంటుందని అనుకొనే వాళ్ళు.&lt;br /&gt;&lt;br /&gt;వయస్సుతో బాటు హాబు జిజ్ఞాస కూడా పెరిగింది. తన మనసులో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలెట్టాడు. తను తెలుసుకొన్న విషయాలనతడు చెబుతుంటే జనాలు నివ్వెరపోయేవారు. ఆఖరికి బభాకు కూడ అచ్చెరవే. మేఘాలెందుకు గర్జిస్తాయే చెప్పింది కూడ హాబూనే, ''దేవతలు తమలో తాము యుద్ధం చేసినప్పుడు వాళ్ళ ఎముకలు చాలా వరకు విరుగుతాయి. ఆ ఎముకల చిటపట ధ్వనులే మేఘాలగర్జన'' ఎప్పటినుండి అతడన్ని ప్రశ్నలకూ సమాధానమీయబట్టొడో అప్పటి నుండి అతని ప్రాముఖ్యత అతని తండాలో పెరగసాగింది.&lt;br /&gt;&lt;br /&gt;కాకులు ఏనుగుల మీద కూర్చొని వుండడమతడు చాలాసార్లు చూశాడు. అవి ఏనుగు చెవిదొప్పల విసుర్లకుగాని, వాటి చిట్టితోక దెబ్బలకుగాని బెదరవు. అతడు తరచూ ఒక ఒంటరి ఏనుగు ఆ పక్కనుండి వెళ్ళడం గమనించాడు. అది ప్రతిదినం రేవుకెళ్ళి అక్కడ నీళ్ళల్లో జలకాలాడి తరువాత యిసుకలో దొర్లేది.&lt;br /&gt;&lt;br /&gt;భూమికి ఉపరితలంలో తిరగాడాలనేది హాబు కోరిక. ఒక రోజు ధైర్యాన్నంతా పోగుచేసికొని ఏనుగురాక కోసంఎదురుచూస్తూ ఒక చెట్టుమీద కూర్చున్నాడు. ఏనుగు ఆ చెట్టుకిందికి రాగానే దానిమీదికి దూకాడు. ఏనుగుకది పూర్తిగా కొత్త అనభవం. ఆ హఠాత్పరిణామానికి అది చలించింది. మొదటది గుండ్రంగా తిరిగింది. పెద్దగా ఫీుంకరించింది. తోక వూపింది. కాని అవేవీ పనిచేయకపోయేసరికి, అడవి వైపు పరుగెత్తింది. హాబు అమితానంద పడ్డాడు. ఆ ఏనుగొక చెట్టు కిందికొచ్చేసరికి, ఎగిరి, చెట్టుకొమ్మనొక దానిని పట్టుకొని తప్పించుకొన్నాడు. రెండు మూడు దినాల తరువాత మళ్ళీ చేసాడపని. ఏనుగు ఫీుంకరించింది. పరుగులుపెట్టింది. అయితే హాబు తనస్వారి ముగించి మునపటిలాగానే తప్పించుకొన్నాడు. ఒకనాడు ఏనుగు హాబు తన స్నేహితులతో కలసి సముద్రంలో స్నానం చేస్తుండడం చూసింది. తొండం నిండా నీటిని నింపి హాబు మొఖానికేసి చిమ్మింది. మిగిలిన వాళ్ళంతా పారిపోయారు. కాని హాబూను తొండంతో చుట్టి, లేపి, తన వీపు మీద కూర్చోపెట్టింది. హాబు తేరుకొని కిందికి దుమికేలోగా ఏనుగు లోతు నీళ్ళలోకి మునగసాగింది. హాబు గట్టిగా అరిచాడు. అయితే ఏనుగు తన తొండంతో నీళ్ళు కొడుతూనే వుంది. అది విపరీతంగా ఆనందపడిపోయింది. కాస్సేపయ్యాక హాబు అరవడం మానుకొన్నాడు. ఏనుగు తనతో పోట్లాడటం లేదనీ, ఆడుకొంటోందని అర్థమయ్యిందతనికి. తీరానికి చేరుకొన్న హాబు తండా మనుష్యులకు హాబు, ఏనుగు స్నేహితుల్లాగ ఆడుకోవడబ్బురమనిపించింది. ఇదివరకెప్పుడు యిలాగ జరగలేదు. భయంకరమైన ఒక అడవి జంతువును హాబు మచ్చిక చేసికొన్నాడు. ఆ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. హాబు ఏనుగునెక్కి తన తండాను చేరుకున్న దినం వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పుడు జంతువును చూస్తే వారికి భయం కలగడంలేదు. దాని దగ్గరగా వెళ్ళి తినడానికేదో ఒకటి అందించారు. ఏనుగు దాన్ని తొండంతో అందుకొని సంతోషంగా మింగింది. అప్పటినుండి ఆ ఏనుగు ఆ తండాలో ఒక భాగమయ్యింది.&lt;br /&gt;&lt;br /&gt;మానవులు వేడిమినీ, చల్లదనాన్ని అనుభవిస్తున్నారు. కాని వేడి ఎందుకు కలుగుతున్నదో, తమ శరీరాలు చలికి ఎందుకు ఒణుకుతున్నాయో అర్థం కాలేదు. వర్షం నుండి కాపాడుకోడానికి గుహలు వగైరాలను కనుక్కొన్నారు. కాని అప్పటికి వారికి రుతుచక్రం గురించి తెలియదు. కాలాన్ని కొలవడమింకా నేర్వలేదు వాళ్లింకా. రాత్రికి, పగటికి తేడా తెలుసుకాని సంవత్సరాల గురించి, నెలల గురించి అవగాహన లేదు. అంచేత ఏ రుతువు ఎన్నాళ్ళుంటుందో, అది మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తుందో వాళ్ళకు తెలియదు. సూర్యుడు, వర్షం మన జీవితాలలో ఉన్నట్లే వారి జీవితాలలో అంతర్భాగమయి ఉండేవి. కాని ఆ కాలంలో పుస్తకాలు లేవు. విషయాలు ఒకరి నుండి మరొకరికి నోటి మాట ద్వారా, ఒక తరం నుండి యింకొక తరానికి తెలుస్తుండేవి.&lt;br /&gt;&lt;br /&gt;ఒక శీతాకాలంలో ఒకసారి బ్రహ్మాండంగా మిరుమిట్లు గొలిపే మెరుపులు మెరిసాయి. హాబు ఇంతకు ముందు మెరుపు చూసి ఉన్నాడు. మెరుపు మెరిసినప్పుడల్లా చాలా దూరం వెలుతురు ప్రసరించటం చూశాడు. పగటి వెలుతురులో చూసినంత స్పష్టంగా ప్రతీదీ చూడొచ్చు. ఆ సంవత్సరం చెవులు బద్దలు చేసే ఉరుములు, మెరుపులు కలసి అడవి మీద వాలాయి. ఒక ఎండిపోయిన చెట్టు మీదొక వింత జంతువు కూర్చొని దానిని తినడం కనిపించింది. దాని శరీరం సూర్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. ప్రతీదీ చాలా స్పష్టంగా కనబడుతోందా వెలుగులో. హాబు తెగ వాళ్లంతా పరుగెత్తి పోయి దాని చుట్టూ చేరారు. అటువంటి జంతువు నింతకు ముందెప్పుడూ చూడలేదు. బభా పూర్వీకుల కాలంలో కూడా చూడలేదు. అది అగ్ని. దానికా పేరు ఎప్పుడు సంతరించిందో తెలియదు. అది పుంలింగం నుండి స్త్రీ లింగం లోనికి ఎప్పుడు మారిందో తెలియదు. కాని మొదట్లో అది మగ జంతువుగానే పరిగణింపబడింది.&lt;br /&gt;&lt;br /&gt;అదొక విస్తారమయిన వృక్షం. దాని పక్కన ఒకటి రెండు చిన్న చెట్లు, ఎండి పోయినవి ఉన్నాయి. మంటలు తమ వైపు కెగసేసరికి తండా వాళ్లు ''చూడు, చూడు, అనడం ఆ పక్కనున్న చెట్టు నందుకో బోతున్నాడ''ని అరిచారు. పక్కనుండే చెట్టు పూర్తిగా కాలేసరికి, అప్పటిదాకా కుంచించుకొని పోయిన దాని శరీరం మళ్లీ పెద్దదిగా ఎదిగింది. మొదటి చెట్టు పైభాగం పూర్తిగా మాయమయ్యింది. వాళ్లంతా ఒకేమాట మీద నిలబడ్డారు. ''అతడు దాన్ని మింగేశాడు. అతడు దాన్ని మింగేశాడు'' అని.&lt;br /&gt;&lt;br /&gt;మొట్ట మొదటిసారి మనిషి ఒక చెట్టు నాసాంతం తినేసిన జంతువును చూశాడు. ఆ జంతువు రాత్రంతా చెట్లను మింగుతూనే ఉంది. ఉదయమయ్యింది. అదింకా అక్కడే ఉంది. మిగిలిన జంతువులు తమ వేటను తిని వెళ్లిపోతాయి. కాని ఈ జంతువు వెళ్లనంటోంది. అది తన బలి పశువును చంపి, అక్కడే కూర్చొని ఆ చెట్లను అక్కడే తిన్నది. కొద్ది దూరంలో మరి కొన్ని చెట్లున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;హాబు అనుకొన్నాడు. ''ఆ చెట్లు దానికి కనబడకుండానయినా ఉండాలి. లేదా దాని ఆకలి పూర్తిగా తీరిపోయి అయినా ఉండాలి'' అని. అతడు బభా నడిగాడు. బభా భేషయిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.&lt;br /&gt;&lt;br /&gt;తన అభిప్రాయాన్ని కొద్దిగా మార్చి ''నా ఉద్దేశంలో ఈ జంతువు ఎండిపోయిన చెట్లనే ఆరగిస్తుందనుకొంటా. అడవిలో యింతకు ముందెప్పుడూ దీనిని చూడలేదు'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;'అది అడవి పైనుండి ఎగిరే పక్షి అయి ఉంటుంది. ఎండిన మోడు కనపడగానే దానిమీద వాలింది.' అని ఊహించాడు హాబు. 'కాని అది ఆకాశంలో ఎగురుతూ ఉండడమెప్పుడూ చూడలేదే'&lt;br /&gt;&lt;br /&gt;''అది ఆకాశం నుండి ఊడి పడిన జంతువనుకొంటా. అది దేవతల నివాసం నుండి కిందపడింది. దాని రంగు దేవతల రంగూ ఒకటిగా ఉంది. కనబడ్డట్లేదా?'' అన్నాడు బభా తన అభిప్రాయాన్ని ఇంకొంచెం మారుస్తూ.&lt;br /&gt;&lt;br /&gt;అప్పటికే బభాకు తన యింగిత జ్ఞానం మీద నమ్మకం కుదిరింది. మిగిలిన వాళ్లు కూడా కొంత వరకు ఒప్పుకొన్నారతని అభిప్రాయంతో. జంతువులు తిండి తిన్న తరువాత లావెక్కడం మామూలు. కాని ఈ జంతువు తక్కిన వాటిలాగా కాకుండా, అంత ఆహారం మేశాక కూడా దాని ఆకారం చిన్నగా కుంచించుకొని పోవడమనే విషయం హాబుకు తికమకగా ఉంది. ఇంకొక విషయం కూడా హాబు గమనించాడు. అది కూర్చుని తింటున్న ప్రదేశమంతా ఎర్రగా అయ్యింది.&lt;br /&gt;&lt;br /&gt;సింహంలాగ తిండి తిన్నాక అది నిద్ర పోతోందని జంబి అనుకొన్నాడు. తుంబా పెద్ద సాహసి. అది నిద్ర పోతూ ఉంటే నేను దానిని లేపుతానని' ప్రకటించాడు.&lt;br /&gt;&lt;br /&gt;దాన్ని నిద్ర లేపేందుకని చేయి చాచి ముట్టుకొన్నాడు. ఒక్క కేకతో వెనక్కి తగ్గాడు. అగ్ని అతని చేతిని గట్టిగా కరిచింది.&lt;br /&gt;&lt;br /&gt;'కాలడం' అనే అనుభూతి అంతకు ముందెప్పుడూ ఎవరికీ లేదు. ముందు 'అగ్ని' పుట్టి ఆ తరువాత 'కాలుట' అనే పదం పుట్టింది. తుంబా చేతిమీద బొబ్బలెక్కాయి. వెంట్రుకలు మాయమయ్యాయి. అది వాటిని నాకేసిందన్నాడు తుంబా బొబ్బలకేసి చూస్తూ.&lt;br /&gt;&lt;br /&gt;''అవి దాని పంటి గుర్తులై ఉంటాయి''&lt;br /&gt;&lt;br /&gt;''ఏదీ, పళ్ళేమీ కనపడట్లేదే?''&lt;br /&gt;&lt;br /&gt;''మరి వెంట్రుకలనెలా తినేసింది?''&lt;br /&gt;&lt;br /&gt;''అది కరిచింది. కాని రక్తం రాలేదు''&lt;br /&gt;&lt;br /&gt;తుంబా ఇంకా కోపంగా ఉన్నాడు. ఒక చెట్టు నుండి పొడవాటి కొమ్మ నొకదానిని తీసుకొని ఆ నిప్పును కలబెట్టడం మొదలెట్టాడు. ప్రతి వాళ్ళూ జాగ్రత్తగా వెనక్కెళ్ళారు. కాసేపు అగ్ని కదలకుండా ఉండిపోయింది. దాని కడుపులోకి గుచ్చిన ఆ కట్టెపుల్ల కొస నెమ్మదిగా నల్లబడుతూ ఉండడం కనబడింది. గభాలున దాన్నుండి మంటలు లేచాయి. భయపడిన తుంబ ఆ పుల్లను విసిరేద్దామని చూశాడు. కాని అది అతని మొల చుట్టూ చుట్టుకొని ఉన్న మృగ చర్మంలో చిక్కుకొని ఉంది. కింద పడీ పడగానే తోలు కాలడం మొదలయ్యింది.&lt;br /&gt;&lt;br /&gt;పెద్ద అలజడి రేగింది. తుంబ నగ్నంగా నిలిచాడా గుంపు ముందు. ఒక్క తృటిలో అగ్ని ఆ పుల్లను, తోలునూ కూడా తినేసింది.&lt;br /&gt;&lt;br /&gt;మళ్లీ పెద్దదయ్యింది దాని ఆకారం. అది దేనినయినా తింటుందన్నాడు తుంబ.&lt;br /&gt;&lt;br /&gt;ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద బండలను పడేశారు. అగ్గి వాటిని తినలేక పోయింది.&lt;br /&gt;&lt;br /&gt;''దానికి పళ్ళు లేవు కదా అంచేత బండలు నల్లగా మారినప్పటికీ వాటిని కొరకలేక పోయింది'' అని హాబు వివరించాడు.&lt;br /&gt;&lt;br /&gt;మరొక విషయాన్ని కూడా హాబు గమనించాడు. అదేమంటే అగ్గికి చాలా నోళ్ళున్నాయా అని. ఒకేసారి చాలా వేపుల నుండి అది తినగలదు అని. ఇంకొకటేమంటే దానికి కాళ్లు లేవు. అది నడిచి వెళ్ళి ఆహారమందుకో లేదు. దానికి అందినంత అది తింటుంది. తిండి తినడం అవగానే అది కూడా చనిపోతుంది అని.&lt;br /&gt;&lt;br /&gt;ఏనుగును సాకడం మొదలు పెట్టాక హాబుకు సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవాలనుండేది. కానీ ఇప్పుడీ అగ్గిని చూశాక దానిని పెంచుకోవాలనే యిచ్చ కలిగింది. అది చనిపోబోతూ ఉండగా అక్కడా యిక్కడా ఎండుపుల్ల వేరుకొని వచ్చి దానికి మేత వేశాడు. అగ్ని మళ్లీ ప్రజ్వలించింది. పెద్దదయ్యింది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ రాత్రికి వాళ్లమ్మతో చెప్పాడు. ''అది తినకపోతే చస్తుంది. దాన్ని బతికి ఉండేట్లు చేయడానికొకే మార్గం. దానికి మేత వేస్తుండడం'' అని.&lt;br /&gt;&lt;br /&gt;అగ్గితో ఏమి చేస్తావనడిగింది వాళ్లమ్మ.&lt;br /&gt;&lt;br /&gt;''అగ్ని ఉండగా ఆ ప్రాంతమంతా వెలుగు ఉంటుంది. రాత్రి వేళల కూడ ప్రతీదాన్ని స్పష్టంగా చూడొచ్చు. కృార జంతువులు దానికి భయపడి దూరంగా పారిపోతాయి. మనం అగ్గిని మచ్చిక చేసుకొంటే ఏ జంతువూ మన తండా జోలికి రావు'' అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;అది ఎంతో నమ్మదగిన వాదన. బభా కూడా తల ఊపి అంగీకారం తెలిపాడు. హాబు మాటకెవరూ ఎదురు చెప్పట్లేదు. ఎందుకంటే అతడెంతో తెలివయినవాడు.&lt;br /&gt;&lt;br /&gt;తండా సంతోషంగా హాబు ప్రతిపాదనకు ఒప్పుకొంది. రోజూ వేటకెళ్లే బదులు ఎండు పుల్లలేరడం మొదలెట్టారు. కొత్త జంతువుకు ఆహారం కోసమని. దానిని ముట్టుకోవాలనే కోరికతో తపించారు. దాన్ని ముట్టుకొన్నప్పుడల్లా అది వారిని కరిచింది.&lt;br /&gt;&lt;br /&gt;హాబు గురించి వాళ్ల తెగలోనే కాదు బయట కూడా మాట్లాడుకోవడం జరిగింది. వేరే తెగలవాళ్ళు కూడా అగ్నిని చూడొచ్చారు. అయితే ఒక రోజొక భయంకరమైన ప్రమాదం జరిగింది. కుండపోత వాన కురిసింది. తమ ఎర్రని బంగారు రంగు జంతువు యొక్క బాధాకరమైన చావును తెగవాళ్లంతా చూశారు. పైకి లేస్తున్న పొగను మొదటిసారిగా చూసి, అది స్వర్గారోహణ చేస్తున్న అగ్ని ప్రాణమయి ఉంటుందని భావించారు. అది పైకెళ్ళడం చూశాక అది పైనున్న ఆకాశంలో ఉండే దేవతల నివాసం నుండి కిందికి దిగి వచ్చిందనేది పూర్తిగా నమ్మకం కలిగింది. కాసేపు అయిన తరువాత అక్కడ మిగిలిందొక బూడిద కుప్ప. అదే ఆ జంతువు శరీరమని వాళ్లనుకొన్నారు. అప్పుడు తుంబి ఒక తమాషా మాటన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;''చనిపోయాక ప్రతివాడి ప్రాణమూ పైకి వెళ్తుందన్న మాట. మనకెప్పుడయినా కనిపిస్తుందా?'' అడిగాడు హాబు. తుంబికి దానికి జవాబు తెలియదు. అప్పటినుండి యిప్పటి వరకు ఆ ప్రశ్న ప్రశ్నగానే మనిషి మనసులో ఉండిపోయింది. ఇప్పటికీ అడుగుతుంటారా ప్రశ్న.&lt;br /&gt;&lt;br /&gt;''మనిషి చనిపోయాక ఎక్కడికెళ్తాడు?''&lt;br /&gt;&lt;br /&gt;అది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.&lt;br /&gt;అనువాదం: పుష్పవతి&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194356689866328?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194356689866328/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194356689866328' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194356689866328'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194356689866328'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194356689866328.html' title='ఎక్కడికి?'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194347436866253</id><published>2005-07-21T03:55:00.000-07:00</published><updated>2005-07-21T03:57:54.373-07:00</updated><title type='text'>బీరువా</title><content type='html'>From July 2005 Vipula, &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;బీరువా&lt;br /&gt;ఇందిరా వాస్వాణి&lt;br /&gt;సింధీ కధ&lt;br /&gt;ఆయన బతికుండగానే తన ఆస్తినంతా ఎక్కువభాగం కొడుకులకే పంచేశాడు. ఆతనిది ఎంతో ముందు చూపు. తను చచ్చిన తర్వాత ఎవరూ ఆస్తి కోసం కొట్టుకు చావకుండా, కోర్టులకెక్కకుండా పకడ్బందీ చేశాడు. అసలు డబ్బు రక్తాన్ని, రక్తసంబంధాల్ని విడదీస్తుంది. కేవలం ఒకేఒక్క బీరువాలో ఆయన చనిపోయిన భార్య నగలు, జనం కుదవబెట్టిన వెండి సామాన్లు చిన్నాచితక నగలు 'సేఫ్‌'టితో క్షేమంగా ఉన్నాయి. బీరువాలో కొన్ని అరల్లో బుల్లిబుల్లి సంచులలో వందేసి రూపాయల చిల్లరుంది. ఈ బీరువాపై పెత్తనం ఆ ముసలాయినదే!&lt;br /&gt;&lt;br /&gt;సింధు ప్రాంతం నించి వలస వచ్చేటప్పుడు ఆయని భార్య ఎంతో చాకచక్యంగా తన నగలు, వెండి, బంగారువస్తువులు, నాణాలు తనవెంట తేచ్చేసుకుంది. దేశవిభజన తర్వాత తన ఇల్లు వాకిలి, భూమిపుట్టా వదిలేసుకుని భారతదేశంలో స్ధిరపడ్డారా దంపతులు. ఐదు ఇళ్ళు, రెండు షాపులు ఉన్నాయి. నాలుగు ఇళ్ళని నల్గురు కొడుకులకి, రెండుషాపుల్ని ఇద్దరు తమ్ముళ్ళకీ సరిసమానంగా పంచాడు. మిగిలిన ఐదో ఇంట్లో ఆ వృద్ధ దంపతులు నివసించేవారు.&lt;br /&gt;&lt;br /&gt;ముసలాయన స్వయంగా తాకట్టు వడ్డీవ్యాపారం చేసేవాడు. ఆ ఊళ్ళోనే ప్రసిద్ధ వడ్డీ వ్యాపారవేత్తగా పేరుగడించాడు. ఆ వచ్చిన డబ్బుని గీపెట్టినా పిల్లలకిచ్చేవాడు కాదు. తాను కూడబెట్టినదంతా ఆ బీర్వాలోనే దాచుకునేవాడు. భార్యకి కావల్సిన వస్తువులు నగానట్రాతో నింపేశాడు. భార్య బతికినంత కాలం ఆమే వంటింటి రాణి. ముసలాయన పొద్దున్నే ఓ గ్లాసుడు పాలు తాగి, కూరలు తేవటానికి ఓ సంచీపుచ్చుకుని బైలుదేరేవాడు. పైసా ఖర్చుపెట్టకుండా, తన దగ్గర అప్పు తీసుకున్న కూరలవాళ్లు, టీవాళ్లు, షాపులవాళ్ళ దగ్గర వడ్డీ కింద జమకట్టుకుని సరుకులు తెచ్చేవాడు.&lt;br /&gt;&lt;br /&gt;ఆయన భార్య బతికికుండగానే చెప్పింది, ''నేను చచ్చిన తర్వాత నా నగలు ఖరీదు డబ్బుని కొడుకులు, కూతుళ్ళుకి పంచండి'' అని. ఆమె చనిపోయిన తర్వాత భార్య కోరిక ప్రకారమే బీరులోని ముప్పైవేల రూపాయల్ని పిల్లలకు ఒక్కోరికి ఐదువేలు వచ్చేలా పంచేశాడు వృద్ధుడు. కానీ కోడళ్ళ మొహాలు ఇంకా ముడుచుకునే ఉన్నాయి. వాళ్ల చూపంతా అత్తగారి సొమ్ములపైనే! చిన్నకోడలు అనేసిందికూడా&lt;br /&gt;&lt;br /&gt;''నేను అందరికంటే చిన్నదాన్ని కదా? అత్తగారి వజ్రాలదిద్దులు నాకు ఇవ్వండి'అని.&lt;br /&gt;&lt;br /&gt;అంతే, పెద్దకోడలు మూతీ ముక్కు విరిచింది.&lt;br /&gt;&lt;br /&gt;భార్య పోయాక కూడా ఆయన ఇంటికి కావల్సిన సరుకులు, కూరానారా తెస్తుండేవాడు. ఇప్పుడు ఇంటి బాధ్యతంతా పెద్దకోడలిపై పడింది. కానీ పూర్తిగా ఏడాది కూడా గడవకుండానే ఉమ్మడి పొయ్యి పోయి నాల్గువేర్వేరు కుంపట్లు, స్టౌవ్‌లు వెలిశాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఆ ముసలాయన మాత్రం తన ఇంట్లోనే ఉండసాగాడు. ఒకటి గెస్టుల గది. రెండో గదిలో ఓ మంచం, నాలుగు కుర్చీలు, ఓ బీరువా! బైటికెళ్ళేప్పుడు ఇంటికి తాళం వేసి దాని తాళం చెవుల్ని ధోవతికి గట్టిగా ముడేసుకుని మరీ వెళ్ళేవాడు.&lt;br /&gt;&lt;br /&gt;కోడళ్ళ దృష్టి ఎప్పుడూ మామగారి బీరువా పైనే! ఆ ముసలాయనకి వయసు బాగా మీరిపోయింది. ఎప్పుడైనా ఆయనకి సుస్తీ చేస్తే కోడళ్ల మొహాలు బాగా వికసించి కళకళలాడేవి. ఆయన ఆరోగ్యంతో పుంజుకోగానే అందరి మొహాలు కళతప్పి ముడుచుకుపోయేవి. కొడుకులు పైకి మాత్రం ''అమ్మో! మా నాన్న ఆరోగ్యం మాకు ఎంతో ముఖ్యం'' అంటుంటే ముసలాయన వెర్రిగా నవ్వుకునేవాడు. కొడుకుల మనసు చదివాడు కాబట్టి! తాను ఇప్పుడిప్పుడే చావడని ఆయనకీ తెల్సు మరి! సింధు ప్రాంతం నెయ్యి, వెన్న వంట పట్టించుకున్న శరీరం, బుర్ర ఆయనవి!&lt;br /&gt;&lt;br /&gt;సాధారణంగా ఆయన చాలా పొద్దుట గానీ, బాగా రాత్రి అయ్యాక గానీ బీరువా తెరిచి ఎర్ర అట్ట పుస్తకంలో పద్దు రాసేవాడు. సరిగ్గా అప్పుడే కావాలని చిన్న కోడలు పాల గ్లాసుతో వచ్చి తిష్ట వేసేది. మొహాన ముసుగున్నా ఎంచక్కా బీరువాని పరిశీలించేది. తాకట్టు పెట్టబడిన బోలెడన్ని చిన్నా చితకా సామాన్లని, వాళ్లు వచ్చి విడిపించుకోలేదు. ఆ బీరువా, దానిలోని వస్తువుల్ని గూర్చి నల్గురు కోడళ్ళు గుసగుసలాడటం, చర్యలు, తీర్మానాలు చేయటం జరిగేది. ప్రతి కోడలికీ ఆ బీరువాలోని సామాన్లన్నీ తనకే దక్కాలనే దురాశ మాత్రం మహా మెండుగా ఉండేది. సమయ సందర్భాలు చూసి భర్తల చెవులు కొరుకుతుండే వారు.&lt;br /&gt;&lt;br /&gt;''మీ నాన్న వీలునామాలో బీరువా మనకే చెందాలని రాయించండీ!'' అని ఉసి గొల్పేవారు&lt;br /&gt;&lt;br /&gt;ఎవరి ఊహకి తోచినట్లు వారు బీరువాలోని వస్తువుల జాబితా తయారు చేశారు కూడా.&lt;br /&gt;&lt;br /&gt;ప్రతి ఫస్టు తారీకుకీ మామగారు తెచ్చే సరుకుని నలుగురు కోడళ్ళు సమంగా పంచుకునేవారు. అందరూ తమ భాగాల్లో వాటాని మామకి పంచేవారు సమానంగా.&lt;br /&gt;&lt;br /&gt;మామగారి తల పండి పోయింది. వయసు, ఎండ వల్ల కాదు. కొడుకు, కోడళ్ళ మంతనాలు, వ్యవహారాలు, తన బీరువాపై వారి దృష్టి ఉండటం ఆయనంతా గ్రహించుకున్న మేధావి. ఆ బీరువా కనుక లేకపోతే తన నెవరూ కన్నెత్తి చూసేవారు కాదు, పన్నెత్తి పలకరించరు అని కూడా తెలుసు ఆయనకి. అందుకే కీలెరిగి వాత పెట్టినట్లు, లోగుట్టు పెరుమాళ్లుకెరుక అన్నట్లు, మాంత్రికుని ప్రాణం భరిణలో ఉన్నట్లు ప్రవర్తించే వాడాయన. కావాలని వారిని ఉడికించేవాడు. మాటి మాటికీ బీరువా తలుపులు లాగటం, తాళం సరిగ్గా పడిందో లేదో పరీక్షించటం ఆయన హాబీ! మధ్య మధ్యలో రాత్రిపూట కూడా లేచి తల దిండు కింద తాళం చెవులు ఉన్నాయో లేదోనని తడిమి చూస్తుండేవాడు.&lt;br /&gt;&lt;br /&gt;ముసలాయనకి అసలెవరిమీదా నమ్మకం ఏమాత్రం లేదు కూడా! నగరంలో ఉన్న తన పెళ్లయిన కూతురికి మాత్రం కొద్దో గొప్పో చెప్పేవాడు. ఆయన వయసు ఇప్పుడు ఎనభై ఐదు దాటింది. ఇల్లు విడిచి బైటికి రాలేక పోతున్నాడు. డాక్టర్లు చూసి ''అబ్బే జబ్బేమీ లేదు. ముసలితనం వచ్చిందాయె! రెస్టు తీసుకోవాలి అంతే! తేలికైన ఆహారం, పళ్ల రసాలు తాగితే చాలు'' అనేవారు.&lt;br /&gt;&lt;br /&gt;పొద్దుటే షాపు కెళ్లేముందు, రాత్రి షాపుల్నించి వచ్చిన తర్వాత కొడుకులు తండ్రి క్షేమ సమాచారం తెలుసుకుని పలకరించి వెళ్లేవారు. ఆయన పడకపై మగతగా కళ్ళు మూసుకు పడుకున్నా చూపు, ధ్యాసంతా బీరువా పైనే!&lt;br /&gt;&lt;br /&gt;ఓ రోజు పెద్ద కొడుకు అడిగాడు, ''నాన్నా! ఎవరి దగ్గరన్నా నీ వస్తువులున్నాయా? వారు నీకు బాకీ ఉన్నారా? చెప్పు!''&lt;br /&gt;&lt;br /&gt;ముసలాయన మాట మార్చేశాడంతే! రాత్రిపూట పొరుగు పట్టణంలో ఉన్న కూతురు వచ్చి సాయం పడుకుని, తెల్లారగానే తనింటికెళ్ళి పోయేది. ఓ రోజు చిన్న కొడుకు వచ్చి&lt;br /&gt;&lt;br /&gt;''నాన్నా! నువ్వు దీర్ఘాయుష్షుతో బతకాలనే మా కోరిక. అలానే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ వాన రాకడ, ప్రాణం పోకడ తెలీదు ఎవరికీ. ఈ బీరువా గూర్చి వీలునామా ఎందుకు రాయవు నాన్నా?'' అనడిగాడు.&lt;br /&gt;&lt;br /&gt;విసుగు, కోపం, అసహ్యంతో ఆ వృద్ధుడొకసారి కొడుకు వంక తీక్షణంగా చూసి మారు మాటాడకుండా ఏకాగ్రతతో ఆ బీరువానే ఆప్యాయంగా చూడసాగాడు. ఇక ప్రశ్నించిన చిన్న కొడుకే అక్కడ్నించి కదిలి వెళ్ళాడు.&lt;br /&gt;&lt;br /&gt;రెండో కొడుకు ''నాన్నా! రోజూ పొరుగూరు నించి అక్క ఇక్కడికి వచ్చి రాత్రిపూట పడుకుని, పొద్దుటే వెళ్లటం కష్టం కదా? ఈ రోజు నించీ నేనే మీ దగ్గర పడుకుంటా'' అన్నాడు. వేలితో ''వద్దు'' అన్నట్లు సైగ చేశాడాయన.&lt;br /&gt;&lt;br /&gt;పళ్లు నూరుతూ కోపంగా తోక రఝాడించాడా కొడుకు. చిన్న కోడలైతే వ్యంగ్యంగా మాటలు అంటించింది కూడా. ''ఏమండీ మామయ్య గారూ! ఆ బీరువా కూడా మీతో పాటే తీసికెళ్తారా?'' అంటూ.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;&lt;br /&gt;క్రమక్రమంగా ముసలాయన ఆరోగ్యం క్షీణించసాగింది. రోజులు లెక్కించసాగాడు. ప్రతి కోడలూ గంగా జలంతో సిద్ధంగా ఉంది. వృద్ధుడు కొద్దిగా కళ్ళు తెరిచి బీరువానే చూడసాగాడు. పట్టణం నించి వచ్చిన కూతురు అన్న దమ్ముల్తో&lt;br /&gt;&lt;br /&gt;''టెలిగ్రాంలు పంపి మన బంధువుల్ని పిలిపించండి, అందరికీ తెలియ పర్చండి'' అంది.&lt;br /&gt;&lt;br /&gt;కొడుకులు ఆ పని మాత్రం చేయలేదు. ఆఖరికి ఆమే తన చెల్లెలికి టెలిగ్రాం ఇచ్చి రప్పించింది. ఆమె పొద్దుట వాలిందో లేదో, సాయంత్రానికల్లా ఆ ముసలాయన ప్రాణం ఎగిరిపోయింది.&lt;br /&gt;&lt;br /&gt;కొడుకులు కోడళ్ళు అంతా చుట్టూ మూగారు. మూడో కొడుకు చటుక్కున తల దిండు కింద నుంచి బీరువా తాళం చెవులు తీసీ తీయగానే పెద్ద కొడుకు కోపంగా, ''సిగ్గు లేదురా? అన్నని నేను ఇక్కడుండగా నీకింత ధైర్యమా?'' అని అరిచాడు. మూడోవాడు జవాబీయకుండా గది బైటికెళ్ళి పోయాడు. అన్న అతని వెనకాలే వెళ్ళగానే, మిగతా వారూ అనుసరించారు. తాళం చెవుల కోసం నోరు, ఆపై చేతులు యుద్ధం చేస్తున్నాయి. ఆ యుద్ధానికి కోడళ్లంతా అక్కడే చేరారు. భర్తల్ని సపోర్టు చేస్తూ వారూ యుద్ధం చేయసాగారు. పట్టణం కూతురు అక్కడికొచ్చి అరుస్తూ&lt;br /&gt;&lt;br /&gt;''సిగ్గూ శరం లేదట్రా మీకు? ఇప్పుడేగా నాన్న ప్రాణం పోయింది. మీరేమో తాళం చెవులు, బీరువా కోసం తన్నుకు చస్తున్నారా? పన్నెండో రోజు దాకా నోర్మూసుకు కూచోండి.'' అంది.&lt;br /&gt;&lt;br /&gt;అంతే, ఒకరి నొకరు కొర కొర నమిలి మింగేలా చూస్తూ అంతా లోపలికి పోయారు.&lt;br /&gt;&lt;br /&gt;కోడళ్లేమో ముసుగులు తీసేసి భోరు భోరున ఏడ్వసాగారు. వారి మొసలి కన్నీరు, ఏడ్పు పెడబొబ్బలికి చుట్టు పక్కల జనం రాసాగారు. పట్టణంలోని బంధు బలగమంతా తరలి వచ్చారు. కూతురు ఓ సంచీని తెచ్చింది. దాన్ని చూస్తూనే చిన్న కోడలి కళ్లు మెరిశాయి. ''అరె! ఇది మావగారి బీరువాలోని సంచీ కదూ? ఇలాంటి సంచులు చాలా ఉండాలే!''&lt;br /&gt;&lt;br /&gt;వృద్ధుడు తన కూతురుకి చెప్పే ఉంచాడు, ''తల్లీ! నేను చనిపోయిన తర్వాత ఈ బుల్లి సంచీని తెరు'' అని. ఆ సంచీలో ఓ చిన్న కాగితపు ముక్క ఉంది. అందులో తను చనిపోయిన తర్వాత చేయ వల్సిన కర్మకాండలు, వాటి ఖర్చు ఎలా చేయాలో వివరంగా రాసి ఉంది. పెద్ద కొడుక్కి ఏమి అర్థం అయిందంటే ఆ ఖర్చుకి కావాల్సిన డబ్బంతా ఆ బీర్వాలో ఉందని. ఇంకా వేరే వెండి, బంగారం కూడా ఉండి ఉండొచ్చు. అలా ఆ ముసలాయన అంతిమ కోర్కె ప్రకారమే యధావిధిగా రోజూ వారి కర్మకాండలన్నీ జరుపుతున్నారు. రోజూ రాత్రిపూట ఆ రోజు అయిన ఖర్చు అంతా పద్దు రాసేవారు. అలా పన్నెండు రోజులూ బ్రహ్మాండంగా కర్మకాండలు జరిపారు.&lt;br /&gt;&lt;br /&gt;పన్నెండో రోజు తర్వాత అక్క చెల్లెళ్లిద్దరూ తమింటికి వెళ్లిపోయారు. అక్క చెరి సగంగా తండ్రి ముందే తనకిచ్చిన నగలు, పాత్రలు చెల్లికి పంచి ఇచ్చేసింది. కానీ అక్క తనకు ఇంకా ఇవ్వాల్సింది దాచుకుందేమో అనే దురభిప్రాయంతో మొహం మాడ్చుకుని బండెక్కింది చెల్లెలు!&lt;br /&gt;&lt;br /&gt;ఇక అన్నదమ్ములంతా కలిసి బీరువాని తెరిచారు. ''ఏమండోయ్‌! అత్తగారి వజ్రాల దిద్దులు నాకే ఇవ్వాలి'' అని హెచ్చరించింది చిన్న కోడలు. అందరి గుండెలు తబ్బిబ్బు అవుతుండగా బీరువాని పరిశీలించారు. మూడు అరల్లో వృధ్ధుని దుస్తులు, ఒకదాంట్లో నోట్ల కట్టలు! సేఫ్‌ని తెరిచారు. అందరి గుండె, కన్ను దానిపైనే! సేఫ్‌ ఖాళీ! తెరిచిన నోళ్లు అలాగే ఉండిపోయాయి. నోట్ల కట్టలు పదిహేను వేలున్నాయి! అంటే పన్నెండు రోజుల కర్మకి అయిన ఖర్చు పదిహేను వేలు!&lt;br /&gt;అనువాదం: అచ్యుతుని రాజ్యశ్రీ&lt;br /&gt;(వ్యాసకర్త ప్రముఖ హాస్యావధాని)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194347436866253?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194347436866253/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194347436866253' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194347436866253'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194347436866253'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_112194347436866253.html' title='బీరువా'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112194333732751227</id><published>2005-07-21T03:53:00.000-07:00</published><updated>2005-07-21T03:55:37.336-07:00</updated><title type='text'>నాగమ్మగారు నాగుల చవితి</title><content type='html'>eenaadu sunday magazine, &lt;br /&gt;July 17th 2005&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;    నాగమ్మగారు నాగుల చవితి&lt;br /&gt;    జయంతి వెంకటరమణ&lt;br /&gt;    కాంతారావు కారు పంపించాడు. పంపుతూ ''మా అమ్మ కాలిఫోర్నియా నుంచి వచ్చింది. కార్తీకమాసం వరకు ఉంటుంది. నీతో మాట్లాడాలట. నేను పంపిన కారులో రా'' అని కబురుపెట్టాడు. నాకేం అర్థంకాకపోయినా మిత్రుడు కదాని వైజాగ్‌ బయలుదేరాను. ఆ సాయంత్రం&lt;br /&gt;&lt;br /&gt;కాంతారావు గేటు దగ్గరే ఎదురొచ్చి హాల్లోకి తీసుకెళ్ళాడు. అప్పటికే హాలులో నాగమ్మ గారు నాకోసం ఎదురుచూస్తున్నారు. అంతవరకు గుర్తురాని అతని తల్లిపేరు ఆమెను చూడగానే గుర్తొచ్చింది. ఆమె చూపులు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆమె సోఫాలో కూర్చోడంలో ప్రత్యేకమైన 'రీ౮వి' ఉంటుంది. ఒకవేపు నుండి మరోవేపుకు తల తిప్పిందంటే అందులో 'దర్పం' ఉంటుంది. కోపమొచ్చిందంటే నాగుపాములా బుస కొట్టగలదు. పేరునుబట్టి ఆమె ఆ లక్షణాలు అలవరచుకున్నదో, లేక ఆ లక్షణాలబట్టి ఆమెకాపేరు పెట్టారో నాకు తెలియదు. కానీ, ఆమెకు ఆ పేరొచ్చిన కారణం అప్పుడే నాకు తెలుస్తుందని నేననుకోలేదు. ఆమెది మా అమ్మ వయసు. అరవైఅయిదు దాటాయి. కానీ, మా అమ్మకన్నా ఆరోగ్యంగా చలాకీగా ఉంటుంది. నన్ను 'ఏంఁవాయ్‌ మాష్ట్రూ!' అని, 'ఏం పంతులూ' అని పిలుస్తుంది. నేనేమీ అనుకోను. చదువు చెప్పే మాస్టర్లంటే ఆమెకు చిన్నచూపే. ఆమె మూడోక్లాసు చదివేటప్పుడట అయిదో ఎక్కం సరిగా రాయలేదని మాస్టారు బెత్తం తీస్తే పలక అతనికేసి విసిరి చదువుకు భరతవాక్యం పాడిందట. కానీ, ఏమీ చదువుకోకపోయినా ఇంగ్లిషు, తెలుగు బాగా మాట్లాడుతుంది. కారణం సంవత్సరంలో సగభాగం స్టేట్స్‌లో కొడుకు దగ్గర ఉండటమే. నన్ను చూడగానే ''రావోయి కిష్టారావూ! బాగున్నావా?'' అని పలుకరించింది. ఏదో పెద్ద అవసరం ఉంటేగానీ ఆమె ఎవర్నీ గుర్తుపెట్టుకోదు, పేరుపెట్టి పలుకరించదు. అతిధి సత్కారాలు అయిన తరవాత ''నీవో 'ఫేవర్‌' చేసిపెట్టాలోయి నాకు. మా 'కాంతం' వల్ల అవదు. పల్లెటూరిలో ఉంటావు కాబట్టి నీవల్ల అవుతుంది...'' అని ఆగిందామె.&lt;br /&gt;''నన్నంతా 'నాగమ్మ', 'నాగమాంబ' అనేస్తున్నారు కానీ... నా అసలు పేరు 'నాగేశ్వరి'. కీపింగ్‌ ఇట్‌ ఎపార్ట్‌ అసలు నాకా పేరు ఎలా వచ్చిందో తెలుసా?...'' ఆగిందామె. ఆమె అలా ప్రసంగం ప్రారంభించడంలో అంతరార్థం తెలియక గబుక్కున ''ఫ్లాష్‌బ్యాకా!'' అన్నాన్నేను. పొరపాటు ఆమె మాట్లాడేటప్పుడు ఆమె వెతుక్కునే పదాన్ని ఎవ్వరూ అందివ్వకూడదు దాన్ని ఆమె ఆమోదించదు. తన ప్రజ్ఞ ప్రదర్శించాలనే చూస్తుంది.&lt;br /&gt;'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడ'ని ఎవరన్నా 'కచ్చితంగా తూర్పే ఎప్పుడయింది? ఆగ్నేయమో... ఈశాన్యమో కాలేదూ? నీకెదురుగా సూర్యుడుండేది ఎంతకాలం?' అని వాదిస్తుంది. ఏ విషయమైనా అంతే.&lt;br /&gt;''ఫ్లాష్‌బ్యాక్‌ అనకు. 'పుష్షింగ్‌ ది బాక్‌ టు ది ఫార్వర్డు' అను. ఎందుకంటే దీనికంత చరిత్ర ఉంది. విను... నేను పుట్టకముందు మేమంతా ఓ పల్లెటూరిలో ఉండేవారమట. పల్లెలో మాది మాత్రం పెద్ద ఇల్లు... పెద్ద వాకిలి... పెద్ద పెరడు... అంతా వాస్తు ప్రకారమే. మామిడి, కొబ్బరి, పనస, సపోటా, సీతాఫలం, అరటి వృక్షాలేకాక పూలమొక్కలు, పారిజాతాలు, ఫలసంపెంగ, పండ్ల సంపెంగ వృక్షాలూ ఉండేవి పెరట్లో. ఆ సంపెంగలపై నాగుపాముల జంట ఉండేదట. అందులో ఒకటి మా ఇంట్లోకీ మా గదుల్లోకీ వచ్చేదట. అప్పుడు మాది పెంకుటిల్లే. అలా వచ్చినా అది ఎవర్నీ ఏమీ చేసేదికాదట. మా నాన్నమ్మ గారు ఓ గిన్నెలో పాలు పోసి ప్రతీ రాత్రి గడప అవతల ఉంచితే, తాగేసి పోయేదట.&lt;br /&gt;ఓసారి ఏమైందంటే ధనుర్మాసంలో మా నాన్నమ్మ యధావిధిగా మూడు గంటలకే లేచి స్నానాదికాలు ముగించుకుని వేణుగోపాలస్వామి కోవెలకు తిరుప్పావై వినడానికి వెడుతూ, ప్రతి రోజులాగే ఇంటిల్లిపాదికి సరిపడే నీళ్ళు డేగిసాలో మరగబెట్టడానికి కట్టె పొయ్యిలో నిప్పు వేసిందట. మా అమ్మ లేచి పెరట్లోకెళ్ళి కడుపు తిప్పేంత వాసనొచ్చి, వాంతి అయ్యేంత పర్యంతమై మరి పెరట్లో ఉండలేక మంచంమీద పడిపోయిందట.&lt;br /&gt;'అమ్మకెందుకలాగయిందో' అని కంగారుగా అందరూ మంచం చుట్టూ చేరడం, వైద్యుడు రావటంతో పెరట్లో ఏమయిందో ఎవరూ గమనించలేదట. పాలు తీయడానికి వచ్చిన పనివాడు 'ఏంటమ్మా! ఈ కమురు కంపు?' అని అన్నాడే తప్ప వాడూ తెలుసుకోలేకపోయాడు. ఆ సాయంత్రం మాకు తెలిసిందేమిటంటే జంట పాముల్లో ఒకటి కప్పను తిన్నదో ఏమో కదలలేక పొయ్యిలో కర్రల మధ్య పడుకుని అగ్గికి ఆహుతి అయిపోయిందని. పాలు తాగే పాము ఆ రాత్రి రాలేదట. ఉదయం లేచి చూస్తే సంపెంగ దగ్గర రాతికి తల పగలగొట్టుకుని చచ్చిపడి ఉందట. మా నాన్నమ్మ గుర్తుపట్టి ఏడ్చింది. గంధంచెక్కల మధ్య అగ్ని సంస్కారాలు చేసినా ఎవరికీ శాంతి లేకపోయిందట.&lt;br /&gt;మూడు నెలల మా అమ్మ గర్భం పోయిందట. అప్పటినుండి ప్రతీసారి అదే తంతు. ఎన్ని పూజలూ... శాంతులూ చేయించినా లాభం లేకపోయిందట. చివరికి ఎవరో 'నాగులచవితినాడు నిష్ఠగా పూజ చేసి, పుట్టలో పాలుపోసి, జంటపాముల విగ్రహాన్ని పుట్టలోవేసి, ఉపవాసం ఉండి ప్రయత్నించండి' అన్నారట. మా నాన్నమ్మ అలాగే చేయించిందట. అద్భుతం పూజ ఫలించింది. మళ్ళీ నాగులచవితికి నేను నెల పిల్లనట. ఆనాటినుండి మా ఇంట్లో అందరి పేర్లకి 'నాగుడి' పేరు కలిపి పెట్టడం, ప్రతీ నాగులచవితికి పుట్టలో బంగారంతో చేసిన 'సర్ప మిధునం' వేయడం మాకు ఆనవాయితీ అయిపోయింది.&lt;br /&gt;అయితే ఈమధ్య కొన్ని ఏళ్ళుగా నేను ఇండియాలో ఆ టైముకి లేకపోవడతో మిగతావాళ్ళు సరిగా పట్టించుకోలేదు. కొంత ఎగతాళి చేసినవాళ్ళూ ఉన్నారనుకో. 'కీపిట్‌ ఎలూఫ్‌' ఈ సంవత్సరం ఎలాగైనా నాగులచవితి పండుగ యధావిధిగా జరపాలని స్టేట్స్‌ నుంచి వచ్చాను. ఈ పట్నాల సంగతి నీకు తెలుసుగా. ఈ అపార్టుమెంట్ల సంస్కృతిలో... కర్మాగారాల కల్చరులో... చెట్లు, పుట్టలు కరవైపోతూంటే ఇక నాగులచవితి ఎక్కడ? నాగమయ్య పూజలెక్కడ?అఫ్‌కోర్స్‌ అపార్టుమెంట్ల దగ్గరికీి పాములొస్తాయి తెస్తారు. అది నాకిష్టం లేదు. అందుకే నీకు కబురు పెట్టాను.&lt;br /&gt;దీపావళి వెళ్ళగానే మేమంతా మీ ఊరొస్తాం. చవితి అక్కడ చేస్తాం. ఏర్పాట్లు నీవు చూడాలి. మేముండడానికి ఇల్లు... పాలు పోయడానికి పుట్ట... పుట్టలో పాముండాలి. ఇంకోమాట ఒకరు పాలుపోసిన పుట్టలో మేం పాలు పొయ్యం. అంతేకాదు. ఆ పుట్టలో మరెవ్వరూ ఆ రోజు పాలు పోయకూడదు...'' అని ఆగిందామె. అంతవరకు ఆమె మాటలు వింటున్నట్టు నటిస్తున్న సీతాపతిరావు గారు ''నీవలా చెయ్యాలి. ఎందుకంటే ఆమె నమ్మకాలు ఆమెవి'' అన్నారు. ఆయన కాంతారావు తండ్రి. రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఆ ఇంట్లో నాగమ్మ గారి మాట ఎవరూ కాదనరు.&lt;br /&gt;వాళ్ళ మాటలు వింటూంటే నా గుండెలో రాయిపడినట్టయింది. మాది పల్లెటూరే. కానీ, ఇప్పుడు దాని స్వరూపమే మారిపోతోంది. తోటలు, చెరువులు మాయమయ్యాయి. చీమలు పెట్టిన పుట్లను పాములు ఆక్రమించినట్లు, కబ్జాస్వాములు మా ఊళ్ళోనూ అవతరించారు. పొలాలు బీడులవుతున్నా... నీరందక పంటలు ఎండిపోతున్నా 'నాకో పెళ్ళాంనాకో ఇల్లు' సిద్ధాంతంతో వ్యష్టి కుటుంబాలు బలపడటంతో మా పల్లెటూరు కూడా పట్నవాసపు వాసనలనందుకుంది. మిద్దెలు, మేడలు లేచాయి. ఖాళీ స్థలాల చుట్టూ ప్రహరీ గోడలూ ముళ్ళ కంచెలూ ఏర్పడ్డాయి. 'మమ్మీడాడీ' బడులూ వచ్చాయి.&lt;br /&gt;''అవునూ! మా వూళ్ళోనే మొక్కు తీర్చుకోవాలని మీకెందు కనిపించింది'' అని అడిగాను ఆ రాత్రి భోజనాల దగ్గర.&lt;br /&gt;''మీ వూళ్ళో శివాలయం వెనుక పెద్దపుట్ట ఉందనీ అందులో వూరిలో సగంమంది పాలు పోస్తారనీ విన్నాను'' అన్నారు సీతాపతిగారు.&lt;br /&gt;''అంతేకాదు. నేను ఫిలడల్ఫియాలో ఉన్నప్పుడు తెలిసివాళ్ళలో మా ఫ్రెండు నాకొక పార్శిల్‌ పంపింది. దాని రేపరు తెలుగు పేపరు. అందులో న్యూస్‌ ఏమిటో తెలుసా? 'మారేడు వనంలో పాముకాటుకు ఒకరు మృతి' అని. ఆ వెంటనే మీ ఊరినే డిసైడ్‌ చేసేశాను. అంతేకాదు. తోడుగా నీవూ ఉన్నావు. మరి 'మారేడు వనం' మీ వూరేగా?'' అంది నాగేశ్వరి గారు.&lt;br /&gt;మా వూరిపేరు అమెరికాలో ఆ విధంగా ప్రతిధ్వనించినందుకు నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియలేదు. మా ఊళ్ళో శివాలయం ఉందిగానీ పుట్టలేదు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి కోవెల కట్టారు.&lt;br /&gt;'యధార్థస్థితి ఇది' అని చెప్పినా వాళ్ళు నమ్మరు. మరి నాకు తప్పలేదు. ఎందుకంటే ఆమె తన దగ్గరున్న పేపర్‌ కటింగ్‌నే నమ్ముతోంది.&lt;br /&gt;* * *&lt;br /&gt;''గోవరాజూ! అదిరా కధ. నీవు గొడ్లను కాయడానికి పొలాల వెంటా... పుట్లవెంటా తిరుగుతుంటావు. ఒక పుట్టను వెతికిపెట్టరా బాబూ! నీకు పుణ్యముంటుంది. అందులో మాత్రం పాముండాలిరోయ్‌! నీ కష్టం ఉంచుకోను'' అన్నాను. నా దగ్గర వాడికి చదువు బాగా రాకపోయినా నన్ను 'గురూ గారూ' అంటూ గౌరవిస్తూ చెప్పిన పని చేస్తూంటాడు.&lt;br /&gt;గోవరాజు ఆలోచనలోపడ్డాడు. స్కూలు వరండాలో మసిబొగ్గుతో గీతలు గీస్తూ ''బాబూ! ఇది సెరువుగట్టు... ఇది బహిర్భూమి... ఇటు పెద్ద ఇస్కూలు... ఈ మూల టూరింగ్‌ టాకీసు... ఇటు కొండ...''&lt;br /&gt;''అదంతా ఎందుకురా! మన వూరివాళ్ళు పాలు పోసేందుకు ఎక్కడికి వెళతారు?''&lt;br /&gt;''ఏడికెళ్తారు సావీ! కొండమీదిగ్గాదూ... ఆడనే ఉండయికదా పుట్టలు. ఆయమ్మ ఎక్కలేరు గదా! పొలాల్లో ఉండయిగానీ మనదాక రానిత్తారూ...'' అంటూ గొంతుకిల్లా కూర్చుని ఆలోచనలోపడ్డాడు గోవరాజు.&lt;br /&gt;అంతలో కాంతారావు 'కార్యక్రమం అయ్యేంతవరకు ఉంచుకో' అని నాకిచ్చిన సెల్‌ మోగింది. సెల్‌ అందుకుని 'హల్లో' అన్నా.&lt;br /&gt;''ఆ! నేనేరా మాష్ట్రూ! మొన్న మా అమ్మ ఒక విషయం చెప్పడం మరచిందట. మనకు కావలసిన పుట్ట వేపచెట్టు కిందదే అయ్యుండాలట'' అన్నాడు.&lt;br /&gt;నా గుండెలో రాయిపడింది. నోరు పెగుల్చుకుని ''మా వూళ్ళో కరచిన పాము వేపచెట్టు కింద పుట్టలోనిది కాదేమోరా!'' అన్నాను.&lt;br /&gt;''నోరు ముయ్యి! పాము కుట్టడం ఎవరికి కావాలోయ్‌! వేపచెట్టు చెట్టుకింద పుట్ట పుట్టలో పాము ఆ పాముకే పాలు పొయ్యాలి'' అంటూ కట్‌ చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోని పాము సంపెంగ చెట్టు మీద కదా ఉంది... ఈ వేపచెట్టు ఎక్కడిది? అయినా ఇప్పుడు సంపెంగ గుర్తుచేస్తే... కూడదు... నేను ఏ సింహాచలమో వెళ్ళి సంపెంగ వృక్షాన్ని తేలేను. నోరు మూసుకుంటూ 'అదిరా కొత్త కధ' అంటూ వివరించా.&lt;br /&gt;గోవరాజు విని, తల పంకించి, యుంకించి ''సావీ! తవరు నిబ్బరంగా ఉండండి. ఆయమ్మగారు వచ్చేతలికి ఏపచెట్టు పుట్ట పాము యాడున్నా ఎతికిపెట్టే పూచీ నాది'' అంటూ గేదెల్ని తోలుకుంటూ వెళ్ళాడు.&lt;br /&gt;దీపావళి వెళ్లిన మూడో రోజున కాంతారావు, భార్య, సీతాపతిగారు, నాగమ్మగారు ఇద్దరు మనవలతో పడవలాంటి పెద్ద కారులో మా ఊరొచ్చారు. అంతకుముందే మా పక్కింటిని వాళ్ళకోసం ఏర్పాటుచేశాం. రాగానే అందులోకి ప్రవేశించి పద్ధతి ప్రకారం పాలు పొంగించారు. మా ఆవిడ, పిల్లలు ఒదిగి ఒదిగి వాళ్ళకు కాఫీలూ టిఫిన్లూ భోజనాలూ ఏర్పాటుచేశారు.&lt;br /&gt;ఆరోజు సాయంత్రం ఆకాశదీపం పెట్టే వేళకు ముందుగా గోవరాజు వచ్చాడు. వస్తూనే ''బాబూ! ఆయమ్మగారు గొప్ప అదృష్టవంతులండీ! గొప్ప జాతిపాము సావీ! గోధుమరంగు, మంచి పొగరులో ఉంది. మన పుట్టలోనే సావీ! అది సరింగా మన పుట్టమీదే పొర ఇడిసిపెట్టినాది. వచ్చి సూత్తారేటి?'' అన్నాడు. నాగమ్మగారు, కాంతారావు, పిల్లలు వాడి మాటలకు లోపలి నుండి వచ్చారు.&lt;br /&gt;''రాండి... సూదురుగాని'' అన్నాడు నాగమ్మగార్ని చూసి.&lt;br /&gt;''నేనొస్తా పద'' అన్నాడు కాంతారావు. నేనూ పిల్లలూ పుట్టను చూడ్డానికెళ్ళాం. మా ఇంటికి దగ్గరలోనే వేపచెట్టు కింద పుట్ట చాలా పెద్దది. పుట్టమీద పాము కుబుసం. ఎవ్వరూ దగ్గరికి చేరకుండా చుట్టూ తుమ్మకంచె పడేశాడు గోవరాజు. కాంతారావు తృప్తిపడ్డాడు.&lt;br /&gt;''గోవరాజూ! పాము ఎప్పుడూ ఇందులోనే ఉంటుందా?'' అని భయపడుతూ అడిగాను.&lt;br /&gt;''మనం మనింటిలో ఉండక యాడికిపోతాం సావీ! ఇదీ అంతే'' అన్నాడు.&lt;br /&gt;పాము పాలు పోసేటప్పుడు బయటికి వస్తే భయపడుతూనే ఇల్లు చేరాను.&lt;br /&gt;చవితినాడు దేవుడి గదిలో పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు నాగమ్మగారు. వాళ్ళకు కావలసిన సరంజామా అంతా నేను సమకూర్చిపెడితే మా శ్రీమతి వాళ్ళకు పనుల్లో సాయపడింది. గోవరాజు ఉదయాన్నే ఆవుపాలు లీటరు సంపాదించి తెచ్చాడు. నువ్వులు, బెల్లం దంచి ఉండలు కట్టారు. అత్తా కోడళ్ళు నానబెట్టిన బియ్యం దంచి, నూరిన పంచదార, కొబ్బరికోరు, యాలకుల పొడి కలిపి ఉండలు కట్టారు. ఇంటి దగ్గర గద్దె నాగయ్యకి పూజచేసి, పాలుపోసి, ప్రసాదం నివేదన చేసి అత్తా కోడళ్ళు పట్టుచీరలు కట్టుకుని పెద్ద వెండి పళ్ళాలలో పూలు, పళ్ళు, చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, నాగుల గావంచా పట్టుకుని బయలుదేరగా, పట్టుపంచెలు కట్టుకుని తండ్రీ కొడుకులు, వెండి చెంబుల్లో పాలు, నీళ్ళు పట్టుకుని బయలుదేరారు. పుట్టకెళ్ళే ఆచారం మాకులేదు కనుక మావాళ్ళెవరూ బయలుదేరకపోయినా, కార్యక్రమం పూర్తయేంతవరకు ఉండాలి కాబట్టి నేనూ గోవరాజు వాళ్ళతో బయలుదేరాం. చెట్టు, పుట్ట, ఆ వాతావరణం చూసి అందరూ తృప్తిపడ్డారు. గోవరాజు ముళ్ళకంచె తొలగించి, పాము కుబుసాన్ని పైకి లాగి ఓ పక్కగా ఉంచాడు.&lt;br /&gt;పూజ మొదలైన దగ్గర్నుండి నాకు భయంగానే ఉంది. ఒక్కసారి బుసకొడుతూ పాము బయటికి వస్తే 'ఏమిటో గతిరా దేవుడా' అని నేను భయపడుతూంటే గోవరాజు నా భయంతో నిమిత్తం లేకుండా దగ్గరుండి పూజ నడిపించాడు. పుట్ట దగ్గర నీళ్ళు చల్లి, ముగ్గులు పెట్టి, పసుపు కుంకుమలతో పూజలు చేసి ''ఇన్ని కన్నాలున్నాయి కదా పాలు ఎందులో పోయమంటావు?'' అని అడిగారు అత్తా కోడళ్ళు.&lt;br /&gt;''ఏ పుట్టలో ఏ పాముంటాదో ఎవురికెరుక తల్లే! కాసినేసి పాలు అన్నిట్లా పోసేండమ్మా! అలాగే సనివిడి, సిమ్మిలీనూ!'' అని సలహా ఇచ్చాడు గోవరాజు.&lt;br /&gt;చేతులు కట్టుకుని, వాళ్ళలా చేసిన తరవాత సీతాపతిగారు, కాంతారావు అలాగే చేశారు. పిల్లలు వాళ్ళననుసరించారు. నాగుల గావంచా పుట్టమీద వేసి, పుట్ట మన్నుతీసి ఇచ్చారు నాగమ్మగారు అందర్నీ పెట్టుకోమని చెవికి. తరవాత అరతులంతో చేసిన బంగారపు సర్ప మిధునాన్ని నాగమయ్యని స్మరించుకుంటూ పుట్టలో వేశారు. పదేపదే దండాలు పెట్టుకుని తిరిగి వస్తూ మూడుచోట్ల నీళ్ళు చల్లి, మూడేసి చిన్నరాళ్ళను కుప్పగాపోసి, వరిపిండి జల్లి వెనక్కి చూడకుండా తిరిగివచ్చారు నాగమ్మగారు. వస్తూ&lt;br /&gt;''ఒరేయ్‌ అబ్బాయ్‌! ఈ రోజున ఈ పుట్టలో మరెవరూ పాలు పోయకూడదు. పూజ చేయకూడదు. చూసే బాధ్యత నీది. ఇదిగో ప్రసాదం. ఇదిగో వంద... ఇంద... తీసుకో'' అంటూ ప్రసాదం, ఓ వంద రూపాయల నోటు వాడి చేతిలోపెట్టి వచ్చారు. ఆరోజు పచ్చి మంచినీళ్ళయినా తాగకుండా అత్తా కోడళ్ళు ఉపవాసముండి నాగపంచమినాడు మాతో భోజనాలు చేసి ఆ మర్నాడు అందరూ వైజాగ్‌ బయలుదేరి వెళ్ళిపోయారు.&lt;br /&gt;వెళ్తూ ''నా పెద్ద మనుమరాలు కన్సీవ్‌ అయింది. సవ్యంగా పురుడు రావాలనమ్మా ఈనా తాపత్రయమంతా...'' అని చెప్పిందామె. వెళ్ళిన తరవాత ఏ కబురూ కాకరకాయ లేకపోయినా కొన్ని నెలల తరవాత ఆమె కాంతారావుచేత నాకు ఫోన్‌ చేయించి, పెద్ద మనుమరాలికి కూతురు పుట్టిందని చెప్పింది. నాకా వార్త ఆనందాన్ని కలిగించినా... ఎక్కువ భయాన్నే కలుగజేసింది. 'మొక్కు తీర్చుకోడానికి మళ్ళీ మా ఊరు ఎక్కడ వచ్చేస్తానంటుందో' అనే నా భయం.&lt;br /&gt;ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మూడో రోజు సాయంత్రం మా అబ్బాయి ఏదో చెబితే అటు వెళ్ళి చూశాను.&lt;br /&gt;అక్కడ వేపచెట్టయితే ఉందిగానీ... పుట్ట మాత్రం లేదు. గోవరాజు కూడా నాకు కనపడటం మానేశాడు.&lt;br /&gt;ఇక నే చెప్పేదేముంది?!&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/13455637-112194333732751227?l=telugukathalu.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugukathalu.blogspot.com/feeds/112194333732751227/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=13455637&amp;postID=112194333732751227' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194333732751227'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/13455637/posts/default/112194333732751227'/><link rel='alternate' type='text/html' href='http://telugukathalu.blogspot.com/2005/07/blog-post_21.html' title='నాగమ్మగారు నాగుల చవితి'/><author><name>telugu sevaka</name><uri>http://www.blogger.com/profile/16497430918351086776</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-13455637.post-112087819300923874</id><published>2005-07-08T20:01:00.000-07:00</published><updated>2005-07-08T20:03:13.023-07:00</updated><title type='text'>ఉఫ్‌ వెంట్రుక</title><content type='html'>హాస్యం కథ&lt;br /&gt;ఉఫ్‌ వెంట్రుక&lt;br /&gt;- కె.వి.నరేందర్‌&lt;br /&gt;&lt;br /&gt;రాత్రి రెండున్నర సమయం.&lt;br /&gt;శ్రీవారి గర్భగుడి తలుపులు మూతపడ్డాయి. భక్త జన సందోహం తాకిడితో అలసిపోయిన వేంకటేశ్వరుడు కాసేపు కునుకు తీద్దామనుకున్నాడు.&lt;br /&gt;ఇంతలో సన్నటి ఏడ్పు విన్పించింది. స్వామికి ఆశ్చర్యం కలిగింది. గర్భగుడిలో ఎవరైనా చిక్కుబడిపోయారా అని నలుదిక్కులా చూశాడు.&lt;br /&gt;ఎవరూ కన్పించలేదు. అయినా చిన్నగా ఏడ్పు విన్పిస్తోంది. తన భక్తుల్లో ఎవరికి ఏ ఆపద కలిగిందోనని స్వామి కంగారుపడ్డారు. ఎవరూ కన్పించట్లేదు.&lt;br /&gt;''ఎవరూ...?'' అన్నాడు స్వామి.&lt;br /&gt;ఉలుకూ లేదు పలుకూ లేదు. ఏడ్పు తప్ప.&lt;br /&gt;''ఎవరూ లేరే... కానీ ఆ ఏడ్పు ఎక్కడిదబ్బా....'' అని ఆశ్చర్యపోయి గర్భగుడి అంతా మరోసారి చూశాడు. ఏ ప్రాణీ కన్పించలేదు... ఏడ్పు మాత్రం విన్పిస్తూనే ఉంది.&lt;br /&gt;స్వామి కంగారుగా... కొంచెం కోపంగా.. 'ఎవరదీ?' అన్నాడు గట్టిగా.&lt;br /&gt;ఏడ్పు ఆగిపోయింది.&lt;br /&gt;''హు... మీ కంటికి నేనెక్కడ కన్పిస్తాను స్వామీ... ఏటా నా వల్ల వచ్చే నలభై కోట్ల రూపాయల ఆదాయం మాత్రం కన్పిస్తుంది...'' ఒక నిష్ఠూరమైన మాటతో పాటు మళ్లీ ఏడ్పు విన్పించింది.&lt;br /&gt;శ్రీవారు కొంచెం ఉలిక్కిపడ్డారు. ఇదేదో తనని ఇరకాటంలో పడేసే మాటలా అన్పించి.... కొంచెం జాగ్రత్తగా చూశారు. ఏమీ కన్పించలేదు.&lt;br /&gt;''ఇటు చూడండి స్వామీ ఈ మూలకు..'' అని విన్పించడంతో అటువైపు చూశారు. ఒక వెంట్రుక... మూలన పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. తిరుమలేశుడికి నవ్వొచ్చింది. దానికొచ్చిన కష్టమేంటో తెల్సుకోవాలని నవ్వుతూ, ''ఓహో.... కేశ ఖండికా...'' అంటూ చేతుల్లోకి తీసుకున్నాడు.&lt;br /&gt;వెంట్రుక ఏడ్పు ఆపి ''అవును కేశ ఖండికనే. కానీ జనమెవ్వరూ అంత మంచి పేరుతో పిలవరు'' అంది నిట్టూర్పుతో.&lt;br /&gt;గోవిందుడు నవ్వి ''ఇప్పుడు నీకు కలిగిన బాధేంటి?'' అన్నాడు.&lt;br /&gt;''నేనంటే అందరికీ చులకనైపోయింది. నా వ్యక్తిత్వానికి నా అస్తిత్వానికి భంగం కలుగుతోంది. అదే నన్ను బాధపెడుతోంది'' అంది మళ్లీ బిగ్గరగా&lt;br /&gt;ఏడుస్తూ.&lt;br /&gt;''నీకు కలిగిన భంగమేమిటి?'' అడిగాడు ఏడుకొండలవాడు.&lt;br /&gt;''నావల్ల ఎందరో లాభపడుతూ కూడా నేనంటే విలువ లేకుండా చూస్తున్నారు. నా వల్ల మీకు కూడా ఏటా కోట్ల రూపాయలొస్తున్నాయాయె..'' అంది.&lt;br /&gt;శ్రీవారికి కొంచెం సిగ్గనిపించింది... ఈగో దెబ్బతిన్నట్టు చూశాడు. వెంట్రుకల ద్వారా కూడా వేంకటేశ్వర స్వామి సంపాదించుకుంటున్నాడు అని ఎక్కడ ప్రచారం జరుగుతుందోనన్న భయంతో... ఎలాంటి ఫీలింగూ కన్పించకుండా...&lt;br /&gt;''సరే... నీ వ్యక్తిత్వానికి ఎక్కడ భంగం కలిగిందో చెప్పు కేశఖండికా...'' అనడిగాడు.&lt;br /&gt;''ఒక్కచోటా... రెండుచోట్లా... ఎక్కడని చెప్పను? ప్రపంచమంతా నా వల్ల కోట్లు సంపాదిస్తూనే నన్ను చిన్నచూపు చూస్తోంది. అంతెందుకూ... మీక్కూడా నా వల్ల కోట్లు...'' అని ఆగింది, స్వామి కొంచెం కోపంగా చూడటంతో...&lt;br /&gt;''నేను నిన్ను గౌరవంగానే చూస్తున్నా కదా... నీకు జరిగిన అవమానమెక్కడో చెప్పు'' అన్నాడు.&lt;br /&gt;''మీరు నా వెంట వస్తే చూపిస్తాను.. నా అస్తిత్వాన్ని దెబ్బ తీస్తున్న సంఘటనలు'' అంది ఏడ్పు గొంతుతో.&lt;br /&gt;''సరే... పద'' అన్నాడు స్వామి.&lt;br /&gt;ఇద్దరూ కల్సి ఆకాశమార్గాన బయల్దేరారు.&lt;br /&gt;వెంట్రుక ఓ చోట స్వామిని ఆపి... ''ఆ ఇంట్లో వంట గదిలోని దృశ్యం చూడండి స్వామీ'' అంది.&lt;br /&gt;భర్త భోంచేస్తూ ఉంటే... భార్య దగ్గరుండి వడ్డిస్తోంది.... తిరుమలేశుడు ఆశ్చర్యపోయాడు. ''టీవీ ఛానెల్స్‌ వచ్చాక ఇలాంటి దృశ్యాలు కరువయ్యాయి. గొప్ప దృశ్యం'' అనుకున్నాడు స్వామి.&lt;br /&gt;ఇంతలో భర్త కంచంలో పొడవాటి వెంట్రుక దొరికింది. అది చూడగానే భర్త ఆగ్రహోదగ్రుడయ్యాడు.&lt;br /&gt;''ఏంటే... అన్నంలో ఈ వెంట్రుక...'' అంటూ భార్యని ఈడ్చికొట్టాడు. వెంకటేశ్వర స్వామికి కూడా ఆ సౌండ్‌కి గుండె జల్లుమంది.&lt;br /&gt;''చూశారా నా విలువ....'' అని మళ్లీ ఏడ్పు అందుకుంది వెంట్రుక. స్వామి ఓదార్చాడు.&lt;br /&gt;''అది కాదు స్వామీ... మీ సృష్టి ప్రకారం తలపై లక్షా యాభై వేల వెంట్రుకలుంటాయి. ఒక్క వెంట్రుక అన్నంలో కన్పడితేనే .... భార్యను కొట్టాడంటే నన్నెంత హీనంగా చూస్తున్నట్టు .... ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బిజినెస్సు మా వెంట్రుకల పైనే జరుగుతోంది. అయినా నా విలువ చూశారా?'' అంది.&lt;br /&gt;స్వామికి జాలేసింది...&lt;br /&gt;''నిజమే కేశఖండికా... ఇది నీ వ్యక్తిత్వానికి భంగమే'' అని నిట్టూర్చాడు. మళ్లీ బయల్దేరారు.&lt;br /&gt;వెంట్రుక మరో చోట స్వామిని ఆపి... 'వాళ్ల మాటలు వినండి దేవా' అని చూపించింది.&lt;br /&gt;ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు.&lt;br /&gt;''ఒరేయ్‌ ... ఈ బిజినెస్‌ చేసి చూద్దాం ... కొండకు వెంట్రుకేసి లాగినట్టనుకో ... వస్తే కొండ ... పోతే వెంట్రుక'' అన్నాడొకడు.&lt;br /&gt;స్వామికి నవ్వొచ్చింది. పక్కనే వెంట్రుక ఉండటంతో తమాయించుకున్నాడు.&lt;br /&gt;''చూశారా స్వామీ. అదీ నాకున్న విలువ. నేనంటే గౌరవం లేకుండా పోయింది. నా విలువ అంతేనా... మీక్కూడా నా వల్ల ఏటా....'' అని మళ్లీ ఏడ్వబోయేంతలో 'సరె సరె... ఇంక పద' అని కదిలాడు స్వామి.&lt;br /&gt;దార్లో తన గోడు వెళ్లబోసుకుంటోంది.&lt;br /&gt;''మనిషి అనే వాడికి నాపై అభిమానముందో... అవహేళన ఉందో ఒక్కోసారి అర్థం కాదు. రోషం కోసం, అందం కోసం మీసాలు దిద్దుకుంటాడు. అదే గడ్డంలా పెరిగితే.. బైరాగిలా ఆ గడ్డమేంట్రా అంటారు. స్థలం మారగానే నా విలువ మారుతోంది...'' అని మళ్లీ కళ్లనీళ్లు తుడుచుకుంది.&lt;br /&gt;''మనిషి తీరే అంత. వాటిని పట్టించుకోకు... పుట్టపర్తి బాబాకు తల వెంట్రుకల వల్లే కదా ఆ అందం... రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ని గడ్డం లేకుండా... వీరప్పన్‌ని మీసాల్లేకుండా గుర్తు పట్టగలమా... కేశఖండికా... నీ అందం నీదే...'' అని పొగిడాడు.&lt;br /&gt;వెంట్రుకలో కొంచెం గర్వం కనపడింది.&lt;br /&gt;''అవును స్వామీ... కేశవా అన్న పేరు మీకు వచ్చిందంటే అది నా వల్లే కదా....'' అంది.&lt;br /&gt;శ్రీవారు ఇబ్బందిగా ''సరే... పద'' అనడంతో ముక్కు చీది కదిలింది. ఆకాశ మార్గాన మరి కొంత దూరం పోయాక...&lt;br /&gt;''స్వామీ... ఆ ఫ్యాక్టరీల్ని చూడండి. షాంపూలు తయారు చేసే ఆ ఫ్యాక్టరీలు ఏటా ఆరు వందల కోట్లు సంపాదిస్తున్నాయి. నేనే లేకపోతే ఆ ఫ్యాక్టరీలకు అతీగతీ ఉందా....'' అంది ఆవేశంగా.&lt;br /&gt;''అవునవును. వాటి బతుకుదెరువంతా నీ మీదే ఆధారపడి ఉంది నిజమే'' శ్రీనివాసుడు ఆశ్చర్యపోతూనే ఒప్పుకున్నాడు.&lt;br /&gt;''మరి అటు చూడండి స్వామీ... '' అంది వెంట్రుక.&lt;br /&gt;అక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు... చొక్కాలు పట్టుకొని అరుచుకుంటున్నారు.&lt;br /&gt;''పోరా, ఫో... నువ్వు నా వెంట్రుకతో సమానం'' అంటున్నాడొకడు.&lt;br /&gt;మరొకడు తల వెంట్రుక పీకి... ''నేను కాదురా... నువ్వే దీంతో సమానం'' అన్నాడు.&lt;br /&gt;స్వామి ఇబ్బందిగా వెంట్రుక వైపు చూశాడు. వెంట్రుక బాధగా 'రండి స్వామీ' అంటూ కదిలింది.&lt;br /&gt;మధ్య మధ్యలో .... కొబ్బరి నూనె కంపెనీల్ని చూపిస్తూ ... అవన్నీ తన వల్లే బతుకుతున్నాయని చెప్పింది. లక్షలాది హెయిర్‌ డ్రస్సర్‌ షాపుల్ని చూపిస్తూ నేను లేకపోతే వాళ్లంతా బజార్నపడతారు కదాని జాలి పడింది. నలభై కోట్ల ప్రస్తావన ఎక్కడ తెస్తుందోనని స్వామి కూడా నిశ్శబ్దంగా తలూపుతున్నాడు.&lt;br /&gt;కొంత దూరం పోయాక .... భూమ్మీదకు చూపిస్తూ ... ''అవి చూడండి ... అవన్నీ తెల్లగా మారిన నన్ను నల్లగా మార్చే హెయిర్‌ డై కంపెనీలు ... షాంపూ ఫ్యాక్టరీల్లాగే నా వల్ల హెయిర్‌ డై కంపెనీలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. నేను గనుక తెల్లగా మారకపోతే వాటి బతుకు తెల్లారిపోతుంది'' అంది అక్కసుగా.&lt;br /&gt;''అవును ... సత్యం చెప్పావు'' అన్నాడు స్వామి.&lt;br /&gt;''అంతెందుకు స్వామీ .... నేర పరిశోధనలో నేనెంత సహకరిస్తున్నానో తెలుసా ... అలాగే ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి నా నుంచి ఎల్‌సిస్టిన్‌ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. విగ్గులు తయారు చేసే కంపెనీలు కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్నాయి. అయినా ఈ మనిషి అనే వాడు నాకూ మతాన్ని అంటగట్టాడు...'' అంది వెంట్రుక మరింత బాధగా...&lt;br /&gt;దేవుడు ఆశ్చర్యపోయాడు.&lt;br /&gt;''అల్పజీవివి... నీకూ మతాన్ని అంటగట్టారా?'' అనడిగాడు తెలీనట్టు...&lt;br /&gt;''అవును స్వామీ... ఇజ్రాయెల్‌లో పెళ్లయిన స్త్రీలు భర్తకు తప్ప ఇతరులకు వెంట్రుకలు చూపరాదన్న మతాచారంతో విగ్గులు ధరించేవారు. ఆ విగ్గులు మీకు సమర్పించిన వెంట్రుకలవి అని తెల్సుకొని హిందువుల దేవుడికి అర్పించిన వెంట్రుకలు నిషిద్ధమని లక్షల విగ్గుల్ని తగులబెట్టారు. ఆ మంటల్లో మాడిపోతూ నేనెంత ఏడ్చానో మీకేం తెలుసు....'' అంది.&lt;br /&gt;వెంట్రుక బాధని తగ్గించేలా స్వామి ఓదారుస్తూనే ఉన్నాడు. ఇలా.. ఎన్నెన్నో సంఘటనలు చూపిస్తూ ఆ కేశం... తన మనోక్లేశాన్ని భగవంతుడికి చెప్పి చెప్పి... ఇద్దరూ కల్సి స్వర్గలోకం చేరుకున్నారు.&lt;br /&gt;''ఊరుకో కేశఖండికా... నీ వ్యక్తిత్వం, నీ అస్తిత్వం ఎలా దెబ్బ తింటున్నాయో అర్థం చేసుకున్నాను... నీ బాధకు కొంతైనా ఉపశమనం కలిగిస్తాను'' అంటూ హంస తూలికా తల్పంపై పవళిస్తూ... వెంట్రుకని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు.&lt;br /&gt;వెంట్రుక తన జన్మ ధన్యమైనంతగా ఆనందపడిపోయింది.&lt;br /&gt;పది నిముషాల తర్వాత .... పద్మావతీదేవి వస్తూనే ....&lt;br /&gt;''ఇంతసేపూ ఎక్కడికెళ్లారు ప్రభూ ... నాతో మాట మాత్రమైనా చెప్పలేదే...?'' అంటూ గారాబంగా శ్రీనివాసుడి ఎదపై తల ఆనించింది. అంతే. స్వామి ఛాతీ మీద నల్లగా నిగనిగలాడుతున్న వెంట్రుక కన్పించి చివ్వున లేచింది.&lt;br /&gt;కోపంగా... ఎడం చేత్తో ఆ వెంట్రుకని తీసింది.&lt;br /&gt;''నిజం చెప్పండి ... ఇప్పటివరకూ ఎక్కడికెళ్లారు ... ఈ వెంట్రుక ఎవర్తిది...?'' అంది కళ్లు ఎర్రబారుతుంటే...&lt;br /&gt;స్వామి అదిరిపడ్డాడు...&lt;br /&gt;''అది కాదు దేవీ ... ఆ వెంట్రుక...'' అని చెప్పబోయేంతలోనే ... కసిగా దాన్ని ''తల మాసిం దానా...'' అని తిట్టింది.&lt;br /&gt;గుడ్లురిమి చూస్తూ... 'ఉఫ్‌...' అని గట్టిగా ఊదింది.&lt;br /&gt;ఆ దెబ్బతో వెంట్రుక గిరికీలు కొట్టుకుంటూ వచ్చి కళ్యాణకట్టలో పడింది...&lt;br /&gt;''పద్మావతీ... నన్ను నమ్ము... పాపం ఆ వెంట్రుక విషయంలో నువ్వు అనుమానపడాల్సింది ఏమీ లేదు'' అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా...&lt;br /&gt;పద్మావతి నమ్మలేదు... రెండు గంటల పాటు దాని కథంతా చెప్పాక... నమ్మింది.&lt;br /&gt;అవునా... అంటూ నవ్వింది.&lt;br /&gt;''హమ్మయ్య .... వెంట్రుకవాసిలో గండం తప్పింది...'' రిలీఫ్‌గా అనుకున్నాడు శ్రీనివాసుడు.&lt;br /&gt;నీతి: కొన్ని జీవితాలింతే వాటిని దేవుడు కూడా మార్చలేడు&lt;br /&gt;మీరే కారణం&lt;br /&gt;డాక్టర్‌ కె.ఎన్‌.మల్లీశ్వరి&lt;br /&gt;&lt;br /&gt;రాధిక హుషారయిన పిల్ల. ఎపుడూ చిరునవ్వుతో ఉల్లాసంగా ఆడుతూ, పాడుతూ కనిపిస్తుంది. ఆ రోజూ ఎప్పటిలాగే స్కూలు నుంచి రాగానే వాళ్లమ్మకి చెప్పి ఆడుకోడానికి బయటికి వచ్చింది. ఆట - పాటల్లో చురుగ్గా ఉండే అమ్మాయి కావడంతో ఆమె మిత్ర బృందానికి అనధికారికంగా ఆమే లీడర్‌...&lt;br /&gt;ఆ బృందానికి రాధిక మాట వేదవాక్కు. ఆమె ఏ ఆట ఆడదామంటే వాళ్లు ఆ ఆట ఆడక తప్పదు. చిత్రంగా వాళ్లల్లో రాధిక తప్ప అందరూ మగ పిల్లలే! రాధికకి చిన్నప్పట్నుంచీ ఆడపిల్లలు ఆడుకునే చింతపిక్కలాట... తొక్కుడు బిళ్ల... వామనగుంటలు... అష్టాచెమ్మ మొదలైన ఆటలు నచ్చేవి కావు.&lt;br /&gt;స్వేచ్ఛగా ఆరుబయట ప్రదేశంలో ఉరుకులు, పరుగులు పెట్టే ఆటలంటే ఆ పిల్లకి ఇష్టం.. రాధిక తండ్రి ప్రకాశరావు చిన్నప్పట్నించీ కూతుర్ని గుండెల్లో పెట్టుకుని పెంచాడు. మొదట పాప పుట్టినప్పుడు ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాడు. రెండో కాన్పులో మగ పిల్లాడు కలిగినపుడు 'పున్నామ నరకం' తప్పిందని సంతృప్తి చెందాడే గానీ హృదయంలోకి తొంగి చూసుకుంటే కూతురంటేనే ప్రేమ పొంగులు వారేది.&lt;br /&gt;తండ్రి ప్రేమ కూడా నిండారా దొరకడంతో రాధికలో చైతన్యం తొణికిసలాడుతూ ఉండేది. ఇంట్లో నానమ్మకీ, అమ్మకీ, తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం అని అపుడపుడూ అన్పించినా తండ్రి ప్రేమ సాయంతో అందరి ప్రేమనీ పొందగలిగింది.&lt;br /&gt;రాధికని చూడగానే ఆమె స్నేహితులంతా చుట్టుముట్టేశారు. ''ఈ రోజు ఏం ఆట ఆడదాం?'' ఓ అబ్బాయి అడిగాడు. రాధిక నడుం మీద చెయ్యేసుకుని నిలబడి ఓ నిముషం ఆలోచించింది.&lt;br /&gt;&lt;br /&gt;అదే సమయంలో ఆఫీస్‌ నుంచి వస్తున్న ప్రకాశరావుకి రాధిక కనిపించి లూనా ఆపాడు. అతను సాధారణంగా ఆ సమయంలో ఆఫీసు నుంచి రాడు... అతను ఇంటికి వచ్చేసరికి రోజూ ఎనిమిది దాటుతుంది. పండగ దగ్గర పడటంతో పిల్లలకి బట్టలు కొందామని ఆఫీసులో పర్మిషన్‌ పెట్టుకుని వచ్చాడు. రాధికని పిలవబోతుండగా ఎదురొచ్చారు తమ పక్కింట్లో ఉండే భార్యాభర్తలు. వాళ్ల మనస్తత్వాలు తమకు విరుద్ధం కావడంతో వాళ్లకి దూరంగా ఉంటాడు ప్రకాశరావు.&lt;br /&gt;హఠాత్తుగా వాళ్లు కనబడడంతో బలవంతంగా చిరునవ్వు నవ్వాడు. వాళ్లిద్దరూ ఆగారు.. అతను ప్రకాశరావునుద్దేశించి ''మీ అమ్మాయి కోసం ఆగారా? మగ పిల్లలతో ఎపుడు చూసినా గెంతులే! అవి ఇప్పట్లో తెమలవులెండి. రోజూ ఇదే తంతు. మొన్నటికి మొన్న క్రికెట్‌ ఆడుతూ మీ ఎదురింటి కిటికీ అద్దం పగలగొట్టింది. వాళ్లు ఇంటి మీదకి వస్తే మీ మిసెస్‌ సర్ది చెప్పలేక అష్టకష్టాలూ పడ్డారనుకోండి. అయినా ఆడపిల్లని అణకువగా, ఒద్దికగా ఉండేలా పెంచాలి గానీ ఇలాగా? చూడండి, నడుం మీద చెయ్యేసుకుని ఎలా నిలబడిందో!'' చిన్నగా నవ్వుతూ నవ్వుతూనే అనాల్సినవన్నీ అనేస్తుంటే ప్రకాశరావు మొహం ఎర్రబడింది.&lt;br /&gt;ఆఫీసుకి వెళ్లడం, రావడం, కొంచెం తీరిక ఉంటే పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పించుకోవడం... అంతే! కానీ తన కూతురి గురించి ఇలా అనుకుంటున్నారని ప్రకాశరావుకి తెలియదు...&lt;br /&gt;&lt;br /&gt;చాలా అవమానంగా అన్పించింది. 'ఆడపిల్ల తండ్రిని' అనుకోగానే రక రకాల భయాలూ, ఆందోళనలూ చుట్టుముట్టాయి. ఇంతకు ముందు లేని కొత్త ఆలోచనలేవో కలుగుతున్నాయి.&lt;br /&gt;విసురుగా లూనా స్టార్ట్‌ చేసి వేగంగా నడుపుతూ ఇంటికి వచ్చాడు. ఎవరు పలకరించినా పలకలేదు. కాళ్లయినా కడుక్కోకుండా కుర్చీలో కూర్చున్నాడు. భార్యా, తల్లీ వంట గదిలోనే ఉండిపోయారు.&lt;br /&gt;కను చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ తర్వాత పది నిముషాలకి ఆటలు ముగించుకొని రాధిక, తమ్ముడు విష్ణు వచ్చారు. వరండాలో కుర్చీలో కూర్చున్న తండ్రిని చూసేసరికి రాధికకి సంభ్రమం కలిగింది. తండ్రి ఆఫీసు నుంచి ముందుగా వచ్చేశాడన్న సంతోషంతో ''నాన్నా! ... వచ్చేశావా?'' అంటూ పరుగెత్తుకుని వెళ్లింది. ప్రకాశరావుని చుట్టేయబోతుంటే అతను విడిపించుకుని, లేచి నిలబడి, కూతురి వీపు మీద ఛెళ్లున చరిచాడు....&lt;br /&gt;ముందుకి పడబోయి నిలదొక్కుకుని మిన్ను విరిగి మీద పడినంత ఆశ్చర్యంగా చూసింది రాధిక.&lt;br /&gt;''మగరాయుడిలా మగ పిల్లలతో ఏంటా గెంతులు? ఇంట్లో ఆడుకోవచ్చుగా! ఇంకోసారి అలా కన్పించావంటే కాళ్లిరగ్గొడతాను. నీకు ఆడుకోవాలన్పిస్తే ఆడపిల్లలతో ఇంట్లో ఆడుకో అంతే...'' తర్జనితో బెదిరించి చర చరా లోపలికి వెళ్లిపోయాడు ప్రకాశరావు.&lt;br /&gt;చెయ్యి వెనక్కి తిప్పి చుర చురలాడుతున్న వీపుని తడుముకుంటూ అపనమ్మకంగా తండ్రి వెళ్లిన వైపు చూసింది. అతను కనుమరుగు కాగానే ఆమె చూపు విష్ణు వైపు తిరిగింది.&lt;br /&gt;&lt;br /&gt;ఆ పిల్లాడూ కాసేపు అయోమయంగా చూసి తనకి దెబ్బలు తప్పాయి కదా అన్న సంతోషంతో లోపలికి పరుగెత్తాడు. తన తప్పేంటో రాధికకి అర్థం కాలేదు. ఉక్రోషంతో కన్నీళ్లు వస్తుంటే తన మొహం ఎవరికీ చూపించలేక పెరట్లో వేసి ఉన్న మంచం మీద పడుకుంది.&lt;br /&gt;నానమ్మ వచ్చి అన్నం తినమని బతిమలాడితే ససేమిరా తిననంది. చివరికి తల్లి వచ్చి బుజ్జగించడం ప్రారంభించింది.&lt;br /&gt;''నీకా మగపిల్లలతో ఆటలొద్దని చెప్పానా?'' అంది తల్లి.&lt;br /&gt;''తప్పేంటి?'' రోషంగా అంది రాధిక.&lt;br /&gt;నానమ్మ అందుకొంది అపుడు. ''తప్పు కాదా మరి? ఆడపిల్లలంటే ఎంత వినయంగా ఉండాలి. నిదానంగా మాట్లాడాలి. నెమ్మదిగా నడవాలి. వంచిన తల ఎత్తకుండా బైటకి వెళ్లి రావాలి. మా కాలంలో ఎలా ఉండేవాళ్లమనుకున్నావూ? మా నాన్న నన్ను బళ్లోనే వెయ్యలేదు. చిన్నపుడు పక్కింటి అబ్బాయి అడిగాడని బిందెతో నీళ్లిస్తే, మా నాన్న కర్రతో వెంటపడి మరీ కొట్టాడు. ఇంకా మీ నాన్న చాలా మంచోడు. నిన్ను చదివిస్తున్నాడు. ఏం కావాలంటే అవి కొనిస్తున్నాడు... అలుసిచ్చాడు కదాని నెత్తినెక్కకూడదు..'' ఆవిడ హితబోధ చేసింది...&lt;br /&gt;రాధికకి ఆ మాటలేం నచ్చలేదు, అర్థం కాలేదు కూడా. తండ్రి నిరాదరణను తట్టుకోలేకపోతోంది. ఆ రాత్రికి తల్లిని కరుచుకుని పడుకుని ''నాన్న చెప్పినట్లుగా ఉంటే ఇంకెపుడూ కొట్టరు కదూ!...'' వెక్కుతూ అడిగింది రాధిక.&lt;br /&gt;''వూ!... ఆ అబ్బాయిలతో ఆటలు, గెంతులూ మాని కుదురుగా ఉంటే నాన్న ఏమీ అనరు...'' అంది తల్లి....&lt;br /&gt;అసంతృప్తిగా ఉన్నా తండ్రి ప్రేమ కోసం తలాడించింది రాధిక. అపుడామె వయసు తొమ్మిదేళ్లు.&lt;br /&gt;&lt;br /&gt;* * *&lt;br /&gt;ఆ కాలనీలో కెల్లా బుద్ధిమంతురాలైన పిల్ల ఎవరూ అంటే చాలా మంది రాధిక పేరే చెబుతారు. కాలేజికి వెళ్లేపుడూ, వచ్చేపుడూ తప్ప ఎపుడూ, ఎవరూ ఆమెని బయట చూడలేదు. ఇంట్లో చదువుకోవడమూ, ఇంటి పనుల్లో తల్లికి సాయం చేయడం, కుట్లూ, అల్లికలూ నేర్చుకోవడం... ఇదే ఆమె ప్రపంచం....&lt;br /&gt;''ముత్యం లాంటి పిల్లమ్మా! ఎంత అణకువ!! ఎంత విధేయత... రోడ్డు మీదకి వచ్చిందంటే తల ఎత్తదు... ఇలాంటి పిల్లను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు!'' అని ఎవరైనా పొగుడుతుంటే ప్రకాశరావు హృదయం గర్వంతో పొంగిపోయేది. ఆ రోజు కాలేజి నుంచి ఇంటికి రావడానికి బస్టాప్‌లో నిల్చుంది రాధిక. సాయంత్రం అయిదు గంటల సమయం కావడంతో బాగా రష్‌గా ఉంది ఆ ప్రాంతం....&lt;br /&gt;రాధిక తల వంచుకుని నిల్చుంది. బస్‌ వచ్చిన శబ్దం వినబడితే మాత్రం తలెత్తి చూస్తోంది... ఇంతలో బస్టాప్‌లో రయ్యిన వచ్చి ఆగింది ఓ బైక్‌. దానిని పక్కన పార్క్‌ చేసి ఓ యువకుడు రాధిక దగ్గరికి రాసాగాడు.&lt;br /&gt;దూరం నుంచే అతన్ని చూసి మరింత కుంచించుకుపోయింది ఆమె. భయంతో నాలుక పొడారిపోయింది.&lt;br /&gt;ఆమెని సమీపించాడతను... ''మీరు ఈ రోజు ఎలాగైనా మీ పేరు చెప్పాల్సిందే!...'' అన్నాడు.&lt;br /&gt;తలెత్తలేదు ఆమె... వణికిపోతూ వాలు చూపులు చూడసాగింది... అది మరింత ముచ్చటగా అన్పించింది ఆ అబ్బాయికి.&lt;br /&gt;''ఇన్ని రోజుల్నుంచీ ట్రై చేస్తున్నాను. మీరు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ ఈ లెటరయినా తీసుకోండి. నా హృదయం ఇందులో ఉంది'' రెండడుగులు ముందుకేసి అన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;నాలుగడుగులు వెనక్కి వేసి నిస్సహాయంగా బస్సొచ్చే వైపు చూసింది. ఇదంతా తనకి అసలు ఇష్టం లేదు. తనతో మాట్లాడొద్దనీ, తనకి ఇలాంటివి ఇష్టం ఉండవనీ గట్టిగా చెప్పాలని ఉంది. గొంతు పెగలడం లేదు.&lt;br /&gt;బస్టాప్‌లో చాలామందే ఉన్నారు. విషయం అర్థం కాకపోయినా వీళ్లిద్దరి మధ్యా ఏదో జరుగుతోందని కనిపెట్టి వినోదం చూడటానికన్నట్లు నిల్చున్నారు.&lt;br /&gt;ఆఫీస్‌ నుంచి వస్తున్న ప్రకాశరావు కళ్లబడిందా దృశ్యం.. అతని రక్తం సలసలా మరిగింది...&lt;br /&gt;బస్టాప్‌లో, ఇంత మంది మధ్య తన కూతురు ఎవడితోనో మాట్లాడుతోంది. అంతే! ఇంకేం ఆలోచించలేదు. లూనా తెచ్చి సరాసరి కూతురి ముందు ఆపాడు. రాధిక బిక్కచచ్చిపోయింది.&lt;br /&gt;ప్రకాశరావుని చూసి ఆ అబ్బాయి క్రాఫ్‌ సవరించుకుంటూ పక్క చూపులు చూడసాగాడు. రాధిక వచ్చి తండ్రి వెనకాల కూర్చుంది. ఇంటికి రాగానే హాలు తలుపులు మూశాడు ప్రకాశరావు... కూతురి చెంప ఛెళ్లుమనిపించాడు. కెవ్వుమంది రాధిక. ఆ అలికిడికి గబగబా వచ్చారు తల్లీ, నానమ్మా.... విషయం అర్థం కాక అయోమయంగా చూడసాగారు.&lt;br /&gt;''ఎవడు వాడు?'' రౌద్రంగా అడిగాడు ప్రకాశరావు.&lt;br /&gt;''నాకు తెలీదు నాన్నా!'' చెంప పట్టుకుని కన్నీళ్లతో అంది.&lt;br /&gt;''తెలీకుండానే అంత మందిలో నీ పక్కన నిల్చుని మాట్లాడుతున్నాడా?''&lt;br /&gt;''నిజం నాన్నా! పేరు చెప్పమని వారం నుంచీ వెంటపడుతున్నాడు. ఈ రోజు ఉత్తరం తీసుకోమని గొడవ పెడుతున్నాడు. నేను భయంతో నిల్చున్నాను. నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు నాన్నా!...'' దీనంగా అంది రాధిక.&lt;br /&gt;''బస్టాప్‌లో అంత మంది అమ్మాయిలున్నారు. వాళ్లెవరితోనూ మాట్లాడని వాడు నీతోనే మాట్లాడాడంటే ఏంటి అర్థం? నువ్వు అలుసు ఇవ్వకపోతే వాడు అలా ఎందుకుంటాడు?''&lt;br /&gt;మెదడు మొద్దుబారిపోయింది రాధికకి. తండ్రి... తనని కన్న తండ్రేనా ఈ మాటన్నది... నమ్మలేనట్లు ఆయన వంక చూసింది రాధిక.&lt;br /&gt;ఎవరి మీదో, దేని మీదో ఉన్న అసంతృప్తి ఇలా బయటపడుతోంది. దానిని అంగీకరించడానికి మనసు ఒప్పుకోవడం లేదు ప్రకాశరావుకి.&lt;br /&gt;''ఏదేమైనా ఇక నువ్వు ఇల్లు కదలడానికి వీలు లేదు'' శాసనం చేస్తున్నట్లుగా అన్నాడు ప్రకాశరావు.&lt;br /&gt;''అయ్యో! నిక్షేపంలా చదువుకుంటున్న పిల్లని'' భార్య ఏదో అనబోయింది... చెయ్యెత్తి ఆమెని వారించాడు...&lt;br /&gt;''చదివి మనని ఉద్దరించేది ఏం లేదు. సంవత్సరం, రెండేళ్లలో కొంచెం కూడదీసుకుని పెళ్లి చేసి పంపిస్తే మన భారం తీరిపోతుంది'' సాలోచనగా అన్నాడు.&lt;br /&gt;నిలువెల్లా దుఃఖం కుదిపేసింది రాధికని.&lt;br /&gt;''నేను చదువుకుంటాను నాన్నా!'' ధైర్యాన్ని కూడదీసుకుంటూ అంది. కూతురి మొహం తేరిపార చూడగానే కోపం స్థానంలో ప్రేమ కలిగింది ప్రకాశరావుకి.&lt;br /&gt;కూతురి తల నిమురుతూ ''నలుగురూ నాలుగు రకాలుగా అనే అవకాశం మనం ఎవరికీ ఇవ్వకూడదమ్మా! నీకు అంతగా చదవాలనిపిస్తే ప్రైవేటుగా చదువు. పుస్తకాలవీ కొని తెస్తాను'' అన్నాడు.&lt;br /&gt;ఇష్టం లేకపోయినా, ఆ మాత్రం అవకాశం అయినా చిక్కినందుకు సంతోషిస్తూ ''అలాగే నాన్నా!'' అనేసింది రాధిక. అపుడామె వయసు పద్దెనిమిదేళ్లు.&lt;br /&gt;&lt;br /&gt;***&lt;br /&gt;రాధిక ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేసింది... వెంటనే ఇంత కాలం కష్టపడి కూడబెట్టిన డబ్బుతో రాధిక పెళ్లి చేశాడు ప్రకాశరావు. రాధిక భర్త మోహన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగి.... కష్టపడి పని చేస్తాడు. మంచివాడు. జీతం తక్కువైనా పిల్లని బాగా చూసుకుంటాడని చెప్పి పెళ్లి చేశారు. రాధిక కూడా ఉన్నం తలో గుట్టుగా సంసారాన్ని గడిపేది... ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. బాబుకి నాలుగేళ్లు... పాపకి రెండేళ్లు...&lt;br /&gt;మోహన్‌కి జీతం పెరిగినా, దానితో పాటే ఖర్చులూ పెరిగాయి. ఓవర్‌ టైమ్‌ కూడా పని చేసే వాడతను.&lt;br /&gt;ఇంటి పనీ, వంట పనీ, పిల్లల్ని పెంచడం తప్ప మరో ప్రపంచం ఏదీ రాధికకు తెలీదు. ఆమె గడప దాటి బయట అడుగుపెట్టడమే గగనం...&lt;br /&gt;భర్తకి ఎంత జీతం వస్తుందో, ఎంత డబ్బు ఉంటే జీవితం సాఫీగా సాగుతుందో, ఇలాంటి ఆర్థిక విషయాలేవీ ఆమెకి తెలీవు... అవసరమైనవి మోహన్‌ తెచ్చి పడేస్తాడు... రాధిక వాటితో ఇల్లు గడిపేస్తుంది, అంతే!&lt;br /&gt;ఇలాంటి సమయంలో ఉరుము లేని పిడుగులా ఓ రోజు సాయంత్రం మోహన్‌ చావు కబురు ఇంటికి చేరింది. ఓవర్‌ టైమ్‌ చేస్తూ, అలసటని ఆపుకోలేక నిద్రపోవడంతో అతను పని చేస్తున్న కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.... అతను చనిపోయాడు.&lt;br /&gt;షాక్‌లో ఉండిపోయింది రాధిక. ఏడుపూ లేదు. మాటా లేదు. మతి పోయిన దానిలా చూస్తూ కూర్చుంది.ఎవరెవరో వస్తున్నారు. పోతున్నారు. దగ్గరకి తీసుకుంటున్నారు. కలగా పులగంగా ఏదో మాట్లాడుతున్నారు.&lt;br /&gt;చివరికి ఓ చాప చుట్ట తెచ్చి, ఇంటి ముందు పడేసి, 'ఇదుగో నీ భర్త' అన్నారు.&lt;br /&gt;గుండెలో గూడు కట్టిన దుఃఖమేదో అపుడు కరిగింది. పిల్లలిద్దరూ తల్లిని చుట్టుకుపోయారు. చూస్తున్న వాళ్ల కళ్లు నీళ్లతో నిండాయి.&lt;br /&gt;అంతా ముగిసింది. అందరూ వెళ్లిపోయారు. తల్లిదండ్రులు, తనూ, పిల్లలు.&lt;br /&gt;కాంపెన్సేషన్‌ కోసం తండ్రి కాళ్లరిగేలా తిరిగాడు. ఫలితం లేదు. మోహన్‌ నిర్లక్ష్యం ఫలితంగా ఫ్యాక్టరీ చాలా నష్టపోవడం మాత్రమే కాక మరో ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు కాబట్టి పైసా కూడా ఇవ్వనని యజమాని తెగేసి చెప్పాడు.&lt;br /&gt;యూనియన్‌ సాయంతో ఆరు నెలల జీతం మాత్రం ఇచ్చారు. అవి బ్యాంకులో వేసి పాస్‌ బుక్‌ కూతురి చేతికిచ్చి ''మనింటికి వెళ్లిపోదామమ్మా!'' భారంగా అన్నాడు ప్రకాశరావు....&lt;br /&gt;ఈ స్థితిలో పుట్టింట్లో ఉండడం కష్టమనిపించినా తలూపింది రాధిక.&lt;br /&gt;అపుడామె వయసు పాతికేళ్లు.&lt;br /&gt;&lt;br /&gt;***&lt;br /&gt;జీవితం భారంగా మారింది రాధికకి. తల చెడి పుట్టింటికి చేరిన ఆమె పట్ల ఇరుగూ పొరుగూ జాలి చూపిస్తూ నిరంతరం ఆమె కష్టాన్ని గుర్తు చేస్తుండేవారు. మంచి కట్నం ఇచ్చే సంబంధం రావడంతో విష్ణు పెళ్లి చేశాడు ప్రకాశరావు. ఇంత మంది మధ్య విష్ణు భార్య ఇమడలేకపోయింది. ముఖ్యంగా రాధికని చూస్తే ఆమెకి చిరాగ్గా ఉండేది.&lt;br /&gt;ఎపుడూ దీనంగా, మొహం వేలాడేసుకుని, నీరసంగా ఓ మూలన ఉండే ఆమెని చూస్తుంటే కంపరంగా ఉండేది... సూటీ పోటీ మాటలు అంటుండేది ఆమె. కోడలిని ఏమీ అనలేని నిస్సహాయత, కూతురి పరిస్థితి పట్ల అసహాయత కలిసి ప్రకాశరావు దంపతుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి.&lt;br /&gt;ఎంత ఓర్పుగా ఉన్నా తమ్ముడి భార్య ఏదో ఒకటి అంటుండటంతో ఓ రోజు తట్టుకోలేక రాధిక కూడా ఏదో అంది.&lt;br /&gt;దానితో ఆ అమ్మాయి శోకాలు పెడుతూ భర్తకి చెప్పింది. ప్రకాశరావు కోడలిని ఏమీ అనలేక కూతురి మీదకి చెయ్యెత్తి, 'ఈ తద్దినాన్ని నెత్తిన పెట్టుకున్నాను... పోయినోడితో పాటే పోక.... ఇంకా ఎందుకిలా?....' చివరి మాటలు మింగేసి చరచరా బయటికి వెళ్లిపోయాడు. ఆ మాటలకి రాధిక షాక్‌ తింది. అంతగా జీవితమంటే విరక్తి ఎపుడూ కలగలేదు. ఇప్పుడే చాలా ఎక్కువగా... ఇంకేమీ లేదన్నట్లుగా... పిల్లల్ని వదిలేసి, పెరట్లోకి పరిగెత్తి బావిలోకి దూకింది.&lt;br /&gt;తల్లి, నానమ్మ గావుకేకలు విని విష్ణు బావిలోకి దిగి రాధికని పైకి తీశాడు.&lt;br /&gt;ఇరుగూ, పొరుగూ అందరికీ తెలిసిపోయిందీ విషయం. అప్పటినుంచీ ఎవరూ రాధిక ఎదురుగా మాట్లాడడం లేదు. రాధిక కూడా ఓ మూల గదిలోనే ఉండేది.&lt;br /&gt;జీవితం అలా సాగుతుండగా, ఓ రోజు ఇంటికి ఓ కవర్‌ వచ్చింది. అది రాధికని బస్‌ కండక్టర్‌గా జాయిన్‌ అవ్వమని ఆర్టీసీ నుంచి వచ్చిన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌.&lt;br /&gt;మోహన్‌ ఒకసారి తనతో సరదాగా అప్లయ్‌ చేయించాడు. తను ఇష్టపడకపోయినా, అతని కొలీగ్స్‌ భార్యలందరూ అప్లయ్‌ చేశారని, పట్టుబట్టి తనతో దరఖాస్తు పెట్టించాడు. తనకెందుకు ఈ ఉద్యోగం? ఆ కాగితాన్ని మూలకి విసిరికొట్టబోయింది.&lt;br /&gt;''నువ్వు జాయినవ్వు'' ప్రకాశరావు తల వంచుకుని అన్నాడు.&lt;br /&gt;''నేనా?'' ఆశ్చర్యంగా అంది రాధిక.&lt;br /&gt;''వూ! నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి'' నచ్చచెబుతున్నట్లు అన్నాడు ప్రకాశరావు.&lt;br /&gt;''ఇది కండక్టర్‌ ఉద్యోగం నాన్నా! అంత మంది మగాళ్ల మధ్యలో'' తడబడుతూ అంది... రాధిక.&lt;br /&gt;ఛెళ్లున చరిచినట్లయింది ప్రకాశరావుకి. తను చెప్పిన నీతులు తనకే ఎదురు తిరిగినట్లయ్యాయి.&lt;br /&gt;''ఆ! ఆ! తప్పదు. ఇంకా జీవితాంతం నిన్నూ, నీ పిల్లల్ని ఎవరు పోషిస్తారు?... నేనున్నంత కాలం ఫరవాలేదు. మరి నా తర్వాత? అందుకే జాయినవు. బస్టాండ్‌కి దగ్గరలో గది చూస్తాను. నానమ్మని తోడుగా ఉంచుకో! మీ అమ్మా, నేను కూడా వస్తూ, పోతూ ఉంటాం!'' గబగబా చెప్పేసి వెళ్లిపోతుంటే విభ్రమంగా చూస్తూ ఉండిపోయింది రాధిక. నాన్న మాటలు కొత్తగా ఉన్నాయి. కానీ బాధగా లేవు.&lt;br /&gt;ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లలు లోపలికి వచ్చారు. వాళ్లు ఆరోగ్యంగా లేరు. సంతోషంగా లేరు... అవును మరి, తండ్రి లేని పిల్లలు... ఆమెకు దుఃఖం వచ్చింది... అంతలోనే ఓ నిశ్చయానికీ వచ్చింది. పిల్లల కోసమైనా తను ధైర్యంగా ఈ ఉద్యోగం చెయ్యాల్సిందే!&lt;br /&gt;&lt;br /&gt;***&lt;br /&gt;ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరింది రాధిక. ట్రైనింగ్‌లోనే అన్ని విషయాలూ తెలుసుకుంది. మొదటి నెల కాంప్లెక్స్‌ నుంచి గాజువాక రూట్‌లో వేశారు.&lt;br /&gt;బాగా రష్‌గా ఉండే రూట్‌ అది... మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ట్రిప్‌లలో టికెట్లు కొట్టడం చాలా కష్టం.&lt;br /&gt;బస్‌కి ముందు వైపు ఆడవాళ్లుంటారు. అక్కడ సులభంగానే టికెట్లు ఇచ్చేది... కానీ వెనుక వైపు మగాళ్ల మధ్య నుంచి వెళ్లి టికెట్లు ఇవ్వాలంటే టెన్షన్‌తో చెమటలు పట్టేవి.&lt;br /&gt;చెకింగ్‌ పాయింట్లో బస్‌ని ఆపించి వెనుక డోర్‌ వైపు వెళ్లి అక్కడ టికెట్లు ఇచ్చి మళ్లీ ముందుకు వచ్చేది. దీనితో బస్‌ కాస్త ఆలస్యమయ్యేది.&lt;br /&gt;డ్రైవర్‌ విసుక్కునేవాడు... 'లేడీ కండక్టరా?ఇక మనం ఈ రోజు వెళ్లినట్లే!' ప్రయాణీకులూ విసుక్కునేవారు. అంతా గాభరాగా, భయంగా ఉండేది రాధికకి.&lt;br /&gt;లేటవడానికి డ్రైవర్‌ ఒప్పుకోకపోవడంతో అందరి మధ్యలోంచి వెళుతూ టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆమె ఇబ్బందిని ఓ టీచర్‌ గమనించింది. ఆమె పేరు రజని... రోజూ ఆ రూట్‌లోనే ప్రయాణించేది. స్టాప్‌కీ స్టాప్‌కీ మధ్య గ్యాప్‌లో రాధిక అపుడపుడూ ఆమె పక్కన ఖాళీ ఉంటే కూర్చునేది.&lt;br /&gt;రజని వికలాంగురాలు. ఆమెకి ఒక కాలు పోలియోతో చచ్చుబడిపోయింది. కానీ ఆమె మొహంలో అంతు లేని ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతూ ఉండేది.&lt;br /&gt;ఓ రోజు మరీ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంది రాధిక. బస్‌ విపరీతమైన రష్‌గా ఉంది... జాగ్రత్తగా చూసుకుని అందరికీ టికెట్లు ఇవ్వాలి. ఎవరైనా ఒకరు టికెట్‌ తీసుకోకుండా చెకింగ్‌లో దొరికితే తనకీ పనిష్మెంటే!&lt;br /&gt;తను ఒదిగి ఒదిగి తోవ చేసుకుని వెళ్తున్న కొద్దీ తప్పుకుంటున్నట్లే తప్పుకుని మీద మీద పడుతున్నారు. కొందరి చూపులు తన శరీర భాగాల్ని దుస్తుల మీద నుంచి స్కాన్‌ చేస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఇబ్బందిగా ఉంది, ఏడుపు వస్తున్నట్లుగా ఉంది. ఎవరిదో చేయి తన పిరుదులని తాకింది. చివ్వున తిరిగి చూసింది. అంతమందిలో ఎవరో తెలీలేదు.&lt;br /&gt;నాలుగడుగులు ముందుకేసి ఆగి టికెట్లు కట్‌ చేస్తోంది. మెడ దగ్గర ఎవరో కాస్త దూరం నుంచి 'ఉఫ్‌' మని ఊదారు. పాము బుసకొట్టినట్లుగా జుగుప్సగా ఉంది. తిరిగి చూసింది. ఇద్దరు, ము
